25, జనవరి 2012, బుధవారం

ఎవరో మీకే తెలుసు!!

ఆంధ్రప్రభ : సత్యం, అహింస వంటి విలువల గురించి ప్రస్తావిస్తే చాలు, మనకు గాంధీజీ గుర్తుకు వస్తారు. అలాగే ఏకపత్నీ వ్రతం, పితృవాక్య పరిపాలన, పరస్త్రీ వ్యామోహం, అనుచిత ఆగ్రహం, దానశీలం, పాతివ్రత్యం చంచలత్వం వంటి గుణగుణాల్ని గురించి మాట్లాడుకుంటే పేర్లు పనిగట్టుకుని చెప్పకపోయినా ఏ పురాణ పురుషులు, స్త్రీలు జ్ఞాపకం వస్తారో తెలిసిందే. వర్తమానంలో కూడా కొందరు విశిష్ట లేదా విలక్షణ వ్యక్తులకూ ఈ సూత్రం వర్తిస్తుంది. అంటే, వాళ్లు (రాజకీయంతో సహా ఏ రంగానికి చెందినవారైనా సరే!) తమ గుణగణాల ద్వారానే ఎక్కువ ప్రసిద్ధులు. తాము సాధించిన సత్ఫలితాలో, దుష్పలితాలో.

విజయాలో, అపజయాలో, మాటలో చేతలో, వాటి మూలంగా కీర్తో అపకీర్తో సాధించి ఆ విధంగా అందరికీ తెలిసిన వాళ్లైపోతారు. అలా కొన్ని ప్రత్యేక లక్షణాల మూలంగా విశేష గుర్తింపు పొందిన రాజకీయ నేత ఒకరు మన రాష్ట్రంలో ఉన్నారు. ఆయన మాట -మౌనం, క్రియ -నిష్క్రియ పుట్టిన ఊరు, పెరిగిన తీరు, చదువు -సంధ్య, చుట్టాలు పట్టాలు, కుటుంబ మూలాలు, ఇంటి దూలాలు, తిట్లు, ఒట్లు, బెట్లు, గతంలో చేసిన వ్యాపారాలు, వ్యవహారాలు వ్యాఖ్యలు, వర్తమానంలో భాగ్యం -ఆరోగ్యం, ఇలా అదనీ ఇదనీ కాదు, తనకి సంబంధించిన సమస్తం అస్తమానూ ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకునే విషయాలైపోయాయి. పేరు చెప్పకపోయినా, కొన్నిగుణాలు విషయాలు ప్రస్తావిస్తే చాలు మనోఫలకాలమీద ఆయన సాక్షాత్కరించే స్థాయిలో సామాన్య ప్రజల అవగాహన ఉంది. పుట్టిన తేదీ, ఊరు, సహజ లక్షణాలు, తెచ్చిపెట్టుకున్న లక్షణాలు, ప్రవచిస్తున్న సిద్ధాంతాలు అలవాట్లు, వాపు, బలిమి, కలిమి, వంటి అందరికీ తెలిసిన వాటి గురించి చెప్పేసి, ఃఃఎవరో చెప్పుకోండిఃః అంటే అంత గొప్పగా ఉండదు. కాబట్టి కొందరికే గాని ఇంకా అందిరకీ పెద్దగా తెలియని వాటి గురించే చెప్పుకుందాం. ప్రధాన లక్షణాలని వదిలేద్దాం.

(1) మూలాల ప్రభావమే కావొచ్చు, ఆయనకి చాలామంది అపోహపడుతున్నట్లు ప్రాంతీయ దురభిమానం మనసులో చేతల్లో ఉండదని చెప్పడానికి కొన్ని నిదర్శనాలున్నాయి (అ) కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తనచేతిలో ఉన్న పదవుల్ని ఇతర ప్రాంతాల వారికే కట్టబెట్టేరు. (ఆ) ఆ ప్రాంతాలకి ప్రధానమైన, వరమైన, పోలవరం ప్రాజెక్టు ఃఃటెండర్ల వండర్లఃఃలో విశాల హృదయంతో, క్రియాశీలక (స్వ)లాభ దాయక పాత్ర పోషించేరు. (ఇ) స్వయంగా చేసిన యాగాల్లో స్థానికేతర రుత్విక్కులకే ఎక్కువ ప్రాధాన్యత నీయటమే కాదు, సంభావనలు కూడా అధికంగా చెల్లించారు. అందుకు స్థానిక పురోహితులు యాగస్థలంలో కోపాగ్నిని రగిలిస్తే లెక్కచేయలేదు. (ఉ) వాస్తు వైద్య సలహాలు సేవలు పొందటంలోనూ ప్రాంతీయాతీతంగానే వ్యవహరించారు. (ఊ) ఆయన విశాల హృదయం ఇరుగు ప్రాంతాలవారి పట్ల మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రాల ప్రజల బాగుకోసం కూడా తపించిందనుకోవడానికి, బాబ్లీ, ఆల్మట్టి ప్రాజెక్టుల విషయాల్లో, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కనుగుణంగా వ్యవహరించడాన్ని ఉదహరించాలి.

(2) కీలక సమయంలో ఃఃఫాంహౌస్‌ఃఃలో పండుకున్నాడని ఆరోపించేవాళ్లని నమ్మొద్దు -ఆ సమయంలో ఎంత అంతర్మధనానికి గురయ్యారో అర్థం చేసుకోకపోతే ఎలా ఃఃపులి స్వారీఃఃని సురక్షితంగా ఎలా విరమించుకోవాలో, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ హైకమాండ్‌ పైనుంచి అందించబోయే రక్షణ తాళ్లనందుకుని, పులివీపు మీదనుంచి, ప్రత్యామ్నాయ (విభజనేతర) పరిష్కారం చెట్టుమీదికి, ఎలా ఎగబాకాలో, తగు స్థాయి వారితో సంప్రదించాలంటే, అబిడ్స్‌ ప్రధాన పోస్టాఫీసు నుంచి కాల్‌ చేసి పబ్లిక్కుగా మాట్లాడటం కుదురుతుందా అలాగే రాంగ్‌రూటులో పోతున్న కారుని దారి మరల్చాలంటే, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏ సురక్షిత మలుపును ఎంచుకోవాలా అన్నదే కదా ఆయన ప్రస్తుత సమస్య -ఇవేమీ అర్థం చేసుకోకుండా, అడపాదడపా అజ్ఞాతంలోకి పోయినా, మౌన వ్రతం పట్టినా, ఆక్షేపించటం న్యాయం కాదు. ఫాంహౌస్‌లో ఉన్నప్పుడు అదుర్స్‌, దూకుడు వంటి సినిమాల్ని డి.వి.డిలో చూసి ఆనందిస్తారని కొద్దిమందికే తెలుసు! పాట సాయం జైబోలో తెలంగాణాకి దక్కింది సొమ్ముల సాయం కాదు.

(3) ఆయనకు స్వపర భేదాలు లేవు -ఇతర ప్రాంతాల ప్రజలను గంపగుత్తగా, రాక్షస సంతతి, దొంగలు, దోపిడీదారులు, మోసకారులు అని నిందిస్తారన్న దొక్కటే పరిగణనలో తీసుకుంటే ఎలా తన ఆధిపత్యాన్ని సంపూర్ణంగా అంగీకరించలేకపోతున్న సొంత ప్రాంత నేతల్ని కూడా ఃఃచవటలు, దద్దమ్మలు, ద్రోహులు, అటూ ఇటూ కానోళ్లు, అని ఒక్కోసారి ఇంకా ఘాటుగా ఃమై సన్స్‌ః ఃయువర్‌ మదర్‌ః వంటి ఆంగ్ల పద ద్వయాలు యొక్క ముతకానువాద తెలుగుపదాలతో సత్కరించటం లేదా?

(4) ఎవరోలా రెండెకరాల కుటుంబంలో పుట్టలేదు. ఎన్నో ఎకరాలలో విస్తరించిన సొంత ఇల్లు ఉన్నవాణ్ణి అని దైర్యంగా ప్రకటించారాయన -ఇంకెవరో అంటున్నట్లు నిజంగా 50 వేల కోట్లు సంపాదించి ఉంటే సరైన సమయం వచ్చినప్పుడు ఆ సంగతీ నిర్భయంగా చెప్పేస్తారు! సున్నాలను ముట్టుకోకుండా మొదటి అంకె ఐదు బదులు రెండు ఉండాలో ఏడు ఉండాలో ప్రకటించేస్తారు. ఈ లోగా మనం కాకి లెక్కలు వేసుకోవటం అనవసరం. 

(5) వసూళ్లు లేకుండా ఏ ఉద్యమం జరిగింది ఈ ప్రపంచంలో ఈ ప్రశ్న ఆయనకాదు గాని కుటుంబ సభ్యులు, అనుయాయులు ఇప్పటికే లేచి, పరోక్షంగా కొంత నిజాన్ని ఒప్పుకున్నారు గదా -ఎవరు, ఎంత, సొమ్ములిచ్చారో ఎలా సహకరించారో అంతా బట్ట బయలుచేసేస్తే, పరువుపోయేది, ఇతర ప్రాంతాలకు చెందిన పారిశ్రామిక సినిమా, మీడియా, రియల్‌ ఎస్టేట్‌ వర్గాలదే! అందుకే ఆ వివరాలు చెప్పటంలేదు -ఈ నేపథ్యంలో జమాఖర్చు -మిగులు లెక్కలు అడగటం ధర్మం కానేకాదు -సభ్యత అసలే కాదు-

(6) ఆయనను క్షమాగుణం కూడా ఎక్కువే! ఏదో ఒకసారి మూడ్‌ బాగోక, అలవాటైన రీతిలో చనువుగా మందలిస్తే, ఒక దళిత నాయకుడు నన్ను పలానా అశ్లీల పదంతో (ల గుణింతంలోది లెండి!) అచ్చతెలుగులో తిట్టేడని బయటికొచ్చి టీవీల సాక్షిగా నానాయాగీ చేసినా, కొన్నాళ్ల తర్వాత మళ్లీ పార్టీ లోకి తీసుకుని పెద్ద పదవినిచ్చేరాయన -ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఃఃచెయ్యిచ్చినఃః ఎమ్మెల్యేలకూ త్వరలోనే క్షమాభిక్ష ప్రసాదించారు. అంతేనా, తనని ఎంతో పరుషంగా తిట్టిన వాళ్లనెందరినో అక్కున చేర్చుకున్న ఉదాహరణలు పెక్కు-

(7) పితృవాత్సల్యం ఆయన సుగుణాల్లో ఒకటి -కుటుంబ సభ్యుల్ని ప్రేమించనివాడు, వాళ్లను పైకి తీసుకురాని వాడు, ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ఉద్ధరించలేడు.

(8) ఆయనకి దూరదృష్టి కూడా మిక్కుటం -అందుకే ఃఃఇక్కడ పుట్టినోళ్లంతా మావోళ్లేఃః అనేశారు ఉదారంగా -తగిన సమయం వచ్చినప్పుడు తెలుగువాళ్లంతా, ఆ మాటకొస్తే భారతీయులంతా ఒక్కటే అంటారు. భారత రాజ్యాంగం గురించి ఆయనకు తెలియదనుకోవద్దు -బుడ్డిపేట బుల్లోడు అని ఎద్దేవా చేయరాదు.

