29, ఏప్రిల్ 2011, శుక్రవారం

సామాన్యుల మాట ఏమిటి?

(ఆంధ్రజ్యోతి సంపాదకీయం పేజీ, 26.04.2011 ) : తెలంగాణ ఉద్యమం బాయిలింగ్ దశకు చేరిందని ఇక తాడోపేడో తేల్చక తప్పదనే స్థితికి అందరూ వస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ భావనకు రాలేదు, బలవంతంగా తీసుకువచ్చారు. ఇంకా చెప్పాలంటే బాయిలింగ్ దశకు వచ్చిందనే భావనను ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నేతలు కొందరు మీడియాను ప్రభావితం చేస్తూ సామాన్యులపై బలవంతంగా రుద్దుతున్నారు. కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం తెలంగాణ ప్రాంతంలోని కొంతమంది నేతలు సృష్టించిన ఉద్యమం ఇది.

మంత్రిపదవి దక్కలేదని కొందరు, రాజకీయాలలో గుర్తింపు పొందాలని మరి కొందరు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంను ప్రారంభించి తెలంగాణకు చెందిన సామాన్య ప్రజలను అగ్నిగుండంలోకి నెట్టారు. ఉద్యమం కారణంగా నష్టపోయింది... నష్టపోతున్నదీ సామాన్యులే. బంద్‌లు చేసినా, ధర్నాలు, రాస్తారోకోలు చేసినా నష్టపోయేది ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకునే చేతివృత్తిదారులు, చిరు వ్యాపారులు, చిరుఉద్యోగులే. బంద్ పాటించిన రోజున వీరందరూ అప్పు చేసి తినడమో లేదా పస్తులుండటమో చేయాలి. అంతేకాకుండా ఎప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినా, ఆ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారు, కోల్పోతున్నవారు సామాన్య ప్రజలే.

నోటితో రమ్మని నొసటితో వెక్కిరించినట్టుగా మా పోరాటం పొట్ట కూటి కోసం వచ్చినవారిపై కాదని, తెలంగాణాను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు, బడాబాబులపైనే అని చెబుతున్నారు. వాస్తవంలో దాడులన్నీ ఆంధ్రపాంతం నుంచి వలస వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన సామాన్యుల పైనే చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 40 లక్షల మంది ఆంధ్రప్రాంతానికి చెందిన వారు జీవిస్తున్నారు. వీరిలో వేలకోట్ల ఆస్తులు కలిగిన కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి చిరు ఉద్యోగులు, రోడ్డు పక్కన టీ అమ్ముకునే వారి వరకూ ఉన్నారు. అయితే, వీరిలో వేల కోట్లలో ఆస్తులు కలిగిన కుటుంబాల సంఖ్య వెయ్యికి మించదు. మిగిలిన 39 లక్షల 99వేల మంది సామాన్యులే !

రూపాయి రూపాయి కూడబెట్టి కొందరూ, సొంత గ్రామాల్లో ఉన్న ఆస్తులను తెగనమ్మి కొందరూ సొంతిల్లు సమకూర్చుకొని స్థిరపడినవారే. రాష్ట్ర విభజన జరిగితే ప్రధానంగా నష్టపోయేది వీరే.

తెలంగాణ ఉద్యమంలో భాగో.. జాగో అంటూ సామాన్యులను రెచ్చగొట్టే నాయకులు కనీసం బడాబాబులకు చెందిన ఇండ్ల ప్రహరీ గోడలను కూడా ఏమీ చేయలేరు. ఉద్యమం గురించి ఎన్ని ఊసులు చెప్పినా, ఆర్థిక అంశాలకు వచ్చేసరికి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించే దొరలు, కోస్తా బడాబాబులు ఒకటే. పైగా ప్రభుత్వం, పోలీసులు వీరికి అండగా వుంటారు. ఈ బాబులు తమలో ఎవరికి ఏ ఆర్థికనష్టం జరగకుండా మీడియాలో మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. సామాన్యులను రెచ్చకొడతారు.

ఉద్యమనేతలు గడచిన కాలంలో ఇతరత్రా అంశాలు ఎలా వున్నప్పటికీ, సామాన్యులను రెచ్చకొట్టడంలో మాత్రం విజయం సాధించారు. ఆంధ్రావాళ్ళ కారణంగానే నీకు ఉద్యోగం రాలేదని, ఆంధ్రావాళ్ళ కారణంగానే నీవు బ్రతకలేకపోతున్నావని, వాళ్ళు వెళ్ళిపోతే ఉద్యోగాలన్నీ తెలంగాణావారికే దక్కుతాయని, ఆంధ్రావారు వెళ్ళిపోతే, వారి హోటళ్ళను తెలంగాణా వారే నడుపు కోవచ్చనీ, వారు ఇళ్ళు ఖాళీచేస్తే వాటిని ఆక్రమించుకోవచ్చనే తెలంగాణనేతల రెచ్చకొట్టే తరహా ప్రకటనలు అమాయక తెలంగాణ ప్రజలను భ్రమలో పడవేస్తున్నాయి.

దాంతో తెలంగాణ ప్రజలకు రోడ్డుపక్కన హోటల్ పెట్టుకొని జీవించేవారు, తినీతినక కష్టపడి హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టుకుని జీవించే చిరుద్యోగులు ఆంధ్రప్రాంతానికి ప్రతీకగా కనిపిస్తున్నారు. తమ నోటి కాడికి వచ్చిన దానిని లాక్కుపోతున్న దుర్మార్గులుగా భావిస్తున్నారు. ఆంధ్ర ప్రాంత నేతలపై ఉన్న తమ అసంతృప్తిని ఆంధ్రప్రాంత సామాన్యులపై చూపిస్తున్నారు.

ఆంధ్రావారు ఎప్పుడు వెళ్ళిపోతారా... అనే రీతిలో ఎదురు చూస్తున్నారు. భౌతికంగా దాడి చేయకపోయినా, మానసికంగా తిట్లతో, దూషణలతో దాడి చేస్తున్నారు. ఈసారి ప్రత్యేక తెలంగాణ రాకపోతే ఎప్పటికీ రాదు... ఉద్యమం వేడెక్కింది... ఇంకా కొంచెం ఉద్యమిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, కనిపించే ఆస్తులన్నీ మనవే అంటూ నేతలు సామాన్యులను మరీ ఊరిస్తున్నారు.

రాష్ట్ర విభజన జరగక ముందే తమ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక రాష్ట్ర విభజన జరిగితే తమ పరిస్థితి ఏమిటి? అని హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో అమాయక తెలంగాణ ప్రజలను అడ్డుపెట్టుకుని ఆంధ్రుల ఆస్తులను చౌకగా కొట్టేయడానికి సంఘ విద్రోహులు చుట్టుపక్కల పొంచివున్నారు. విభజన జరిగితే సంఘవిద్రోహులు తమను ఏం చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడపెట్టి కట్టుకొన్న ఇల్లును వదిలేయవలిసిందేనా? కారుచౌకగా తెగనమ్ముకోవలిసిందేనా? లేదా తిట్లు తింటూ రెండోతరగతి పౌరునిగా జీవించాలా? అని తీవ్రంగా మథనపడుతున్నారు.

రాష్ట్ర విభజన అనివార్యమైతే, సామాన్య ప్రజలకు, వారికి సంబంధించిన ఆస్తులకు భవిష్యత్తులోనైనా రక్షణ కలిగే విధంగా స్పష్టమైన విధానాలు రూపొందించడం అవసరం. ఒక మేజరు గ్రామపంచాయితీని పురపాలకసంఘం (మున్సిపాలిటీ)గా మార్పు చేయాలంటే ఆ పంచాయితీ జనాభా, ఆర్థిక వనురులను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.

అదే విధంగా ఒక రాష్ట్రానికి ఇంత జనాభా వుండాలని, ఇంత ఆదాయం రావాలని అంతకు మించినప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజింపవచ్చుననే తరహాలో నిబంధనలు ఉంటే బాగుంటుంది. లేదంటే ప్రతి 15 నుంచి 20 సంవత్సరాలకు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన చేయాలి. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఈ తరహా విధానాలు ఏర్పాటు చేసుకునే పక్షంలో ఉద్యమాలు, ఆందోళనలతో అవసరం లేకుండా పరిపాలనలో భాగంగా నూతన రాష్ట్రాల ఏర్పాటుకు వీలు కలుగుతుంది. ప్రజలు కూడా మానసికంగా సిద్ధపడతారు.

నేతల ఆధిపత్యం కోసమో లేదా పార్టీల ప్రయోజనాల కోసమో రాష్ట్రాల విభజన చేయడం ప్రారంభిస్తే, దేశాన్ని 25 రాష్ట్రాలుగానే కాదు 50 రాష్ట్రాలుగా విభజించినా, మళ్ళీమళ్ళీ ఏదో కారణంగా మా రాష్ట్రం మాకు కావాలి! అనే వాదన చేస్తూనే వుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలుగా విభజన జరిగినా, తర్వాత మరల తెలంగాణాలో ఉత్తర తెలంగాణవారు, ఆంధ్రలో రాయలసీమవాదులు, ఉత్తరాంధ్రవాదులు మరల మా రాష్ట్రం మాకు కావాలనే వాదన ముందుకు తీసుకురారనే గ్యారంటీ ఏదీ లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించాలనుకొనేవారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
 
- అన్నవరపు బ్రహ్మయ్య, సీనియర్ పాత్రికేయులు

27, ఏప్రిల్ 2011, బుధవారం

చారిత్రక పటములు చెప్పే నిజాలు

ఆధునిక భారతదేశ చరిత్రలో తెలంగాణా, సీమాంధ్రలు కలిసి ఎన్నడూ లేవు అని తరచుగా ప్రత్యేక తెలంగాణావాదులు వాదిస్తుంటారు.తెలుగువాళ్ళు విడదీయబడ్డారు కాని విడిపడి ఎన్నడూ లేరు. దానికి ఈ చారిత్రక పటములే నిదర్శనం



ఔరంగజేబ్ 1687 లో గోల్కొండపై దాడి చేసి కుతుబ్ షాహీల  పాలనను అంతమొందించిన సమయానికి వారి రాజ్యస్వరూపం ఇలా ఉండేది

కుతుబ్ షాహీల తర్వాత అసఫ్ జాహీ(నిజాం)ల పరిపాలన మొదలైయ్యే వరకు మొఘలుల రాజ్యం లో హైదరాబాద్ సుబహ యొక్క చిత్రం (నెంబర్ 6 ) ఇలా వుండేది 
ఆ తర్వాత నిజాముల పరిపాలన క్రమములో అనేక ప్రాంతాలు బ్రిటిష్ వారికి అప్పగించబడ్డాయి.  ఆ విధంగా తెలంగాణా, సీడెడ్(రాయలసీమ), సర్కార్(కోస్తాంధ్ర) వేర్వేరు ప్రాంతాలన్న వాడుక మొదలైంది 
1948 లో  హైదరాబాద్ రాష్ట్ర విముక్తి సమయానికి దాని స్వరూపము 

25, ఏప్రిల్ 2011, సోమవారం

మనిషి లోపలి విధ్వంసం


అసెంబ్లీ ఆవరణలో లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్‌పై దాడి జరిగినప్పుడు, ఆ దాడిని అందరూ ఖండించారు. కానీ, తెలంగాణ ఉద్యమనాయకులు మాత్రం తెలంగాణ రాష్ట్రం కోసం ఆరు వందల మంది యువకులు చేసుకున్న ఆత్మాహుతిముందు ఈ సంఘటన ఏ పాటిది అంటూ తేలిగ్గా తోసిపుచ్చారు. అదే కోవలో ట్యాంక్‌బండ్‌పై తెలుగు వైతాళికుల విగ్రహాలను ధ్వంసం చేస్తే, వార్తా సంస్థల సామగ్రిని నాశనం చేసి విలేకరులపై దాడిచేస్తే ఈ సంఘటనను సభ్యసమాజమంతా ముక్త కంఠంతో ఖండించినా, తెలంగాణ ఉద్యమ నాయకులు మాత్రం వందలాది యువకుల ఆత్మార్పణతో పోల్చుతూ ఇదేం పెద్ద ఘటన అని తోసిపుచ్చుతున్నారు.

తెలంగాణ ఉద్యమం అరవై సంవత్సరాల నుండి సాగుతోందని ఉద్యమ నాయకులు చెబుతూంటారు. కేసీఆర్ తెరాసను ప్రారంభించిన తరువాత తెలంగాణ ఆకాంక్ష ఇక్కడి ప్రజల్లో బలంగా చోటుచేసుకుందని అన్ని రాజకీయ పక్షాలకు చెందిన తెలంగాణ నాయకులు అంగీకరిస్తున్నారు. అయితే 58 సంవత్సరాలుగా ఏనాడూ ఒక్కరు కూడా ఆత్మాహుతికి పాల్పడకుండా కేవలం డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన తరువాత మాత్రమే వందలాది మంది యువకులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడ్డారో, వారిని ఇందుకు ప్రేరేపిస్తోంది, ప్రోత్సహి స్తోంది ఎవరో తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రజలం దరికీ సంజాయిషీ చెప్పుకోవాలి.

కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేయడా నికి ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను చేపట్టిందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర అసెంబ్లీలో తగిన తీర్మానాన్ని ఆమోదించడం జరుగు తోందని’’ డిసెంబర్ తొమ్మిదిన చిదంబరం ప్రకటిం చారు. ఆ తరువాత దీనికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం చెలరేగింది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ప్రాంతాలవారీగా చీలిపోయాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనను పక్కన పెట్టి ఈ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి సమకట్టింది. అందుకు అనుగుణంగా శ్రీకృష్ణ కమిటీని నియమించింది.

ఇదంతా బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం. ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమ నాయకులు తీవ్రంగా వక్రీకరించి, దానికి అనేక అసత్యాలను జోడించారు. కేసీఆర్ ‘‘డిసెంబర్ 9నే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చివేయ డం జరిగింది. కానీ కొందరు సీమాంధ్ర పెట్టుబడిదారు లు దానికి అడ్డుపడుతున్నారని’’ పదేపదే చెప్పసాగారు. తెరాసా నాయకులందరూ ఇదే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ చెప్పసాగారు. ప్రముఖ కాంగ్రెస్ నేత కేశవరావు కూడా ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచడం ఎప్పుడో జరిగిపోయింది’’ అని ఎన్నోసార్లు చెప్పారు. చిదంబరం డిసెంబర్ 9న చేసిన ప్రకటనను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు పదేపదే చెప్పడం ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై పునరాలోచనలో పడిందని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే కేంద్ర నిర్ణయం ఉండబోతుందని ఒక్కరంటే ఒక్క ఉద్యమ నాయకుడు కూడా చెప్పలేదు. ఇందుకు భిన్నంగా వీరంతా తమకు ఇచ్చిన రాష్ట్రాన్ని సీమాంధ్ర పెట్టుబడి దారులు తమకు దక్కకుండా చేశారన్న భావనను యువకుల్లో కలిగించారు. తామంతా ఏదో కోల్పోయా మన్న వేదనను, తమ బంగారు భవిష్యత్తు చేజారి పోయిందన్న నైరాశ్యాన్ని, ఏం చేయాలో తెలియని నిస్సహాయతను, నిస్పృహను ఉద్యమ నేతలంతా కలసి యువకులలో ప్రేరేపించారు. ఫలితంగా ఈ నైరాశ్యాన్ని తట్టుకోలేక యువకులు వందల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునర్వి చారిస్తోందని, రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని, ఆత్మహత్యలకు పాల్పడేవారు అందుకు దోహదం చేసినవారు కాబోరని ఉద్యమ నాయకులెవ్వరూ చెప్పిన పాపాన పోలేదు. ఒకరిద్దరు మాత్రమే ఈ ప్రాణత్యాగాల వలన ఫలితం ఉండబోదని, బతికివుండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుదామని చెప్పినా, ఆ మాటలకు, వారి ఇతర ప్రకటనలకు పొంతన లేకుండా పోయింది.

‘‘ఇంతమంది యువకుల ప్రాణత్యాగం తరువాతైనా ఆలస్యం చేయకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని ఉద్యమ నేతలు ప్రతి ఒక్కరూ పదేపదే ప్రకటించడంతో తమ తమ ఆత్మార్పణకు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కచ్చితమైన సంబంధం ఉందన్న భావనను ఈ ఉద్యమ నాయకులు యువకులలో కలిగించగలిగారు. అలా ప్రాణత్యాగం చేసిన వారిని అమరవీరులుగా కీర్తించసాగారు. అదే సమయంలో ఉద్యమనేతలు ఆంధ్ర ప్రాంతం వారిని దోపిడీదారులుగా అభివర్ణిస్తూ, ఇక్కడి ప్రజలు అనుభవించే కష్టాలన్నింటికి వారే కారకులుగా చిత్రించసాగారు. తమకు న్యాయంగా రావలసిన ఉద్యోగాలు వారే కాజేస్తున్నారని, తమను వివక్షకు, అన్యాయానికి లోను చేస్తున్నారని నమ్మించగలి గారు. ఫలితంగా తాము ఆత్మాహుతి చేసుకుంటే, అది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కొంత దోహదం చేస్తుందని, ఫలితంగా తమ ప్రాంత ప్రజలకు కష్టాల నుండి, బాధల నుండి విముక్తి లభిస్తుందని విశ్వసించిన యువకులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

‘‘ఆంధ్రులు ఆగర్భ శత్రువులు. వారు నిరంతరం తెలంగాణ ప్రజల ప్రయోనాలను కాలరాస్తున్నారు. వారే సర్వ అరిష్టాలకు కారణం. వారి విషబంధనాల నుండి విమోచన లేకపోతే ఇక్కడి ప్రజల మనుగడే ప్రశ్నార్థక మవుతుంది. ఇందుకు ప్రత్యేక రాష్టమ్రే ఏకైక శరణ్యం. ఇక్కడి ప్రజలందరూ ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా, దుర్మా ర్గులైన ఆంధ్రపెట్టుబడిదారులు అడ్డుపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు కోట్లాది రూపాయలు ఇచ్చి తప్పుడు నివేదిక ఇప్పించారు.’’ ఈ అంశాలన్నింటినీ తెలంగాణ నేతలు ప్రతినిత్యం వల్లెవేస్తున్నారు. ఈ కారణంగా ఇక్కడి యువకులు తీవ్ర నిస్సహాయభావనలో చిక్కుకుంటు న్నారు. నిస్సహాయభావనలో ఉన్నప్పుడు ఎవరికైనా ఈ ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తుంది. ‘‘ఆంధ్ర పెట్టు బడిదారులు ఎప్పుడూ అడ్డుపడుతూనే ఉంటారు. ఇక తెలంగాణ రావడం అసాధ్యం’’ అనే భావాన్ని తెలంగాణ నేతలు అన్యాపదేశంగా ప్రజలకు నూరిపోస్తున్నారు.

