25, జనవరి 2012, బుధవారం

ఎవరో మీకే తెలుసు!!

ఆంధ్రప్రభ : సత్యం, అహింస వంటి విలువల గురించి ప్రస్తావిస్తే చాలు, మనకు గాంధీజీ గుర్తుకు వస్తారు. అలాగే ఏకపత్నీ వ్రతం, పితృవాక్య పరిపాలన, పరస్త్రీ వ్యామోహం, అనుచిత ఆగ్రహం, దానశీలం, పాతివ్రత్యం చంచలత్వం వంటి గుణగుణాల్ని గురించి మాట్లాడుకుంటే పేర్లు పనిగట్టుకుని చెప్పకపోయినా ఏ పురాణ పురుషులు, స్త్రీలు జ్ఞాపకం వస్తారో తెలిసిందే. వర్తమానంలో కూడా కొందరు విశిష్ట లేదా విలక్షణ వ్యక్తులకూ ఈ సూత్రం వర్తిస్తుంది. అంటే, వాళ్లు (రాజకీయంతో సహా ఏ రంగానికి చెందినవారైనా సరే!) తమ గుణగణాల ద్వారానే ఎక్కువ ప్రసిద్ధులు. తాము సాధించిన సత్ఫలితాలో, దుష్పలితాలో.

విజయాలో, అపజయాలో, మాటలో చేతలో, వాటి మూలంగా కీర్తో అపకీర్తో సాధించి ఆ విధంగా అందరికీ తెలిసిన వాళ్లైపోతారు. అలా కొన్ని ప్రత్యేక లక్షణాల మూలంగా విశేష గుర్తింపు పొందిన రాజకీయ నేత ఒకరు మన రాష్ట్రంలో ఉన్నారు. ఆయన మాట -మౌనం, క్రియ -నిష్క్రియ పుట్టిన ఊరు, పెరిగిన తీరు, చదువు -సంధ్య, చుట్టాలు పట్టాలు, కుటుంబ మూలాలు, ఇంటి దూలాలు, తిట్లు, ఒట్లు, బెట్లు, గతంలో చేసిన వ్యాపారాలు, వ్యవహారాలు వ్యాఖ్యలు, వర్తమానంలో భాగ్యం -ఆరోగ్యం, ఇలా అదనీ ఇదనీ కాదు, తనకి సంబంధించిన సమస్తం అస్తమానూ ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకునే విషయాలైపోయాయి. పేరు చెప్పకపోయినా, కొన్నిగుణాలు విషయాలు ప్రస్తావిస్తే చాలు మనోఫలకాలమీద ఆయన సాక్షాత్కరించే స్థాయిలో సామాన్య ప్రజల అవగాహన ఉంది. పుట్టిన తేదీ, ఊరు, సహజ లక్షణాలు, తెచ్చిపెట్టుకున్న లక్షణాలు, ప్రవచిస్తున్న సిద్ధాంతాలు అలవాట్లు, వాపు, బలిమి, కలిమి, వంటి అందరికీ తెలిసిన వాటి గురించి చెప్పేసి, ఃఃఎవరో చెప్పుకోండిఃః అంటే అంత గొప్పగా ఉండదు. కాబట్టి కొందరికే గాని ఇంకా అందిరకీ పెద్దగా తెలియని వాటి గురించే చెప్పుకుందాం. ప్రధాన లక్షణాలని వదిలేద్దాం.

(1) మూలాల ప్రభావమే కావొచ్చు, ఆయనకి చాలామంది అపోహపడుతున్నట్లు ప్రాంతీయ దురభిమానం మనసులో చేతల్లో ఉండదని చెప్పడానికి కొన్ని నిదర్శనాలున్నాయి (అ) కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తనచేతిలో ఉన్న పదవుల్ని ఇతర ప్రాంతాల వారికే కట్టబెట్టేరు. (ఆ) ఆ ప్రాంతాలకి ప్రధానమైన, వరమైన, పోలవరం ప్రాజెక్టు ఃఃటెండర్ల వండర్లఃఃలో విశాల హృదయంతో, క్రియాశీలక (స్వ)లాభ దాయక పాత్ర పోషించేరు. (ఇ) స్వయంగా చేసిన యాగాల్లో స్థానికేతర రుత్విక్కులకే ఎక్కువ ప్రాధాన్యత నీయటమే కాదు, సంభావనలు కూడా అధికంగా చెల్లించారు. అందుకు స్థానిక పురోహితులు యాగస్థలంలో కోపాగ్నిని రగిలిస్తే లెక్కచేయలేదు. (ఉ) వాస్తు వైద్య సలహాలు సేవలు పొందటంలోనూ ప్రాంతీయాతీతంగానే వ్యవహరించారు. (ఊ) ఆయన విశాల హృదయం ఇరుగు ప్రాంతాలవారి పట్ల మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రాల ప్రజల బాగుకోసం కూడా తపించిందనుకోవడానికి, బాబ్లీ, ఆల్మట్టి ప్రాజెక్టుల విషయాల్లో, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కనుగుణంగా వ్యవహరించడాన్ని ఉదహరించాలి.

(2) కీలక సమయంలో ఃఃఫాంహౌస్‌ఃఃలో పండుకున్నాడని ఆరోపించేవాళ్లని నమ్మొద్దు -ఆ సమయంలో ఎంత అంతర్మధనానికి గురయ్యారో అర్థం చేసుకోకపోతే ఎలా ఃఃపులి స్వారీఃఃని సురక్షితంగా ఎలా విరమించుకోవాలో, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ హైకమాండ్‌ పైనుంచి అందించబోయే రక్షణ తాళ్లనందుకుని, పులివీపు మీదనుంచి, ప్రత్యామ్నాయ (విభజనేతర) పరిష్కారం చెట్టుమీదికి, ఎలా ఎగబాకాలో, తగు స్థాయి వారితో సంప్రదించాలంటే, అబిడ్స్‌ ప్రధాన పోస్టాఫీసు నుంచి కాల్‌ చేసి పబ్లిక్కుగా మాట్లాడటం కుదురుతుందా అలాగే రాంగ్‌రూటులో పోతున్న కారుని దారి మరల్చాలంటే, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏ సురక్షిత మలుపును ఎంచుకోవాలా అన్నదే కదా ఆయన ప్రస్తుత సమస్య -ఇవేమీ అర్థం చేసుకోకుండా, అడపాదడపా అజ్ఞాతంలోకి పోయినా, మౌన వ్రతం పట్టినా, ఆక్షేపించటం న్యాయం కాదు. ఫాంహౌస్‌లో ఉన్నప్పుడు అదుర్స్‌, దూకుడు వంటి సినిమాల్ని డి.వి.డిలో చూసి ఆనందిస్తారని కొద్దిమందికే తెలుసు! పాట సాయం జైబోలో తెలంగాణాకి దక్కింది సొమ్ముల సాయం కాదు.