(9) ఏదో అవసరార్థం, నేడు ఎన్ని వితండ వాదాలు వినిపిస్తున్నా విపరీత వ్యాఖ్యలు చేస్తున్నా, ఇదంతా ప్రజలు అంతిమంగా జ్ఞానోదయం పొందడానికి, నిజాన్ని గ్రహించడానికి చేసే ఒక వినూత్న నకారాత్మక ప్రక్రియలో భాగంగా అర్థం చేసుకోవాలి. పూర్వం నాస్తికులను లేదా సంశయాత్ములను ఆస్తికులుగా మార్చడానికి కొందరు రుషులు ఇలాంటి విధానాన్నే అవలంబించేవారట. దైవదూషణ ఏవగింపు కలిగే స్థాయిలో చేసేవారట. అందరికీ తెలిసిన నిజాల్ని ఖండించేవారట. అబద్ధాలు అలవోకగా చెప్పేవారట. అదే రీతిలో మనజాతి, రీతి, నీతి, సంస్కృతి, వేషభాషలు, ఆఖరికి దేవుళ్లు, దేవతలు అన్నీ లేరనే సిద్ధాంతాన్ని ప్రచారం చేయటంలో ఆయన అంతిమధ్యేయం, ఇదో పిచ్చిరాద్ధాంతమని ప్రజలే తెలుసుకుంటారన్నదే మార్గం ఏదైతేనేం, అంతిమ ఫలితం ముఖ్యం కదా.

ప్రధాన వివరాలు, గుణగణాలు వదిలేసినా పైన చెప్పిన క్లూలతో పేరు చెప్పక పోయినా ఈ ప్రముఖుడెవరో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అందరికీ కరెక్టు ఆన్సరే వస్తుంది. కాబట్టి నగదు బహుమతి ఏదీ ఉండదు. కాదంటే అనంతం అమూల్యమైన తెలుగుతల్లి దీవెనలు లభిస్తాయి వచ్చేవారం ఇంకో విషయంపై వ్యాసం ఉంటుంది గాని కరెక్టు ఆన్సర్‌ ప్రకటించబడదు.

చేగొండి రామజోగయ్య
(వ్యాసకర్త విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు)

23, జనవరి 2012, సోమవారం

ఎం.ఎస్. రాజలింగం అమర్ రహే!

 స్వాతంత్య్రసమరయోధుడు, రాష్ట్ర మాజీ మంత్రి, అలనాటి 'విశాలాంధ్ర మహాసభ'లో ప్రముఖ పాత్ర పోషించిన శ్రీ ఎంఎస్ రాజలింగం గారు సోమవారం ఉదయం మృతి చెందారు.ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం- విశాలాంధ్ర మహాసభ 


కలసి ఉన్నా.. విడిపోయనా.. విద్వేషం వద్దు : ఎం ఎస్ రాజలింగం ( ఆంధ్రభూమి, మే 28,2010)  

కాకతీయ సామ్రాజ్యం ఆంధ్రలోకానికి ఎన్నో పాఠాలు నేర్పింది. సామ్రాజ్య చరిత్రలో విజయంగురించి ఎంత ఘనంగా చెప్పుకున్నామో ఓటనిని గూర్చి కూడా చెప్పుకొని అంత మిక్కుటంగా బాధపడ్డాము. కాకతీయుల చరిత్రలో విజయం, పరాజయం ఒకరి సొత్తుకాదని అది దైవ నిర్ణయంపై ఆధారపడినదని అనుభవము చెప్పుచున్నది. శైవ, వైష్ణవ సాంప్రదాయాల ఘర్షణలు, రెడ్డి, వెలమ పరస్పర వైషమ్యాలు సామ్రాజ్యాన్ని కూల ద్రోశాయి. ఓరుగల్లు, కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకొని గర్వించడం మాత్రమే మనకు మిగిలింది. చరిత్ర పుటలు త్రిప్పినప్పుడు సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు ఓరుగల్లు ప్రాశస్త్యమును గూర్చి చెప్పినప్పుడు గర్వించని సన్నివేశము లేదు. ఆంధ్ర విద్యాభివర్థనీ సంఘానికి ఉదయరాజు రాజేశ్వరరావు అధ్యక్షులుగాను , నేను కార్యదర్శిగానూ పనిచేశాము. చందా కాంతయ్యఆర్థిక సహాయముతో సంస్థ ఏర్పడ్డది. ఈ సంస్థ ద్వారా ఎ.వి. హైస్కూలు ప్రారంభించబడి క్రమాభివృద్ధి చెందింది. 1950లో ఎ.వి. హైస్కూలు ఉత్సవాలలో బూర్గుల రామకృష్ణారావు చారిత్రకప్రాధాన్యం ఉన్న ఓరుగల్లు ఆంధ్రప్రదేశ్‌కు రాజధానికాక తప్పదని అన్నారు.ఫజల్ ఆలీ కమీషన్ వచ్చిన రోజులలో నీటి వసతి లేని కారణంగా ఓరుగల్లు రాజధానిగా సూచించుటకు వెనకా, ముందు అయినాము. 1949-50 సంవత్సరంలో విశాలాంధ్ర మహాసభ ఓరుగల్లులో శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారి అధ్యక్షతన జరిగింది. నేను, ఒరిస్సా ప్రాంతమునకు చెందిన ప్రకాశ్ చంద్ర శతపథి కార్యదర్శిలుగా ఉన్నాము. తెలంగాణ నుంచి రామానంద తీర్థ స్వామి, బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, కోదాటి, కాళోజీ, ప్రభృతులు పాల్గొన్నారు. ఆ సమయంలో , చందా కాంతయ్య ఆంధ్రుల ఆధిపత్యమును గూర్చి తెలంగాణ వారికి భయం ఉందన్నారు. ఈ విషయం ఆనాటి మహాసభకు హాజరైన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, వావివాల, మాదల వీరభద్రరావు లాంటి పెద్దలకు తెలియజెప్పడం జరిగింది. ఆంధ్రకేసరి శ్రీ ప్రకాశం పంతులు‘‘ నేను బ్రతికుండగా మీకు అన్యాయం జరుగుతుందా?’’ అని ప్రశ్నించారు. దానితో ఆ సమస్య అప్పుడు సమసిపోయింది. 

విశాలాంధ్ర మహాసభ హైద్రాబాద్‌రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇరు పక్షాలకి భిన్న విశ్వాసాలు ఉన్నా మనసా, వాచా, కర్మణా ఎవరి విశ్వాసాలను వారు ప్రజలవద్దకు తీసుకువెళ్ళారు. పరస్పర దూషణలు, దెబ్బలాటలు లేకుండా ఎవరి భావాలను వారు సభల ద్వారానూ, పత్రికల ద్వారానూ ప్రచారం చేసుకున్నారు. కాని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంవారు ఇరువురూ ఒకరి ప్రాంతానికి మరొకరు రాకూడదని పొరపాటున కూడా అనలేదు.ఆరోజులలోనే ఇల్లెందులో గ్రంథాలయ మహాసభ జరిగింది. ఆ మహాసభకి సురవరం ప్రతాపరెడ్డి (గోల్కొండ పత్రికాధిపతి)గడియారం రామకృష్ణ శర్మ, వానమాముల వరదాచార్యులు, కాళోజీనారాయణరావు, కాళోజీ రామేశ్వరరావు ప్రభృతులు హాజరయ్యారు. ఆ మహాసభలో ఆంధ్రమాత, తెలుగుతల్లి కీర్తనలు ప్రతిధ్వనించాయ..... ప్రాంతీయ భావాలు, విడిపోవాలనే ధోరణులు ఎక్కడా కనపడలేదు. ఇరు ప్రాంతాల వారు కలిసి ఉండాలనే సమైక్యభావములు చల్లపల్లి వెంకటశాస్ర్తీ, దాశరథి రంగాచార్యుల కలాలలో అక్షర రూపం దాల్చాయి. 1946లో ఆంధ్ర సారస్వత పరిషత్ మహాసభ ఓరుగల్లు లో జరిగింది. అక్కడ ఆంధ్ర, తెలంణ కవుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంలో జాతీయ వ్యతిరేక శక్తులు విచక్షణా రహితంగా నా (ఈ రచయిత) పై దాడి చేశాయ. దెబ్బలు తగిలినవి. ఈ విషయం మహాత్మా గాంధీకి తెలిపాము. గాంధీ- అహింసతో మీరు ఈ ఉద్యమాన్ని ఎదుర్కొన్నారు. సర్‌మీర్జా ఇస్మాయిల్ త్వరలో హద్రాబాద్ రాష్ట్రానికి ప్రధానిగా వస్తున్నారు. మీరు తొందరపడవద్ద-ని సందేశాన్ని పంపారు.. ఓరుగల్లు కోటలో జాతీయ జెండా ఎగురవేయబడ్డది. ఆ సందర్భంలో జాతీయ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ కార్యకర్త, బలహీన వర్గాలకు చెందిన బత్తిని మొగలయ్యను బహిరంగంగా బల్లెంతో పొడిచి, చంపిరు. ఇట్టి పరిస్థితులలో హంతకుడు కర్నూలులో ఉన్నాడని తెలిసి, ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ఆ నిందితతుని తరలింపునకు వారంట్ ఇప్పించాఠు. ఆంధ్ర, తెలంగాణ భాషలో యాస వేరైనా అందరి సంస్కృతి ఒక్కటే అని గుర్తించి వ్యవహరించిన రోజులవి. ఇలాంటి ఘట్టాలలో ఆంధ్రా, తెలంగాణ వాదులు ఎవరైనా, వాచా, మనసా, కర్మణా, మానవతా దృష్టితో మాత్రమే వ్యవహరించినందువల్లనే చిక్కులూ విభేదాలు ఆనాడు అవుపడలేదు.ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ నాయకుల ఆలోచనలలోని ఆంతర్యము తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. రాజకీయ పరిశీలకులు, గత అనుభవాలు, 50 సంవత్సరాలకు పైగా చూచినవారికి ఈ ఉద్యమాలన్నీ ప్రజలకు దూరం అవుతున్నాయేమో అనిపిస్తున్నది. కాని ఉద్యమ నిర్వాహకులు మాత్రం ప్రజలకు చాలా సన్నిహితంగా ఉన్నామనే భావనలో ఉన్నారు. 