చిదంబరం ప్రకటన తరువాత తెలంగాణనేతలు, పరిస్థితిని ఉద్రేక భరితం చేసి, తమ ఏకపక్ష వాదనలతో విద్వేషాలను ప్రేరేపించి అసలు హేతుబద్ధమైన చర్చకు ఆస్కారం లేకుండా చేశారు. ఫలితంగా తెలంగాణ యువ కులు ఈ నేతలు చెప్పే విషయాలను అక్షర సత్యాలుగా పరిగణిస్తూ, తీవ్ర ఉద్వేగాలకు లోనవుతున్నారు.

తెలంగాణ ఉద్యమ నాయకులు వందలాది ఆత్మహత్యలకు పాల్పడిన భయంకర విషాదాన్ని తమ ప్రత్యేక రాష్ట్ర వాదనకు అనువైన సాధనంగా, తమతో విభేదించే వారి నోరు మూయించే ఆయుధంగా వినియోగించుకోవడం చూసి ప్రతిఒక్కరూ సిగ్గుపడాలి. ఈ ఆత్మహత్యలకు పరోక్షంగా తామే కారకులమని ఈ ఉద్యమ నాయకులు గుర్తించాలి. ఈ యువకుల సమాధు లపై తమ పదవుల సౌధాలను నిర్మించుకునే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలి.
-సి.నరసింహారావు
విశాలాంధ్ర మహాసభ సభ్యులు

'ప్రజలను విభజించడం మహాపాపం' - సత్యసాయిబాబా

మానవ సేవయే అన్నిటికన్నా ఉన్నతమైనదని తన చేతలతో చాటి చెప్పిన సత్యసాయిబాబా ఇక లేరు. ఆయన పేరును రాజకీయాలకు, వాదనలకు (అదీ ఈ సమయంలో) వాడుకోవడం తగదు కాని వార్త పత్రికలు , టివి ఛానల్ లు  శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ యొక్క సేవలు కొనియాడుతుంటే నాకు నాలుగేళ్ల క్రితం చదివిన సంగతి జ్ఞప్తికి వచ్చింది. ప్రజలను విడదీయరాదంటూ విభజన మహాపాపం అన్న పాపానికి ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకుని స్వార్ధ చింతనతో స్వప్రయోజనమే అన్నిటికన్నా మిన్న అనేవిధంగా వ్యవహరిస్తున్న కొందరు నాయకులు అనవసరంగా తమ తమ నోర్లు పారేసుకొని సత్యసాయిని దుర్బాషలాడారు. టిఆర్ఎస్ ప్రోద్బలంతో ఒక విద్యార్థి సంఘం సభ్యులు ఓయు క్యాంపస్ దగ్గరున్న 'శివం' పై పడి సత్యసాయిబాబా కటౌట్లను చించి వేసారు.
 
ఆనాడు కేసిఆర్ తెలంగాణా చేనేత కార్మికుల పైన, నల్గొండ ఫ్లౌరోసిస్ బాధితుల పైన తనకున్న అపారమైన  ప్రేమను మీడియా ముందు చెప్పుకొచ్చి, బాబా ఎన్నడైనా తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కారాలు ఆలోచించారా అని అడిగాడు http://articles.timesofindia.indiatimes.com/2007-01-24/india/27872215_1_satya-sai-baba-separate-telangana-state-trs-president ఆ ముక్క నన్నెవడు  బహిరంగంగా  అడగాలి, నేనెప్పుడు సమాధానం చెప్పాలి అన్న ధైర్యం కాబోలు. మనకు నిజాలు మాట్లాడటం తెలుసునా? నోరు తెరిస్తే సన్నాసి కబుర్లే కదా? ప్రాతినిథ్యం వహించిన జిల్లా సంగతులే మనకు తెలియవు. అయినా సమస్యలు సృష్టించడంలో కదా మనం దిట్ట. పరిష్కారాలు ఎవడికి కావాలి? 

ఈ రోజు మీడియా మొత్తం సత్యసాయి సేవలను స్మరిస్తున్నది. సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోని  320 పైగా గ్రామాలకు రక్షిత మంచినీటి సౌలభ్యం కల్పించింది. ఎన్ని జన్మలెత్తి, ఎన్ని ఉద్యమాలు నడిపి, ఎన్ని వసూళ్లు చేస్తే మాత్రం అటువంటి మహత్కార్యం చేయడానికి మనకు మనసొస్తుంది?

23, ఏప్రిల్ 2011, శనివారం

తెరపైకి ‘కేంద్రపాలిత’ ఉద్యమం !

( సూర్య  వార్తాపత్రిక) : తెలంగాణ ఉద్యమంలో కొత్త మలుపు! ఇప్పటి వరకూ ఉత్తర-దక్షిణ తెలంగాణ కలిపి నిర్వహిస్తోన్న తెలంగాణ ఉద్యమంలో తాజాగా కీలక మలుపు! హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలు కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేయాలన్న కొత్త డిమాండ్‌ ఇక ఉధృతమవనుంది. తెలంగాణ సత్వర అభివృద్ధికి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడమే తారకమంత్రమన్న వాదన తెరపైకొస్తోంది. అంటే.. తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణను విడగొట్టి, దానిని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌ ఇకపై విస్తృతం కానుంది.
ఈ డిమాండ్‌ కోసం ‘హైదరాబాద్‌ కేంద్రపాలిత సాధన సమితి’ ఏర్పాటయింది. తమ డిమాండ్‌ నెరవేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి చేయాలంటూ హెచ్‌యుటిఎస్‌ఎస్‌ నేతలు శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కలసి వినతిపత్రాలు సమర్పించారు. మిగిలిన విపక్ష నేతలు, ఈ ఐదు జిల్లాలకు చెందిన తెలంగాణ ఉద్యమ సంస్థలు, సంఘాలు, ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి నేతలతో కూడా భేటీ కానున్నారు. ఐదు జిల్లాలను కలిపి యుటి ఏర్పాటుచేయించడం ద్వారా అభివృద్ధి పథంలో పయనించాలన్నది ఈ సమితి లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే, ఇది తెలంగాణ ఉద్యమంలో చీలికలు తీసుకువచ్చేందుకో, కొన్ని రాజకీయ పక్షాల పక్షాన చేస్తున్న ఉద్యమమో కాదని, పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిన దక్షిణ తెలంగాణ సత్వర అభివృద్ధి కోసం ప్రారంభించిన ఉద్యమమని హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంత సాధన సమితి కన్వీనర్‌ కొడిచెర్ల వెంకటయ్య స్పష్టం చేశారు. తాము ఏ రాజకీయ పార్టీకి, ఉద్యమానికి వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. రాజకీయ నాయకుల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఉద్యమం వల్ల నాయకులు-పార్టీలు బాగుపడితే అమాయకులైన విద్యార్ధుల భవిష్యత్తు నాశనమయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌తో కలసి పనిచేయవలసిన అవసరం లేదని, అయితే తమ ఉద్యమానికి ఎవరు మద్దతునిచ్చినా స్వీకరిస్తామని వెంకటయ్య చెప్పారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ చెప్పినట్లు హైదరాబాద్‌ను దేశ రెండవ రాజధానిగా చేయాలని, శ్రీ కృష్ణ కమిటీ నివేదికలోని 4వ సూచనలో మరికొన్ని ప్రాంతాలను కలిపి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఈ సమితి వాదిస్తోంది. తెలంగాణ పోరాటంలో అమరులైన ప్రతి విద్యార్థి కుటుంబంలోని వ్యక్తులకు సర్కారీ ఉద్యోగం ఇవ్వడంతో పాటు, కృష్ణా మూడవ దశను చేపట్టి నల్లగొండ, రంగారెడ్డి ప్రజలకు సాగు-త్రాగునీరు కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది.

ఈ ఐదు జిల్లాలకు చెందిన ప్రజలను కేంద్రపాలిత ప్రాంత డిమాండ్‌కు ఒప్పించేందుకు సాధన సమితి నేతలు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు వల్ల ఐదు జిల్లాలు ఆర్ధికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని.. ధరలు తగ్గడంతో పాటు దేశ, విదేశీ పెట్టుబడులు ఊపందుకుంటాయని ప్రజలకు వివరించనున్నారు.కాగా, హైదరాబాద్‌ను తెలంగాణలో కలిపితే నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ప్రజలు విపరీతంగా నష్టపోతారన్న కొత్త వాదనను తెరపైకి తీసుకు వస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన హైదరాబాద్‌, ఇతరుల చేతిలోకి వెళితే అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉందని, అన్నింటికంటే ఉత్తర-దక్షిణ తెలంగాణ జిల్లాల పరిథిలోని ప్రజల్లో అంతరాలు పెరిగి, అది అంతర్యుద్ధంగా మారే అవకాశం ఉందన్న వివరణతో ప్రజలను చైతన్యం చేసేందుకు సమితి నేతలు సిద్ధమవుతున్నారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ జిల్లాలకు వచ్చే లాభమేమీ లేదన్న వాదనను ప్రజల ముందు వినిపించనుంది. ఆ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణకు చెందిన కరీంన గర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ , వరంగల్‌ జిల్లాలే లబ్థి పొందుతాయని ప్రజల్లో చైతన్యం తీసుకురానుంది. హైదరాబాద్‌కు గోదావరి జలాలే దిక్కన్న వాదనతో దాని కోసం ఉద్యమించనుంది. హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంత సాధన సమితి నేతలు.. నేతల వల్ల తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టాన్ని కూడా ప్రచారం చేయనున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని సామాన్యులను సమిథలను చేస్తున్న వైనాన్ని ప్రజలకు వివరించనున్నారు.

విద్యార్థులను ఉద్యమాల పేరుతో రెచ్చగొట్టిన రాజకీయ నేతలు ఇళ్ళలో కూర్చుంటే.. 400 మంది విద్యార్థులు చనిపోగా, 8 వేల మంది విద్యార్ధులు జైలుపాలయిన వైనాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లనున్నారు. ఈ స్వార్థ నేతల వల్లే ప్రభుత్వానికి 7 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, పారిశ్రామికాభివృద్ధి 11 నుంచి 6 శాతానికి పడిపోయిందని, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కుప్పకూలిందని ఉదాహరణలతో సహా చాటనున్నారు. ఉద్యమాల వల్ల నగరానికి వలస వచ్చిన తెలంగాణ కూలీల జీవనోపాథి దెబ్బతిందని చెప్పనున్నారు.

తెలంగాణకు రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌నే ఉంచి, సీమాంధ్ర రాజధానిని ఏర్పాటుచేసుకొనేవరకూ హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌తో ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండ్‌ను భౌగోళిక పరిస్థితి దృష్ట్యా అంగీకరించమని చెబుతున్న వారి వాదనలో పస లేదని కన్వీనర్‌ వెంకటయ్య చెబుతున్నారు. నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల కంటే హైదరాబాద్‌ చాలా పెద్దదంటున్నారు. జనాభా, విస్తీరణంలో హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతమే పెద్దదని స్పష్టం చేస్తున్నారు. కాగా, తమ డిమాండ్‌ సాధన కోసం త్వరలో ఐదు జిల్లాల్లో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సభలు, సెమినార్లు, ఇష్టాగోష్ఠి సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా.. విద్యార్థులు, ఉద్యోగ వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి, వారిలో పూర్తి స్థాయి అవగాహనకు తీసుకురావాలని నిర్ణయించారు. అదే సమయంలో ఈ ఐదు జిల్లాలకు చెందిన అన్ని పార్టీల నాయకుల మద్దతు కూడగట్టి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.

హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం అయితే...
50 శాసనసభ నియోజకవర్గాలు, 9 పార్లమెంటు స్థానాలు, 3 జిల్లాల హెడ్‌క్వార్టర్లు ఇమిడి ఉన్నందున.. దానిని ‘ఎలక్టెడ్‌ యుటి’గా ప్రకటించ వచ్చు. అంటే ఎన్నికలు నిర్వహించవచ్చు.
హైదరాబాద్‌ జిల్లా లోని 217 చదరపు కిలోమీటర్లతో 16 మండలాలు; రంగారెడ్డి లోని 7493 చ.కి.మీలతో 38 మండలాలు; నల్లగొండలోని 5341చ.కి.మీలతో 18 మండలాలు; 3260 చ.కి.మీలతో మెదక్‌ జిల్లాలోని 12 మండలాలు; మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 18432 చ.కి.మీల పరిథిలోని 64 మండలాలతో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడుతుంది.
34743 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధి ఉంటుంది. ఇంతపెద్ద విస్తీర్ణం ప్రపంచంలోని 40 దేశాల విస్తీర్ణం కంటే పెద్దది.
గోవా విస్తీర్ణం 1,302 చ.కి.మీ; ఢిల్లీ 1,483 చ.కి.మీ; చండీగఢ్‌ 114 చ.కి.మీ; పాండిచ్చేరి 492 చ.కి.మీ; కొత్తగా ఏర్పడే హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం 34,743 చదరపు కిలోమీటర్లుగా ఉండనుంది.
 
http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=25360


‘వేర్పాటు’కు జిల్లా పాలనే విరుగుడు! - ఎంఎల్ కాంతారావు

జాతీయస్థాయి స్థూల ప్రణాళికలు దేశాభివృద్ధికి ఎంత అవసరమో పంచాయతీ, మండల, జిల్లాస్థాయి అభివృద్ధి ప్రణాళికలు దేశసమగ్రతకు, గ్రామీణ ప్రాంత సమగ్రాభివృద్ధికి అంతే అవసరం. ఈ ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో, వారి అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందాలి. అప్పుడే స్థానిక ప్రజలు ఆ ప్రణాళికలను తమవిగా భావించి, వాటి అమలులో ఇష్టపూర్వకంగా పాల్గొంటారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎన్ని ప్రణాళికలు రూపొందినా లక్ష్యం నెరవేరదన్నది గత ఆరు దశాబ్దాల చరిత్ర గుర్తు చేస్తోంది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడచినా, నేటికీ నాలుగు రకాల దారిద్య్రాలు ప్రజలను పట్టిపీడిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. ఆకలి, అనారోగ్యం, అవిద్య, ఆర్థిక దారిద్య్రాలు దుష్ట చతుష్టయంగా మారి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోందన్నది అతిశయోక్తి కాదు. ప్రధానంగా గ్రామీణప్రాంత ప్రజల అభివృద్ధి అగమ్యంగా మారడం మొదటి తరం పాలకులను సైతం తీవ్రంగా ప్రభావితం చేసింది. మరోవైపు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగి, జీవన స్థితిగతుల్లో వ్యత్యాసాలు తారస్థాయికి చేరడం జాతీయ సమగ్రతకు గొడ్డలిపెట్టుగా పరిణమించింది.

అందుకే, దారిద్య్రాన్ని ప్రణాళికాబద్ధంగా ధ్వంసం చే యడానికి పూనుకోవాలని విజ్ఞులు సూచించారు. దానికనుగుణంగానే 1950లో భారత పార్లమెంటు తీర్మానం ద్వారా ‘ప్రణాళికా సంఘం’ ఆవిర్భవించింది. 1951 నుంచి నేటివరకూ దేశసమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో 11 పంచవర్ష ప్రణాళికలు రూపొందాయి. 2012లో ప్రారంభమయ్యే 12వ పంచవర్ష ప్రణాళికలో ఆర్థికాభివృద్ధి మరింత వేగంగానూ, సమ్మిళితంగానూ ఉండాలన్నది లక్ష్యం. ప్రజలకు సుసంపన్నమైన, మెరుగైన, వైవిధ్యంతో కూడిన జీవనాన్ని అందించాలన్న ప్రణాళికా సంఘం లక్ష్యాన్ని నెరవేర్చడంలో గణనీయమైన విజయాన్ని సాధించలేకపోవడం వెలితిగానే భావించాలి.

కేంద్రీకృత ప్రణాళికా విధానాలతో విభిన్న ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య అంతరాలను పూర్తిగా తొలగించడం సాధ్యమా అన్నది చర్చగా మారింది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి, ఆర్థిక పరిపుష్టతను చేకూర్చాలన్న వాదనకు ఈ నేపథ్యం దోహదం చేసింది. 1993 ఏప్రిల్ 24న 73వ సవరణ ద్వారా భారత రాజ్యాంగాన్ని సవరించి పార్లమెంటు ఆమోదించడంతో పంచాయతీరాజ్ వ్యవస్థకు జవజీవాలను సమకూర్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

విభిన్న రాష్ట్రాలు, జిల్లాల మధ్య ఆర్థికపరమైన అంతరాలు ఉన్నట్లే వ్యక్తుల మధ్య కూడా దిగ్భ్రాంతి కలిగించే స్థాయిలో అంతరాలు ఉన్నాయన్నది వాస్తవం. ప్రపంచ కుబేరుల్లో భారతీయుల సంఖ్య పెరగడాన్ని చూసి మురిసిపోతున్న పాలకులకు, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న (బీపీఎల్) భారతీయుల శాతం రోజురోజుకూ పెరిగిపోవడం ముచ్చెమటలు పట్టిస్తోంది. దేశంలో బీపీఎల్ శాతం 28.3గా ప్రణాళికా సంఘం అంచనా వేయగా, టెండూల్కర్ కమిటీ 37.2 శాతంగా లెక్కగట్టింది.

2007-10 సంవత్సరాల మధ్య హైదరాబాద్ జిల్లా సాలుసరి సగటు ఆదాయం రూ. 59,234 కాగా మహబూబ్‌నగర్ జిల్లా తలసరి ఆదాయం రూ. 25,565. కృష్ణా జిల్లా తలసరి ఆదాయం రూ. 40,466 కాగా విజయనగరం జిల్లా తలసరి ఆదాయం రూ. 26,298. అలాగే, నెల్లూరు జిల్లా తలసరి ఆదాయం రూ. 35,700గా నమోదైతే, అనంతపురం జిల్లా సగటు ఆదాయం రూ. 29,421 మాత్రమే కావడం గమనార్హం.