(3) ఆయనకు స్వపర భేదాలు లేవు -ఇతర ప్రాంతాల ప్రజలను గంపగుత్తగా, రాక్షస సంతతి, దొంగలు, దోపిడీదారులు, మోసకారులు అని నిందిస్తారన్న దొక్కటే పరిగణనలో తీసుకుంటే ఎలా తన ఆధిపత్యాన్ని సంపూర్ణంగా అంగీకరించలేకపోతున్న సొంత ప్రాంత నేతల్ని కూడా ఃఃచవటలు, దద్దమ్మలు, ద్రోహులు, అటూ ఇటూ కానోళ్లు, అని ఒక్కోసారి ఇంకా ఘాటుగా ఃమై సన్స్‌ః ఃయువర్‌ మదర్‌ః వంటి ఆంగ్ల పద ద్వయాలు యొక్క ముతకానువాద తెలుగుపదాలతో సత్కరించటం లేదా?

(4) ఎవరోలా రెండెకరాల కుటుంబంలో పుట్టలేదు. ఎన్నో ఎకరాలలో విస్తరించిన సొంత ఇల్లు ఉన్నవాణ్ణి అని దైర్యంగా ప్రకటించారాయన -ఇంకెవరో అంటున్నట్లు నిజంగా 50 వేల కోట్లు సంపాదించి ఉంటే సరైన సమయం వచ్చినప్పుడు ఆ సంగతీ నిర్భయంగా చెప్పేస్తారు! సున్నాలను ముట్టుకోకుండా మొదటి అంకె ఐదు బదులు రెండు ఉండాలో ఏడు ఉండాలో ప్రకటించేస్తారు. ఈ లోగా మనం కాకి లెక్కలు వేసుకోవటం అనవసరం. 

(5) వసూళ్లు లేకుండా ఏ ఉద్యమం జరిగింది ఈ ప్రపంచంలో ఈ ప్రశ్న ఆయనకాదు గాని కుటుంబ సభ్యులు, అనుయాయులు ఇప్పటికే లేచి, పరోక్షంగా కొంత నిజాన్ని ఒప్పుకున్నారు గదా -ఎవరు, ఎంత, సొమ్ములిచ్చారో ఎలా సహకరించారో అంతా బట్ట బయలుచేసేస్తే, పరువుపోయేది, ఇతర ప్రాంతాలకు చెందిన పారిశ్రామిక సినిమా, మీడియా, రియల్‌ ఎస్టేట్‌ వర్గాలదే! అందుకే ఆ వివరాలు చెప్పటంలేదు -ఈ నేపథ్యంలో జమాఖర్చు -మిగులు లెక్కలు అడగటం ధర్మం కానేకాదు -సభ్యత అసలే కాదు-

(6) ఆయనను క్షమాగుణం కూడా ఎక్కువే! ఏదో ఒకసారి మూడ్‌ బాగోక, అలవాటైన రీతిలో చనువుగా మందలిస్తే, ఒక దళిత నాయకుడు నన్ను పలానా అశ్లీల పదంతో (ల గుణింతంలోది లెండి!) అచ్చతెలుగులో తిట్టేడని బయటికొచ్చి టీవీల సాక్షిగా నానాయాగీ చేసినా, కొన్నాళ్ల తర్వాత మళ్లీ పార్టీ లోకి తీసుకుని పెద్ద పదవినిచ్చేరాయన -ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఃఃచెయ్యిచ్చినఃః ఎమ్మెల్యేలకూ త్వరలోనే క్షమాభిక్ష ప్రసాదించారు. అంతేనా, తనని ఎంతో పరుషంగా తిట్టిన వాళ్లనెందరినో అక్కున చేర్చుకున్న ఉదాహరణలు పెక్కు-

(7) పితృవాత్సల్యం ఆయన సుగుణాల్లో ఒకటి -కుటుంబ సభ్యుల్ని ప్రేమించనివాడు, వాళ్లను పైకి తీసుకురాని వాడు, ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ఉద్ధరించలేడు.

(8) ఆయనకి దూరదృష్టి కూడా మిక్కుటం -అందుకే ఃఃఇక్కడ పుట్టినోళ్లంతా మావోళ్లేఃః అనేశారు ఉదారంగా -తగిన సమయం వచ్చినప్పుడు తెలుగువాళ్లంతా, ఆ మాటకొస్తే భారతీయులంతా ఒక్కటే అంటారు. భారత రాజ్యాంగం గురించి ఆయనకు తెలియదనుకోవద్దు -బుడ్డిపేట బుల్లోడు అని ఎద్దేవా చేయరాదు.

(9) ఏదో అవసరార్థం, నేడు ఎన్ని వితండ వాదాలు వినిపిస్తున్నా విపరీత వ్యాఖ్యలు చేస్తున్నా, ఇదంతా ప్రజలు అంతిమంగా జ్ఞానోదయం పొందడానికి, నిజాన్ని గ్రహించడానికి చేసే ఒక వినూత్న నకారాత్మక ప్రక్రియలో భాగంగా అర్థం చేసుకోవాలి. పూర్వం నాస్తికులను లేదా సంశయాత్ములను ఆస్తికులుగా మార్చడానికి కొందరు రుషులు ఇలాంటి విధానాన్నే అవలంబించేవారట. దైవదూషణ ఏవగింపు కలిగే స్థాయిలో చేసేవారట. అందరికీ తెలిసిన నిజాల్ని ఖండించేవారట. అబద్ధాలు అలవోకగా చెప్పేవారట. అదే రీతిలో మనజాతి, రీతి, నీతి, సంస్కృతి, వేషభాషలు, ఆఖరికి దేవుళ్లు, దేవతలు అన్నీ లేరనే సిద్ధాంతాన్ని ప్రచారం చేయటంలో ఆయన అంతిమధ్యేయం, ఇదో పిచ్చిరాద్ధాంతమని ప్రజలే తెలుసుకుంటారన్నదే మార్గం ఏదైతేనేం, అంతిమ ఫలితం ముఖ్యం కదా.

ప్రధాన వివరాలు, గుణగణాలు వదిలేసినా పైన చెప్పిన క్లూలతో పేరు చెప్పక పోయినా ఈ ప్రముఖుడెవరో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అందరికీ కరెక్టు ఆన్సరే వస్తుంది. కాబట్టి నగదు బహుమతి ఏదీ ఉండదు. కాదంటే అనంతం అమూల్యమైన తెలుగుతల్లి దీవెనలు లభిస్తాయి వచ్చేవారం ఇంకో విషయంపై వ్యాసం ఉంటుంది గాని కరెక్టు ఆన్సర్‌ ప్రకటించబడదు.