సైద్ధాంతిక విభేదాలు తీవ్రంగా ఉన్న రోజులలో కూడా పరస్పరంగా వారివారి సిద్ధాంతాలను ప్రచారం చేసుకున్నారు గాని ఒక పార్టీవారు మరొక పార్టీవారిని తమ ఊరిలోకి రాకూడదని ఎవరూ శాసించలేదు. ఇప్పుడు ఈ హక్కు కేవలం ప్రొఫెసర్ కోదండరాంకే ఉన్నట్లుగా కనపడుచున్నది. సర్వదేవభట్ల రామనాథం సిసలైన కమ్యూనిస్టు నాయకులు. ఆస్తినంతా కమ్యూనిస్టు ఉద్యమానికి ధారపోసిన మహా వ్యక్తి. వారితో 1952 సార్వత్రిక ఎన్నికలో శాసనసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయవలసి వచ్చింది. ఎన్నడూ ద్వేషపూరిత స్వార్ధపూరిత వాతావరణం కనిపించలేదు. పార్టీ ప్రతిష్ఠ, సంస్థల ప్రతిష్ఠలు మాత్రమే ప్రాధాన్యత వహించేది. ఆనాటి నాయకులుగాని, కార్యకర్తలుగాని ఆలోచించేది, చెప్పేది, చేసేది ఒకటిగా ఉండేది. ఆ కారణంగా వైరుధ్యాలు ఉన్న దశలో కూడా పరస్పర విశ్వాసము ఉండేది. సభలు, సమావేశాలు ఉధృతంగా జరిగినాయి. మేము కాంగ్రెస్ వారము, కమ్యూనిస్టులు ఒక టేబుల్ వద్ద కూర్చొని భోజనంచేశాము. ఇది ఆనాటి విద్యాలయాలు గురువులు అభ్యసింపచేసిన పాఠాలు. కాని దీనికి భిన్నంగా ‘‘నేడు విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, అధినేతలు కొందరు వ్యవహరించడం చాలా బాధాకరంగా ఉంది.చిల్లంచర్లలో 1957లో శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థినైన నాకు, కమ్యూనిస్టు అభ్యర్థి గోపాలరావుకు పోటీ జరిగింది. చెట్లముప్పారం గ్రామంలో గోపాలరావు అనుయాయులు మమ్ములను మీటింగ్ పెట్టుకోనివ్వలేదు. ఉద్రిక్త వాతావరణంలో మా కార్యకర్త శ్రీనివాసరావును ముక్కుపై వేటువేస్తే సగం ముక్కు తెగింది. నేను గోపాలరావు వద్దకు వెళ్ళి ఇదేమిటని అడిగా, అతను చాలా బాధపడ్డాడు. అతను ముందుండి మా సమావేశం నడిపాడు. ఆ తరువాత వారి సమావేశం జరిగింది. రెండోరోజు గోపాలరావు నన్ను భోజనానికి పిలిచాడు. వైద్య చికిత్సకు కూడా ఇరువురు కలిసివెళ్ళాం. నిజాం ప్రభుత్వం చేసిన అన్యాయాలను ఎదిరించవలసివస్తే అందరూ కలిసి నిర్వహించే కార్యక్రమాన్ని తలపెట్టి నిర్వహించేవారు. 

తెలంగాణ పోరాటం నిర్వహించిన కమ్యూనిస్టు అగ్రనాయకుడు రావి నారాయణరెడ్డి, పోరాటాన్ని ఒక దశలో కాంగ్రెస్ తరపున నడిపిన రేపాల క్యాంప్ అధినేత కోదాటి నారాయణరావు కలిసి కూర్చొని సమీక్షించుకొని తప్పులు దిద్దుకోవటం జరిగేది. వారిరువురి సిద్ధాంతాలకు అఘాతం లేకుండా చూచుకునేవారు. ఇలాంటి వివిధ ఘట్టాలలో కూడా , ఈ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి రావద్దని కాని, ఆ ప్రాంతం వారు ఈ ప్రాంతమునకు రావద్దని కాని ఆంక్షలు విధించిన నాయకులు ఆ రోజులు వేరు. ఆ కీర్తి ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాంవంటి వారికే దక్కింది. బహిష్కరణ ఉద్యమాలు ఎవరు ఎప్పుడు ఏ కారణంవల్ల తలపెట్టినా అందలిలోపాలను అందుకు భిన్నమైన పార్టీలు చూపటం సహజం, సమంజసం. సభలు, సమావేశాలు చేసుకొని ఆ కార్యక్రమంలో ఉన్న లోపాలను ప్రజలకు చెప్పి తమవైపు ఆకట్టుకోవడం న్యాయం. అదే ప్రస్తుతం జై ఆంధ్ర, జై తెలంగాణా నాయకులు చేయవలసిన పని. మృదువైన తీయని మాటలతో, ప్రేమ పూర్వకమైన చర్యలు దేశ సౌభాగ్యానికి ఎంతేని తోడ్పడతాయి. గతంలో ఉద్రిక్త వాతావరణంలో ఆనాటి నాయకులు ఎలా వ్యవహరించారో తెలుసుకొని వారిని ఆదర్శంగా భావించి వారి అడుగుజాడలలో నడువాలని ఆ విధంగా జాతీయ ఐక్యతకు, అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజలు నారుూ కోరికను మన్నిస్తారని ఆశిస్తాను. ప్రాంతీయ బహిష్కరణ ఉద్యమాలను ఎవరు చేసినా , ఎప్పుడు చేసినా, ఎందుకు చేసినా వాటిని తెలంగాణ ప్రజలు బహిష్కరించాలి.

ఆంధ్రభూమి పత్రికకు రాసిన మరో వ్యాసం లో రాజలింగం గారు నిజాం పరిపాలనా కాలం లో పత్రికా స్వాతంత్ర్యం మరియు ఇతర పరిస్థితులను గురించి వివరించారు. 

1935లో నేను బి.ఎస్‌సి చదువుకోవడానికి నిజాం కాలేజీలో చేరాను. ఆనాటి విద్యార్థి ఉద్యమాలకి నాయకత్వం వహించానని చెప్పవచ్చు. ఆరోజుల్లో గోల్కొండ పత్రిక (తెలుగు) హైదరాబాద్ బులెటిన్ (ఇంగ్లీషు), డెక్కన్‌క్రానికల్ (ఇంగ్లీష్) ఉండేవి. ఈ పత్రికల్లో ప్రజా చైతన్యానికి సంబంధించి చైతన్యవంతులను చేసే ఏ కార్యక్రమమైన అంత తేలిగ్గా ప్రచురింపబడేవి కావు. ఆరోజుల్లో వాక్‌స్వాతంత్య్రం, పత్రిక స్వాతంత్య్రం, ఏవిధమైన న్యాయ సంబంధమైన హక్కులు ఉండేవికావు.

సికింద్రాబాద్‌లో ఒక మూల దివ్యవాణి అనే చిన్న పత్రిక ఉండేది. అది వారపత్రికో, మాసపత్రికో గుర్తులేదు. చివుకుల అప్పయ్యశాస్ర్తీ దానికి సంపాదకులుగా ఉండేవారు. వారు ఒకరుమాత్రం మేము విద్యార్థి సంఘం నుంచి పోగానే ‘‘నాయనా పిల్లలు మీరు వచ్చారు మీటింగ్ వివరాలు ప్రచురించడం నావల్లకాదు. కానీ చివరిపేజీలో మీ మీటింగ్ జరిగిందని, ఫలానావారి అధ్యక్షతన జరిగిందని వేస్తాననేవాడు. అప్పటికదే పెద్ద వరంగా ఉండేది. 1938లో మేము ‘ఆంధ్ర సారస్వత సంచిక’ తీయాలనుకున్నాం. ఆనాటి నిజాం కాలేజి అధ్యాపకులు సరిపల్లి విశ్వనాథశాస్ర్తీ, కురుగంటి సీతారామయ్య తగు ప్రోత్సాహం ఇచ్చేవారు. వారి ప్రోత్సాహంతోనే విద్యార్థి సంచిక తీయాలనుకున్నాం. కానీ మా ప్రిన్సిపాల్ టర్నరు. (The word Andhra has political significance) ఆంధ్ర అనే శబ్దం రాజకీయ ప్రాముఖ్యత కలిగింది. దానికి బదులు మీరు తెలుగు అనే పదం వాడి తెలుగు సారస్వత సంచిక అనే సంచికగా తీయమన్నారు. దాన్ని ఉల్లంఘించాము. ఈ పత్రిక అచ్చువేసిన బుచ్చయ్యలింగశాస్ర్తీని పోలీసువారు నిర్బంధించదలిచారు. కానీ ఆయన నెత్తిపై ఉన్న రుద్రాక్ష కిరీటం, చేతికి ఉన్న రుద్రాక్షదండలు మెడలో ఉన్న రుద్రాక్ష మాలలు విభూతిరేఖలు చూసి వచ్చిన పోలీసు ‘‘అయ్యా మీరెందుకు ఈ గొడవలో పడుతున్నారు. మీరెందుకు ఈ పత్రిక అచ్చువేసారు’’ అని అడిగారు. దానికి బుచ్చయ్యలింగ శాస్ర్తీ ‘‘పోరగాండ్లు వచ్చిండ్రు నేను అచ్చేసిన. దాంట్లో ఏముంది నాకు తెలియదు. ఇక మీ ఇష్టం పట్టుకెలితే పట్టుకెళ్లండి. ఆ జైళ్లోనే కూర్చుని తీరిగ్గా 24 గం.లు శివపూజ- చేసుకుంటా’’ అన్నారు. ఆయన అమాయకత్వం మమ్మల్ని రక్షించింది. ఈ రెండు ఘట్టాల్లోని ముఖ్యోద్దేశం సనాతన ధర్మసంస్థలు తెలిసో తెలియకో పత్రికా స్వాతంత్య్ర పరిరక్షణకై కొంత తోడ్పడ్డాయని చెప్పడం. మరొక ఘట్టంతో పత్రికా స్వేచ్ఛ ఎంతగా ఉండేదో తెలుస్తుంది. మేము వరంగల్ హైస్కూలులో వున్నపుడు 1933-36 ‘వ్యాసలత’ అనే చిన్న మాసపత్రిక తీసేవాళ్లం. అందులో రజస్వలానంతర వివాహం చేయాలి అని మా మిత్రుడు లక్కినేని నర్సయ్య వ్రాసాడు. అతనిని పోలీసులు పట్టుకెళ్లారు. విద్యార్థులు పోలీసుని నిలదీసి అడిగితే ఇది నేడు చిన్న విషయం, రేపు నిజాం తఖ్త్ (సింహాసనం)ని ఉల్టా (తలకిందులు) చేస్తుంది అని అన్నాడు. ఈ భూమికలోనే మరికొన్ని ప్రాథమిక హక్కులు ఏవిధంగా దెబ్బతిన్నవో చెప్పడం అవసరం. ఉర్దూ రాజభాష అయింది. బ్రిటిష్‌వారు భారతదేశంలో ఏవిధంగా వారికి అనుకూలించిన దాస్య ప్రవృత్తిగల మంత్రాంగాన్ని మనుషుల్ని సృష్టించారో అదేవిధంగా ఉర్దూను రాజభాషగా పాలకవర్గం వారు ఉపయోగించారు. ప్రాథమిక పాఠశాల సైతం అనుమతి లేనిదే పెట్టకూడదని ఒక సర్క్యులర్ జారీచేసింది. 1929లో లార్డ్‌ఇర్విన్ ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినప్పుడు ఈ క్రిందివిధంగా ఉపన్యసించాడు. "It will be the fast of a mature statemenship so as to shape the policy of Osmania University so that it may have as strong apeal to the Hindus as to the Mohamadans subjects of your state.'' ఈ విధంగా ఉర్దూ భాష పేరిట మతఛాందసాన్ని ప్రభుత్వం పెంచింది. వారికి కీలక స్థానాల్లో ఉద్యోగాలనిచ్చింది. ఉద్యోగాలకి అర్హత కలిగినవారు ముస్లింల్లో లేకపోతేను ఉత్తరప్రదేశ్‌నుంచి ముస్లింలను పిలిచి ఉద్యోగాలిచ్చారు. ‘‘ఇత్తెహాదుల్ ముసల్మీన్’’ సంస్థ 1936లో స్థాపించబడి మతం మార్పిడిని ప్రభుత్వ సహకారంతో చేయడానికి పూనుకుంది. 18,000 హరిజనులను ఒక్క బహదూర్‌యార్‌జంగ్ ముస్లింలుగా మార్చగలిగాడు. ఆఫీసర్లు వెట్టిచాకిరికి పూనుకున్నారు. ఒక దశలో వెట్టిచాకిరి చేయించుకోలేని ఆఫీసర్లను, జాగీర్‌దారీ, వతన్‌దార్లను అసమర్ధులుగా ప్రభుత్వం చూపింది. ఇలాటి దుశ్చర్యలవల్ల బాధపడిన ఆంధ్రులు 1920లో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ పేరిట ఆంధ్ర మహాసభను ఏర్పాటుచేసారు. తద్వార గ్రంథాలయాలు స్థాపించి వెట్టిచాకిరీ నిర్మూలనకు, రైతు సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు లేవదీసారు. ఈ ఉద్యమాల తాకిడివల్ల నైతేనేమి, భారతదేశంలో రాజకీయంగా వస్తున్న మార్పులవల్లనైతేనేమి రాజ్యాంగ సంస్కరణలు అవసరమని ప్రభుత్వం భావించింది. అయ్యంగార్ కమిటీ 1939లో ఏర్పాటైంది. 132 స్థానాలు హైదరాబాద్ శాసనసభలో ఉండేటట్లు దానిలో 76గురు ఎన్నుకోబడేటట్లు సంస్కరణలు సూచించబడ్డాయి. జిన్నా సూచనపై Functional Representation (వృత్తిపరమైన ప్రాతినిధ్యం) ఇవ్వబడింది. రైతులకు, ఇండ్ల యజమానులకు, కిరాయిదారులకు, జాగీరుదారులకు, కూలీలకు, డాక్టర్లకు వకీళ్లు వ్యాపారస్తులు ఇత్యాది వృత్తులవారికి ఇవ్వబడింది. 51% ఓట్లు వస్తే వారు గెలిచినట్టు లెక్క. పై 76 సీట్లుకాక 56 మందిని ప్రభుత్వం నామినేట్ చేయ నిశ్చయించింది. ఈవిధంగా ఆందోళన జరుగుతున్న రోజులలో 1941లో వ్యక్తి సత్యాగ్రహం జరిగింది.