దారిద్య్రం, నిరుద్యోగం బాధ ఎక్కడ ఉన్నా, అవి ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా పరిణమిస్తాయన్నది అనాదిగా వినిపిస్తున్న హెచ్చరిక. దేశంలో విస్తృత స్థాయిలో ఉన్న పేదరికమే నేడు మన ముందున్న ప్రధాన సవాలు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా అందకపోవడం దీనికి ఒక ప్రధాన కారణమన్నది విమర్శకుల వాదన.
ఆర్థిక అంతరాలు, సాంఘిక అసమానతలు తగ్గేవిధంగా ప్రణాళికలను రూపొందించుకోవాలి. తీవ్రవాద ప్రభావాలను తగ్గించి, ఆయా ప్రాంతాల అభివృద్ధికి సత్వరం కృషి జరగాలి. ఈ రకమైన లక్ష్యాల సాధనకు ఏర్పడిందే ‘వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి నిధి’ (బీఆర్‌జీఎఫ్). వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలను చేపట్టడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. 2006లో ఈ నిధిని ఏర్పాటు చేశారు. వెనుకబడ్డ జిల్లాల గుర్తింపుకు అనేక కమిటీలను నియమించారు.

గిద్వాని కమిటీ, పాండే కమిటీ, వాంఛూ కమిటీ, శర్మ కమిటీలు అలా ఏర్పడినవే. అప్పటిదాకా ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో అమలవుతున్న ‘రాష్ట్రీయ సమవికాస్ యోజన’ స్థానంలో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించి పంచాయతీరాజ్‌శాఖ నియంత్రణలోకి తేవడం విశేషం. ఈ పథకం ప్రారంభానికి కొన్ని ప్రత్యేక లక్ష్యాలను ప్రకటించారు. వెనుకబడ్డ జిల్లాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పాటు, పంచాయతీ స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నది ప్రధానం. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల ద్వారా స్థానికంగా మౌలిక వసతుల కల్పనకు చాలినంత నిధులు లభించని పక్షంలో, ఈ నిధి నుంచి సహాయం పొందవచ్చు. స్థానిక సంస్థలు తమ అవసరాలకు తగినట్టు ప్రణాళికలను రూపొందించి అమలు చేసుకోవడానికి ఈ పథకం ఇతోధికంగా దోహదపడుతుంది. పంచాయతీ సంస్థలు సాంకేతికపరంగానూ పాలనాపరంగానూ తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం ప్రస్తుతం 13 జిల్లాల్లో అమలులో ఉంది. హైదరాబాద్ మినహా తెలంగాణలోని 9 జిల్లాలు, కర్నూలు మినహా రాయలసీమలో 3 జిల్లాలు, కోస్తా ప్రాంతంలోని విజయనగరం జిల్లాను ఈ పథకం అమలుకు ఎంపిక చేశారు. తీవ్రవాదాన్ని, పేదరికాన్ని నివారించడానికి ఈ పథకం ద్వారా ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా వంద జిల్లాలను ఎంపిక చేసినప్పుడు, రాష్ట్రం వాటా 10 జిల్లాలు మాత్రమే. తదనంతరం ఆ సంఖ్య 250కి పెరగడంతో, రాష్ట్రంలో అదనంగా అనంతపురం, కడప, రంగారెడ్డి జిల్లాలు చేరాయి. 11వ పంచవర్ష ప్రణాళికలో ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ఆర్థిక సహాయం సుమారు రూ. 1,676 కోట్లు. అంటే ఏడాదికి సగటున దాదాపు రూ. 335 కోట్లు. జిల్లాల అభివృద్ధికి, అసమానతల తగ్గింపుకు బీఆర్‌జీఎఫ్ ఒక పాక్షికమైన పరిష్కారం మాత్రమేనన్నది మరువ కూడదు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయిలో మరిన్ని ప్రణాళికలు ఎంతైనా అవసరం.

దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడి సుపరిపాలన సాధించడానికి పేదరికాన్ని తొలగించడం, అసమానతలను రూపుమాపడం ప్రధాన ఎజెండా కావాలి. పంచవర్ష ప్రణాళికల అమలులో నేర్చుకున్న ప్రధాన గుణపాఠంతోనే వికేంద్రీకృత, సూక్ష్మస్థాయి ప్రణాళికల ఆవశ్యకతను గుర్తించామన్నది గమనించదగ్గది. జాతీయస్థాయి స్థూల ప్రణాళికలు దేశాభివృద్ధికి ఎంత అవసరమో, పంచాయతీ, మండల, జిల్లాస్థాయి అభివృద్ధి ప్రణాళికలు దేశ సమగ్రతకు, గ్రామీణప్రాంత సమగ్రాభివృద్ధికి అంతే అవసరం. ఈ ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో, వారి అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందాలి. అప్పుడే స్థానిక ప్రజలు ఆ ప్రణాళికలను తమవిగా భావించి, వాటి అమలులో ఇష్టపూర్వకంగా పాల్గొంటారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎన్ని ప్రణాళికలు రూపొందినా లక్ష్యం నెరవేరదన్నది గత ఆరు దశాబ్దాల చరిత్ర గుర్తు చేస్తోంది.

ఆర్థికాభివృద్ధికి, సామాజిక న్యాయ సాధనకు అవసరమైన వార్షిక ప్రణాళికలను ఒక యజ్ఞంలాగా పంచాయతీరాజ్ సంస్థలు రూపొందించి అమలు చేయాలన్నది 73, 74 రాజ్యాంగ సవరణల ముఖ్య ఉద్దేశం. ఈ సవరణలతోనే ‘జిల్లా ప్రణాళికా కమిటీ’ (డీపీసీ)ల ఏర్పాటుకు వెసులుబాటు కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 2003 నుంచీ డీపీసీలు అమలులోకి వచ్చినట్టు ప్రకటించినప్పటికీ, 2007 నుంచి మాత్రమే అవి అమలుకు నోచుకోవడం ప్రారంభమైంది. ఈ కమిటీలకు జిల్లాపరిషత్ అధ్యక్షులు చైర్‌పర్సన్‌లు కాగా, జిల్లా కలెక్టర్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. వీరుకాక 28 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 24 మంది జెడ్పీటీసీ, మునిసిపల్ కమిటీ సభ్యుల నుంచి ఎన్నికవుతారు.

మిగిలిన నలుగురు ప్రణాళికా వ్యవహారాల్లో నిపుణులైనవారుగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా ప్రణాళికా కమిటీలు ఉన్నప్పటికీ, కొన్ని రాజకీయ కారణాల వల్ల అవి కేవలం బీఆర్‌జీఎఫ్ ద్వారా వచ్చే నిధులకు మాత్రమే పరిమితమై ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఇది అంత మంచిది కాదు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే జిల్లా ప్రణాళికా కమిటీలు విస్తృత స్థాయిలో ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.

ప్రజల భాగస్వామ్యంతో చక్కటి ప్రణాళికలు రూపొందినప్పుడే పంచాయతీరాజ్ వ్యవస్థ పరిపూర్ణమై, మరింతగా పరిపుష్టమవుతుంది. స్థానిక ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందాలి. ప్రతి ప్రాంత అభివృద్ధికీ ఒక ప్రత్యేక విజన్ ఉండాలి.

2011 జనవరిలో జిల్లా ప్రణాళికా కమిటీలను దృష్టిలో పెట్టుకుని అనేక మార్గదర్శకాలను రూపొందించారు. స్థానికంగా తయారైన ప్రణాళికలను, ఎంపిక చేసుకున్న పథకాలను డీపీసీలు ఇష్టమొచ్చిన రీతిలో మార్చడానికి వీలులేదు. ప్రణాళికల్లో మార్పులను కిందిస్థాయి సంస్థలకు తెలియజేయాలి. తమవద్దకు చేరిన స్థానిక ప్రణాళికలను క్రమబద్ధీకరించి, క్రోడీకరించి జిల్లా ప్రణాళిక ను స్థిరీకరించుకోవాలి. ప్రణాళికల్లో నిర్దేశించిన పనుల నిర్వహణ, పర్యవేక్షణతో పాటు నెలవారీ పనిని కూడా సమీక్షించుకుని గుణాత్మకమైన విజయాలను సాధించడానికి డీపీసీలు కృషి చేయాలి.

జిల్లా ప్రణాళికా కమిటీలు సమగ్రంగా రూపుదిద్దుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధను కనపరచినపుడే, అవి మంచి విజయాలను సాధించడం సులభతరమవుతుంది. నిష్ణాతులైన సిబ్బందిని నియమించి, ఆర్థికపరమైన ఆసరాను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. జిల్లా ప్రణాళికాధికారి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించాలి. 12వ పంచవర్ష ప్రణాళికను రాష్టస్థ్రాయిలో ఆమోదించే తరుణంలో, ఆయా ప్రణాళికలు కింది స్థాయి నుంచి, గ్రామ సభలు మొదలైనవాటి ద్వారా సంపూర్ణ ఆమోదంతో రూపొందేలా చర్యలు తీసుకోవాలి. గ్రామీణాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములను చేయాలి.

వేగవంతమైన అభివృద్ధి, సమగ్రమైన సమ్మిళత అభివృద్ధిని సాధించడానికి వికేంద్రీకృత, సూక్ష్మస్థాయి ప్రణాళికలు ప్రధాన కార్యరంగంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. 73, 74 రాజ్యాంగ సవరణలు పంచాయతీరాజ్ వ్యవస్థను తృతీయ అంచె ప్రభుత్వాలుగా గుర్తించాయన్నది దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా వాటి కార్యాచరణను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టినప్పుడే గ్రామీణప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. స్థానిక స్థాయిలోని ప్రభుత్వ వ్యవస్థలు ఎంత పటిష్టంగా పనిచేస్తే, ఉగ్రవాదాలను, వేర్పాటువాదాలను అంత త్వరగా రూపుమాపవచ్చన్నది పాలకులు ఇప్పటికైనా గుర్తించాలి.

-  ఎంఎల్ కాంతారావు, విశ్రాంతాచార్యులు, ఎస్.కె.యూనివర్శిటీ
( ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సాక్షి వార్తాపత్రికలో ప్రచురితమైనది )

20, ఏప్రిల్ 2011, బుధవారం

దేశద్రోహులు

ఎవరికి ఓటేశావ్?
మనసున్న మంచివాడికా?
కాదు...కాదు...
చదువున్న సంస్కారికా?
అదేం కాదు...
బాధ్యతున్న దేశభక్తుడికా?
అస్సలు కాదు...
సంఘమంటే అతనికవగాహన ఉందా?
ఏమో తెలీదు...
దేశాబ్యుదయమే అతని ఆశయమా?
కాదనుకుంటా...

మరి..ఏం తెలిసి అతనికోటేశావ్?
ఏంకోరి దేశాన్నతని చేతిలో పెట్టావ్?
అదేమీ ఆలోచించలేదా?

అవగాహనలేని, బాధ్యత లేని
తెలివిమాలిన... ఓటరువి నువ్వు!
నోట్లు పంచి ఓట్లు దండే దమ్మున్న
తెలివిమీరిన... నాయకుడు అతను!
అందుకే..ఇద్దరూ దేశద్రోహులే!!

హత్య తరువాత హత్య తో సమానమైన నేరం ’హేళన’.."- బుద్ధుడు

హత్య తరువాత హత్య తో సమానమైన నేరం ’హేళన’.."- బుద్ధుడు

రెండువైపులా సాన గల్గిన కత్తికన్నా పదునైనది మాట.
చేసినపనుల కన్నామాట చాలారోజులు గుర్తుండి పోతది!

చులకన, వెటకారం, వ్యంగ్యం ,పరిహాసం,  పర్యాచకం, పరుశ పదజాలం, నవ్వు, నిర్లక్ష్య-చూపులు, ఇవే అవహేళనకి అస్త్రాలు.

వివక్షలో భాగం
హేళన!

ఎదుటి వాడి ఆధిక్యత ని ఒప్పుకోలేని వాడు హేళనకి దిగుతాడు.
ఎదుటు వాడిపై ఆధిక్యతని చూపలేని వాడు హేళనకి దిగుతాడు.
చేతలు చేయడానికి చేత కాని  వాడు హేళనకి దిగుతాడు.
తనకి తాను సమాధానం చెప్పుకోలేనోడు హేళనకి దిగుతాడు.
మాటలతో ఒప్పించలేని వాడు హేళనకి దిగుతాడు ,
అవేమాటలతోనే నొప్పించా లనుకునే వాడు హేళనకి దిగుతాడు.
దురహం తో వున్న వాడూ  హేళనకి దిగుతాడు.
అవివేకాన్ని కప్పిపుచ్చు కోవాలనుకునే వాడు హేళనకి దిగుతాడు.
అబధ్రతా భావానికి లోనయ్యేవాడు ఎక్కువగా హేళనకి దిగుతాడు,
సొంత వాళ్ళతో లేక సొంత -భజన- బృందాలతో మెప్పు పొందాలనే  ఆరాటం ఉన్నవాడూ  హేళనకి దిగుతాడు.

హేలన చేసేవారికి ఇది ...
వ్యక్తిత్వ పరంగా ఒక దౌర్బల్యం.
సామాజిక పరంగా దౌర్భాగ్యం.
మానసికంగా ఒక అశాంతి.
జ్ఞానార్జన పరంగా ఒక ఆటంకం.
క్షేమం పరంగా ఒక సంకటం.

వెటకారం తో , వ్యంగ్యం తో చులకన చేసి ఆనంద పడే వాడు నిజంగా రాక్షసుడే!
నిజమైన శీలవంతుడు, స్వాభిమాని ఎదుటివారిని హేళన పరచడు.
శీలం లేనివాడు, దురాభిమానం కల వాడు మాత్రమే ఎదుటివారిని హేళన చేస్తాడు. (దురాభిమాని అంటే వాడి లోపాలు వాడికి తెలిసికూడా ఒప్పుకోని వాడు.)

హేళన తో ఎదుటివారిని జయించచ్చు, పరాభవించవచ్చు అనుకోవడం కూడా పొరపాటే! కాని ఆగ్రహాని మాత్రం గురవుతాం, మాటతో మనం చేసే చులకన మనకు తెలియకుండానే శత్రువులని తయారుచేసిపెడ్తుంది. ప్రతీకారం తరాలు దాటినా వెంబడిస్తుంది.

మనవైపు న్యాయమున్నా,  అవహేళనని ఆయుధం గా మలుచుకోవడం వల్ల న్యాయం కూడా మనలని వదలి వెలుతుంది.. మన వాదనని బలహీన పరుస్తుంది.

తనకి పరాభవం జరిగితే , విజ్ఞులు వివేచనతో వ్యవహరిస్తారు....
దురాభిమానులు మాటలతో హేళన చేస్తారు.

స్వాభిమానం తో వశిష్ఠ మహర్షి పై అధిక్యం చూపడానికి విజ్ఞత గల్గిన విశ్వామిత్రుడి సత్‌ప్రయత్నం తనని ఋషి నుండి  రాజర్షి, బ్రహ్మర్శి, మహర్షిని జేసింది.
దురాభిమానం తో పాండవులపై ఆధిక్యం చూపడానికి దుర్యోధనుడు చేసిన విఫల యత్నం తనని మనిషి నుండి పశువు, మృగం, రాక్షసున్ని జేసింది. 

ఒకడు హేళన చేస్తున్నప్పుడు .....
మౌనం తో సమాధానం చెప్పడం ఉత్తముల లక్షణం.
మాటల తో సమాధానం చెప్పడం మధ్యముల లక్షణం.
హేలన తో  సమాధానం చెప్పడం అధముల లక్షణం.

నిజమైన వీరుడు ద్వంద్వం లో చూసుకుంటాడు.


ఏది ఏమైనా ...... ఇప్పటికే హేళనా-రంగంలో దిగిన వారికి నామాటలు విరుధ్ధంగా అనిపించ వచ్చు!.


సంరంభం అన్నది సాహసం ... సాకారం చేసేయ్ ఆశయం!

ప్రజలంతా ఇప్పుడు సిధ్ధమే
సమరానికంతా సనధ్ధమే!
అలుపన్నదెరుగని పయనమే
 వేర్పాటువాదం  పై ఇక యుధ్ధమే!


చీకట్లని చీల్చే కిరణము
దూసుకు వచ్చే తరుణము
తరతరాల దోపిడినాపే
నవీన విప్లవ జననము 


సంకల్పం వీడక ఈ క్షణం
సంరంభం అన్నది సాహసం
మనదే తప్పక ఈ జయం
సాకారం చేసేయ్ ఆశయం


ఐక మత్యమే మనబలం
అని జాగృతి చెందిన జనబలం
కునీతిపరుల గుండెల్లో 
చిచ్చై రేగిన కలకలం! విశాలాంధ్ర మహాసభ.

19, ఏప్రిల్ 2011, మంగళవారం

గోదావరి నదీ జలాలపై వేర్పాటువాదుల మోసపూరితమైన వాదన

స్వప్రకటిత తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర పోరాటయోధులెవరిని కదిపినా, వారి నోటి ముందు మైకు పెట్టినా ఏదో 'జాతీయ జలసంఘం' నుండి డెప్యుటేషన్ పై వచ్చి రోడ్డున పడిన వారిలా "మా నీళ్ళు...అరె అరె మా నీళ్ళు మాకిమ్మని " అని బ్యాక్ గ్రౌండ్ పాటొకటి వేసుకొని జనాలను అదరగొడతారు.వారి వాదనను విని బాగా చదువుకొన్న వారే మోసపోగాలేనిది సామాన్య ప్రజలు ఏపాటివారు?  అటువంటివారు ఎప్పుడు చూసిన మా నీళ్ళు దొంగిలించారు, మాకన్యాయం చేశారు, 70 % పైగా క్యాచ్ మెంట్ ( పరివాహక ప్రాంతం) ఉన్నాకూడా కేటాయింపులలో మా ప్రాంతానికి అన్యాయం  చేశారు అని ప్రజలను ఎమార్చుతారే తప్ప నిజాలను మాట్లాడరు. మరి లేకపోతే భావోద్రేకాలను సులువుగా ఎలా రెచ్చకొట్టడం?

అసలు కేటాయింపులు రాష్ట్రాలవారీగా, రాష్ట్రాలలో ప్రాజెక్ట్ల వారీగా జరుగుతాయి కానీ ప్రాంతాలవారీగా కాదు. సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారెవరికైనా తెలుసు క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా నదీజలాల  కేటాయింపులు ఎక్కడా జరపరని.లేకపోతే గోదావరి, కృష్ణ  ట్రిబ్యునల్ల కేటాయింపులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  మహారాష్ట్ర, కర్ణాటక కన్నా ఎక్కువ వాటా వచ్చేదే  కాదు.