చేగొండి రామజోగయ్య
(వ్యాసకర్త విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు)

23, జనవరి 2012, సోమవారం

ఎం.ఎస్. రాజలింగం అమర్ రహే!

 స్వాతంత్య్రసమరయోధుడు, రాష్ట్ర మాజీ మంత్రి, అలనాటి 'విశాలాంధ్ర మహాసభ'లో ప్రముఖ పాత్ర పోషించిన శ్రీ ఎంఎస్ రాజలింగం గారు సోమవారం ఉదయం మృతి చెందారు.ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం- విశాలాంధ్ర మహాసభ 


కలసి ఉన్నా.. విడిపోయనా.. విద్వేషం వద్దు : ఎం ఎస్ రాజలింగం ( ఆంధ్రభూమి, మే 28,2010)  

కాకతీయ సామ్రాజ్యం ఆంధ్రలోకానికి ఎన్నో పాఠాలు నేర్పింది. సామ్రాజ్య చరిత్రలో విజయంగురించి ఎంత ఘనంగా చెప్పుకున్నామో ఓటనిని గూర్చి కూడా చెప్పుకొని అంత మిక్కుటంగా బాధపడ్డాము. కాకతీయుల చరిత్రలో విజయం, పరాజయం ఒకరి సొత్తుకాదని అది దైవ నిర్ణయంపై ఆధారపడినదని అనుభవము చెప్పుచున్నది. శైవ, వైష్ణవ సాంప్రదాయాల ఘర్షణలు, రెడ్డి, వెలమ పరస్పర వైషమ్యాలు సామ్రాజ్యాన్ని కూల ద్రోశాయి. ఓరుగల్లు, కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకొని గర్వించడం మాత్రమే మనకు మిగిలింది. చరిత్ర పుటలు త్రిప్పినప్పుడు సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు ఓరుగల్లు ప్రాశస్త్యమును గూర్చి చెప్పినప్పుడు గర్వించని సన్నివేశము లేదు. ఆంధ్ర విద్యాభివర్థనీ సంఘానికి ఉదయరాజు రాజేశ్వరరావు అధ్యక్షులుగాను , నేను కార్యదర్శిగానూ పనిచేశాము. చందా కాంతయ్యఆర్థిక సహాయముతో సంస్థ ఏర్పడ్డది. ఈ సంస్థ ద్వారా ఎ.వి. హైస్కూలు ప్రారంభించబడి క్రమాభివృద్ధి చెందింది. 1950లో ఎ.వి. హైస్కూలు ఉత్సవాలలో బూర్గుల రామకృష్ణారావు చారిత్రకప్రాధాన్యం ఉన్న ఓరుగల్లు ఆంధ్రప్రదేశ్‌కు రాజధానికాక తప్పదని అన్నారు.ఫజల్ ఆలీ కమీషన్ వచ్చిన రోజులలో నీటి వసతి లేని కారణంగా ఓరుగల్లు రాజధానిగా సూచించుటకు వెనకా, ముందు అయినాము. 1949-50 సంవత్సరంలో విశాలాంధ్ర మహాసభ ఓరుగల్లులో శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారి అధ్యక్షతన జరిగింది. నేను, ఒరిస్సా ప్రాంతమునకు చెందిన ప్రకాశ్ చంద్ర శతపథి కార్యదర్శిలుగా ఉన్నాము. తెలంగాణ నుంచి రామానంద తీర్థ స్వామి, బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, కోదాటి, కాళోజీ, ప్రభృతులు పాల్గొన్నారు. ఆ సమయంలో , చందా కాంతయ్య ఆంధ్రుల ఆధిపత్యమును గూర్చి తెలంగాణ వారికి భయం ఉందన్నారు. ఈ విషయం ఆనాటి మహాసభకు హాజరైన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, వావివాల, మాదల వీరభద్రరావు లాంటి పెద్దలకు తెలియజెప్పడం జరిగింది. ఆంధ్రకేసరి శ్రీ ప్రకాశం పంతులు‘‘ నేను బ్రతికుండగా మీకు అన్యాయం జరుగుతుందా?’’ అని ప్రశ్నించారు. దానితో ఆ సమస్య అప్పుడు సమసిపోయింది. 

విశాలాంధ్ర మహాసభ హైద్రాబాద్‌రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇరు పక్షాలకి భిన్న విశ్వాసాలు ఉన్నా మనసా, వాచా, కర్మణా ఎవరి విశ్వాసాలను వారు ప్రజలవద్దకు తీసుకువెళ్ళారు. పరస్పర దూషణలు, దెబ్బలాటలు లేకుండా ఎవరి భావాలను వారు సభల ద్వారానూ, పత్రికల ద్వారానూ ప్రచారం చేసుకున్నారు. కాని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంవారు ఇరువురూ ఒకరి ప్రాంతానికి మరొకరు రాకూడదని పొరపాటున కూడా అనలేదు.ఆరోజులలోనే ఇల్లెందులో గ్రంథాలయ మహాసభ జరిగింది. ఆ మహాసభకి సురవరం ప్రతాపరెడ్డి (గోల్కొండ పత్రికాధిపతి)గడియారం రామకృష్ణ శర్మ, వానమాముల వరదాచార్యులు, కాళోజీనారాయణరావు, కాళోజీ రామేశ్వరరావు ప్రభృతులు హాజరయ్యారు. ఆ మహాసభలో ఆంధ్రమాత, తెలుగుతల్లి కీర్తనలు ప్రతిధ్వనించాయ..... ప్రాంతీయ భావాలు, విడిపోవాలనే ధోరణులు ఎక్కడా కనపడలేదు. ఇరు ప్రాంతాల వారు కలిసి ఉండాలనే సమైక్యభావములు చల్లపల్లి వెంకటశాస్ర్తీ, దాశరథి రంగాచార్యుల కలాలలో అక్షర రూపం దాల్చాయి. 1946లో ఆంధ్ర సారస్వత పరిషత్ మహాసభ ఓరుగల్లు లో జరిగింది. అక్కడ ఆంధ్ర, తెలంణ కవుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంలో జాతీయ వ్యతిరేక శక్తులు విచక్షణా రహితంగా నా (ఈ రచయిత) పై దాడి చేశాయ. దెబ్బలు తగిలినవి. ఈ విషయం మహాత్మా గాంధీకి తెలిపాము. గాంధీ- అహింసతో మీరు ఈ ఉద్యమాన్ని ఎదుర్కొన్నారు. సర్‌మీర్జా ఇస్మాయిల్ త్వరలో హద్రాబాద్ రాష్ట్రానికి ప్రధానిగా వస్తున్నారు. మీరు తొందరపడవద్ద-ని సందేశాన్ని పంపారు.. ఓరుగల్లు కోటలో జాతీయ జెండా ఎగురవేయబడ్డది. ఆ సందర్భంలో జాతీయ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ కార్యకర్త, బలహీన వర్గాలకు చెందిన బత్తిని మొగలయ్యను బహిరంగంగా బల్లెంతో పొడిచి, చంపిరు. ఇట్టి పరిస్థితులలో హంతకుడు కర్నూలులో ఉన్నాడని తెలిసి, ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ఆ నిందితతుని తరలింపునకు వారంట్ ఇప్పించాఠు. ఆంధ్ర, తెలంగాణ భాషలో యాస వేరైనా అందరి సంస్కృతి ఒక్కటే అని గుర్తించి వ్యవహరించిన రోజులవి. ఇలాంటి ఘట్టాలలో ఆంధ్రా, తెలంగాణ వాదులు ఎవరైనా, వాచా, మనసా, కర్మణా, మానవతా దృష్టితో మాత్రమే వ్యవహరించినందువల్లనే చిక్కులూ విభేదాలు ఆనాడు అవుపడలేదు.ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ నాయకుల ఆలోచనలలోని ఆంతర్యము తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. రాజకీయ పరిశీలకులు, గత అనుభవాలు, 50 సంవత్సరాలకు పైగా చూచినవారికి ఈ ఉద్యమాలన్నీ ప్రజలకు దూరం అవుతున్నాయేమో అనిపిస్తున్నది. కాని ఉద్యమ నిర్వాహకులు మాత్రం ప్రజలకు చాలా సన్నిహితంగా ఉన్నామనే భావనలో ఉన్నారు. 