వ్యక్తి సత్యాగ్రహం తరువాత 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌వారు భాగస్వాములయ్యారు. బార్డర్ క్యాంపులు పెట్టి కాంగ్రెస్‌వారికి శిక్షణ ఇచ్చి నిజాం వ్యతిరేక పోరాటం క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్‌వారు చేశారు. కమ్యూనిస్టులు ప్రజాయుద్ధం అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉన్నారు. బహదూర్‌యార్‌జంగ్ ఆనాటి హైదరాబాద్‌కు తోడు బీహార్, ఉత్తర సర్కార్‌లు కలుపుకొని ఒక స్వతంత్ర ముస్లిం రాజ్యంగా ఏర్పడాలని కోరాడు. నిజాం వరల్డ్ ముస్లిం ఫెడరేషన్‌కి హైదరాబాద్ కేంద్రంగా ఉండాలని కోరుకున్నాడు. దీనిలో బహదూర్‌యార్‌జంగ్ ప్రముఖ పాత్ర వహించాడు. 1942నుంచి 1946 వరకు తెలంగాణ కమ్యూనిస్టు సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ ఆశయాల కనుగుణంగా జరిగాయి. 1946లో స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యాన బిందు అధ్యక్షతన కాంగ్రెస్ రాష్ట్ర కార్యాచరణ సంఘం ఏర్పడింది. సత్యాగ్రహాలు, సాయుధ పోరాటాలు నిజాంకి వ్యతిరేకంగా జరిగాయి. పరిటాల లాంటి కొన్ని గ్రామాలు రిపబ్లిక్‌గా ప్రకటించుకొనబడ్డాయి. ఈవిధంగా జరిగిన పోరాటాల ఫలితంగా 17.09.1949న నిజాం ప్రభువు, రజాకార్లు భారత ప్రభుత్వానికి లొంగిపోయారు.

 
మరపురాని ధన్యజీవి,ఆంధ్రభూమి సంపాదకీయ పేజీ: ‘ఆరని నీటికొలనక్కట పూచిన తమ్మికన్, విధి ప్రేరణ రాలిపోయినవి, రేకులు తొంబది తొమ్మిది! అన్నట్లుగా కురువృద్ధుల్ గురువృద్ధబాంధవులలో ఒక్కొక్కరే తనువు చాలిస్తున్నారు. నిన్నటిరోజు కన్నుమూసిన ఎం.ఎస్.రాజలింగంఅటువంటి చరితార్థులలో ఒకరు. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం ఒక ఆరని నీటి కొలను. అందులో శతపత్ర పరంపర నిర్నిద్రంగా ప్రభవించింది. జాతీయోద్యమం నాటికీ ఆ పరంపర జాతికి నాయకశ్రేణిగా మారి పతన స్థితిలో ఉన్న జాతి జనులకు ఆత్మగౌరవం కల్పించి ధర్మంకోసం పోరాటం నేర్పింది. వారి కృషి ఫలితమే నేటి, మన రాష్ట్రం. ఆ నిర్మాతలలో నిస్సందేహంగా ఎం.ఎస్.రాజలింగం ఒకరు.

రాజలింగం 1919 ఫిబ్రవరి 9వ తేదీన వరంగల్‌లో జన్మించారు. అక్కడే మెట్రిక్ పాసయ్యారు. నిజాం కళాశాలలో బిఎస్సీ చేసి ఉస్మానియాలో ఎల్.ఎల్.బి. చేశారు. విద్యార్థి దశనుండే రాజకీయాలలో పాల్గొనేవారు. అవి సాహిత్యరూపంలో ఉండేవి. సాధనా సమితిలో చేరి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. కానీ చదువు పూర్తి అయ్యేనాటికి ఆయన మీద పోలీసు నిఘా తీవ్రమై రాష్ట్రం విడచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. పిట్టల వాని వేషంలో స్టేటు వదలి వార్థా చేరుకున్నారు. గ్రామీణ విద్యాలయంలో జె.సి. కుమారప్ప ఆధ్వర్యంలో గ్రామ పరిశ్రమణ శిక్షణ పొందారు. సేవాగ్రాంలో ఆశ్రమ మేనేజరుతో ఏర్పడిన విభేదాల కారణంగా గాంధీజీ, కస్తూరిబా, రాజాజీ వద్దని చెప్పగా సేవాగ్రాం వదలి వచ్చారు. మొదటినుంచి ఆయనది ఒకరికి లొంగి ఉండే తత్వం కాదు.

ఆ తరువాత కరీంనగరు జిల్లాలోని ముస్తాబాద్ గ్రామంలో 1941లో గ్రామీణ కార్యక్రమాలను ప్రారంభించారు. నిజాం రాష్ట్రంలో మొట్టమొదటి చరఖా సంఘం ఏర్పాటుచేసారు. 1942-43లో క్విట్ ఇండి యా ఉద్యమ సందర్భంగా ఎం.ఎస్.ఆర్ అరెస్టయ్యారు. 1944లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షిక సభలకోసం వేసిన పందిళ్లను దుండగులు తగలబెట్టారు. ఎంఎస్ ధైర్యంగా తిరిగి కొత్త పందిళ్ళు వేయించారు. కవి సమ్మేళనం దిగ్విజయంగా జరిగింది. 1946లో ఓరుగల్లు కోటలో జెండా వందనం జరిగింది. జాతీయ విద్రోహశక్తులు మొగలయ్యను హత్య చేశారు. ఆ వార్తను జాతీయ పత్రికలు ప్రచురించే ఏర్పాటుచేసిన ఎం.ఎస్. రాజలింగంను వరంగల్ జిల్లా నుంచి మూడు నెలలు బహిష్కరించింది ప్రభుత్వం. వరంగల్ జైలు నుంచి ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. స్టేటు కాంగ్రెస్ రెండుగా చీలినప్పుడు ఎం.ఎస్.రాజలింగం ఎంతో బాధపడ్డారు. ఆయన చివరిదాకా స్వామీజీ పక్షంలోనే ఉన్నారు. 1950లో వరంగల్‌లో విశాలాంధ్ర మహాసభ జరిగింది. హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడాలనే తీర్మానాన్ని ఎం.ఎస్. ప్రవేశపెట్టారు. దాన్ని కోదాటి, కొమరగిరి, చంద్రవౌళిశ్వరరావులు బలపరిచారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

1952లో జరిగిన ఎన్నికలలో వరంగల్ జిల్లా నుంచి గెలుపొందిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు రాజలింగమే. వరంగల్‌లో ఒక తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటుచేసే బాధ్యతను వరంగల్ పట్టణ ప్రముఖులు ఎం.ఎస్‌కు అప్పగించారు. అది ఫలించి, పాఠశాల ప్రారంభోత్సవానికి అప్పటి విద్యాశాఖ మంత్రి మహమ్మద్ ఆజమ్ విచ్చేయనున్నారు. ఆ సమయంలో ఎం.ఎస్. కుమారుడు తీవ్ర జబ్బుతో బాధపడుతున్నాడు. అత్యవసర సేవలందించవలసిన సమయంలో ఎం.ఎస్. లేకపోవడం వలన అతడికి వైద్య సహాయం లభించలేదు. ఫలితంగా పిల్లవాడు అసువులు బాసాడు. కర్తవ్యం - కుమారుడు, మధ్య కర్తవ్యం గెలిచింది. నాటి నాయకుల దేశభక్తి అలాంటిది.

1946 చివరి వారంలో మహాత్మాగాంధీ హిందీ ప్రచార సభలలో పాల్గొనటానికి మద్రాసు వచ్చారు. ఆ సందర్భంలో తిరుగు ప్రయాణంలో గాంధీజీని డోర్నకల్, గుండ్రాతిమడుగు, ఖమ్మం, వరంగల్, మానుకోట, మంచిర్యాలలో ప్రయాణం చేయిస్తే జాతీయోద్యమానికి తెలంగాణలో బలం కలుగుతుందని నాయకులు భావించారు. ఆ బాధ్యత ఎం.ఎస్.పై ఉంచారు. గాంధీజీ పర్యటన వరంగల్‌లో ఒక మధురానుభూతి.

1951 ఎన్నికల అనంతరం బూర్గుల మంత్రివర్గంలో ఉపమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించారు. ఎం.ఎస్. సమైక్యవాది అయినా తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాల గురించి సమయం లభించినప్పుడల్లా గళమెత్తేవారు. వివిధ పత్రికలలో చాలా వ్యాసాలు రాశారు. బహుగ్రంథకర్తలు ఇటీవల తమ స్వీయచరిత్ర ప్రచురించారు. అది బహుళ జనాదరణ పొందింది.
 - జీ. వెంకటరామారావు

15, జనవరి 2012, ఆదివారం

Milestone Achieved!

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.'విశాలాంధ్రమహాసభ'  ఎన్నో అడ్డంకులను అధిగమించి డిసెంబర్ 29,2011న హైదరాబాద్ లో  'రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం' అనే అంశంపై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసినదే. 'విశాలాంధ్రమహాసభ' ప్రయత్నాన్ని విచ్చిన్నం చేయాలని విఫలయత్నం చేసి ఆతర్వాత అంతా రసాభస అయ్యిందని కొంతమంది పనిగట్టుగొని ప్రచారం చేసినా, రాష్ట్ర రాజధానిలో చాలా కాలం తర్వాత సమైక్యవాదం వినిపించడం సంతోషించదగ్గ పరిణామం. దౌర్జన్యంతో ఇతరుల భావవ్యక్తీకరణ స్వేచ్చను ఎప్పటికీ హరించగలుగుదామనుకోవడం మూర్కత్వమవుతుంది.