క్యాచ్ మెంట్  ఏరియా గురించి మాట్లాడే వారు నదీప్రవాహ లెక్కల్ని సునాయాసంగా మర్చిపోతారు. అసలు నదిలోని నీళ్ళు కదా మనకు ముఖ్యం? నదీప్రవాహం వార్షిక వర్షపాతం, భూనేలల స్వభావం, ఆ ప్రాంతపు సహజ అడవులు తదీతర అంశాలపై ఆధారపడి వుంటుంది.గోదావరికున్న విశిష్టమేమిటంటే ఆ నదిలో నీటి ప్రవాహం ఎగువ ప్రాంతాలలో చాలా తక్కువుగా ఉంటుంది, దిగువున మాత్రం ఎన్నో రెట్లు పెరుగుతుంది. "గోదావరి నీటి మొత్తంలో దాని ఉపనదులు మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి మరియు శబరిలు వరుసగా  6%,40%,20%,10% నీటిని సమకుర్చుతాయి"(sakti.in). ప్రాణహిత, ఇందావతి, శబరి నదుల క్యాచ్ మెంట్ ఏరియా ఆంధ్ర ప్రదేశ్ లో ఎంత మాత్రం ఉంది? మంజీరా నది క్యాచ్ మెంట్ మాత్రమే కొద్దో గొప్పో ఆంధ్ర ప్రదేశ్ లో ఉండగా మిగతాది కర్ణాటక, మహారాష్ర లలో ఉంది. మరి మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ , ఒరిస్సా  రాష్ట్రాలు మన ప్రత్యేకవాదులు కనిపెట్టిన వాదనను కాపీ కొట్టేసి, మన రాష్ట్రం చేస్తున్న నీటి దోపిడీని ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెబుదాం?ఆలోచిందండి.

 ప్రపంచవ్యాప్తంగా డెల్టా ప్రాంతాలు సహజ సిద్దంగా దిగువకి పారే నీళ్ళను, వాటితో కొట్టుకువచ్చే ఒండ్రు మట్టిని  వనరులుగా కలిగి ఉన్నాయి. గోదావరి డెల్టానో లేక కృష్ణ డెల్టానో  అందుకు మినహాయింపు కాదు. మనదేశం విషయానే తీసుకుంటే కావేరి, మహానది నీళ్ళను ఎగువ ప్రాంతాల నుండి దిగువ ప్రాంతాల వారు దొంగిలించడం లేదు? ఎక్కడైనా మానవమాత్రులు ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళలేరు. వినేవారు వుంటే 'సన్నాసి' ఊతపదంగా కలవారు  ఎన్ని సన్నాసి  కబుర్లయినా చెప్పి వినేవారిని నిజమైన సన్నాసులను చేస్తారు.

గోదావరి నది లోయలో ప్రవహిస్తుంది. అంతేగాక ఆ లోయ కొన్ని లక్షల సంవత్సరాలుగా ఇరువైపులా విస్తరిస్తూ నేటి స్థితి కి చేరుకుంది. పోలవరం వద్ద గోదావరి ఇరుకైన పాపి కొండల మధ్య ప్రవహిస్తుంది. గోదావరి పై గ్రావిటీ డ్యాం కట్టడానికి  అది అత్యంత అనుకూలమైన ప్రదేశం. పోలవరం ప్రాజెక్టు మొదట 1946 లో ప్రతిపాదించబడింది. ప్రత్యేకవాదులెవరైనా అటువంటి అనువైన స్థలాన్ని శ్రీరాంసాగర్, పోలవరం మధ్య చూపించగలరా?సాగునీరు ఉచితంగా వచ్చేది కాదు. సముద్రమట్టానికి దగ్గరిగా, కాలువలు తవ్వడానికి అనువుగా వుండే డెల్టా ప్రాంతాలలో సాగునీటి సరఫరాకి అయ్యే ఖర్చు తక్కువ. డెల్టా ప్రాంతాలు సారవంత మైన భూమిని కూడా అదనంగా కలిగివుంటాయి. నదీలోయ నుండి నీటిని  తోడి ఎత్తైన ప్రాంతాలకు సాగు నీటి సరఫరా చేయాలంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. చాలాసార్లు  అటువంటి లిఫ్ట్ ప్రాజెక్ట్లలో ఖర్చులు లాభాలను ఎన్నో రెట్లు మించిపోతాయి. కొత్తగా ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల లిఫ్ట్ ప్రాజెక్ట్ కొరకు పోలవరం డ్యాం మొత్తానికి అయ్యే ఖర్చు కన్నా దాదాపు 2.5 రెట్లు ఎక్కువ అవుతంది అని ఒక అంచనా. అంతేకాక నీటిని తోడదానికి 3,500 మెగావాట్ల విద్యుత్తూ అవసరమవుతుంది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం దానికి  కార్య రూపం ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఎందుకంటే గోదావరి లో మనం ఉపయోగించుకుంటున్న దానికంటే అధిక జలాలు నిరూపయోగంగా పారుతున్నాయి.

గోదావరి జలాలను  పూర్తి స్థాయిలో ఉపయోగించదానికి  అడ్డోస్తున్న సాంకేతిక,భౌగోళిక మరియు ఆర్థిక సవాళ్ళను  వేర్పాటువాదులు ప్రజలను ఏమార్చే సాధనాలుగా వాడుకోరాదు. ఇటీవలే తెలంగాణా వెనుకబాటు విషయాన్ని కనుగొన్న నాయకులు, తమకు సంబంధం లేని లేక తెలియని దానిగురించి అడ్డంగా వాదించే కుహన ప్రొఫెసర్ లు , మేతావులు , పనిలేక గుర్తింపు కోసం లేక రెండు నిమిషాల కీర్తి కోసం తహతహ లాడే  పలురకాల జేఏసి సభ్యులకు ఇదంతా చెప్పినా వృధానే. కాని సామాన్య ప్రజానీకానికి  నిజాలు తెలియపరచాల్సిన  అవసరం ఎంతైనా వుంది. 

డెల్టా ప్రాంతాలలో సాగునీటి సదుపాయాలు రాష్ట్రం ఏర్పడే నాటికే వున్నాయి. ఉభయగోదావరి, కృష్ణ జిల్లాలలోని ఎగువ ప్రాంతాలు కూడా కాలువల ద్వారా సాగునీటి సదుపాయం కలిగి లేవు. ఒక అంచనా ప్రకారం ఏటా ౩౦౦౦ TMC ల   గోదావరి నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. మరి ఎవరి నీళ్ళను ఎవరు దొంగిలిస్తున్నారు? మరి శ్రీరాంసాగర్ తెలంగాణా ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర సరిహద్దు దగ్గర వుంది కాబట్టి అందులో నిల్వ చేసిన నీళ్ళు మహారాష్ట్ర నుండి దొంగిలించినవి అని అనడం సమంజసమా?

Suggested Reading:

“When it comes to irrigation, there are many concerns and apprehensions in all regions of Andhra Pradesh. In terms of old projects in the coastal belt, ayacut was developed and  river waters in Godavari and Krishna were harnessed during British time. The topography, low altitude, flat terrain, annual flooding of major rivers and drains, the ease of harnessing river water in deltas a relatively low cost per acre and the higher water duty
(area irrigated by one cusec of water) on account of long-standing, settled irrigated cultivation in alluvial soils have all given significant advantage to the four coastal districts which form the delta areas of the mighty Godavari and Krishna rivers. The globally accepted ‘prior-use’ principle in allocation of water also gave the coastal delta regions an advantage. Of the two major rivers in Andhra Pradesh, Godavari flows mostly in a valley. The altitude of much of Telangana is between 300 to 2100 feet above the mean sea level (MSL), and Godavari at Pochampad is at 299.3 m (bed level) elevation; where the Pranahita tributary meets Godavari the elevation is only 95 m above MSL. While in most years up to 3000 TMC of flood water flows into sea in Godavari river, it cannot be easily exploited except in the delta region. Krishna River which can be harnessed better on account of topography is fully exploited by the riparian states. Out of  the 890 TMC of water allocated to Andhra Pradesh, Telangana gets 266.83 TMC share. In terms of the run off into Krishna River from the catchment area, the flows from Telangana into the river are estimated 263 TMC. Bachawat tribunal allocated up to 280 TMC of the waters in Krishna River to the projects irrigating in Telangana area. The delta
region is allotted 300 TMC from Prakasam Barrage and the Right Canal of Nagarjunasagar Project.This allocation is based on topography and prior use. Thus, while the delta is benefiting disproportionate to its area of Catchment, Telangana has been allocated its due share by the Tribunal and projects are being developed to harness that water. One of the keys to harnessing the river waters in the parched Rayalaseema and Telangana region lies in inter-basin river transfers.

Godavari flood river water should be transferred to Krishna basin to the extent feasible . Unfortunately, most inflows into Godavari are from Kaleswaram in Karimnagar district where Pranahita joins Godavari, and in the downstream areas. But the confluence of Pranahita and Godavari, the river flows at 95 meters above MSL (bed level) whereas most of the Telangana is significantly above this elevation. This makes inter-basin transfer in upper reaches of Godavari exceedingly difficult and costly, and therefore not feasible or viable. Such feasibility exists in the delta area, where Godavari water, in addition to fulfilling the ayacut needs in Godavari delta, can be transferred by gravity to Krishna basin. If that is accomplished successfully,all water upstream of Nagarjunasagar project can be impounded at Srisailam and Nagarjunasagar and utilized for Rayalaseema
and Telangana fully. Such innovative ideas are needed to ensure a more equitable, costeffective distribution of river water. However, there is no real evidence of any deliberate discrimination in distribution of river waters or denial of due share to any region in A.P., except on grounds of topography and prior use.”

Source: http://www.loksatta.org/cms/documents/skc.pdf ( Report presented to Justice Sri
Krishna Committee by Lok satta party )

18, ఏప్రిల్ 2011, సోమవారం

Ghazal Srinivas's song on Tank Bund Statues demolition

ప్రభుత్వోద్యోగుల సహాయనిరాకరణ ఎవరెవరి నడ్డి విరిచింది?

 ఈ ప్రశ్నకు అంత సులువుగా  సమాధానం దొరకదు. ఎవరైనా మాకు అన్యాయం జరిగింది అన్నారంటే  వారిని తెలంగాణా  ద్రోహులగానో, సీమాంధ్ర నుండి వలసవచ్చిన వారిగానో ముద్రవేయడం ఖాయం. ప్రభుత్వోద్యోగులు తమ విధులకు హాజరు కాకపొతే సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారులు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. అందులో అర్థం కాకపోవడానికి ఏమి లేదు. సంఖ్యాబలం మెండుగా ఉన్నా అటువంటివారికి బారెడు నోరు ఉండదు కాబట్టి వారి మాటలు మీడియాకు వినిపించవు. జనాభాలో ఒక్కశాతం కూడా లేనివారు చేసే పార్ట్ టైం ఆందోళనలకు(  ఆఫీసు ముందు టెంట్ వెయ్యడం, ఒక పూట ధర్నాకు కూర్చోవడం, ఫోటోలకు ఫోజులివ్వడం, ఐదు కాగానే నిమ్మకాయి రసం పుచ్చుకొని సెలవు తీసుకోవడం) అటువంటివారు బలి అవుతూనే వుంటారు. 

ఈ రిపోర్ట్ ను చదవండి

 ఈ సంవత్సరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ  ఉపాధి పథకం  పనులలో  నిజామాబాదు జిల్లా మొదటి స్థానం నుండి నాల్గవ స్థానానికి పడిపోయింది. ఇతర తెలంగాణా జిల్లాల పరిస్థితి మనకు తెలియదు. ఒక పక్క ప్రభుత్వోద్యోగులు సహాయనిరాకరణ పేరుతో గుర్రుపెట్టి ఇంట్లో నిద్రపోయినా వారి జీతాలకు ధోకా ఉండదు. ఆ పరిస్థితే వస్తే  ఎందుకూ కొరగాని 'రకరకాల' జేఏసి సభ్యులు టివీ స్టూడియోలకెక్కి ప్రభుత్వాన్నే బెదిరిస్తారు.మరో పక్క రోజు కూలీలకు పనిచేసే వాళ్ళు మాత్రం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాల్సి వచ్చినా పట్టించుకునే దిక్కు లేదు. హైదరాబాద్ మహానగరం విషయాన్నే తీసుకుంటే చీటికి మాటికి ఇచ్చే బంద్ పిలుపులు మూలంగా సగటు పౌరుడు రవాణా సౌకర్యం లేక రోడ్డుపై తిప్పలుపడుతుండగా, చిన్న వ్యాపారులు మరియు  రోజు కూలీలు బాగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఒక ప్రాంతీయ పక్షపాతి జడ్జి గారి ముసుగు వేసుకొని విధ్వంసకారుల ప్రజాస్వామ్యక హక్కుల గురించి ఉచిత అభిప్రాయాలు చెబుతారు. ఆయనలాంటి వారు  హైదరాబాద్ లో బందు రోజున సగటు పౌరుడిగా జీవిస్తే ప్రజాహక్కుల గురించి ఇంకా బాగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తారేమో!


17, ఏప్రిల్ 2011, ఆదివారం

'అందమైన భాష రా అందరు మెచ్చిన భాష రా' - జొన్నవిత్తుల


ఓ ప్రభుత్వోద్యోగి ఆవేదన

'నో వర్క్ నో పే ' నిబంధనను ప్రభుత్వం తెచ్చిందని సంతోషించినా అది ఎంతో కాలం నిలవలేదు.GO 177ను 'తాత్కాలికంగా' నిలిపివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పట్లో దానికి మోక్షం లభిస్తుందని అనుకోను.  

మొదటగా జీతం తీసుకొని చేసే పనిని సహాయం అనరు. లేని సహాయాన్ని నెట్టినబెట్టుకొని నేనేదో పొడిచేస్తున్నాను అనుకొని అదే భ్రమలో సహాయనిరాకరణ పేరుతో ప్రభుత్వ పరిపాలనకు ఆటంకాలు కలిగించిన వారు చివరకు ఏమి సాధించారు? ప్రభుత్వోద్యోగులలో ఒకరు తప్పుకున్నా ఆ స్థాయిని ఆశించే, ఎక్కువ అర్హత కలిగిన వారు వందల్లో ఉన్నారు.సాధారణ ప్రజల సాదకబాధకాలను పట్టించుకోకుండా ఎంతోమంది సహోద్యోగులను పని చేయవద్దని బెదిరించి, మరెంతో మంది క్రింది స్థాయి ఉద్యోగులతో 'అదిగో రాష్ట్రం వస్తుంది ఇదిగో మీ సమస్యలు యిట్టె తీరిపోతాయి' అని లేని పోనీ ఆశలు కల్పించి,  ఒక గంటసేపు ఆఫీసు ఆవరణలో బంతి ఆట ఆడి మిగతా టైంలో ఇంటిలో గుర్రుపెట్టి నిద్రపోయి, లేక ఒక పూట ధర్నాలో కూర్చొని సాయంత్రం ఐదు కాగానే నిమ్మకాయ రసం తాగేసి ఇంటికి చెక్కేసి, పే బిల్లుల పని మాత్రం చేసుకొని ఆలస్యంగానైన అప్పనంగా జీతాలు తీసుకొన్న వారు అసలు ఏమి సాధించారు ?

అసలు ఇదెక్కడి అన్యాయం ? ప్రభుత్వోద్యోగులు ఏ ప్రాంతంలోనైనా పనిచేయకుండా జీతాలు ఎలా తీసుకుంటారు?ప్రపంచంలోని  ఏ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ బుక్ దీనికి అంగీకరిస్తుంది? నలుగురు పోగయ్యి బెదిరిస్తే బెదిరిపోయే ఈ ప్రభుత్వానికి, పని ఎగ్గొట్టి జీతాలు తీసుకుని పార్టీ తొత్తులులాగా వ్యవహరించే ఉద్యోగసంఘాల నాయకులకు అసలు సిగ్గు అనేదే లేదా? వారి చేతలకు ఉద్యోగులంతా ఎందుకు  సిగ్గు పడాలి? అసలుఉద్యోగ సంఘాలకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పేరుతో వసూళ్ళు చేసుకునే వాళ్ళతో సమాలోచనలెందుకు?వారికి వసూళ్ళ నుండి  జీతలేమైనా వస్తున్నాయా? ప్రజలు చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నుల నుండే కదా అందరికి జీతాలు వస్తున్నాయి? హుకుంలను ఎదిరించి పని చేసుకోవాలనుకునే ఉద్యోగులకు ఏది రక్షణ?



16, ఏప్రిల్ 2011, శనివారం

వేర్పాటువాద రాజకీయాల ముసి ముసి నవ్వులు చూడు!

వేర్పాటువాద రాజకీయాల ముసి ముసి నవ్వులు చూడు!
బలైన అమాయకపు సమిధల కన్నీళ్ళు చూడు

మసి పోతున్న మానవత్వం చూడు

నక్సల్స్ విరంగం చూడు

రౌడీ మూకల విహారం చూడు

పొంచి వున్న తీవ్రవాదుల ఆశలు చూడు

పగులుతున్న తెలుగువాడి గుండె చూడు

వేర్పాటువాద రాజకీయాల ముసి ముసి నవ్వులు చూడు................

తెలు'గోడు'

తెలు'గోడు'
అయ్యా కే.సి.ఆర్. గారు,

పాపం ఇన్నాళ్ళు మీకు తల్లే లేదని తెలిసినప్పటి నుంచి ఎంతో మనోవేదన చెంది ఈ ఉత్తరం వ్రాస్తున్నాను! తెలుగు వాళ్ళందరికీ తల్లి అయిన తెలుగుతల్లి, మీకు మరియు మీరు మాత్రమే యావత్ తెలంగాణకి ప్రతినిధిగా భావించే మీ వంధిమాగధులకీ, మాత్రం తల్లి కాదని తెలిసి ఎంతో బాధ పడ్డాను. తెలుగు తల్లి కేవలం కోస్తాకి లేదా మీరు అనుకునే ఆంధ్రాకి మాత్రమే తల్లి అని తెలియ చెప్పి, మీకు, అజ్ఞానాంధకారం లోంచి వెలుగు చూపిన మీ ప్రొఫ్.జయశంకర్ సర్వదా అభినందనీయులు.