సైద్ధాంతిక విభేదాలు తీవ్రంగా ఉన్న రోజులలో కూడా పరస్పరంగా వారివారి సిద్ధాంతాలను ప్రచారం చేసుకున్నారు గాని ఒక పార్టీవారు మరొక పార్టీవారిని తమ ఊరిలోకి రాకూడదని ఎవరూ శాసించలేదు. ఇప్పుడు ఈ హక్కు కేవలం ప్రొఫెసర్ కోదండరాంకే ఉన్నట్లుగా కనపడుచున్నది. సర్వదేవభట్ల రామనాథం సిసలైన కమ్యూనిస్టు నాయకులు. ఆస్తినంతా కమ్యూనిస్టు ఉద్యమానికి ధారపోసిన మహా వ్యక్తి. వారితో 1952 సార్వత్రిక ఎన్నికలో శాసనసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయవలసి వచ్చింది. ఎన్నడూ ద్వేషపూరిత స్వార్ధపూరిత వాతావరణం కనిపించలేదు. పార్టీ ప్రతిష్ఠ, సంస్థల ప్రతిష్ఠలు మాత్రమే ప్రాధాన్యత వహించేది. ఆనాటి నాయకులుగాని, కార్యకర్తలుగాని ఆలోచించేది, చెప్పేది, చేసేది ఒకటిగా ఉండేది. ఆ కారణంగా వైరుధ్యాలు ఉన్న దశలో కూడా పరస్పర విశ్వాసము ఉండేది. సభలు, సమావేశాలు ఉధృతంగా జరిగినాయి. మేము కాంగ్రెస్ వారము, కమ్యూనిస్టులు ఒక టేబుల్ వద్ద కూర్చొని భోజనంచేశాము. ఇది ఆనాటి విద్యాలయాలు గురువులు అభ్యసింపచేసిన పాఠాలు. కాని దీనికి భిన్నంగా ‘‘నేడు విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, అధినేతలు కొందరు వ్యవహరించడం చాలా బాధాకరంగా ఉంది.చిల్లంచర్లలో 1957లో శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థినైన నాకు, కమ్యూనిస్టు అభ్యర్థి గోపాలరావుకు పోటీ జరిగింది. చెట్లముప్పారం గ్రామంలో గోపాలరావు అనుయాయులు మమ్ములను మీటింగ్ పెట్టుకోనివ్వలేదు. ఉద్రిక్త వాతావరణంలో మా కార్యకర్త శ్రీనివాసరావును ముక్కుపై వేటువేస్తే సగం ముక్కు తెగింది. నేను గోపాలరావు వద్దకు వెళ్ళి ఇదేమిటని అడిగా, అతను చాలా బాధపడ్డాడు. అతను ముందుండి మా సమావేశం నడిపాడు. ఆ తరువాత వారి సమావేశం జరిగింది. రెండోరోజు గోపాలరావు నన్ను భోజనానికి పిలిచాడు. వైద్య చికిత్సకు కూడా ఇరువురు కలిసివెళ్ళాం. నిజాం ప్రభుత్వం చేసిన అన్యాయాలను ఎదిరించవలసివస్తే అందరూ కలిసి నిర్వహించే కార్యక్రమాన్ని తలపెట్టి నిర్వహించేవారు. 

తెలంగాణ పోరాటం నిర్వహించిన కమ్యూనిస్టు అగ్రనాయకుడు రావి నారాయణరెడ్డి, పోరాటాన్ని ఒక దశలో కాంగ్రెస్ తరపున నడిపిన రేపాల క్యాంప్ అధినేత కోదాటి నారాయణరావు కలిసి కూర్చొని సమీక్షించుకొని తప్పులు దిద్దుకోవటం జరిగేది. వారిరువురి సిద్ధాంతాలకు అఘాతం లేకుండా చూచుకునేవారు. ఇలాంటి వివిధ ఘట్టాలలో కూడా , ఈ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి రావద్దని కాని, ఆ ప్రాంతం వారు ఈ ప్రాంతమునకు రావద్దని కాని ఆంక్షలు విధించిన నాయకులు ఆ రోజులు వేరు. ఆ కీర్తి ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాంవంటి వారికే దక్కింది. బహిష్కరణ ఉద్యమాలు ఎవరు ఎప్పుడు ఏ కారణంవల్ల తలపెట్టినా అందలిలోపాలను అందుకు భిన్నమైన పార్టీలు చూపటం సహజం, సమంజసం. సభలు, సమావేశాలు చేసుకొని ఆ కార్యక్రమంలో ఉన్న లోపాలను ప్రజలకు చెప్పి తమవైపు ఆకట్టుకోవడం న్యాయం. అదే ప్రస్తుతం జై ఆంధ్ర, జై తెలంగాణా నాయకులు చేయవలసిన పని. మృదువైన తీయని మాటలతో, ప్రేమ పూర్వకమైన చర్యలు దేశ సౌభాగ్యానికి ఎంతేని తోడ్పడతాయి. గతంలో ఉద్రిక్త వాతావరణంలో ఆనాటి నాయకులు ఎలా వ్యవహరించారో తెలుసుకొని వారిని ఆదర్శంగా భావించి వారి అడుగుజాడలలో నడువాలని ఆ విధంగా జాతీయ ఐక్యతకు, అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజలు నారుూ కోరికను మన్నిస్తారని ఆశిస్తాను. ప్రాంతీయ బహిష్కరణ ఉద్యమాలను ఎవరు చేసినా , ఎప్పుడు చేసినా, ఎందుకు చేసినా వాటిని తెలంగాణ ప్రజలు బహిష్కరించాలి.