ఆ దినం జర్నలిజం ముసుగు తొడుక్కున్న కొంతమంది నోర్లను సమర్ధవంతంగా మూయించిన స్వాతంత్ర్యసమరయోధురాలు సుగుణమ్మగారికి అభినందనలు





My Telugu Roots.com : Visalandhra Mahasabha on December 29th achieved an important milestone. After months of setbacks, we've eventually achieved our goal of conducting an integrationist event in Hyderabad. It is the first of its kind.
When we asked for our right to freely express our opinion: the State government instead of coming to our rescue stifled our voices. The police have turned their back on us when we asked for protection. The "so-called" integrationists and community leaders of Hyderabad refused to come to our rescue as they felt expressing a point of view would be provocative. Our political parties and leaders said it is in VMS’ best interest that they don't stand by us as it would hurt our organization's image of an apolitical organization. When our venue was denied to us, as a last resort, when we approached the judiciary, the court system failed us. The High Court sided with the government and dismissed our most basic fundamental rights case. I was dumbfounded by the courts decision. The judiciary in our country lost course.
The essential ingredient for a free society to survive is people's ability to freely express their opinions. When a society cannot tolerate such freedoms, it gradually degenerates into a dictatorship, where only might will win.
The fight for integration is important. However, the fight for individual freedom is far more important. Alas, it is lost on the intellectuals of our state why we should stand for our fundamental rights, while risking fears of provocation. Every time you fear to freely speak your mind, the society moves one step closer to an autocracy. Need evidence? Look at how the separatist movement became violent as years went by. This has happened because integrationist voices decided to stay quiet.
VMS about a month ago lost trust in the judiciary process as the High Court kept on adjourning our petition week after week after week. We have decided to go ahead and conduct our event in a private venue instead of a government facility like the Jubilee Hall or Ravindra Bharathi. We’ve also decided not to give anything in writing to police seeking protection, as they will use it to deny our most basic rights. Technically, we did not need permission from the law enforcement to conduct an indoor event.
December 29th 2011 exhibition and media workshop was a phenomenal success. We had several freedom fighters from the Nizam region that rallied to our cause and dared to stand with our organization. They are Sri Narra Madhav Rao, Smt. Shakhamuri Suguna, Sri K.S. Mehaboob, Sri Laxman Rao, and Sri Naganna. The former two are also members of VMS executive committee.
As the session began, when Sri C. Anjaneya Reddy garu was speaking, a journalist kept on interfering demanding to name the five Chief Ministers from Telangana mentioned in our charts. Anjaneya Reddy garu insisted on allowing him to finish his speech and the answer will be given later. He eventually clarified that they are JVR, PVNR, MC, and TA. The reason for five is the two terms held by MC.
When Sri Narra Madhav Rao spoke, some of the journalists took exception to his comments and demanded an apology. 90 year old native Hyderabadi, Madhav Rao garu refused to apologize and with police intervention things returned to normalcy. Freedom fighter Suguna garu, despite her frail physical condition, took on the journalists head-on. She said, nobody can stop the event from happening that day. From that point on, the event went on smoothly. Professor and former Vice Chancellor R.V.R. Chandhra Shekhar Rao, MCPI leader Thandra Kumar and MCPI Secretary Marreddy Venkat Reddy spoke. After which Prabhakar garu did a powerpoint presentation. It was highlight of the day and his presentation was carried live on most TV channels and it was simply spectacular.
We’ve also put up an exhibition at the venue. In the lobby area we put a photo gallery of the violent activities that have happened during the course of this agitation. Some of the journalists pulled those charts down. We quickly put them back up.
The media workshop ended as planned at 2.00 PM.
Police came in around 2:30 PM and said they have protected us to the best of their ability throughout the day. In reciprocation, they requested us to conclude the exhibition early due to security concerns.  We took the exhibition down at 3:30 PM an hour and half earlier than planned. I now regret agreeing to end the exhibition early. The media completely distorted the story and declared the event was disrupted by the separatists.
Today, I am very proud of the Visalandhra Mahasabha team. There are too many names to mention. Our brave team has worked hard for weeks and never did their spirits wane. We stuck together through thick and thin. I am proud to be associated with such spectacular group of team players.
Our cause is noble, our fight is just. The fight for Telugu unity will go on.
Nalamotu Chakravarthy
President
Visalandhra Mahasabha

 


విభజన చరిత్రాత్మకంగా ఏమాత్రం సమంజసం కాదు తాటాకు చప్పుళ్లకు బెదరం… మాది ఎప్పటికీ సమైక్యవాదమే… మమ్మల్ని కొట్టినా, తిట్టినా దాడులు చేసినా వెనక్కు తగ్గేదే లేదని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ స్పష్టంచేశారు. 2012 సంవత్సరాన్ని విశాలాంధ్ర నామ సంవత్సరంగా ప్రకటించుకుందామని పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ‘రాష్ట్ర సమైక్యతను కాపాడుకుందాం’ అనే నినాదంతో విశాలాంధ్ర మహాసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో పాటు తెలంగాణలో కూడా లక్షలాది మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ వాదనలో సత్యం ఉంది కాబట్టే వేర్పాటు వాదులకు వినేందుకు ధైర్యం చాలక దాడులకు పూనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 30 ఏళ్లుగా పౌర హక్కులపై మాట్లాడుతున్న తమపై అనేకరకాల ఆరోపణలు, దాడులు జరుగుతున్నా బోగస్ హక్కుల సంఘాల నేతలు ఏమాత్రం స్పందించక పోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.
1956 నుంచి అన్ని రంగాల్లో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని వివరించారు. మాజీ పోలీసు ఉన్నతాధికారి సి.ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా సంస్కృతీ , సాంప్రదాయాలను కాపాడుకుంటూ రాష్ట్ర సమైక్యతకు పాటు పడాలని చెప్పారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధులు నర్రా మాధవరావు, శాఖమూరి సుగుణ, నాగయ్య, పత్తి శేషయ్య, ఎన్.లక్ష్మణ్‌రావు, పి. రామస్వామి, మహబూబ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు ఎన్. చక్రవర్తి, ఎంసీపీఐ నాయకులు ఎం. వెంకట్ రెడ్డి, తాండా కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి అబీద్ రసూల్ ఖాన్, ప్రొఫెసర్ ఆర్‌వీఆర్ చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విశాలాంధ్ర మహ సభ ముద్రించిన రాష్ట్ర సమైక్యతను కాపాడుకుందామనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

27, డిసెంబర్ 2011, మంగళవారం

‘రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం’

మిత్రులారా,


‘విశాలాంధ్ర మహాసభ’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడడం కోసం కృషి చేస్తున్న సంస్థ. రాజకీయాలకు అతీతమైనది. ‘విశాలాంధ్ర మహాసభ’ తెలంగాణ, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలకు చెందిన మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు మరియు సమాజశ్రేయస్సు కోసం కృషి చేస్తున్న అనేకమంది వ్యక్తులు కలిసి స్థాపించిన సంస్థ.
మనరాష్ట్రంలో జరుగుతున్న వేర్పాటువాద ఆందోళన, హింస మరియు విధ్వంసక చర్యలను ప్రోత్సహిస్తూ, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురైయ్యారన్న అసత్య ఆరోపణల ఆధారంగా సాగుతున్నది. విభజనవాదులు అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.మా ఉద్దేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఆందోళన పూర్తిగా అసమంజసమైనది.
ఈ సందర్భంలో, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర సమైక్యతను కాపాడుదాంఅనే అంశం పై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ నిర్వహించతలపెట్టింది. మన రాష్ట్రానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక మరియు చారిత్రక నిజాలను మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ ద్వారా ప్రజల ముందుకు తేవడం యీ ప్రయత్నం యొక్క ముఖ్య ఉద్దేశం.
వేర్పాటువాద ఆందోళన ప్రచారం చేస్తున్న నిందలు,అవాస్తవాలు,వక్రీకరణలు, అసత్యాలను ఖండించి నిజానిజాలను తెలిసుకోవడంలో మా యీ ప్రయత్నం సహాయపడుతుందని ఆశిస్తున్నాము.

December 29th 11.00 AM – 4.00 PM

Venue: Sundaraiah Vignanan Kendram, Bagh Lingampally, Hyderabad.

24, డిసెంబర్ 2011, శనివారం

'విగ్రహాలను వెంటనే పునఃప్రతిష్ఠించండి' : విశాలాంధ్రమహాసభ

డిసెంబర్ 20 వ తేదీన విశాలాంధ్రమహాసభ ప్రతినిధులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆయన కార్యాలయంలో కలిసి ట్యాంక్ బండ్ పై విధ్వంసానికి గురయ్యిన తెలుగు మహనీయుల విగ్రహాలను వచ్చే ఉగాదిలోగా  పునఃప్రతిష్ఠించాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు. దానికి సానుకూలంగా స్పందించిన సీఏం విగ్రహాల పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. మిలియన్ మార్చ్ రోజున ట్యాంక్ బండ్ పై ఆందోళనకారులపై చర్య తీసుకొంటే వచ్చే పరిణామాలను దృష్టిలో ఉంచుకొనే విగ్రహాల ధ్వంసాన్ని ఆపలేకపోయామన్నారు. పోలీసుచర్యలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయివుంటే పరిస్థితి అదుపుతప్పుతుందేమోనన్న ఆలోచన చేశామన్నారు.




22, డిసెంబర్ 2011, గురువారం

దార్శనికుడు పి.వి.

"ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగ
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ''

1972లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శాసనసభలో చదివిన ఈ కవితార్థం చరితార్థం కావించిన వాడు పాములపర్తి వేంకట నరసింహారావు దేశమంతా 'పి.వి'గా పిలుచుకున్న తొలి తెలుగు ప్రధాని. పి.వి. రాజకీయ చతురతలో రాణించాడు; ఏ కుల, వర్గ, మతాల గుంపును దరిచేరనివ్వలేదు. ఆయన దృక్పథం ప్రజాస్వామ్యం. దృష్టి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు జరిపారు; కాంగ్రెస్ అధ్యక్షునిగా, బడుగువర్గాలకే ప్రాధాన్యమిచ్చి రాజ్యాధికారానికి స్వాగతించారు.

తెలుగు భాషకు పట్టనున్న దుర్గతి ఊహించి తెలుగు అకాడమీ స్థాపించారు. తెలుగు అధికార భాషా సంఘ స్థాపనలో పి.వి. కృషి ఉంది. రాష్ట్రంలో, బోధనా భాషగా తెలుగు ప్రాముఖ్యత గురించి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. తెలుగు బోధన తప్పనిసరిగా పదవ తరగతి వరకు అమలులో ఉండేలా చూశారు.1973లో అకాడమీ అధ్యక్షులుగా 'ఉత్తరోత్తరా ఏమి జరుగుతుందో చెప్పలేం' అన్నారు.

1933లో అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్ న్యూడీల్ అనే కొత్త ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లుగా ప్రధాని పి.వి. భావి భారతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుందని గ్రహించి తన దార్శనిక దృష్టితో అటువంటి కొత్త ఆర్థిక కార్యక్రమాన్ని మన దేశంలో ప్రవేశపెట్టారు. తద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు.