ఏ నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందాలని తెలంగాణా యోధులు ప్రాణాలు అర్పించారో ఆ నియంత నిజాంని కీర్తించిన మీ ఉదార బుద్ది శ్లాఘనీయం. మీరు ఆ రావణ పరబ్రహ్మ కన్న చాలా ఘనులు. వివిధ వేదికలపై "తెలంగాణా కోసం తల నరుక్కుంటాను" అని ప్రకటించిన సందర్బాలు పదికి పైచీలే. పైగా ఇంకా ఒకటి మిగిలే వుంది! ఆ మధ్య తెలంగాణా కోసం మీరు చేసిన ఒక పూట "ఆమరణ నిరాహారదీక్ష" వంటి సాహస కార్యక్రమాలు మాకు ఇంకా గుర్తువున్నాయి.

చైతన్యం కొరవడిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పునఃఉత్తేజితం చేసి తమిళనాడు ,బీహార్, ఉత్తరప్రదేశ్ ల స్థాయికి తీసుకువెళ్ళగలిగిన సత్తా మీకు మాత్రమే వుంది. ఎంతో స్వార్ధ ప్రాంతీయ అభిమానాలున్న రాజకీయనాయకుల మధ్య మీ విజయనగరాన్ని కలలో కూడా తలవకుండ తెలంగాణా విముక్తి కోసం “ఆంధ్రోళ్ళ బొంద“ పెడుతున్న మీరు నిజమైన ఆదర్శ మూర్తులు.

తెలంగాణా నుంచి 20 వేల కిలోమీటర్లు తరలి వచ్చి పరాయి దేశాల్లో స్థిరపడి అక్కడే వుద్యోగాలు చేసుకుంటూ ఎన్నో యేళ్ళుగ ఎంతో సంపద కూడబెట్టినా మాతృభూమి పై మమకారం చావక, తెలంగాణా వాళ్ళ వుద్యోగాలను హరిస్తున్న పక్క జిల్లా సాటి తెలుగు వాళ్ళని తెలంగాణా గడ్డ పైనుంచి తరిమి కొట్టాలని అకుంఠిత దీక్షతో కోట్లు కుమ్మరిస్తున్న ప్రవాస ఆంధ్రుల కాదు కాదు ప్రవాస తెలంగాణీయుల అండ దండలు మీకు సర్వదా వుండాలని అభిలషిస్తున్నాను.

"స్వార్ధ సమైఖ్యాంధ్ర" నినాదంతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ హయంలో, ఎన్నో మంత్రి పదవుల శిక్షల్ని ఓర్పుతో భరించిన మీ త్యాగనిరతిని తెలంగాణా ప్రజలు ఎప్పటి మరచి పోరాదని తెలంగాణా దేవుడైన ఆ యాదగిరి గుట్ట నృసింహ స్వామిని వేడుకుంటున్నాను.

మీ తెలు"గోడు"
Posted by Phani Polapragada - ఫణి పోలాప్రగడ at 5:14 PM

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గోరేటి వెంకన్నకి తెలిసొచ్చేట్టు

అవును రాష్ట్రం విడిపోతే,
ఒక ముక్క దొర గారి జాగీరౌతుంది!
సాటి తెలుగోళ్ళు కాందిసీకులౌతారు!
ఆంధ్రుడి గుండె ముక్కలౌతుంది!

లక్నో నుంచొచ్చిన వాళ్ళు, రాజస్థాన్ నుంచొచ్చిన వాళ్ళు వుండొచ్చు!
పక్క జిల్లా వాడు పరాయి వాడా? సాటి తెలుగోడు శతృవా?
ఎవడురా "సెటిలర్లు"?
కలవ లేదని ఏడుస్తావు, "610" అని అడ్డు పడతావ్?

ఎప్పుడురా తెలంగాణా చరిత్రలో విడిగావుంది?
ఆంధ్ర శబ్దం నీకు చేదెందుకైంది?
శాతవహనుల రాజధాని ఏదిరా? వారి మరో పేరు తెలుసా?
నిజంపై పోరాడిన సంస్థ పేరులో ఆంధ్ర శబ్ద మెందుకుంది?

రామదాసుకు తెలుగు జాతి ఏవత్తు మనస్పుర్తిగా మ్రొక్కుతూనే వున్నాం!
సి.నా.రే కూర్చున్న పల్లకీ ఆనందంగా మోస్తూనే ఉన్నాం!!
రుద్రమదేవి ని తలుచుకు ఉప్పొంగిపోతూనే ఉన్నాం!!!
కాళోజికి విద్వేషం కక్కినందుకు నమస్కరించాలా?

చరిత్ర తెలియని వాడివి నీకు చుట్తరికం గురించేమి తెలుస్తుంది!
పదవుల కోసం పాకులాడే జయశంకర్ నీకు గురువా?
నిన్నే అమ్మేసిన చెన్నారెడ్డి నీకు బంధువా?
నిన్ను హింసించిన నిజాంని నెత్తినెక్కుంచుకునే దొర నీకు నాయకుడా?

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా...జాతి విద్రోహులు వణికిపోయేట్టు
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా...వేర్పాటు వాదుల గుండెలదిరేట్టు
జై సమైక్యాంధ్ర, జై తెలుగు తల్లి
జై విశాలంధ్ర, జై తెలుగు తల్లి

-పోలాప్రగడ ఫణి
Posted by Phani Polapragada - ఫణి పోలాప్రగడ at 8:28 PM

వేర్పాటుపై ‘శ్రీకృష్ణ’ ఒంటరి కాదు!

తనది ‘వీర తెలంగాణయే గాని వేరు తెలంగాణ కాదు’ అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి తెలంగాణ భవితవ్యాన్ని, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో ఆవేదనతో చేసిన ప్రతిపాదనకు మించి, శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో అదనంగా ప్రత్యేకించి చెప్పిందేమీ లేదు!

2002 నాటి బొంబాయి ఘటనలపై నిష్పాక్షిక విచారణ జరిపిన జస్టిస్ శ్రీకృష్ణ ఉభయ మతాలకు చెందిన వారిని శఠిస్తూ, రుజువులతో కేసులు నమోదు చేయడానికి అనువైన విస్పష్ట నివేదికను సమర్పించినందుకే ఆ ఘర్షణలలో ప్రత్యక్ష పాత్ర వహించిన రెండు మత రాజకీయ పక్షాలు ప్రస్తుతపు శ్రీకృష్ణ కమిటీ నివేదికను వ్యతిరేకిస్తున్నాయన్నది దాచేస్తే దాగని సత్యం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వ్యక్తుల పదవీకాంక్ష చుట్టూ తిరుగుతూ తెలుగుజాతిని తమ స్వార్థం కోసం విభజించి తాము ఎలా లబ్ధిపొందాలన్న ‘ఆబ’ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ‘మేధావులు’ అనుకుంటున్న కొంతమంది ‘మేతావులు’గా మారి అనాలోచితంగా వ్యవహ రిస్తున్నారు. రాష్ట్ర సమస్యల పరిశీలనకు కేంద్రాధికారంతో ఏర్పడిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన నివేదిక గురించి, ముఖ్యంగా పదవీ వేటలో ఉన్న కొందరు రాజకీయులు సృష్టించిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విభిన్న కోణాల నుంచి రాష్ట్రంలో ‘‘శాంతి-భద్రతల’’ సమస్యపైన కమిటీ వెలిబుచ్చిన అభిప్రాయాల గురించీ ఎవరికి తోచిన వ్యాఖ్యలు, విమర్శలూ వారు చేస్తున్నారు. ఇక కొంత మందైతే కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదికలో భాగంగా ఆంతరంగిక శాంతి-భద్రతలకు చెందిన 8వ అధ్యాయాన్ని ఏదో ‘దేవతా వస్ర్తాల కథ’లా భావించారే గాని ‘సమస్య’ను మరింత జటిలం చేస్తూ మరిన్ని సమస్యల్ని పెంచకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఏ పూర్వరంగంలో కమిటీ ఆవేదన వెలిబుచ్చిందో అర్థం చేసుకోడానికి ప్రయత్నించలేదు.

శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని, రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజ నాలను, దేశ సమగ్రతను, తెలుగుజాతి సమైక్యతనూ, మూడు ప్రాంతాల ప్రజల మనోభావా లనూ దృష్టిలో పెట్టుకొని పరిపూర్ణమైన, ఆచరణ సాధ్యమైన చర్చ కోసం సమస్యా పరిష్కారానికి ఆరు ప్రత్యామ్నాయ సూచనలు చేసింది. 8వ అధ్యాయంలో చర్చించిన అంశాలను, రాజ కీయులు కల్పించిన అవాం ఛనీయ వాతావరణంలో బహి రంగపరచడం మంచిది కాదని కమిటీ భావించి ఉండవచ్చు. అయినా రాష్ట్ర సమస్యపైన పరిశీలనకు శ్రీకృష్ణ కమిటీని ఏర్పరచినప్పుడే కేంద్రప్రభుత్వం కమిటీ పరిశీలనలోకి తీసుకోవలసిన అంశాల్ని ఖరారు చేసింది. కమిటీ ‘‘కార్యాచరణ ప్రణా ళికను, మార్గ నిర్దేశాన్ని సూచించాలి.. కమిటీ ఏది తగిన పరిష్కారమనుకుంటుందో అందుకు సంబంధించిన ఏ ఇతర సూచనలనైనా లేదా ఏ సిఫారసు లనయినా కమిటీ చేయవచ్చు’’ అని ‘‘టరమ్స్ ఆఫ్ రిఫరెన్సు’’లో స్పష్టంగా ఉన్నది.

ఇలాంటి పరిస్థితే గతంలో ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు అటూ ఇటూ కాకుండా ‘గోడ మీద పిల్లివాటం’గా సిఫారసులు చేసిన ఫజల్‌అలీ కమిషన్ విషయంలో కూడా తెలుగు జాతికి ఎదురయిందన్నది మరచిపోరాదు. రెండు పడవలపైన కాళ్లు పెట్టిన ఫజల్‌అలీ కమిషన్ ఆనాడు ఒక వైపున ఆంధ్ర జాతి అంతా కలిసి ఉంటే ఒనగూరగల అపారమైన ఆభివృద్ధి అవకాశాలూ, సౌలభ్యాలు ఏమిటో చెప్పి, ఇంకో వైపు నుంచి ప్రత్యేక రాష్ట్రంగా యథాతథంగా హైదరాబాద్ స్టేట్ కొనసాగితే మంచిదని కూడా సూచించింది! కాగా ప్రస్తుతపు శ్రీకృష్ణ కమిటీ కూడా రాష్ట్ర సమస్యలన్నింటినీ ప్రాంతాల వారీగా, గత 55 ఏళ్లుగా సమైక్యాంధ్రప్రదేశ్‌గా కొనసాగిన పూర్వరంగంలో కమ్యూ నికేషన్స్, విద్య, వైద్యం, నీటిపారుదల, ఉపాధి రంగా లలో సాధించిన ప్రగతి (1956 నాటితో పోల్చి)పై సాధికారికంగా అంచనాలు వేసింది. 17 జిల్లాలు పర్య టించి అన్ని ప్రాంతాల ప్రతినిధులతోనూ చర్చించింది.

రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ వెనుకబడిన ప్రాంతాలున్నాయని చెబుతూనే, బడుగు భాగాలను ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ఎలా మరింత వృద్ధిలోకి తీసుకురావచ్చునో చర్చించింది. మూడు ప్రాంతాలలోని సమస్యలతోను, అభివృద్ధి శాతాలతోనూ పోల్చితే రాయల సీమ ఎలా అన్నింటికన్నా వెనుకబడి కుందుతోందో కూడా చెప్పింది. మూడు ప్రాంతాలలోనూ ఏ జిల్లాలు ఇంకా అభివృద్ధి చెందాలో, చెందగల అవకాశాలున్నాయో కూడా చెప్పింది. మొత్తం పరిశీలనానంతరం రాష్ట్ర సమస్యకు పరిష్కారంగా ఆరు సూచనలు ప్రతిపాదించింది.

అంతర్జాతీయ స్థాయిగల మహానగరంగా హైదరా బాద్ ఎదిగి ఉన్నందున దాని ప్రతిపత్తిని గురించి కూడా కమిటీ రెండు మూడు రకాల ప్రతిపాదనలు చేసింది. ఎందుకంటే రెండు రకాల అభిప్రాయాలను వెలిబుచ్చిన ఫజల్ అలీ కమిషన్ (1954-55) నివేదిక మనకు రుచిం చగా లేనిది రాష్ట్ర సమైక్యతకు మొదటి ప్రాధాన్యతనిస్తూ పలు ప్రత్యామ్నాయాలు సూచించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను అంతే సంయమనంతో ఎందుకు స్వీకరించరు?

దేశ భద్రతకు, రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబం ధించిన విషయంలో విచారణ కమిటీల నివేదికలను గానీ, వాటిలోని కొన్ని అధ్యాయాల్ని రహస్యంగా ఉంచడం గానీ బహిరంగపరచకుండా కేవలం ప్రభుత్వ పాలనా యం త్రాంగం పరిశీలనకుగానీ గతంలో కొన్ని సందర్భాల్లో కమిషన్లు/కమిటీలు వదిలిపెట్టాయి. చివరికి రాజకీయ వేత్తలకు-మాఫియాకు-పోలీసులకూ మధ్య సంబంధా లపై నివేదిక రూపొందించిన వోహ్రా కమిటీ కూడా సంపూర్ణ నివేదికను చాలా కాలం వరకూ అందుబాటులో ఉంచలేదు! అయితే ఈ ‘చూపకపోవడం’ ఎందుకు ఎలాం టి పరిస్థితులలో జరుగుతుందో తెలుసుకోవాలంటే... తెలంగాణ సాయుధ పోరాట యోధుడైన స్వర్గీయ రావి నారాయణరెడ్డిగారు తన ‘అనుభవాలు - జ్ఞాపకాలు’ రచనలో చెప్పిన ఆ నాడు జరిగిన కొన్ని అవాంఛనీయ పరిణామాలను తెలుసుకోవాలి. అందులోనే ఆయన తెలంగాణ చీలిపోతే ప్రజలకు ఎదురయ్యే అనూహ్యమైన ఇబ్బందులను ఏకరువు పెట్టారు.

ఆ మాటకొస్తే నేడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయంలో కమిటీ ఏ ‘శాంతి- భద్రతల’ పరిస్థితి గురించి ఆవేదనపడి ఆ సమస్యలను వివరించే అంశాలను ప్రభుత్వ పరిశీలనకు వేరుగా పంపించిందో, ఏ ‘శాంతి-భద్రతల’ గురించి అది అం తగా ఆందోళన పడిందో-సరిగ్గా ఆ ఆందోళన ఎంత సరైనదో, ఎక్కడో కాదు, ఎప్పుడో కాదు, ఇటీవలనే మన కళ్ల ముందు రుజువయింది! రాష్ట్ర గవర్నర్‌పైన, రాష్ట్ర శాసనసభ సభ్యులు కొందరిపైన శాసన వేదికలోనూ, వేదిక బయట ‘మీడియా పాయింట్’ వద్దా కొందరు తెలంగాణ ఉద్యమ నాయకులే దౌర్జన్యానికి, హింసాకాం డకు పాల్పడటమూ, తెలుగుజాతి గర్వించదగిన, సాహితీ, సంస్కృతీ తేజోమూర్తుల విగ్రహాలను విధ్వంసం చేయ డమూ, శాంతి-భద్రతల సమస్యపై శ్రీకృష్ణ కమిటీ నిర్ణ యం (రహస్య నివేదన) సబబైనదని నిరూపించడం లేదా? ఈ పూర్వరంగంలో రావి నారాయణరెడ్డిగారు తన ‘అనుభవాలు-జ్ఞాపకాలు’ గ్రంథంలో నమోదు చేసిన రెండు మతాలకు చెందిన సంస్థలు తెలంగాణ ప్రజలకు ఆనాడు కలిగించిన క్షోభనూ, సృష్టించిన ప్రమాదకర పరిస్థితులనూ, రేకెత్తించిన అశాంతినీ, కల్లోలాన్నీ వివరిం చారు.

ఒక వైపున ఆ నాటి అభ్యుదయ నిరోధక సంస్థ అయిన ‘అంజుమన్ తబ్లీ గులిస్లాం’ అనే సంస్థ వారు, దానికి ప్రతిగా ‘ఆర్యసమాజం’, ‘హిందూ మహాసభ’ వారూ పరస్పరం బద్ధ విరోధులుగా బలవంతపు మతాం తరీకరణలకు, పునః మతాంతరీకరణలకు గజ్జె కట్టారు. ఆ సందర్భంగా ఒక మతం వారిని శుద్ధి చేసి తిరిగి హిందువు లుగా మార్చడానికి వేరే ‘శుద్ధి సభ’ అనే ప్రత్యేక సంస్థను నెలకొల్పడమూ జరిగింది. రావి నారాయణరెడ్డిగారు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ రెండు మత సంస్థల కార్యకలా పాలవల్ల హైదరాబాద్ సంస్థానంలో మతోద్రేకాలు’ పెచ్చరిల్లడంతో చివరికి ఏ నిజాం నవాబు సాయంతో, ఆశీస్సులతో ‘తబ్లీ’ సంస్థ ఏర్పడిందో ఆ నిజామే ఈ రెం డు సంస్థలనూ నిషేధించవలసి వచ్చిందని వెల్లడించారు.

ఈ పద్ధతి ఘర్షణలను, మత ప్రాతిపదికపై తలెత్తే ఉద్య మాలను ఆంధ్ర మహాసభ, ఆంధ్ర జనసంఘం, కమ్యూ నిస్టు పార్టీ, కాంగ్రెస్‌లోని కొందరు సెక్యులర్ వాదులూ ఎదిరించి నిలబడ్డారు. ఆ నాడు తెలంగాణలో ఏ మత శక్తుల్ని ప్రజలు అదుపు చేయవలసివచ్చిందో, నేడు వేర్వేరు పార్టీల పేర్ల చాటున మరొక రూపంలో మత ఘర్షణలకు ఈ రోజూ హైదరాబాద్‌నూ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలనూ ఉభయ పక్షాలకు చెందిన చాందస ఉగ్రవాద శక్తులు దఫదఫాలుగా కేంద్రాలుగా చేసుకుంటు న్నాయి. ఆనాడు ‘‘తబ్లీ’’ స్థానంలో ఎంఐఎం, నాటి ఆర్య సమాజ్, హిందూ మహాసభల స్థానంలో ఈ రోజున బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రంగంలో ఉన్నాయి.