ఆంధ్రభూమి పత్రికకు రాసిన మరో వ్యాసం లో రాజలింగం గారు నిజాం పరిపాలనా కాలం లో పత్రికా స్వాతంత్ర్యం మరియు ఇతర పరిస్థితులను గురించి వివరించారు. 

1935లో నేను బి.ఎస్‌సి చదువుకోవడానికి నిజాం కాలేజీలో చేరాను. ఆనాటి విద్యార్థి ఉద్యమాలకి నాయకత్వం వహించానని చెప్పవచ్చు. ఆరోజుల్లో గోల్కొండ పత్రిక (తెలుగు) హైదరాబాద్ బులెటిన్ (ఇంగ్లీషు), డెక్కన్‌క్రానికల్ (ఇంగ్లీష్) ఉండేవి. ఈ పత్రికల్లో ప్రజా చైతన్యానికి సంబంధించి చైతన్యవంతులను చేసే ఏ కార్యక్రమమైన అంత తేలిగ్గా ప్రచురింపబడేవి కావు. ఆరోజుల్లో వాక్‌స్వాతంత్య్రం, పత్రిక స్వాతంత్య్రం, ఏవిధమైన న్యాయ సంబంధమైన హక్కులు ఉండేవికావు.

సికింద్రాబాద్‌లో ఒక మూల దివ్యవాణి అనే చిన్న పత్రిక ఉండేది. అది వారపత్రికో, మాసపత్రికో గుర్తులేదు. చివుకుల అప్పయ్యశాస్ర్తీ దానికి సంపాదకులుగా ఉండేవారు. వారు ఒకరుమాత్రం మేము విద్యార్థి సంఘం నుంచి పోగానే ‘‘నాయనా పిల్లలు మీరు వచ్చారు మీటింగ్ వివరాలు ప్రచురించడం నావల్లకాదు. కానీ చివరిపేజీలో మీ మీటింగ్ జరిగిందని, ఫలానావారి అధ్యక్షతన జరిగిందని వేస్తాననేవాడు. అప్పటికదే పెద్ద వరంగా ఉండేది. 1938లో మేము ‘ఆంధ్ర సారస్వత సంచిక’ తీయాలనుకున్నాం. ఆనాటి నిజాం కాలేజి అధ్యాపకులు సరిపల్లి విశ్వనాథశాస్ర్తీ, కురుగంటి సీతారామయ్య తగు ప్రోత్సాహం ఇచ్చేవారు. వారి ప్రోత్సాహంతోనే విద్యార్థి సంచిక తీయాలనుకున్నాం. కానీ మా ప్రిన్సిపాల్ టర్నరు. (The word Andhra has political significance) ఆంధ్ర అనే శబ్దం రాజకీయ ప్రాముఖ్యత కలిగింది. దానికి బదులు మీరు తెలుగు అనే పదం వాడి తెలుగు సారస్వత సంచిక అనే సంచికగా తీయమన్నారు. దాన్ని ఉల్లంఘించాము. ఈ పత్రిక అచ్చువేసిన బుచ్చయ్యలింగశాస్ర్తీని పోలీసువారు నిర్బంధించదలిచారు. కానీ ఆయన నెత్తిపై ఉన్న రుద్రాక్ష కిరీటం, చేతికి ఉన్న రుద్రాక్షదండలు మెడలో ఉన్న రుద్రాక్ష మాలలు విభూతిరేఖలు చూసి వచ్చిన పోలీసు ‘‘అయ్యా మీరెందుకు ఈ గొడవలో పడుతున్నారు. మీరెందుకు ఈ పత్రిక అచ్చువేసారు’’ అని అడిగారు. దానికి బుచ్చయ్యలింగ శాస్ర్తీ ‘‘పోరగాండ్లు వచ్చిండ్రు నేను అచ్చేసిన. దాంట్లో ఏముంది నాకు తెలియదు. ఇక మీ ఇష్టం పట్టుకెలితే పట్టుకెళ్లండి. ఆ జైళ్లోనే కూర్చుని తీరిగ్గా 24 గం.లు శివపూజ- చేసుకుంటా’’ అన్నారు. ఆయన అమాయకత్వం మమ్మల్ని రక్షించింది. ఈ రెండు ఘట్టాల్లోని ముఖ్యోద్దేశం సనాతన ధర్మసంస్థలు తెలిసో తెలియకో పత్రికా స్వాతంత్య్ర పరిరక్షణకై కొంత తోడ్పడ్డాయని చెప్పడం. మరొక ఘట్టంతో పత్రికా స్వేచ్ఛ ఎంతగా ఉండేదో తెలుస్తుంది. మేము వరంగల్ హైస్కూలులో వున్నపుడు 1933-36 ‘వ్యాసలత’ అనే చిన్న మాసపత్రిక తీసేవాళ్లం. అందులో రజస్వలానంతర వివాహం చేయాలి అని మా మిత్రుడు లక్కినేని నర్సయ్య వ్రాసాడు. అతనిని పోలీసులు పట్టుకెళ్లారు. విద్యార్థులు పోలీసుని నిలదీసి అడిగితే ఇది నేడు చిన్న విషయం, రేపు నిజాం తఖ్త్ (సింహాసనం)ని ఉల్టా (తలకిందులు) చేస్తుంది అని అన్నాడు. ఈ భూమికలోనే మరికొన్ని ప్రాథమిక హక్కులు ఏవిధంగా దెబ్బతిన్నవో చెప్పడం అవసరం. ఉర్దూ రాజభాష అయింది. బ్రిటిష్‌వారు భారతదేశంలో ఏవిధంగా వారికి అనుకూలించిన దాస్య ప్రవృత్తిగల మంత్రాంగాన్ని మనుషుల్ని సృష్టించారో అదేవిధంగా ఉర్దూను రాజభాషగా పాలకవర్గం వారు ఉపయోగించారు. ప్రాథమిక పాఠశాల సైతం అనుమతి లేనిదే పెట్టకూడదని ఒక సర్క్యులర్ జారీచేసింది. 1929లో లార్డ్‌ఇర్విన్ ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినప్పుడు ఈ క్రిందివిధంగా ఉపన్యసించాడు. "It will be the fast of a mature statemenship so as to shape the policy of Osmania University so that it may have as strong apeal to the Hindus as to the Mohamadans subjects of your state.'' ఈ విధంగా ఉర్దూ భాష పేరిట మతఛాందసాన్ని ప్రభుత్వం పెంచింది. వారికి కీలక స్థానాల్లో ఉద్యోగాలనిచ్చింది. ఉద్యోగాలకి అర్హత కలిగినవారు ముస్లింల్లో లేకపోతేను ఉత్తరప్రదేశ్‌నుంచి ముస్లింలను పిలిచి ఉద్యోగాలిచ్చారు. ‘‘ఇత్తెహాదుల్ ముసల్మీన్’’ సంస్థ 1936లో స్థాపించబడి మతం మార్పిడిని ప్రభుత్వ సహకారంతో చేయడానికి పూనుకుంది. 18,000 హరిజనులను ఒక్క బహదూర్‌యార్‌జంగ్ ముస్లింలుగా మార్చగలిగాడు. ఆఫీసర్లు వెట్టిచాకిరికి పూనుకున్నారు. ఒక దశలో వెట్టిచాకిరి చేయించుకోలేని ఆఫీసర్లను, జాగీర్‌దారీ, వతన్‌దార్లను అసమర్ధులుగా ప్రభుత్వం చూపింది. ఇలాటి దుశ్చర్యలవల్ల బాధపడిన ఆంధ్రులు 1920లో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ పేరిట ఆంధ్ర మహాసభను ఏర్పాటుచేసారు. తద్వార గ్రంథాలయాలు స్థాపించి వెట్టిచాకిరీ నిర్మూలనకు, రైతు సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు లేవదీసారు. ఈ ఉద్యమాల తాకిడివల్ల నైతేనేమి, భారతదేశంలో రాజకీయంగా వస్తున్న మార్పులవల్లనైతేనేమి రాజ్యాంగ సంస్కరణలు అవసరమని ప్రభుత్వం భావించింది. అయ్యంగార్ కమిటీ 1939లో ఏర్పాటైంది. 132 స్థానాలు హైదరాబాద్ శాసనసభలో ఉండేటట్లు దానిలో 76గురు ఎన్నుకోబడేటట్లు సంస్కరణలు సూచించబడ్డాయి. జిన్నా సూచనపై Functional Representation (వృత్తిపరమైన ప్రాతినిధ్యం) ఇవ్వబడింది. రైతులకు, ఇండ్ల యజమానులకు, కిరాయిదారులకు, జాగీరుదారులకు, కూలీలకు, డాక్టర్లకు వకీళ్లు వ్యాపారస్తులు ఇత్యాది వృత్తులవారికి ఇవ్వబడింది. 51% ఓట్లు వస్తే వారు గెలిచినట్టు లెక్క. పై 76 సీట్లుకాక 56 మందిని ప్రభుత్వం నామినేట్ చేయ నిశ్చయించింది. ఈవిధంగా ఆందోళన జరుగుతున్న రోజులలో 1941లో వ్యక్తి సత్యాగ్రహం జరిగింది.