కేంద్రీకృత ప్రణాళికా విధానాన్ని వదిలి, ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ మార్కెట్‌కు ప్రవేశం కల్పించారు. 1995లో పోఖ్రాన్-2 అణు పాటవ పరీక్షలను పి.వి.నే సాహసోపేతంగా నిర్వహించారు. దేశ అవసరాలు, ఆలోచనలు పూర్తిగా తెలిసిన వివేకవంతమైన పాలకుడు పి.వి. 1988లో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉంటూ అంతర్జాతీయంగా మేధావి అని గుర్తింపు పొందారు. ఐక్యరాజ్యసమితిలో ఆయన ప్రసంగానికి, వివిధ దేశాల ప్రతిని«ధలు వినమ్రంగా లేచి నిలుచుని పదినిముషాల పాటు చప్పట్లతో ప్రశంసలు కురిపించారు.

పి.వి.కి భవిష్యత్తు పట్ల చక్కని అవగాహన ఉంది. మానవుని క్రమవికాసం అరనిందులు దర్శించురని ప్రస్తావిస్తూ "ఈ అభూత పరిణామ క్రమంలో భారతదేశం అనేక ఇతర దేశాలకన్నా విజయవంతంమైన సమాజంగానూ, భాగస్వామిగా వ్యవహరించే మహదావకాశాలు కలిగి ఉందని నా ప్రగాఢ విశ్వాసం'' అని దృఢంగా చెప్పారు. పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఒకే విధంగా నడిచిన పి.వి. స్థితప్రజ్ఞుడు. తన మనసుకు నచ్చింది చేసేవాడు. అంతటి మహామనిషికి భరతజాతి చిత్తశుద్ధితో నివాళి అర్పించగా; ఆయన సేవలు నిరంతరం పొందిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మాత్రం ఆయనను చివరిదశలో అశాంతికి గురిచేసింది.

పలు కోర్టు కేసుల్లో సతమతమైనా, ఆయన ఎవరినీ విమర్శించలేదు సరికదా తన కేసులు తానే వాదించి నెగ్గారు. మరణానంతరం ఆయన అంతెవాసు లు, పార్టీ నేతలు ఘోరంగా వ్యవహరించారు. అందరు ప్రధానులకు అం తిమ సంస్కారాల వేదికలు నిర్మించిన ఢిల్లీ నేతలు పి.వి.కి. ఆరడుగుల నేల ఇవ్వ మనసురాలేదు సరికదా ఆయన దేహాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలోకి అనుమతించని 'గొప్ప' నాయకత్వం ప్రపంచంలో ఇదేనేమో! అయినా తెలుగు ప్రజల గుండెల్లో పి.వి. చిరంజీవి.

- డా. బి. దామోదరరావు
పి.వి.స్మారక పీఠం, కరీంనగర్
(డిసెంబర్ 23న పి.వి.నరసింహారావు వర్ధంతి)

యూపీ కి కేంద్రం కొర్రీలు - నమస్తే తెలంగాణా ఆక్రోశం

నాలుగు రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉత్తర్ ప్రదేశ్ చేసిన అసెంబ్లీ ప్రతిపాదన పైన కేంద్రభుత్వం అడిగిన ప్రశ్నల పై మాయావతి స్పందన ఎలా ఉన్నా మన యెల్లో జర్నల్ నమస్తే తెలంగాణా ఏడుపు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నేటి నమస్తే తెలంగాణా దినపత్రిక లో వచ్చిన ఎడిటోరియల్ చదివి తరించండి.

ఉత్తరప్రదేశ్ శాసన సభ పంపించిన రాష్ట్ర విభజన తీర్మానానికి కేంద్రం కొర్రీలు పెట్టి తిప్పి పంపడంతో కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి బయటపడ్డది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఆరోపించినట్టుపజాభివూపాయాన్ని పట్టించుకోక పోవడం, ప్రధాన సమస్యలను దాటవేయడం కాంగ్రెస్ స్వభావం. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర విభజనను కాదనలేక, తిరస్కరించలేక కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనాన్ని గ్రహించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ‘కాంక్షిగెస్ కో ఖతం కరో’ నినాదం చేపట్టారు. కానీ ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఈ విషయం ఎంతో ముందే గ్రహించి అక్కడ కాంగ్రెస్ పార్టీ పాలనను సమాధి చేశారు.


రాష్ట్రాల విభజనపై కేంద్రానికే అధికారం ఉన్నదని, తాము తీర్మానం చేసినందు వల్ల ఇక బాధ్యత కేంద్రానిదే అని మాయావతి ఇప్పటికీ అంటున్నారు. మాయావతి వాదనలో ఔచిత్యం ఉన్నది. భిన్న సాంస్కృతిక, భౌగోళిక మండలాలతో వైవిధ్య భరితమైన మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక్క ప్రాంత పక్షం వహించడం వల్ల మరో ప్రాంతం అణచివేతకు గురికావచ్చు. ఆనాడు ధర్ కమిషన్ హెచ్చరించింది కూడా ఇదే. భాష పేరుతో మరో ప్రాంత సాంస్కృతిక అస్తిత్వానికి ముప్పు వాటిల్లకూడదనే భావన కూడా ఆనాడే గ్రహింపునకు వచ్చింది. అందువల్ల కేంద్రం తీర్పరి పాత్ర పోషించాల్సిందే. అయితే కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించక పోవడం అనుచితంగా ఉంటుందనే భావన కూడా ఏర్పడింది. అందుకనే రాష్ట్రాన్ని సంప్రదించాలి తప్ప, రాష్ట్ర అభివూపాయాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. రాజ్యాంగం ఇంత స్పష్టంగా ఉన్నది కనుకనే యూపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాజ్యాంగం తనకు కట్టబెట్టిన బాధ్యతకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించక పోవడం వల్లనే ఇప్పుడు రాష్ట్రాల విభజనకు సంబంధించి చిక్కులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ విషయంలో మాదిరిగానే యూపీ పట్ల కూడా కేంద్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్త్తున్నది.


రాజ్యాంగంలోని 3 వ అధికరణం ప్రకారం రాష్ట్ర శాసన సభ అభివూపాయాన్ని రాష్ట్రపతి ద్వారా కోరాలే తప్ప హోం మంత్రిత్వ శాఖ లేఖ రాయడం సరైంది కాదని మాయావతి అంటున్నారు. ఇది జరగాలంటే మొదట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనను సూత్రబద్ధంగా అంగీకరించాలె. ఇష్టం లేకపోతే ఆ విషయం ధైర్యంగా చెప్పాలె. కానీ తన నిర్ణయం చెప్పకుండా, కాలయాపన కోసం కొర్రీలు పెట్టి హోం మంత్రిత్వ శాఖ ద్వారా లేఖలు పంపడం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించడమే. మనదేశంలో రాష్ట్రాల ఏర్పాటు కొత్తేమీ కాదు. ఇదే ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ కూడా విడిపోయింది. 1998 సెప్టెంబరు 22 వ తేదీన పార్లమెంటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అభివూపాయాన్ని కోరింది. 2000 సంవత్సరం మార్చి 30వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ తరువాత రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అప్పుడే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ కూడా ఏర్పడ్డాయి. అప్పుడు రాష్ట్రాలను కాలయాపన కోసం ఇటువంటి అసంబద్ధ ప్రశ్నలు వేయలేదు. మన దేశంలో రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ఇది మొదటిసారి కాదు. అందుకు అనుసరించవలసిన విధానాలు స్థిరపడి ఉన్నాయి. 

యూపీ రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వేసిన ప్రశ్నలు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయాలని నిర్ణయించుకున్నదని తెలిసిపోతుంది. కొత్త రాష్ట్రాల సరిహద్దులు ఏమిటి? ఏ జిల్లాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయి? వాటి వైశాల్యం, జనాభా ఎంత వంటి ప్రశ్నలు అర్థం లేనివి.


అవి ముంజేతి కంకణం మాదిరిగా చూస్తేనే కనబడుతున్నాయి. ఆయా ప్రతిపాదిత రాష్ట్రాల రాజధాని సమస్య కూడా లేదు. ఏ ప్రాంతం వారూ బుద్ధి జ్ఞానం లేకుండా మరో ప్రాంత రాజధాని కావాలని కోరడం లేదు. కోరినా అసంబద్ధమైన కోరికను ఎవరూ హర్షించరు. రాష్ట్ర విభజన జరిగితే ఐఎఎస్ అధికారులు ఎంత మంది ఏ రాష్ట్రంలో ఉంటారనేది సూత్ర బద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు చర్చించాల్సిన గొప్ప అంశమా అనే ఆశ్చర్యం కలుగుతున్నది. ఆదాయ పంపకం, రుణాల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగా అడగడం వింతగా ఉన్నది. రాష్ట్రాల రుణ భారాన్ని సమస్యగా చెప్పడం కూడా అర్థ రహితమే. ఈ విదేశీ రుణాల గురించి మాట్లాడాలంటే, ఈ తరహా ఆర్థిక విధానాలకు ఆద్యులలో ఒకరైన ప్రధాని మన్మోహన్‌సింగ్ జవాబుదారు అవుతారు.


ఆధిపత్య దేశాలు , వారి తాబేదారులు మొత్తం మూడవ ప్రపంచ దేశాలకు తెచ్చిపెట్టిన సమస్య ఇది. అన్ని రాష్ట్రాలూ రుణభారంతోనే ఉన్నాయి. విభజన జరిగినప్పుడు ఆస్తులు, రుణాలు న్యాయబద్ధంగా పంపకాలు చేయడానికి ఇప్పటికే అనుసరించిన విధానాలు మార్గదర్శకంగా ఉంటాయి. ఇది కూడా కేంద్రానికి తెలియదని కాదు. తెలిసి చేస్తున్న కుతర్కాలు ఇవి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యూపీ ప్రభుత్వానికి పంపిన ప్రశ్నావళిని బుద్ధి పూర్వకంగా పత్రికలకు విడుదల చేసింది. దీనిని కాంగ్రెస్ నాయకులు పారదర్శకతగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులకు పారదర్శకతపై అంత నమ్మకం ఉంటే, తెలంగాణ విషయంలో ఆజాద్, ప్రణబ్ జరుపుతున్న చర్చల సారాన్ని ఎందుకు వెల్లడించడం లేదు? తెలంగాణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గడియకోసారి చెబుతున్నారు. కానీ పరిష్కార యత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎందువల్ల తాత్సారం జరుగుతున్నదో చెప్పడం లేదు. ఇక్కడి నాయకులు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్నదేమిటో తెలియదు. యూపీ విషయంలోనైనా, తెలంగాణకు సంబంధించి అయినా ప్రజలు కోరేది ఒక్కటే. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వ్యవహరించాలె, ప్రజల మనోభావాలు గౌరవించాలె.

19, డిసెంబర్ 2011, సోమవారం

విశాలాంధ్రోద్యమాన్ని నేను హృదయపూర్వకంగా బలపరుస్తున్నాను: స్వామి రామానందతీర్థ (14 .2 .1950)

1950 ఫిబ్రవరి 13,14 వ తేదీలలో విశాలాంధ్రమహాసభ స్థాయిసంఘ సమావేశం వరంగల్ లో అయ్యదేవర కాళేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగింది. ఆ సమావేశాలకి మాడపాటి హనుమంతరావు, టంగుటూరి ప్రకాశం,స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు,కే.వీ.రంగారెడ్డి, బులుసు సాంబమూర్తి,అబ్దుల్ సలీం, కాళోజి మొదలైన ప్రముఖులు హాజరైయారు.  