2002 నాటి బొంబాయి ఘటనలపై నిష్పాక్షిక విచా రణ జరిపిన జస్టిస్ శ్రీకృష్ణ ఉభయ మతాలకు చెందిన వారిని శఠిస్తూ, రుజువులతో కేసులు నమోదు చేయడానికి అనువైన విస్పష్ట నివేదికను సమర్పించినందుకే ఆ ఘర్షణలలో ప్రత్యక్ష పాత్ర వహించిన రెండు మత రాజ కీయ పక్షాలు ప్రస్తుతపు శ్రీకృష్ణ కమిటీ నివేదికను వ్యతిరేకి స్తున్నాయన్నది దాచేస్తే దాగని సత్యం. ఈ మత పక్షాలకు శ్రీకృష్ణపై ‘గుర్రు’కు అసలు కారణం అదే!

అలాగే మావోయిస్టులు / నక్సల్స్ గురించి కమిటీ చేసిన ప్రస్తావన కూడా కొత్తదేమీ కాదు. రావి నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ‘అసమానాభివృద్ధి’కి కారణాలపై శాస్ర్తీయ దృష్టితో ఇలా అంచనా వేశారు.
‘‘ఆంధ్రదేశంలో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే కనబ డేదేమిటి? ఆంధ్ర ప్రాంతంలోని 70 నుండి 80 తాలూ కాలలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరులు, నెల్లూరు జిల్లాలలోని 20 తాలూకాలు మాత్రమే వ్యవసా యంలో అభివృద్ధి చెందాయి. ఈ 20 తాలూకాలలో వచ్చిన అభివృద్ధి అంతా గత 12 సంవత్సరాలలోనే (1960-1972) జరగలేదు. ఈ జిల్లాల్లో జరిగిన అభివృద్ధికి తొలి కారణం అక్కడ ప్రకృతి సిద్ధంగా భౌగోళికంగా ఉన్న పరిస్థితి, సారవంత మైన భూమి, సర్ ఆర్థర్ కాటన్ కృష్ణా, గోదావరి ఆనకట్టలను శతాబ్దం క్రితమే నిర్మించి కాలవల ద్వారా చేసిన నీటి సరఫరా ఇందుకు కారణాలు.

ఈ 20 తాలూకాలు మినహా మిగిలిన ఆంధ్ర ప్రాంతమంతా తెలంగాణ జిల్లాల వలెనే వెనుకబడి ఉంది. కొన్ని ప్రాంతాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. రాయలసీమ నిత్యం కరువులకు ఆటపట్టుగా ఉంది. ఈ కరువు నివారణకు గత 12 సంవత్సరాలలో (1960- 1970) ప్రభుత్వం ఇంచుమించు ఏమీ చేయలేదని చెప్పవచ్చు’’!

‘పెద్దమనుషుల ఒప్పందం’ ప్రకారం రక్షణలకు సంబంధించి అమలుజరగని కొన్ని భాగాలు అమలు జరపకపోవడానికి రావి నారాయణరెడ్డి చూపిన కారణా లలో ప్రధానమైనవిగా పేర్కొన్న రెండు రాజకీయ కారణా లలో ఒకటి ‘‘కాంగ్రెస్ వారిలో పదవుల కోసం వచ్చిన లోలోపలి కీచులాటలు కాగా, రెండవది తెలంగాణ నాయ కుల పచ్చి అవకాశవాద స్వార్థపరత్వం, మూడవ కారణం విద్యాధికుల నిరుద్యోగ సమస్య’’ 1955-56 నాటి తెలం గాణలోని పరిస్థితితో 1972 నాటి పరిస్థితిని పోలుస్తూ ఆయనే ఇలా చెప్పారు; ‘‘లోగడ 1955-56లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలానికీ, 1969లో వచ్చిన ఉద్యమ కాలానికీ మధ్య తెలంగాణలో విద్యాలయాలు పెరిగి విద్యార్థుల సంఖ్యా పెరిగింది. ఒక్కొక్క జిల్లాలో వందలకొలదీ హైస్కూళ్లు నెలకొన్నాయి. ప్రభుత్వ దుష్ట విధానాలవల్ల నిరుద్యోగ సమస్య భయంకరంగా తయార యింది. దీన్ని ప్రత్యేక తెలంగాణవాదులయిన నాయకులు తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు.’’

అయితే, ఈ పరిస్థితులలో ‘ఉద్యమం విపరీతమైన వెర్రితలలు’ వేసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో కమ్యూ నిస్టు పార్టీ, నాయకులు ఇచ్చిన ఉపన్యాసాల ప్రభావం ఆంధ్ర ప్రజల్లో సద్భావాన్ని కలిగించింది. అలాగే ఆంధ్ర ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఇచ్చిన ఉపన్యాసాలూ తెలం గాణ ప్రాంత ప్రజలపైన చక్కని ప్రభావాన్ని కలిగించా యని, ఆయన చెప్పారు. అయితే ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ‘అవకాశవాద స్వార్థపరత్వపు నాయకత్వం’ కారణంగా అవమానకరమైన రాతలతో గోడలు నింపే శారనీ, ఈ ‘రాతలను చూస్తే తెలంగాణ వాడినైన నాకు సిగ్గేసింద’నీ, ‘తలాతోకాలేని అపవాదులను ప్రచారంలో పెట్టారనీ’ రావి నారాయణరెడ్డి పేర్కొన్నారు.

రావి నారాయణరెడ్డిగారు ప్రత్యేక తెలంగాణ ఉద్య మం వల్ల ప్రజాజీవనానికి కలిగే దుష్ఫలితాలను ఇలా ఏకరువు పెట్టారు. ‘‘ఉద్యమం దుష్ఫలితాలు నగర ఆర్థిక జీవితంపై స్పష్టంగా అగుపడుచున్నవి. ఎన్నో భవనాల నిర్మాణం ఆగిపోయింది; కష్టజీవులకు కూలీ తగ్గింది. వర్తక వ్యాపారాలు సన్నగిల్లుతున్నాయి. టాక్సీల, రిక్షాల గిరాకీ తగ్గి పోతుంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఈ పరిణా మాలింకా తీవ్ర తరమౌతాయి.

‘‘అంతేకాదు, దివాళాకోరు ఆర్థిక పరిస్థితులు మాత్రమే ప్రత్యేక తెలంగాణకు సంక్రమిస్తాయి. ఇప్పుడు తెలంగాణ నిధులు అంటూ ఉన్న మిగులు, ప్రస్తుతం తెలంగాణలో వస్తున్న ఎక్సైజ్ ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పరచడంలోనే హరించు కుపోతాయి. తెలంగాణ ఆంధ్ర నుండి విడిపోతే ఇన్నేళ్లుగా ఏర్పడిన మిగులు నిధులు చేతికి రావు. ఆస్తులు అప్పులు అన్నీ తేల్చేసరికి ఉమ్మడి రాష్ట్రం చేసిన అప్పు లన్నీ ఆ నిష్పత్తిలోనే తెలంగాణ మెడకు చుట్టుకుంటాయి. కేంద్రం నుండి వచ్చే వాటాల నిష్పత్తీ తగ్గిపోతుంది. అందుచేత ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఏదో అమాంతం అభివృద్ధి జరిగి పోతుందని కలలుకనే వారికి ఇవి పీడ కలలుగా పరిణమిస్తాయి. ఏ ఇతర అభివృద్ధి కార్యకలా పాలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో డబ్బు ఉండదు. ప్రత్యేక తెలంగాణ ఆర్థికంగా స్వయంపోషకం గాని రాష్ట్రంగా తయారవుతుంది.’’

అంతేగాదు, చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉవ్వి ళ్లూరే వారిని ప్రస్తావిస్తూ రావి నారాయణ రెడ్డిగారు ఇలా జోస్యం పలికారు. ‘‘రాష్ట్రం చిన్నదైన కొద్దీ దేశంలోని గుత్త పెట్టుబడిదారీ వర్గాలకు ఆ రాష్ట్రంలో పెత్తనం చెలా యించడానికీ, కుట్రలు చేయడానికీ ఎక్కువ వీలుగా ఉంటుంది. రాష్ట్రాలను ముక్కచెక్కలుగా చేస్తే వాటిని సులువుగా తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చు. పెద్ద రాష్ట్రాల యితే వారికి కొరుకుడు పడటం కష్టం. అందుకే నిజానికి బిర్లాలు, టాటాలు చిన్న రాష్ట్రాలను నేడు కోరు తున్నారు. సౌరాష్ట్ర, మధ్య భారత్, జార్ఖండ్, ఉత్తర, దక్షిణ యూపీలు ప్రత్యేక రాష్ట్రాలుగా కావాలని ఈ గుత్త వర్గాలు ఉబలా పడుతున్నాయి. ప్రత్యేక విదర్భ ఆందోళన ఇదివరకే ఉంది. అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదం ఆచరణ సాధ్యమైన నినాదం ఎన్నటికీ కాజాలదు. తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక రక్షణలను అమలు జరిపించుకోవడానికి ఎడతెగని ఐక్య ఆందోళన సాగించడం ఒక్కటే మార్గం, చీలిక వాదానికి వ్యతిరేకంగా ఉభయ ప్రాంతాలలోని ప్రజాతంత్ర అభివృద్ధికర శక్తులన్నీ ఏకం కావాలి’’,

నిజానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడైన రావి నారాయణరెడ్డి తెలంగాణ భవితవ్యాన్ని, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో ఆవేదనతో చేసిన ప్రతిపాదనకు మించి, శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో అదనంగా ప్రత్యేకించి చెప్పిందేమీ లేదు!

‘‘విశాలాంధ్ర సమస్యను కాంగ్రెస్‌లోని అధికార గుద్దులాటల్లో ఒక భాగంగానే వీరు గుర్తించినట్టు స్పష్టమవుతోంది. జాతి సమైక్యతపైన వీరి నిర్లక్ష్య భావం క్షమించరానిది. ఈ ఒడంబడిక యథార్థంగా అమలు జరగలేదు. ఒడంబడికపైన సంతకాలు చేసిన వారందరూ అధికారానికి వచ్చిన వెంటనే ఆ ఒడంబడికను విస్మరిం చారు. ఇరుపక్షాల వారూ తమ మంత్రి పదవులకు రక్షణ కల్పించుకోవడంలోనే నిమగ్నులైపోయారు. తెలంగాణ మంత్రులు బాధ్యతగల శాఖలను నిర్వహిస్తూ కూడా ఒడంబడికలోని అంశాలను అమలు జరిపే బాధ్యత తమపై ఉండి కూడా పదవుల వేటలో వాటిని పూర్తిగా మరచిపోయారు’’.

ఈ లోటుపాట్లను శ్రీకృష్ణ కమిటీ కూడా గుర్తించి నివేదికలో ప్రస్తావించబట్టే రక్షణలకు సంబంధించి మెరు గైన పద్ధతిలో కొన్ని ప్రత్యేక సూచనలను చేసిందని గమనించాలి. ఈ రక్షణలను అన్ని పక్షాలూ కలిసి అమలు జరిగేటట్లు అవిశ్రాంతంగా పోరాడుతూ ఒత్తిడి తేవాలే గాని చీలికవాదం తెలంగాణ ప్రయోజనాలకు హానికర మనీ, అందుకే తనది ‘వీర తెలంగాణయే గాని వేరు తెలంగాణ కాదు’ అని రావి నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ఆ ఒత్తిడికి తగిన బలమైన ప్రాతిపదికలను శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో పొందుపరచిందని గమనించాలి!

ఏబీకే ప్రసాద్
సీనియర్ పాత్రికేయులు
(ఈ రోజు సాక్షిలో ప్రచురితమైనది) 

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

మరిచిపో బిడ్డా మరిచిపో తెలంగాణ రాదు,రానేరాదు

మరిచిపో బిడ్డా మరిచిపో
మరిచిపో బిడ్డా మరిచిపో
తెలంగాణ రాదు,రానేరాదు

అమరవీరులస్థూపం మీది రక్తపు మరకల తడి ఆరక ముందే
విప్లవ వీరుల ఆత్మ లింకా గడ్డ ఇడిచి పోకముందే
మరిచిపో బిడ్డా మరిచిపో
తెలంగాణ రాదు,రానేరాదు

నీ రక్తం తాగినోడ్ని నవాబు అంటూ
నీ రక్తం అమ్మేటోడ్ని నాయకుడంటు మురిసిపో
నీకోసం రక్త ధారపోసినోడిని తెల్వదంటు
మరిచిపో బిడ్డా మరిచిపో

విశాలాంధ్రమెవడిదంటూ, మాడపాటి మనోడు కాదంటూ
ఆంధ్ర మహా సభ మాకేటి చెసిందనుకుంటూ
రావి(నారె) మర్రి(చెరె) ఒకటే అనుకుంటూ
మరిచిపో బిడ్డా మరిచిపో
తెలంగాణ రాదు,రానేరాదు

నవాబుగారు పీల్చి వదిలిన హుక్కా పొగే సాంబ్రాణి ధూపమంటూ
దొరగారి బూటు పాలీషింగే ఆత్మ గౌరవమంటూ
తమ్ముడి భుజంపై చెయ్యేసుకు తిరగడమే తలవంపులంటూ
మరిచిపో బిడ్డా మరిచిపో
తెలంగాణ రాదు,రానేరాదు

గులాబీ రంగే ఎరుపు రంగని
వర్ణాంధత్వవంలో బతికేస్తూ
మరిచిపో బిడ్డా మరిచిపో
తెలంగాణ రాదు,రానేరాదు

వేర్పాటు వాదులకి మల్టిపుల్ చాయిస్లో మూడు ఆప్షన్లు

వేర్పాటు వాదులకి మల్టిపుల్ చాయిస్లో మూడు ఆప్షన్లు..ఏదైనా ఒకటి ఎన్నుకోవచ్చు లేదా (ఎప్పటిలా ఆడ్డంగా వాదించి) మూడూ లేదా సున్నా ఎన్నుకోవచ్చు.. సరేనా?

ఎన్నిక1: భారత దేశ స్వాతంత్రానంతరం ఏదైనా ప్రాంతం ఒక రాష్ట్రం నుండి విడి పోవాలనుకున్నప్పుడు, విడిపోవాలనుకున్న వాళ్ళకి రాజధాని దక్కలేదు.
అ. మద్రాసు రాష్ట్రం(తమిళ నాడు) నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలనుకున్నప్పుడు, మద్రాసు విడిపోవాలనుకున్న ఆంధ్ర కి ఇవ్వలేదు.
ఆ. బొంబాయి రాష్ట్రం (మహారాష్ట్ర) నుండి గుజరాత్ రాష్ట్రం విడిపోవాలనుకున్నప్పుడు, బొంబాయి విడిపోవాలనుకున్న గుజరాత్ కి ఇవ్వలేదు
ఇ. పంజాబ్ నుండి హర్యానా విడిపోవాలని ముచ్చట పడినప్పుడు, రాజధాని అయిన చండీఘడ్ కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యబడింది. అలాగే రెండు రాష్ట్రాలకీ ఉమ్మడి రాజధానిగా కొనసాగించబడుతోంది.
ఈ. మరే ఇతర కొత్తరాష్ట్రాల ఉదాహరణ అయినా చూసిన బుద్ది ఉన్న వాడికి ఎవడికైనా అర్ధం అవుతుంది కాబట్టి మాకు హైదరాబాద్ అక్కర లేదు, తెలంగాణా చాలు

ఎన్నిక2: సర్వ సత్తాక భారత గణతంత్ర రాజ్యం అవతరించినప్పటి నుండీ
అ. ఎప్పుడూ ఒక భాషా ప్రతిపదిక రాష్ట్రం విడతీయబడలేదు
ఆ. హైదరాబాద్ రాష్ట్రం అనే కుటుంబం నుంచి వచ్చిన ముగ్గురు ఆడ పిల్లల్లో, మరత్వాఢా మహారాష్ట్ర తోటి, కన్నడ ప్రాంతం కర్ణాటక తోటి బుద్దిగా కాపురం చేసుకుటున్నారు. మూడో పిల్లకే ఏదో మాయ రోగం వచ్చింది తప్పు తెలుసు కుంటుంది, బుద్దిగా కాపురం చేసుకుంటుంది ఇకపై.
ఇ. ఎదో ఒక సంవత్సరం ఆలీస్యంగా భారత దేశంలో కి వచ్చినంత మాత్రాన! మేమూ కూడా భారత దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళమే తెలంగాణా రాష్ట్రం ఇస్తే నక్సలిసం పెరుగుతుంది, ఇంకో కొత్త 24 రాష్ట్రాల డిమాండులు వచ్చి భారత దేస సమగ్రతకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి.
భారత దేశ అభ్యున్నతిని కాంక్షించే వాళ్ళగా మాకు తెలంగాణా అవసరం లేదు. సమైక్యాంద్రని కొనసాగించండి.

ఎన్నిక 3: "అరే ఏందిరా బై నీ లొల్లి, ఈ లాజిక్లు నాక్ తెల్వద్. నాకు గీ బావిలో ఉండుడే ఇస్టం. మా తెలంగాణా మాగ్గావాలె. మా నీల్లు మాగ్గావలె. ఇయ్యక పోతే తెలంగాణలె తాలిబన్లొస్తర్, మీరు మాకు ఆప్షన్లు ఇచ్చు డేంది మేమే మీకిస్తాం , తాలిబన్లు కావల్న నక్సల్ కావాల్న తేల్చుకోండ్రి.

ఒక స్నేహితుడి మనోవేదన : ఇప్పుడు సమాధులు మాట్లాడుతున్నై...!,

ఇప్పుడు సమాధులు మాట్లాడుతున్నై...!,

రాత్రికిరాత్రి తెలంగాణ నిద్రలేచి
కాళ్ళ కింద గతాన్ని తోవ్వు కుంటాండి,
సాయుధ పోరాట గమనాన్నీ గుర్తుకు తెచ్చు కున్తన్ది !
ఒక "బద్మాశ్ గాడి మాట" మృతవీరుల
ఆత్మని తూట్లు తూట్లు జేస్తన్నది..!

ఇప్పుడు నేను చరిత్ర తెలియనోని నాల్కను గొసకపొయి
కామ్రెడ్ "రావి నారాయణ రెడ్డి" సమాధి ముందు బెట్టాల..

బానిసల్ని జేసినోని బూజానెక్కి "ఓటు" కోసం
నీతిమాలిన మాటలో డి కంట్లో వరంగల్లు కారం జల్లాల..!