వ్యక్తి సత్యాగ్రహం తరువాత 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌వారు భాగస్వాములయ్యారు. బార్డర్ క్యాంపులు పెట్టి కాంగ్రెస్‌వారికి శిక్షణ ఇచ్చి నిజాం వ్యతిరేక పోరాటం క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్‌వారు చేశారు. కమ్యూనిస్టులు ప్రజాయుద్ధం అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉన్నారు. బహదూర్‌యార్‌జంగ్ ఆనాటి హైదరాబాద్‌కు తోడు బీహార్, ఉత్తర సర్కార్‌లు కలుపుకొని ఒక స్వతంత్ర ముస్లిం రాజ్యంగా ఏర్పడాలని కోరాడు. నిజాం వరల్డ్ ముస్లిం ఫెడరేషన్‌కి హైదరాబాద్ కేంద్రంగా ఉండాలని కోరుకున్నాడు. దీనిలో బహదూర్‌యార్‌జంగ్ ప్రముఖ పాత్ర వహించాడు. 1942నుంచి 1946 వరకు తెలంగాణ కమ్యూనిస్టు సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ ఆశయాల కనుగుణంగా జరిగాయి. 1946లో స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యాన బిందు అధ్యక్షతన కాంగ్రెస్ రాష్ట్ర కార్యాచరణ సంఘం ఏర్పడింది. సత్యాగ్రహాలు, సాయుధ పోరాటాలు నిజాంకి వ్యతిరేకంగా జరిగాయి. పరిటాల లాంటి కొన్ని గ్రామాలు రిపబ్లిక్‌గా ప్రకటించుకొనబడ్డాయి. ఈవిధంగా జరిగిన పోరాటాల ఫలితంగా 17.09.1949న నిజాం ప్రభువు, రజాకార్లు భారత ప్రభుత్వానికి లొంగిపోయారు.

 
మరపురాని ధన్యజీవి,ఆంధ్రభూమి సంపాదకీయ పేజీ: ‘ఆరని నీటికొలనక్కట పూచిన తమ్మికన్, విధి ప్రేరణ రాలిపోయినవి, రేకులు తొంబది తొమ్మిది! అన్నట్లుగా కురువృద్ధుల్ గురువృద్ధబాంధవులలో ఒక్కొక్కరే తనువు చాలిస్తున్నారు. నిన్నటిరోజు కన్నుమూసిన ఎం.ఎస్.రాజలింగంఅటువంటి చరితార్థులలో ఒకరు. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం ఒక ఆరని నీటి కొలను. అందులో శతపత్ర పరంపర నిర్నిద్రంగా ప్రభవించింది. జాతీయోద్యమం నాటికీ ఆ పరంపర జాతికి నాయకశ్రేణిగా మారి పతన స్థితిలో ఉన్న జాతి జనులకు ఆత్మగౌరవం కల్పించి ధర్మంకోసం పోరాటం నేర్పింది. వారి కృషి ఫలితమే నేటి, మన రాష్ట్రం. ఆ నిర్మాతలలో నిస్సందేహంగా ఎం.ఎస్.రాజలింగం ఒకరు.