ఆ సందర్భంగా ప్రసంగించిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానందతీర్థ, హైదరాబాద్ సంస్థాన విచ్ఛిత్తి భాషాప్రయుక్త రాష్ట్రాల నిర్మాణానికి ప్రస్తావన కావాలని, విశాలాంధ్రోద్యమం న్యాయమైనది, సహజమైనది అని , ఎనిమిది తెలంగాణా జిల్లాలు చేరనిదే ఆంధ్రరాష్ట్రం సమగ్రంకాదని అన్నారు.




ఆంధ్రప్రభ,ఫిబ్రవరి 15,1950





11, డిసెంబర్ 2011, ఆదివారం

తెలంగాణ ఊరువాడా 'విశాలాంధ్ర' అని నినదించిన వేళ

నైజాం ప్రాంతంలో తెలుగు భాషా పరిరక్షణకు, తెలుగు వారి ఆత్మా గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రారంభమైన 'ఆంధ్రోద్యమం' నిజాంపాలన నుండి విముక్తి లభించడంతోనే ఆగలేదు. 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అనే నినాదం తెలంగాణ సాయుధ పోరాటం నాడే వినవచ్చింది. 1950 లోనే 'విశాలాంధ్రమహాసభ' వరంగల్ లో స్థాయిసంఘ సమావేశాన్నినిర్వహించి అన్ని ప్రాంతాల ప్రముఖులను ఒక వేదిక పై తెచ్చి 'విశాలాంధ్ర' ఏర్పడాలని తీర్మానాలు చేసింది.

హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి విశాలాంధ్ర వెంటనే ఏర్పడాలని అభిలాషించినా, శాసనసభలో మెజారిటీ సభ్యులు ఆ మేరకు తీర్మానాన్ని సమర్ధించినా, వారు తమ వ్యక్తిగత అభిప్రాయములను ఇతరులపై రుద్దలేదు.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పై దేశమంతటా చర్చ జరుగుతున్న సమయంలో తెలుగువారందరూ ఒకే గొడుగు కిందకు రావాలని, విశాలాంధ్ర ఏర్పడాలని, తెలంగాణ ఊరువాడా ఎన్నో తీర్మానాలు వెలువడ్డాయి.ఈనాడు తమ ప్రాంత చరిత్రే తెలియని  అజ్ఞానులు, స్వార్థపరులు 'విద్రోహం' అంటూ కొత్త వాదనలు లేవదీస్తున్నారు, అమాయకులను తప్పుదారి పట్టిస్తున్నారు, వేర్పాటువాదంతో ఒక ప్రాంతప్రజల కష్టాలన్నీ తొలగింపబడతాయి అని మాయమాటలు చెబుతూ తరాలుగా మిమ్మల్ని అణిచివేసింది మేముకాదు ఇతర ప్రాంతాల వారు అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, స్వార్థచింతనతో తమ భవిష్యత్తు బాగుంటే చాలన్న ఉద్దేశంతో ఎన్నో కష్టాల పిమ్మట ఒకటిగా చేరిన తెలుగువారిని చీల్చాలని చూస్తున్నారు. వారు ఎన్ని చేసినా నిజాలను దాయడం అంత సులువకాదు



ఆంధ్రపత్రిక, డిసెంబర్ 3,1955



ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955

 
ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955




ఆంధ్రపత్రిక, డిసెంబర్ 27,1955

ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే!


10, డిసెంబర్ 2011, శనివారం

విశాలాంధ్ర ఏర్పాటుకే మొగ్గు చూపిన హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ (డిసెంబర్,1955)

ఇదివరకే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫార్సులపై ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం(అక్టోబర్,1955 )లో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణమే విశాలాంధ్ర ఏర్పడాలని ఏకాభిప్రాయానికి వచ్చిన సంగతి చదివాము. అదే సంవత్సరం నవంబర్ మాసాంతంలో శాసనసభ లో హైదరాబాద్ రాష్ట్ర భవిష్యత్తుపై చర్చను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అధికార తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానం విషయం పై ప్రసంగించిన బూర్గులగారు ఈ క్రింది విధంగా అన్నారు:

"రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫార్సులపై ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్మానాన్ని రూపొందించారు.అందులో లోపాలోపాలు నాకు తెలుసు.


సభలోని అన్ని వర్గాలనూ తీర్మానం సంతృప్తికలిగించలేదని కూడా నాకు తెలుసు. ప్రతిపాదించదలచినట్టు ఇప్పటికే నోటీసు రెండు డజన్ల సవరణలు ఈ విషయాన్ని విదితం చేస్తున్నవి.


కర్నాటక, సంయుక్త మహారాష్ట్రలను ఏర్పాటు చేసే విషయంలో కూడా అభిప్రాయభేదాలున్నవి. తెలంగాణలో మూడు రకాల అభిప్రాయములున్నవి. తక్షణ విశాలాంధ్ర నిర్మాణానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యవర్గం ఇచ్చిన సలహాను పాటించాలని కొందరు అంటున్నారు.శాశ్వతంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మరికొందరు అంటున్నారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫారసును ఆమోదించడమే మంచిదని వేరొక వర్గం అంటున్నారు.నివేదిక పై దాదాపు 25 మంది సభ్యులు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘముకు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. సభ్యులందరూ అదే విధంగా సభలో తమ అభిప్రాయాలను తెలియచెయ్యడం సాధ్యం కాక పోవచ్చు. సభ్యుల అభిప్రాయాలను భారత ప్రభుత్వానికి తెలియజేస్తాం.వ్యవధి లేనందువల్లచర్చలో పాల్గొనే అవకాశం లభించని సభ్యుల లిఖితపూర్వక అభిప్రాయములను అంగీకరించడమా అంగీకరించపోవడమా అనేది సభాపతి నిర్ణయించాలి. ఏమైనా ఈ విషయమై తుది నిర్ణయం చేసే అధికారం పార్లమెంటుదే.

ఆంధ్ర పత్రిక, డిసెంబర్ 1,1955


సభలో ఎక్కువ మంది సభ్యులు తమ అభిప్రాయములు వెల్లడించడానికి అవకాశం కల్పించడం కోసం చర్చ సుదీర్ఘంగా సాగింది

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 4,1955

ఎనిమిది రోజుల పాటు బూర్గుల గారు ప్రతిపాదించిన తీర్మానాన్ని హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ చర్చించింది. సభలో మెజారిటీ సభ్యులు తక్షణ విశాలాంధ్ర ఏర్పాటునే సమర్ధించారు.చర్చలో మొత్తం 147 సభ్యులు పాల్గొనగా వారిలో 103 మంది వెంటనే విశాలాంధ్రను నిర్మించడానికి అనుకూలంగా మాట్లాడారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని 29 మంది వాదించారు.15 మంది ఎటూ చెప్పలేదు.అంతటితో చర్చను ఆపి తదుపరి శాసనసభ సమావేశం మొదటి రోజున దానిని కొనసాగించాలని నిర్ణయించి శాసనసభ సమావేశం వాయిదా పడింది. నేటి తరం వేర్పాటువాదులు, వారి అబద్ధాల విషపత్రిక తిరిగి రాయలేని చారిత్రిక సత్యం ఇది.

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955
 

 

8, డిసెంబర్ 2011, గురువారం

'ఏకాభిప్రాయంతోనే కొత్త రాష్ట్రాలు' - రాజ్యసభలో హోం శాఖ సహాయమంత్రి

ఆంధ్రజ్యోతి: ఇక నుంచి దేశంలో ఒక రాష్ట్రాన్ని విభజించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ ప్రతిపాదనపై సంబంధిత రాష్ట్రంలో విస్తృత ఏకాభిప్రా యం ఉన్నప్పుడు మాత్రమే తాము ముందుకు కదులుతామని కేంద్రం ప్రకటించింది. "కొత్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల విస్తృత పర్యవసానాలు ఉంటాయి.

అందువల్ల రాష్ట్ర విభజనపై సంబంధిత రాష్ట్రంలో విస్తృత ఏకాభిప్రాయం ఉన్నప్పుడు.. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాక మాత్రమే కొత్త రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం ముందుకు కదులుతుంది'' అంటూ రాజ్యసభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం, దానిపై సాధారణ ఏకాభిప్రాయం మీద ఆధారపడి కేంద్రం చర్యలు ఉంటాయని బుధవారం రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి తెలిపారు.

RAJYA SABHA
UNSTARRED QUESTION NO. †1608. 
TO BE ANSWERED ON THE 7th DECEMBER, 2011/AGRAHAYANA 16, 1933 (SAKA)

DIVISION OF UP INTO FOUR SEPARATE STATES

1608. SHRI MOHAN SINGH:


Will the Minister of HOME AFFAIRS be pleased to state:

(a) whether a proposal to divide the present geographical unit of Uttar Pradesh into four parts has been passed by the State Assembly;

(b) if so, whether Central Government intends of formulate separate States of Gorkhaland, Vidarbha, Bundelkhand including Telangana, etc;

(c) if not, the reason therefor;

(d) whether there is any plan to bring various parts of India, suffering the agony of backwardness, into the race for development by providing them special packages; and 

(e) if not, the reasons therefor?

ANSWER

MINISTER OF STATE IN THE MINISTRY OF HOME AFFAIRS
(SHRI JITENDRA SINGH) 

(a): Yes Sir.

(b) & (c): Creation of any new State has wide ramifications and direct bearing on the federal polity of our country. The Government of India moves in the matter only when there was a broad consensus in the parent State, that one part thereof may be separated to form a new State. Government takes decision on the matter of formation of new States after taking into consideration all relevant factors. Action by the Government would depend on the felt need and general consensus.


(d) to (e): Under the Backwards Regions grant Fund, central assistance is granted to identified backward districts/ regions. Besides, State-specific need based special dispensation is made as and when required through existing programmes, schemes under Annual/Five Year Plans.


జనవాక్యం: తెలుగు పీఠమా? ఆంధ్ర పీఠమా?

జనవాక్యం,ఆంధ్ర జ్యోతి : ఎట్టకేలకు తెలుగు భాషకు ప్రాచీనహోదా, ఆ పీఠం మైసూర్‌లో కాకుండా తెలుగు నేలపై నెలకొల్పటానికి అంగీకారం పొందటం జరిగింది. ఇది అందరూ సంతోషించదగ్గ సఫలత. అయితే ఒక విషయంలో జాగరూకులమూ ఆలోచించవలసిన అగత్యం ఉంది. రాష్ట్ర విభజన ఉద్యమం పేరిట జరిగిన అన్యాయాల, అవమానాల, జాబితాలో భాష, భాషావేత్తలు, కవులు పొట్టిశ్రీరాములు, ఆర్థర్ కాటన్, తెలుగు తల్లి, కాసు బ్రహ్మానందరెడ్డి, వంటి ప్రముఖులే గాక, ఆంధ్రా బేంక్, ఆంధ్ర మహిళాసభ వంటి సంస్థలు, ప్రాంతీయ దైవాలు, తిరుపతి లడ్డూ కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగు వేరు ఆంధ్రం వేరు, సీమాంధ్రులది ఆంధ్రభాష, తెలంగాణ వారిది తెలుగు భాష అన్న వాదనలు కూడా బయలుదేరాయి. ఇన్నాళ్ళూ 'మన' రాజధాని అన్న భావంతో రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు పరంగా ఎన్ని విద్యా, వైద్య పార్రిశామికాది సంస్థలు హైదరాబాదులో వెలసినా కిమ్మనలేదు. కాని నేటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలుగు పీఠాన్ని మైసూర్ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని సి.నా.రె, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి రచయితలు బుద్ధప్రసాద్, పురంధేశ్వరి వంటి మంత్రులు ఇతర ప్రముఖులు విజయవంతమైన ప్రయత్నాలు చేశారు.