ఈ గద్ద ముక్కొడికి
గెరిల్లా యోధుల గుండె మంటలేం దెల్సు?

అరె.. గుండెలు మండిపోతున్నైరా.. ఎలా తట్టుకునేదీ మాటలు

ముఖ్దూంసాబ్, బద్దం ఎల్లా రెడ్డి, చాకలి అయిలమ్మ, తమ్మారపు గోవిందు
మళ్లీ చంప బడ్డార్రా.... బిడ్డ
వాడిని క్షమించొద్దు..!

నీ "బాన్చనన్నా" బతుకులు కూల్చబడ్డది,
నీ "కాల్మోక్థ" అన్నా చెరచబడ్డ ఆడది
వాడికేం తెల్సు????

పోరాటం కోసం బతుకుని బుల్లెట్లకు దారాబోసినోళ్ళు,
ఆజాదీ కోసం గుండెల్లో గుళ్ల వర్షం కురిపిచ్చుకున్నొళ్ళు,
మాతాత పక్కతెముకలు కుప్ప చేసిన బూట్లదెబ్బలు,
గిరిప్రసాద్ రొమ్ము చీల్చిన బుల్లెట్ సంగతి,
చిట్యాలలో నర మేధం..
వాడికేం తెల్సు???

వోరేయ్ శవ సంభోగి......
నీ మాటలు విన్నాక కాటికి కాల్జాపిన మా జేజి "కాంద్రించి ఉమ్మింది",
పక్షవాతంలోనూ మాతాత "పళ్ళు గొరికిందు" ,
"నిజాం (నిరంకుశత్వాన్ని) ని వెయ్యిసార్లు పోగుడ్థా" అన్న నీ ఫోటో ఉన్న పేపర్ మీద
మా పిలగాడు "ఉచ్చ బోస్తన్నాడు"

ఉద్యమ నేత ముసుగ్గప్పుకున్న తాగుబోతొన్ని, బుధ్ధిహీనున్ని,
మా గుండెల మీద తీవ్రంగా ఎగిరే "ఎర్ర జెండాని" ఒక నిమిషం చూసే ధైర్యం లెనొన్ని

ఇంతకన్నా ఎం శిక్షించగలం ??????

"క్రాంతి" ("నీ")


( మహొజ్వలిత తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని ఇంటి చరిత్రగా భావించే మా కుటుంబం, ఉద్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మా కుటుంబం లో పుట్టి.. ఒక నర హంతకుడైన "నిజామ్ని" తెలంగాణ నిర్మాత, గొప్పోదు, వెయ్యిసార్లు కీర్తిస్తా అన్న కేసీయార్ మాటలు.. విని రక్తం మరిగి పోయినప్పుడు..)

ఊరు నిన్ను పిలుస్తుంది..

Why Division? These are some solutions...

It is good that Telanganaites are voicing for their share of resources. It is the responsibility of the Government to distribute the resources equitably, if failed before, for various reasons like the influence of the pressure/interest groups operating, and the domination of the politicians or their art of lobbying from a particular region etc, atleast this is high time to realise and take appropriate measures if the demands are genuine and true. Unfortunately, all the divisions in this country are politically motivated. Whenever the party in the power feels that the division helps them to get political mileage, or winnable public mandate, orelse to with hold the South from challenging the North (especially UP politicans) to emerge as the leaders at the Center, the Center goes for a division, apart from other accessory good reasons. India is the fatest dividing country in the World in the name of language, administrative convenience, or something else. We are divided into 29 states and 7 UTs from 1959 to 2011 (52 years) and there are 17 states in queue awaiting the division of Telangana to voice for their cause. It took 212 years for the United States for reorganization from 13 colonies to 50 states. If separation is directly proportional to the development we would have been developed by leaps and bounds when compared to the US which is not a reality. I dont wish to go into the details of why and how Telangana issue recurred, undoubtedly it is a political reason. The acceptance of all parties before 2009 elections, its announcement and the vertical split across the parties, their resignations and agitations on either side all are political in nature. The division is an extreme step to take when the Governments fail to address the grievances, if genuine, creating awareness in the public about which are not genuine, and experiment other models of governance. The problem is Centralization, and what is the solution? Throughout the history, the people fought against their governments whenever it exceeded its limits through centralization of the land and the resources, its inequatible distribution, lack of proper representation for their problems, inefficiency of the Governments to have a proper mechanism to find and address regular public grievances timely that are recurring on daily basis. How efficient are our Governments? Due to economic liberalization and globalization wealth had been created in a record time but its distribution failed utterly, which has become the greatest worry ever before to the have nots in the system. This centralized system created Neo-Zamindars and Neo-Imperialists. The fought began among these new generation of zamindars and imperialists to have their own region and for their own self rule, for which they lead the people and made them voice, unless whose backing and the support this would not have been organised and grown to this much level. What is paining Telangana commoners is paining Andhra commoners too. The real estate boom crushed the people in the districts around Hyderabad, now the people around Vizayawada and Guntur are being crushed, only thing is that the momentum is shifting on both the sides with the uprise and downfall of the movement. Is there time relevance for the problems of water for irrigation, and employment? Are they not addressable? We all knew, that the economy shifts from agririan low productive to industrial and high productive service sector and we took direct shift to dollar driven service sector. The usage pattern of the land has been changing rapidly recentralising, which is definitely a worry. Some economists strongly criticise investing in irrigation sector is bypassing the growth trajectory and going back in time. Then the Government has to carefully assess the professional patterns and requirements of the people and try for a gradual and smooth shift from farm to non-farm sector in which China has shown its leadership with its model of highly centralised governance and highly decentralised economy. Though fighting for government employment has little relevance at present as all sorts of jobs are available in private sector and the Government also moving forward with private public partnership, the Government has to address that the education system, skills upgradation of young people, fair share of representation in these jobs is met from all the regions. The Government should demonstrate its will to decentralise the power and the authority to regional councils, to the Local governments called Corporations, Municipalities, Zilla Parishads, Mandal Parishads and Gram Panchayats which are expected to coordinate and deliver the services of 29 departments at the bottom. The Government has to model itself so that people will not migrate to the cities and increase the pressure on them by providing all amneities, services and opportunities within the district borders. For which the economic model and ivestment should be shifted to second level cities and major towns. The people have the right to enjoy the Governance at their door steps by participating and availing services through governing processes. The State Government has to dare take and experiment alternative governing models and reduce itself to supervisory role to regulate and punish if local governments err. Who is stopping it? The MP/MLAs (neo-zamindaris) though bothered and over burdened with public outpouring of grievances do not like a Sarpanch to fulfill all the needs to his/her people at the village level itself and the bureaucracy (neo-imperialists) does not wish their power go down below the district though overwhelmed with innumerable subjects. This lack of sharing of power and authority is innate to our society and culture for generations. May be this is the reason why one of the ministers from AP came forward with a proposal to increase number of districts but not the division of the State, somewhat better idea but not the best. Then what is the best? The power should rest with Gram Sabha which is the only institution in this country where people represent directly, all other institutions like the General Bodies, the Assemblies, and the Parliament being indirectly represented by the people through their representatives from ward members to MPs. These sabhas should be empowered to take decisions, have functionaries, functions and funds enough to implement those decisions, to realise the dream of Gram Swaraj of the Father of Nation. What is reality? The reality is that the Central Governments try restrict State Governments which inturn limit the local governments. The reality is that the PM or the CMs annonce that they are empowering the local governments by conduct of regular elections and by increasing 33-50% reservations to the women, which has never been sufficient without the power, the funds and the functionaries devolved. Technological recentralization, a new phenomenon? Technology aided the centralised governance to centralise further. Its amazing to know that we pay bills directly to the peoples accounts through software aided processes, but the monitoring of the entire processes are done mostly from the State headquarters. Then what will be the people down below doing? The higher level is overburdened with, and the human resource down below and at all levels are not used and engaged optimally. It is at the bottom level the people sense the feel of Government. We need to implement the principle of "do the job and deliver a service to the people at the level where it can be done at its best", and if we try monitor daily errands of the people from Delhi, we will never satify the people, whatever may be the number of states or districts and computers we have.

13, ఏప్రిల్ 2011, బుధవారం

పని చేస్తేనే జీతం అని అనడం కూడా తప్పేనా?

తాజా వార్త :  "పని చేయకపోతే జీతం చెల్లించేది లేదంటూ ప్రభుత్వం బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి ప్రభుత్వ కార్యాలయాలలో పని ఎగగొట్టి ఉద్యమాలు చేస్తామంటే కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం పేర్కొన్నది. కొంతమంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి సంతకాలుచేసి బయటకు వెళ్లిపోతున్నారని, అటువంటివారికి పని చేయకపోతే జీతాలు చెల్లించడం కుదరదని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ అంటే ఊరుకునేది లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది"

దీనికి మామాఅల్లుళ్ళ (కేసీఆర్, హరీష్ రావు ల) అభ్యంతరం ఏమిటి చెప్మా? ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారి చేసిన జీవో రాష్ట్రమంతటికి వర్తిస్తుంది. ఏ ఒక్క ప్రాంతానికో కాదు. వారుగాని ప్రభుత్వోద్యోగులు ప్రజలకోసం పని చేయకూడదని భావిస్తున్నారా?ప్రభుత్వోద్యోగులు నిర్లజ్జగా పని చేయకుండా (అదే ప్రజలకు సహాయం చేయకుండా) కూడా అప్పనంగా ప్రజలు చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నుల నుండి జీతాలు తీసుకోమని సంకేతమిస్తున్నారా? ప్రభుత్వోద్యోగులు అంత అధములుగా కనిపిస్తున్నారా? ఎంత అవమానం?


12, ఏప్రిల్ 2011, మంగళవారం

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మేధావులకు మాత్రమె కనిపించటానికి అది ఏమన్నా రారాజు తొడిగే దేవతా వస్త్రమా ఏమి.......?

ప్రత్యేకరాష్ట్ర వేర్పాటు వాదులు చేసే వాదనలు చూస్తే అలాగే అనిపిస్తున్నది. నేనేమి చదువురాని అమాయకుడైన పల్లెవాడును కాను, వారు చెప్పే కాకమ్మ కబుర్లు నమ్మడానికి. అసలు ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రత్యేక తెలంగాణాను ఇస్తామని హామీ ఇచ్చింది ? ఈ వేర్పాటువాద ఉద్యమం ఐదు దశాబ్దాల ఉద్యమమా.....? ఇలా మాట్లాడితే ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు నవ్వరు...? నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనుకుని మాట్లాడే వాళ్ళని ఎవరు మాత్రం ఏమిచేయగలరు....కానీ మేధావుల ,సాహితీవేత్తల ,ఆచార్యుల (ప్రొఫెసర్లు),చరిత్రకారుల ముసుగులో కొంతమంది ఇలా వక్రభాష్యాలతో మీడియా సహకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ సమాజానికి కీడు చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం.1972 లో జై ఆంధ్ర ఉద్యమము ఉద్ధృతంగా సాగుతున్నప్పుడు ఏమయ్యిందీ తెలంగాణా ఉద్యమం? అప్పుడు తెలంగాణా ఉద్యమకారులు ఎందుకు నిశ్శభ్దంగా ఉండిపోయారు.... రాష్ట్ర విభజన కోసం ఎందుకు పాటుపడలేదు? 1969 తర్వాత మళ్లీ కేసిఆర్ కు మంత్రి పదవి పోయేదాకా మీలో ఎవరైనా ప్రత్యేక తెలంగాణావాదాన్ని విన్నారా...? 1980 -90 దశకాలలో (1994 ,95 ,96 లలో ఉత్తర తెలంగాణా ప్రాంత విముక్తి పోరాటం అనే వరంగల్ ప్లీనరీ తీర్మానం) నగ్జలైట్లు లాంటి వారు ఎవరో ఒకరు ఎక్కడో చోట ప్రత్యేక తెలంగాణా గురించి మాట్లాడి ఉంటారు.దానిని ఉద్యమం అనాలా అన్నది మీ విఙ్ఞతకే వదిలివేస్తున్నాను. నేను హైదరాబాద్ లో చదువుకున్నాను మరియు నా స్నేహుతులు చాలామంది తెలంగాణా అదికూడా అక్కడి గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఉండేవారు.మేము అనేకానేక విషయాలగూర్చి చర్చించుకునేవాళ్ళం. కానీ ఏఒక్క సందర్భంలోను కూడా ప్రత్యేక తెలంగాణా విషయం చర్చకు రాలేదు. ప్రత్యేక తెలంగాణా వాదము 1969 ప్రాంతంలో ఒక సంవత్సరం పాటు మరియు 2009 డిసెంబర్ నుండి మాత్రమే ప్రజలలో చెలామణి అయ్యింది.అంటే వేర్పాటువాద చరిత్ర 4 (నాలుగు) సంవత్చరాలు మాత్రమె,అదే సమైఖ్యాంధ్ర చరిత్ర (6) ఆరు దశాబ్దాలకు (అంటే అరవై సంవత్చరాలు) పైమాటే అనేది చారిత్రిక అక్షర సత్యం.

రాజకీయ పార్టీల వైఖరి :------
కాంగ్రెస్ 2004 మానిఫెస్టోలో రెండవ ఎస్సార్సీ గురించి మాత్రమె మాట్లాడింది. కొంతమంది దీనిని వక్రీకరించి ,వక్రభాష్యాలతో మసిపూసి మారేడుకాయ చేసి ,గారడీ మాటల వేర్పాటు వాదంతో వచ్చిన వారు సమైఖ్యాంధ్ర (కాంగ్రెస్సు) రాష్ట్ర ప్రభుత్వంలోను మరియు కేంద్ర ప్రభుత్వంలోను చేరి కొంతకాలం మంత్రి పదవులు అనుభవించారు .తరువాత ఆపార్టీ అంతర్గత కలహాలతో కకావికలై ,ముక్కలు చక్కలై దిక్కుతోచని స్థితిలో పడింది .ఆ తరువాత కావాలని కోరితెచ్చుకున్న ఉప ఎన్నికలలో ఆ పార్టీ ఘోర పరిస్థితి ఎదుర్కొంది. కాంగ్రెస్స్ 2009లో మాత్రం కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి వుంటానన్నది. వైఎస్ఆర్ విభజనకు వ్యతిరేకమని మరియు అతను రాష్ట్ర ముఖ్య నేతగా వుండగా ప్రత్యేక తెలంగాణ అసంభవమని రాజకీయాలగురించి అంతగా తెలియని వానికి కుడా తెలుసు. కానీ అంతాతెలిసిన ప్రజలు వైఎస్ఆర్ నే గెలిపించారు. తెలుగుదేశం విషయానికి వస్తే ఆ పార్టీ 2004 లో ప్రత్యేకవాదాన్ని బాహాటంగానే వ్యతిరేకించి 2009 లో మాత్రం కాంగ్రెస్ 2004 లో చూపిన రాజకీయ అవకాశవాదాన్ని పుణికిపుచ్చుకుని,దానికి తగ్గ ఫలితాన్ని చవిచూసింది.దీనికి నిదర్శనం ప్రత్యెక వాదంతో వచ్చిన తెలుదేశం పార్టీ, దాని మిత్రపక్షమైన తెరాస ల కంటే వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్స్ పార్టీ కి తెలంగాణా ప్రాంతంలో ఎక్కువ స్థానాలు వచ్చాయి. అప్పుడు గాని, ఇప్పుడు గాని చంద్రబాబు నాయుడు ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా ఉన్నాడని ఎవరు నమ్మలేదు. 2009 ఎన్నికలలో ప్రత్యేక తెలంగాణను గట్టిగా సమర్ధించిన పార్టీ వేర్పాటువాద తెలంగాణా రాష్ట్ర సమితి మాత్రమే.కానీ ఆ పార్టీ గెలిచిన అన్ని సీట్లలో వచ్చిన మెజారిటీ మరియు ఆ పార్టీ ఒడిపోయిన సీట్లలో ప్రత్యర్ధులకు వచ్చిన మెజారిటీ చూస్తే తెలంగాణా ప్రజా తీర్పు, ప్రజల మనోభావం మనకు తెలుస్తుంది . అప్పుడు ఘోరపరాజయాన్ని చవిచూసిన టీఆర్ఎస్ తర్వాత జరిగిన జీ హెచ్ యం సీ ఎన్నికల్లలో పొటీ చేసే సాహసం కూడా చేయలేకపోయింది.

కొందరు నాయకులు తమ స్వార్థం కోసం, కొన్నేళ్ళ పాటు యదేచ్చగా, పిట్టకథలు,పొడుపు కథలతో అసత్య ప్రచారాలు చేసుకుంటూ, ప్రజల్లో విద్వేషాగ్నుల్ని రగుల్చుకుంటూ పోతుంటే.. మిగతా నాయకులు తమకేం పట్టనట్లు చూస్తూ ఉండటమో, లేకపోతే పొత్తులతో ఆ విద్వేషాగ్నుల్లో చలికాచుకోవటానికో ప్రయత్నిస్తే, అంతిమంగా ఇలాంటి పరిస్తితులు తలెత్తటంలో ఆశ్చర్యం లేదు.మన బాధలన్నిటికీ యూదులే కారణం, వారిని అంతమొందించండని" హిట్లర్ అనగానే, మొత్తం జర్మన్ ప్రజలు గుడ్డిగా ఎలా నమ్మారా..? అనే సందేహం ఉన్నవారికి ఎవరికైనా, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కొంత సమాధానం ఇస్తాయి.

వక్రభాష్యాలు:-----
నా అభిప్రాయంలో ప్రత్యేకవాదులు వెనుకబాటుతనానికి, వివక్షకు మధ్య తేడా గుర్తించకలేక కొంచెం అయోమయంలో ఉన్నారు. మనదేశంలో వెనుకబడిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. చూస్తుంటే ఈ ఉద్యమం చేసే వాళ్ళకి ఉత్తరాంధ్ర, ప్రకాశం, రాయలసీమల వెనుకబాటు గురించిన వివరాలు వినే దయాద్ద్ర హృదయం లేనట్టుగా ఉంది. అసలు హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని వాళ్ళు ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదు? రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న ఉద్యోగాలలో దాదాపు నాలుగింట ఐదు వంతులు హైదరాబాద్ కు చెందినవే. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోని ఐదు ముఖ్య నగరాలు మొత్తం కలిపినా దానిలో సగముకు సమము కాలేవు. హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ యొక్క రాజధాని కాకపోయి వుంటే ఔరంగాబాద్ లేక ఇతర చారిత్రక దక్కను నగరాల వలెనే ఉండిపోయేది. హైదరాబాద్ అభివృద్ధికి దాని యొక్క రాష్ట్ర రాజధాని స్థానముకు విడదీయలేనంత అనుబంధం ఉంది. కావున మన రాష్ట్ర ప్రజలందరికి ఆ అభివృద్ధిలో భాగం ఉంది,బాధ్యత ఉంది.