రాజలింగం 1919 ఫిబ్రవరి 9వ తేదీన వరంగల్‌లో జన్మించారు. అక్కడే మెట్రిక్ పాసయ్యారు. నిజాం కళాశాలలో బిఎస్సీ చేసి ఉస్మానియాలో ఎల్.ఎల్.బి. చేశారు. విద్యార్థి దశనుండే రాజకీయాలలో పాల్గొనేవారు. అవి సాహిత్యరూపంలో ఉండేవి. సాధనా సమితిలో చేరి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. కానీ చదువు పూర్తి అయ్యేనాటికి ఆయన మీద పోలీసు నిఘా తీవ్రమై రాష్ట్రం విడచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. పిట్టల వాని వేషంలో స్టేటు వదలి వార్థా చేరుకున్నారు. గ్రామీణ విద్యాలయంలో జె.సి. కుమారప్ప ఆధ్వర్యంలో గ్రామ పరిశ్రమణ శిక్షణ పొందారు. సేవాగ్రాంలో ఆశ్రమ మేనేజరుతో ఏర్పడిన విభేదాల కారణంగా గాంధీజీ, కస్తూరిబా, రాజాజీ వద్దని చెప్పగా సేవాగ్రాం వదలి వచ్చారు. మొదటినుంచి ఆయనది ఒకరికి లొంగి ఉండే తత్వం కాదు.

ఆ తరువాత కరీంనగరు జిల్లాలోని ముస్తాబాద్ గ్రామంలో 1941లో గ్రామీణ కార్యక్రమాలను ప్రారంభించారు. నిజాం రాష్ట్రంలో మొట్టమొదటి చరఖా సంఘం ఏర్పాటుచేసారు. 1942-43లో క్విట్ ఇండి యా ఉద్యమ సందర్భంగా ఎం.ఎస్.ఆర్ అరెస్టయ్యారు. 1944లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షిక సభలకోసం వేసిన పందిళ్లను దుండగులు తగలబెట్టారు. ఎంఎస్ ధైర్యంగా తిరిగి కొత్త పందిళ్ళు వేయించారు. కవి సమ్మేళనం దిగ్విజయంగా జరిగింది. 1946లో ఓరుగల్లు కోటలో జెండా వందనం జరిగింది. జాతీయ విద్రోహశక్తులు మొగలయ్యను హత్య చేశారు. ఆ వార్తను జాతీయ పత్రికలు ప్రచురించే ఏర్పాటుచేసిన ఎం.ఎస్. రాజలింగంను వరంగల్ జిల్లా నుంచి మూడు నెలలు బహిష్కరించింది ప్రభుత్వం. వరంగల్ జైలు నుంచి ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. స్టేటు కాంగ్రెస్ రెండుగా చీలినప్పుడు ఎం.ఎస్.రాజలింగం ఎంతో బాధపడ్డారు. ఆయన చివరిదాకా స్వామీజీ పక్షంలోనే ఉన్నారు. 1950లో వరంగల్‌లో విశాలాంధ్ర మహాసభ జరిగింది. హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడాలనే తీర్మానాన్ని ఎం.ఎస్. ప్రవేశపెట్టారు. దాన్ని కోదాటి, కొమరగిరి, చంద్రవౌళిశ్వరరావులు బలపరిచారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

1952లో జరిగిన ఎన్నికలలో వరంగల్ జిల్లా నుంచి గెలుపొందిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు రాజలింగమే. వరంగల్‌లో ఒక తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటుచేసే బాధ్యతను వరంగల్ పట్టణ ప్రముఖులు ఎం.ఎస్‌కు అప్పగించారు. అది ఫలించి, పాఠశాల ప్రారంభోత్సవానికి అప్పటి విద్యాశాఖ మంత్రి మహమ్మద్ ఆజమ్ విచ్చేయనున్నారు. ఆ సమయంలో ఎం.ఎస్. కుమారుడు తీవ్ర జబ్బుతో బాధపడుతున్నాడు. అత్యవసర సేవలందించవలసిన సమయంలో ఎం.ఎస్. లేకపోవడం వలన అతడికి వైద్య సహాయం లభించలేదు. ఫలితంగా పిల్లవాడు అసువులు బాసాడు. కర్తవ్యం - కుమారుడు, మధ్య కర్తవ్యం గెలిచింది. నాటి నాయకుల దేశభక్తి అలాంటిది.

1946 చివరి వారంలో మహాత్మాగాంధీ హిందీ ప్రచార సభలలో పాల్గొనటానికి మద్రాసు వచ్చారు. ఆ సందర్భంలో తిరుగు ప్రయాణంలో గాంధీజీని డోర్నకల్, గుండ్రాతిమడుగు, ఖమ్మం, వరంగల్, మానుకోట, మంచిర్యాలలో ప్రయాణం చేయిస్తే జాతీయోద్యమానికి తెలంగాణలో బలం కలుగుతుందని నాయకులు భావించారు. ఆ బాధ్యత ఎం.ఎస్.పై ఉంచారు. గాంధీజీ పర్యటన వరంగల్‌లో ఒక మధురానుభూతి.

1951 ఎన్నికల అనంతరం బూర్గుల మంత్రివర్గంలో ఉపమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించారు. ఎం.ఎస్. సమైక్యవాది అయినా తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాల గురించి సమయం లభించినప్పుడల్లా గళమెత్తేవారు. వివిధ పత్రికలలో చాలా వ్యాసాలు రాశారు. బహుగ్రంథకర్తలు ఇటీవల తమ స్వీయచరిత్ర ప్రచురించారు. అది బహుళ జనాదరణ పొందింది.
 - జీ. వెంకటరామారావు

15, జనవరి 2012, ఆదివారం

Milestone Achieved!

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.'విశాలాంధ్రమహాసభ'  ఎన్నో అడ్డంకులను అధిగమించి డిసెంబర్ 29,2011న హైదరాబాద్ లో  'రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం' అనే అంశంపై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసినదే. 'విశాలాంధ్రమహాసభ' ప్రయత్నాన్ని విచ్చిన్నం చేయాలని విఫలయత్నం చేసి ఆతర్వాత అంతా రసాభస అయ్యిందని కొంతమంది పనిగట్టుగొని ప్రచారం చేసినా, రాష్ట్ర రాజధానిలో చాలా కాలం తర్వాత సమైక్యవాదం వినిపించడం సంతోషించదగ్గ పరిణామం. దౌర్జన్యంతో ఇతరుల భావవ్యక్తీకరణ స్వేచ్చను ఎప్పటికీ హరించగలుగుదామనుకోవడం మూర్కత్వమవుతుంది.