బహుప్రయత్న లబ్దమైన ఈ సంస్థ హైదరాబాదులో నెలకొన్నాక- ఇది మా తెలుగుపీఠం ఇందులో మీరు వేలు పెట్టకండి, మీ ఆంధ్ర పీఠం మీరు తెచ్చుకోండి అనే సందర్భమూ రావచ్చు. అందులో కృషిచేసే పండితులకు, భాషా వేత్తలకు ఇతర సిబ్బందికి- పైన పేర్కొన్న ప్రముఖులకు జరిగిన 'సన్మానం' జరగదని, ఆ సంస్థకు ట్యాంక్ బండ్ మీది విగ్రహాలకు పట్టిన గతి పట్టదని భరోసా ఏమైనా ఉన్నదా? ఇప్పటికే సాహిత్యపీఠం ఉన్న రాజమండ్రీ, సాహిత్య రాజధానిగా పేరొందిన విజయవాడ అనువైన ప్రదేశాలు అన్న విషయం పరిగణలోకి తీసుకోవాలి.

అసలింతకూ ఈ పీఠం కర్ణాటకలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా ఏం చెయ్యాలి? ఏ విషయాలమీద పరిశోధన చేపట్టాలి? ఎట్టి పరిశోధకుల్ని, భాషా వేత్తలను నియమించుకోవాలి? ప్రాచీన భాషా? క్లాసికల్ భాషా? ఏ పేరుతో పిలవాలి? ఈ అర్థాన్నిచ్చే తెలుగు పదమేది? ఏదో ఒకటిలే అనుకున్నా, వచ్చిన ప్రతిపత్తిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలి? - ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించండి మహాప్రభో అని ఏ మంత్రిత్వ శాఖ వారికి మొర పెట్టుకోవాలి? తమిళ, కన్నడ ప్రభుత్వాల వలె మన భాషకూ ఒక మంత్రిత్వ శాఖ ప్రారంభించటం అత్యవసరం కాదా? ఇలాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకొని ముందుకు సాగాలి. మాతృభాష పట్ల శ్రద్ధాభక్తులున్న అందరూ తలోచెయ్యీ వెయ్యాల్సిన అవసరం ఉంది.

- ప్రసాద్ మున్షీ, ఆర్.కె.పురం, సికింద్రాబాద్

7, డిసెంబర్ 2011, బుధవారం

చిన్న రాష్ట్రాలకు నేను వ్యతిరేకం : కుల్దీప్ నయ్యర్

ఆంధ్రజ్యోతి: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాను వ్యతిరేకమని, రెండో ఎస్సార్సీ వేసేందు కు ఇది సమయం కాదని ప్రముఖ జర్నలిస్టు, మాజీ హై కమిషనర్ కుల్దీప్ నయ్యర్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక రా ష్ట్రాల డిమాండ్లు అన్ని సమస్యలనూ ఆటోమేటిక్‌గా పరిష్కరించలేవని, పైగా ఎవరూ పరిష్కరించలేని మరిన్ని సమస్యలను సృష్టిస్తాయని స్పష్టం చేశారు. 'భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రాల సమస్య' అనే అంశంపై బోడోల్యాండ్ విద్యార్థి విభాగం మంగళవారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జాతీయ సదస్సు నిర్వహించింది.

ఇందులో కు ల్దీప్ నయ్యర్ పాల్గొని ప్రసంగించారు. చిన్న రాష్ట్రాల ఆ కాంక్షలు సమంజసమే కావొచ్చని, వీటి కోసం ఎస్సార్సీ వేయాల్సి ఉంటుందని, అయితే, తన దృష్టిలో రెండో ఎ స్సార్సీ వేసేందుకు కూడా ఇది సరైన సమయం కాదని వివరించారు. దేశంలో మరెన్నో సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు ఎస్సార్సీ వేస్తే ఇక ఆ హంగామాలో పనులేమీ జరగవని చెప్పారు. మొదటి ఎస్సార్సీ సమయంలో ఇలాగే జరిగిందని, తాను అదంతా చూశానని, కాబట్టి ఇప్పుడు రెండో ఎస్సార్సీ వేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఏ రాష్ట్రంలోని ఆకాంక్షలపైనైనా ఎస్సార్సీ వేసే ముందు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎస్సార్సీతో ఆర్థికంగా కేంద్రంపై చాలా భారం పడుతుందని, దీనికి కేంద్రం డబ్బు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. అందుకే చిన్న రాష్ట్రాలకు తాను అనుకూలం కాదని తేల్చి చెప్పారు. తెలంగాణకు కూడా తాను అనుకూలం కాదని స్పష్టం చేశారు. మరొకవైపు కూడా మనోభావాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుకు ఇది సరైన సమయం కాదన్నారు. దీనివల్ల దేశం, రాష్ట్రం నాశనం కాకూడదని హితవు పలికారు.

ఒకవేళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటే.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కుల్దీప్ నయ్యర్ సూచించారు. తెలంగాణ అంశంలో కేంద్రం తప్పు చేసిందని, ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత కమిషన్‌ను ఏర్పాటు చేసిందని.. అలా కాకుండా ముందే కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఆ తర్వాత ప్రకటన చేసి ఉండాల్సిందని చెప్పారు.

ఒకవేళ తెలంగాణ ఏర్పాటైతే గూర్ఖాల్యాండ్, బోడోల్యాండ్, వి దర్భ, యూపీలో నాలుగు రాష్ట్రాల ఏర్పాటును డిమాండ్ చేస్తారని, ఇది సరైనదేనా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా తాను గౌరవిస్తాను. కానీ, ఆంధ్రప్రదేశ్ విభజనకు మాత్రం అంగీకరించనని స్పష్టం చేశారు.

6, డిసెంబర్ 2011, మంగళవారం

విశాలాంధ్ర ఏర్పడితే చాలా సంతోషిస్తాను : పండిట్ నెహ్రూ (11.12.1955)

1955 అక్టోబర్ మాసంలో ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు విశాలాంధ్ర ఏర్పాటు వెంటనే జరగాలని ఏకాభిప్రాయమునకు వచ్చారని చదివాము

భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు డిసెంబర్ 11 న గుంటూరు రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆంధ్ర రాజకీయ మహాసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ కార్యవర్గం విశాలాంధ్ర ఏర్పడాలని చెప్పిందని, దానిపై ఇరు ప్రాంతాల నాయకులు కలిసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. విశాలాంధ్ర ఏర్పడితే తాను మిక్కిలి సంతోషిస్తానని, త్వరలోనే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘ నివేదిక పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుందని, ఆ నిర్ణయాలు పార్లమెంట్ పరిశీలనకు వస్తాయని చెప్పారు.



ఆ తర్వాత పండిట్ నెహ్రూ నిజామాబాద్ నందు మార్చ్ 5,1956 తేదీన విశాలాంధ్ర ఏర్పాటును ప్రకటించిన విషయం తెలిసినదే.

29, నవంబర్ 2011, మంగళవారం

ప్రత్యేక తెలంగాణ నినాదం ఆత్మహత్యా సదృశమైనది : జే.వీ.నర్సింగరావు(15.08.1969)

ఈ మధ్యకాలంలో వేర్పాటువాదులు తమ అబద్ధాల విషపత్రికలో, వారి మద్దతుదారులు కొంతమంది అంతర్జాలంలో చరిత్రను తిరగ రాసేస్తున్నారు. ఈ క్రమంలో 1956 లో  సీమాంధ్ర నాయకులు తెలంగాణ జిల్లాలను బలవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో కలిపివేసుకొన్నారు అనే కథ ప్రచారం చేస్తున్నారు. పనిలోపని గా నవంబర్ ఒకటిని విద్రోహ దినంగా పాటించాలని సకల జనులకు హుకం జారీ చేసారు. అయితే పాపం వీరి పిలుపుకి అటుకుడివైపు భాజపా నుండిగాని  ఇటుఎడమ వైపు సీపీఐ-ఎంఎల్ నుంచి గాని, తెరాస మినహా ప్రధాన రాజకీయ పక్షాల నుండి అంత స్పందన రాలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న సీపీఐ-ఎంఎల్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే తాము నవంబర్ ఒకటిని విద్రోహ దినంగా పాటించమని , తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని 1956లో వ్యక్తమైన ఆకాంక్షను విద్రోహంగా చూడడం చారిత్రక తప్పిదమవుతుందని బహిరంగంగానే ప్రకటించారు.

ఇప్పటికే ఈ బ్లాగ్లో వేర్పాటువాదుల చెప్పే అనేక అబద్ధాలను ఎండగట్టడం జరిగింది. వేర్పాటువాదులు తమ వాదనకు సాక్షాలుగా ప్రచారం చేసుకొనే వాటిలో 1955 లో హైదరాబాద్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉండిన శ్రీ జే.వీ.నర్సింగరావు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమైనవి. ఇండియన్ ఎక్ప్రెస్ లో వచ్చిన ఈ న్యూస్ రిపోర్ట్ లో ఆయన కాంగ్రెస్ అధినాయకత్వం విశాలాంధ్రను బలవంతంగా ఎవరిపైనా రుద్దదనీ , తనకు రక్షణలపై (Safeguards for Telangana) నమ్మకం లేదనీ, హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ విశాలాంధ్ర ఏర్పాటుకు అనుకూలంగా వ్యక్తం చేసిన అభిప్రాయానికి తెలంగాణ ప్రజల మద్దతు లేదనీ, తొంభై శాతం ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారనీ సెలవిచ్చారు. అయితే ఆయన లెక్కలకు ఆధారాలు మాత్రం చూపలేదు.ప్రజలు ఎన్నుకొన్న శాసనసభ సభ్యులు విశాలాంధ్ర విషయంపై ఎన్నికలలో పోటీ చేయలేదు కాబట్టి వారి అభిప్రాయాలు చెల్లవని కూడా సెలవిచ్చారు.

అదలా ఉంచితే, పాపం మన నవయుగ వేర్పాటువాదులకు జే.వీ.నర్సింగరావు గారు తదనంతర కాలంలో వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలియదు. తెలిసినా దానిని బహిరంగ పరచరు.జే.వీ.నర్సింగరావు వ్యాఖ్యలను వేదవాక్కులుగా భావించే వారు ఈ క్రిందివాక్కులను కూడా బాగా అరిగించుకొంటారని ఆశిస్తున్నాను. 

మొదటగా 1969 ఏప్రిల్ 20 న హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో చేసిన ప్రసంగంలో ఆయన శ్రీ పీ.వీ.నరసింహారావు తో పోటాపోటీగా సమైక్యవాదాన్ని సమర్ధించి ప్రత్యేక రాష్ట్రవాదానికి స్వస్తి చెప్పాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేసారు.

ఆంధ్ర జనత, ఏప్రిల్ 21,1969


అదే సంవత్సరం స్వాతంత్య్రదినోత్సవాన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదాలో అనేక పత్రికలకు విడుదల చేసిన సందేశంలో ప్రత్యేక తెలంగాణ నినాదం  ఆత్మహత్యా సదృశమైనదిగా పేర్కొన్నారు.త్వరలో ఆయన పూర్తి సందేశ పాఠాన్ని బ్లాగ్లో పోస్ట్ చేస్తాం.

ఆంధ్రజనత, ఆగష్టు 15,1969