కొంతమంది తెలంగాణా వేర్పాటువాద నాయకులు,ఉద్యమ ముసుగులో ఉన్న కొంతమంది కుహానా మేధావులు ,స్వార్ధం కోసం మావోఇజం ముసుగు వేసుకున్నవారు కలసి... సమైఖ్యాంధ్రను సమర్ధించే వారు దురహంకారులని తీర్పులు చెబుతున్నారు. ఎవరు దురహంకారులు అని వీరు తీర్పు చెబుతున్నారు? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు విగ్రహాల ధ్వంసం చేసినపుడు దానికి వ్యతిరేకముగా ప్రపంచం అంతా వాదించింది . ఎవరూ కూడా నాజీలు పుస్తకాలను తగలబెట్టదాన్నిసమర్ధించలేదు.అలాగే నేను కూడా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను ద్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఒకవేళ ప్రపంచం మొత్తం మొదటి రెండు అంశాలలో ఉంది విధ్వంసకారులు,దురహంకారులు అన్నట్లయితే,..... ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద మతిలేని విధ్వంసం సృష్టించినవాళ్ళని, వారిని సమర్ధిస్తున్న వారిని దురహంకారులు అని అంటారని ఆశిస్తున్నాను.విగ్రహాల ధ్వంసం కన్నా, దానిని సమర్థించుకునే చర్యలు, దానిని కూడా తమ రాయకీయ లబ్ధికి వాడుకునే ప్రయత్నాలే ఇంకా ఎక్కువ బాధిస్తున్నాయి.

ఆత్మ విమర్శ:------


ఎవరిది మోసం....? ఎవరు దురహంకారులు....... ? ఎవరు ఫాసిష్టులు........ ? ఎవరు అప్రజాస్వామికులు........ ? ఎవరు చేస్తున్నది దౌర్జన్యం .....? ఉస్మానియా విశ్వవిద్యాలయములో ప్రశ్నాపత్రాలు దిద్దడానికి వచ్చిన అమాయక లెక్చరర్లను కొట్టడమా ఉద్యమమంటే ? ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న మహిళా ఉద్యోగినిల పట్ల ,ఉద్యోగస్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించి వారిని ఇక్కడనుండి వెళ్ళిపోవాలని బెదిరించి,దౌర్జన్యం చేసినది/చేస్తున్నది ఎవరు ? నిన్నటి దాకా ఆంధ్రలో చదువుకుని, అమెరికాలో ఉండి,నేడు హైదరాబాద్ లో వేర్పాటువాద ముసుగులో దౌర్జన్యాలు చేస్తూ,వ్యక్తులను,సంస్థలను బెదిరిచి ,బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లాది రూపాయలను పోగేసింది ఎవరు...వారి అడుగులకు మడుగులు వత్తుచూ వారి అడుగుజాడలలో నడుస్తున్నది ఎవరు ? తమ పిల్లలను ఇంటర్నషనల్ స్కూళ్ళలోను, విజయవాడలో ను,గుంటూరులోనూ,ఒంగోలులోను,మద్రాసులోనూ,కర్ణాటకలోను చదివిన్చుకొంటు....తెలంగాణలో విద్యాసంస్థలను మాట మాటకు బందులతో మూయిస్తూ,ఇక్కడి మధ్యతరగతి,పేద విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరు ? విద్యార్ధుల జీవితాలను,ప్రాణాలను సమిధలుగా వాడుకుంటున్నది ఎవరు ? నిరుద్యోగులను ఉద్యోగ అర్హత పరీక్షలకు వెళ్ళనీయకుండా అడ్డుకొని,వారిలో నిరాశా నిస్పృహా నింపుతున్నది ఎవరు ? నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్లకు కనీసం ఈ మాత్రం తెలియదా...? లేక.... వీళ్ళు ఎవరకి అనుచరులుగా పనిచేస్తున్నారు ? తోటి యమ్ఎల్ఏ ను అసెంబ్లీ సాక్షిగా కొట్టడమా ప్రజాస్వామ్యమంటే ? రాష్ట్ర ప్రధమ పౌరుడు,రాష్ట్ర రాజ్యాన్గాదిపతి అయిన గవర్నర్ మీద దాడి చేయటమా ప్రజాస్వామ్యమంటే ?దీనినేనా మీరు ప్రజాస్వామ్యక ఉద్యమం అనేది? ఇదిగో తెలంగాణా...అదిగో తెలంగాణా ...అంటూ గడువుల మీద గడువులు పెంచుకుంటూ ప్రజలను,విద్యార్ధులను మోసంచేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటోంది ఎవరు ? అన్ని రోగాలకు జిన్దాతిలిస్మాత్ ఒక్కటే మందు అన్నట్టు,అన్ని సమస్యలకు తెలంగాణా సాధన ఒక్కటే సమాధానం అని,పట్టపగలే ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్నిచూపించే విధంగా మాయ మాటలతో యువకులను తప్పుదారి పట్టిస్తున్నది ఎవరు ? ఆవేశంలో పేద,మధ్యతరగతి యువకులు ఆత్మహత్య (హత్యలు) చేసుకుంటుంటే ,ఆ చావులను తమ సొంత స్కోరుగాను,ఘనకీర్తి గాను వాడుకొంటున్నది ఎవరు ? ఆత్మహత్యలు చేసుకున్నవారిలో ఎవడన్న స్థాయిగల ఒక్క నాయకుడు గాని,వారి పిల్లలు గాని ఉన్నారా..?తెలంగాణా ఉద్యమాన్ని కుటుంబాలకోసం,కులాల కోసం తాకట్టు పెడుతున్నది ఎవరు ? ఈ ఉద్యమాన్ని ఆర్ధిక , రాజకీయ లబ్దికోసం వాడుకుంటున్నది ఎవరు ?

ఇవన్నీ ప్రక్కన పెట్టినా........,తెలంగాణాగురించి,తెలంగాణాకోసంపోరాడే మేధావులకు,పౌర హక్కుల ఉద్యమ నేతలకు ,మానవ హక్కుల ఉద్యమ నేతలకు,ఆచార్యులకు(ప్రొఫెసర్లు),న్యాయవాదులకు,న్యాయకోవిదులకు,సంఘసేవకులకు,జర్నలిష్టులకు,నేను వేసే ప్రశ్న ఒక్కటే ......మానవ హక్కులు,పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులు ప్రజలందరికి మరియు అన్ని ప్రాంతాలకు ఉంటాయా......? లేక కొంతమంది ప్రజలకు మరియు కొన్ని ప్రాంతాలకు మాత్రమె ఉంటాయా.....? ఒకవేళ తెలంగాణా ప్రాంత ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం నిర్ణయాధికారం ఉన్నప్పుడు , హైదరాబాద్ నగర ప్రాంత ప్రజలకు మాత్రం అటువంటి హక్కు ఉండదా? వారు ప్రత్యేక తెలంగాణలో భాగంకాకుండా వేరు పడాలని కోరుకుంటే మీరు ఎందుకని సమర్దిన్చరు...మీకు ఉలికిపాటు ఎందుకు .......? హైదరాబాద్ గురించి వేరే వాళ్ళు మాట్లాడితే నాలుకలు కోస్తాం,బట్టలు విప్పదీసి తరుముతాం ,ఆస్తులు ఆక్రమిస్తాం అని ఉద్యమంలో ఉన్న వారు,నాయకులు అంటున్నప్పుడు మీరు ఎవ్వరన్నా వారు అనేది తప్పు అని ఖండిచారా..? ఈరోజు హైదరాబాదులో ఉన్న మీడియా సంస్థలకు,అందులోని సిబ్బందికి స్వేచ్చ ఉందా....? హైదరాబాదు మీడియాని బెదిరించి ,బ్లాక్ మెయిల్ చేసి మీకు అనుకూలంగా వార్తలు వచ్చేటట్లు మార్చుకోలేదా..? తెలంగాణలో గాని,హైదరాబాదులో గాని ఎవ్వరైనా,ఎక్కడైనా సమైఖ్యాంధ్ర గురించి మాట్లాడే స్వేచ్చ లేకుండా చేసింది మీరు కాదా...? ఇదేనా మీరు చెప్పదలచుకున్న ప్రజాస్వామిక మూలసూత్రం ? ఇవేనా మీరు మాట్లాడే మానవ హక్కులకు,పౌర హక్కులకు అర్ధం ? మీరు టీవీ లలో ,చర్చా వేదికలలో మాట్లాడే మాటలు,ఇచే ఉపన్యాసాలు మేడి పండుల్లాగా లేవా ? మీ వాదాలలో పస ఎంత ? మోకాలికి బోడిగుండుకి ముడివేసి నట్లు మీకు అనిపించటం లేదా ..? సొంత ఎజెండాలతో ఒక జెండా నీడన చేరి ప్రజాస్వామ్యాన్ని,పౌర హక్కులను,మానవ హక్కులను మీరు అపహాస్యం చేయటలేదా......? భారత జాతికి మాత ఒక్కటే ఉంటుంది...తెలుగు జాతికి తల్లి ఒక్కటే ఉంటుంది.....అంతేగాని ప్రాంతానికి ఒక తల్లి,ఊరికి ఒక తల్లి, వీధికి ఒక తల్లి ఉండదు,ఈ విషయం కనీస జ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా తెలుసనుకుంటాను.సమాజాన్ని,మనుషులను,మమతలను,మనసులను చీల్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు ?

విజ్ఞత:---
ఎవరు ఎవరి ప్రతిక్రియను ఆపుతున్నారు? ఎవరు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు? 2010 లో కేసిఆర్ పై విజయవాడ లో ఎవరైనా దాడి జరిపారా? దురహంకారులైన టిఆర్ఎస్ పార్టీవాదులు తిరుమలలో రాష్ట్ర విభజనకు సమర్ధనగా నినాదాలు చేయగా వారిని ఎవరైనా ఆపారా.....? ఇతర ప్రాంతాలవాళ్ళు తెలంగాణావాళ్ళని దోపిడిదార్లు, మోసకారులు అని నినదించారా....? చైతన్యవంతులైన తెలుగు ప్రజలు అన్ని రకాల అవకాశవాదాలకూ సమాధానమివ్వడం త్వరలోనే చూడొచ్చు" అని ఆశించటం మినహా వేరే మార్గం లేదు.

దీనిని బట్టి సిగ్గుపడవలసినది ఎవరో ఇట్టే అర్ధమవుతున్నది!!

వెంకటేశ్వర్. సుంకర
బచాఓ హైదరాబాద్ కౌన్సిల్ , కన్వీనర్

'వీర తెలంగాణా నాది వేరు తెలంగాణా కాదు'- రావి నారాయణరెడ్డి

1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమం జరుగుతున్నసమయంలో చీలికవాదాన్ని ఖండిస్తూ స్వర్గీయ రావినారాయణరెడ్డి (తెలంగాణా సాయుధపోరాట వీరుడు)ఒక కరపత్రాన్ని ప్రకటించారు.అందులోని కొంత భాగం:
  "భారతదేశంలో అంతర్భాగంగా,ఆంధ్రప్రదేశ్ లో నివసించే 4.5 కోట్ల ప్రజలు ఒక విశిష్టమైన ప్రత్యేక జాతిగా,ఆంధ్రజాతిగా రూపొందారు.జాతి అని పిలవడానికి అవసరమైన లక్షణాలు అనగా ఒకే భాష,ఒకే చరిత్ర,ఒకే సంస్కృతి,ఆచార వ్యవహారాలు,ఒకే భూభాగం కల్గి వున్నారు."
ఆంధ్ర చరిత్ర చూస్తే,ఆంధ్ర సాహిత్యాన్నిఅవలోకిస్తే చారిత్రకంగా కొన్ని దశల్లో తప్ప యావత్తు తెలుగు ప్రజలు కలిసే వున్నారు.అట్టి ఎడబాటు కూడా పరాయి పాలకుల పాలనలోనే జరిగింది.అయితే సామ్రాజ్య వ్యతిరేక పోరాటదశలో ఈ రెండు ప్రాంతాలు ఉమ్మడి పోరాట సంప్రదాయాలనే కలిగి ఉన్నాయి."

"ఆంధ్ర సారస్వతంలోని కొన్ని మహత్తర కావ్యాలు తెలంగాణా గడ్డమీద తెలంగాణా కవులచే రచింపబడినాయి.అదేవిధముగా ఆంధ్ర జీవితంలో ఆంధ్ర కవులచే గూడా రచింపబడినాయి. యావత్తు తెలుగుప్రజల జీవితంతో ఇవి ముడిపడి ఉన్నాయి."
 

"ఆధునిక పారిశ్రామిక యుగంలో సైతం ఆంధ్ర ప్రజలు సర్వతోముఖాభివృద్ధ్హి చెందాలంటే, వ్యాపారంలో,విద్యలో,ఆర్ధికకార్యకలాపాలలో,పరిపాలనలో ఒకే భాష ద్వారా తమ వ్యవహారాలను కొనసాగించడం అవసరం.ప్రస్తుతం పరిపాలక వర్గ అభివృద్ధ్హి నిరోధక,సంకుచిత స్వార్థపర విధానాలవల్ల,తాత్కాలికంగా కొన్ని చిక్కులు,కలతలు సంభవించినప్పటికీ ఆంధ్ర ప్రజల సమగ్రాభివృద్ధి సమైక్యాంధ్రలోనే సాధ్యం.దీనికి ఆంధ్ర ప్రజల ఉమ్మడి సంస్కృతి,చరిత్ర పునాది."

10, ఏప్రిల్ 2011, ఆదివారం

"అన్నా హజారే" ఉద్యమాన్ని హాస్యాస్పదం చేసిన అపర కుబేరులు,అవినీతి సామ్రాట్టులు :---

"అన్నా హజారే" ఉద్యమాన్ని హాస్యాస్పదం చేసిన అపర కుబేరులు,అవినీతి సామ్రాట్టులు :---

శ్రీ అన్నా హజారే సామాన్య ప్రజానీకం కోసం, సమాజం లో,ప్రభుత్వయంత్రామ్గంలోను అడ్డగోలుగా వేళ్ళూనుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ పోరాటం మీడియా సహకారంతో సామాన్యుడినిసైతం ఆలోచిమ్పచేసి అందరిని ఉద్యమభాగాస్వాములు చేసింది.ఇది మరో స్వాతంత్ర్య పోరాటం లాగా ఉవ్వేతున రగిలిన ప్రజానిరసన . కాని ఇందులో మనం కొద్దిగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే.....అనినీతిలో భాగస్వాములు,అవినీతిని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రోచాహించిన వ్యక్తులు,శక్తులు కూడా ఈ ఉద్యమ ముసుగులో చేరిపోయి నీతులు వల్లించడం చూస్తే... నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వానికి దొంగలెక్కలతో పన్నులు ఎగ్గొట్టే పారిశ్రామికవేతలు,అపర కుబెరులైనటువంటి రాజకీయ నాయకులు,సినీ తారలు,సిని ప్రముఖులు,రియల్ ఎస్టేట్ వ్యాపారులు,న్యాయవాదులు,డాక్టర్లు,రాజకీయ దళారీలు మరియు ఎలేక్షన్లలో నల్లధనాన్నినీళ్ళు లాగ ఖర్చుపెట్టే రాజకీయ పార్టీలు, అధినేతలు ,రాజకీయ నాయకులు అందరు కూడా అవినీతి సామ్రాట్టులే. దొంగే ....దొంగా..దొంగా...అని అరచినట్టు, పైన పేర్కొన్న వివిధ రంగాల్లోని వ్యక్తులు,శక్తులు ఈ ఉద్యమ ముసుగులో చేరిపోయి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఈ రోజు మనం కొద్దిగా ఆలోచిస్తే ,నేటి ఈ ఉద్యమంలో పాల్గొన్న వారిలో,ఉపన్యాసాలు ఇచ్చినవారిలో ఎంతమందికి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే అర్హత ఉందొ తెలుస్తుంది .వీళ్ళు ఎవరైనా గుండెలమీద చేయ్యవేసుకొని ఆత్మసాక్షిగా అవినీతికి,చట్టవ్యతిరేకతకు పాల్పడలేదని ప్రమాణం చెయ్యగలరా.......? చట్టాన్ని వ్యతిరేకించటం,చట్టాన్ని ఉల్లంఘించటం,బంధుప్రీతి,దొంగలెక్కలతో ప్రభుత్వాన్ని మోసం చెయ్యటం,పన్నులు ఎగ్గొట్టటం,ఎన్నికలలో ధనము,మధ్యము ఖర్చుపెట్టటం...ఇవి అన్ని కూడా అవినీతిలో భాగాలే. అలనాటి స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఇటువంటి కొన్ని శక్తులు చేరిపోయి ,ఆ తరువాత అధికారాన్ని చేచిక్కున్చుకోవటం మూలానే ఈ రోజు అవినీతి విలయతాండవం చేస్తోంది అనేది నిర్వివాదాంశం.ఇప్పటికైనా నేటి ఈ ఉద్యమంలో ముందుండి నడిపించిన,నడిపిస్తున్న మేధావులు,సంఘ సంస్కర్తలు జాగరూకులై ఉండవలసినదిగా కోరుచున్నాం,లేకపోతే దీని ద్వారా ప్రజలకు,సమాజానికి,దేశానికి మంచికంటే హాని ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది.ఈ చట్టం రూపొందిచే సమయంలో దూరదృష్టితో,జాగూరూకతతో వ్యవహరించకపోతే దొంగలే దొరల్లాగా,ప్రభువుల్లాగా మరలా చెలామణి అయ్యే పరిస్థితి దాపురిస్తింది.కాబట్టి శ్రీ అన్నా హజారే ద్వారా వచ్చిన ఈ ఉద్యమ స్పూర్తి ఫలాలను సామాన్యులకు,సమాజానికి,దేశానికి అందే విధంగా ఆలోచిద్దాం....అడుగు ముందుకువేద్దాం.

జయహో భారత్
జైహింద్
ఇట్లు
భవదీయుడు
వేంకటేశ్వర్. సుంకర