ఆ దినం జర్నలిజం ముసుగు తొడుక్కున్న కొంతమంది నోర్లను సమర్ధవంతంగా మూయించిన స్వాతంత్ర్యసమరయోధురాలు సుగుణమ్మగారికి అభినందనలు





My Telugu Roots.com : Visalandhra Mahasabha on December 29th achieved an important milestone. After months of setbacks, we've eventually achieved our goal of conducting an integrationist event in Hyderabad. It is the first of its kind.
When we asked for our right to freely express our opinion: the State government instead of coming to our rescue stifled our voices. The police have turned their back on us when we asked for protection. The "so-called" integrationists and community leaders of Hyderabad refused to come to our rescue as they felt expressing a point of view would be provocative. Our political parties and leaders said it is in VMS’ best interest that they don't stand by us as it would hurt our organization's image of an apolitical organization. When our venue was denied to us, as a last resort, when we approached the judiciary, the court system failed us. The High Court sided with the government and dismissed our most basic fundamental rights case. I was dumbfounded by the courts decision. The judiciary in our country lost course.
The essential ingredient for a free society to survive is people's ability to freely express their opinions. When a society cannot tolerate such freedoms, it gradually degenerates into a dictatorship, where only might will win.
The fight for integration is important. However, the fight for individual freedom is far more important. Alas, it is lost on the intellectuals of our state why we should stand for our fundamental rights, while risking fears of provocation. Every time you fear to freely speak your mind, the society moves one step closer to an autocracy. Need evidence? Look at how the separatist movement became violent as years went by. This has happened because integrationist voices decided to stay quiet.
VMS about a month ago lost trust in the judiciary process as the High Court kept on adjourning our petition week after week after week. We have decided to go ahead and conduct our event in a private venue instead of a government facility like the Jubilee Hall or Ravindra Bharathi. We’ve also decided not to give anything in writing to police seeking protection, as they will use it to deny our most basic rights. Technically, we did not need permission from the law enforcement to conduct an indoor event.
December 29th 2011 exhibition and media workshop was a phenomenal success. We had several freedom fighters from the Nizam region that rallied to our cause and dared to stand with our organization. They are Sri Narra Madhav Rao, Smt. Shakhamuri Suguna, Sri K.S. Mehaboob, Sri Laxman Rao, and Sri Naganna. The former two are also members of VMS executive committee.
As the session began, when Sri C. Anjaneya Reddy garu was speaking, a journalist kept on interfering demanding to name the five Chief Ministers from Telangana mentioned in our charts. Anjaneya Reddy garu insisted on allowing him to finish his speech and the answer will be given later. He eventually clarified that they are JVR, PVNR, MC, and TA. The reason for five is the two terms held by MC.
When Sri Narra Madhav Rao spoke, some of the journalists took exception to his comments and demanded an apology. 90 year old native Hyderabadi, Madhav Rao garu refused to apologize and with police intervention things returned to normalcy. Freedom fighter Suguna garu, despite her frail physical condition, took on the journalists head-on. She said, nobody can stop the event from happening that day. From that point on, the event went on smoothly. Professor and former Vice Chancellor R.V.R. Chandhra Shekhar Rao, MCPI leader Thandra Kumar and MCPI Secretary Marreddy Venkat Reddy spoke. After which Prabhakar garu did a powerpoint presentation. It was highlight of the day and his presentation was carried live on most TV channels and it was simply spectacular.
We’ve also put up an exhibition at the venue. In the lobby area we put a photo gallery of the violent activities that have happened during the course of this agitation. Some of the journalists pulled those charts down. We quickly put them back up.
The media workshop ended as planned at 2.00 PM.
Police came in around 2:30 PM and said they have protected us to the best of their ability throughout the day. In reciprocation, they requested us to conclude the exhibition early due to security concerns.  We took the exhibition down at 3:30 PM an hour and half earlier than planned. I now regret agreeing to end the exhibition early. The media completely distorted the story and declared the event was disrupted by the separatists.
Today, I am very proud of the Visalandhra Mahasabha team. There are too many names to mention. Our brave team has worked hard for weeks and never did their spirits wane. We stuck together through thick and thin. I am proud to be associated with such spectacular group of team players.
Our cause is noble, our fight is just. The fight for Telugu unity will go on.
Nalamotu Chakravarthy
President
Visalandhra Mahasabha

 


విభజన చరిత్రాత్మకంగా ఏమాత్రం సమంజసం కాదు తాటాకు చప్పుళ్లకు బెదరం… మాది ఎప్పటికీ సమైక్యవాదమే… మమ్మల్ని కొట్టినా, తిట్టినా దాడులు చేసినా వెనక్కు తగ్గేదే లేదని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ స్పష్టంచేశారు. 2012 సంవత్సరాన్ని విశాలాంధ్ర నామ సంవత్సరంగా ప్రకటించుకుందామని పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ‘రాష్ట్ర సమైక్యతను కాపాడుకుందాం’ అనే నినాదంతో విశాలాంధ్ర మహాసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో పాటు తెలంగాణలో కూడా లక్షలాది మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ వాదనలో సత్యం ఉంది కాబట్టే వేర్పాటు వాదులకు వినేందుకు ధైర్యం చాలక దాడులకు పూనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 30 ఏళ్లుగా పౌర హక్కులపై మాట్లాడుతున్న తమపై అనేకరకాల ఆరోపణలు, దాడులు జరుగుతున్నా బోగస్ హక్కుల సంఘాల నేతలు ఏమాత్రం స్పందించక పోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.
1956 నుంచి అన్ని రంగాల్లో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని వివరించారు. మాజీ పోలీసు ఉన్నతాధికారి సి.ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా సంస్కృతీ , సాంప్రదాయాలను కాపాడుకుంటూ రాష్ట్ర సమైక్యతకు పాటు పడాలని చెప్పారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధులు నర్రా మాధవరావు, శాఖమూరి సుగుణ, నాగయ్య, పత్తి శేషయ్య, ఎన్.లక్ష్మణ్‌రావు, పి. రామస్వామి, మహబూబ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు ఎన్. చక్రవర్తి, ఎంసీపీఐ నాయకులు ఎం. వెంకట్ రెడ్డి, తాండా కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి అబీద్ రసూల్ ఖాన్, ప్రొఫెసర్ ఆర్‌వీఆర్ చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విశాలాంధ్ర మహ సభ ముద్రించిన రాష్ట్ర సమైక్యతను కాపాడుకుందామనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.