16, మార్చి 2013, శనివారం

'విశాలాంధ్రోద్యమం' పై అలనాటి పుస్తకాలు



2 కామెంట్‌లు:

  1. చుక్కా రామయ్య , ప్రజాకవి కాళోజీ వంటి మహామహులంతా అప్పట్లో విశాలాంధ్ర వాదులే
    ఆ తరువాత విశాలాంధ్ర కాదు అది విషపు ఆంద్ర అని గ్రహించి వాళ్ళు తెలంగాణా అస్తిత్వం కోసం జై తెలంగాణా నినాదం అందుకున్నారు
    1970 లో ప్రజా కవి కాళోజీ రాసిన కవిత ఇది
    చదవండి :

    ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు ???

    ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు,
    ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని
    హామీలిచ్చినవారే అంత స్వాహా చేస్తారని ||ఎవర||

    అన్నలు ఒప్పందానికి సున్నా చుట్టేస్తారని
    పరిపాలనతో తమ్ముల ‘ఫజీత’ పాలు చేస్తారని ||ఎవర||

    ముఖ్యమంత్రియే స్వయముగ సఖ్యత ఛేదిస్తాడని
    ప్రాంతీయాధ్యక్షుండు ప్రక్క తాళమేస్తాడని ||ఎవర||

    ‘కావలి కుక్కలు’ దొంగల గంజికాసపడతాయని
    కావలివాడే దొంగల కావళ్లను మోస్తాడని ||ఎవర||

    సిబ్బందిలోగల తమ్ముల ఇబ్బంది పెడతారని
    అన్నలమను మాట మరచి అహంకార పడతారని ||ఎవర||

    తమ్ముని తల బోడిచేసి దక్షత అనుకుంటారని
    తంతే-తమ్ముడు అన్నను తన్నిండని అంటారని ||ఎవర||

    తపుడు లెక్కతొ తమ్ముల నెప్పుడు ఒప్పిస్తారని
    అంకెల గారడి చేస్తూ చంకలు ఎగిరేస్తారని ||ఎవర||

    పోచంపాడు, శకుని పాచిక పాలౌతుందని
    తెలంగాణవాసులకు త్రిశంకుస్థాయి వస్తుందని ||ఎవర||

    ప్రాంతాన్ని పాడుచేసి శాంతి శాంతి అంటారని
    కడుపుల్లో చిచ్చుపెట్టి కళ్ళు తుడువ వస్తారని ||ఎవర||

    అధికార ప్రకటనలో అబద్దాలె ఉంటాయని
    బాధ్యతగల మంత్రికూడ బాతాలే కొడతాడని ||ఎవర||

    మంత్రి అయిన మురిపెముతో మనిషి దయ్యమౌతాడని
    ప్రజాస్వామ్య విధానాన్ని బదనాము చేస్తాడని ||ఎవర||

    ఓట్లు పొంది సీటు దొరక నోట్ల మన్ను పోస్తాడని
    నమ్మకద్రోహం చేస్తూ గమ్మున కూర్చుంటాడని ||ఎవర||

    ప్రజాస్వామ్యమీ తీరుగ పాడుచేయబడుతుందని
    శాసనసభ వుండికూడ మోసమె సాగిస్తారని ||ఎవర||

    విశాలాంద్రులను సైతము విషాదులను చేస్తారని
    తెలంగాణ వేర్పాటుకు తీరులు కల్పిస్తారని ||ఎవర||

    తీరవాసులైనంతనె తీర్థంకరులౌతారని
    తెలంగాణ వాసులను దేభ్యాలుగ చూస్తారని ||ఎవర||

    అభయమిచ్చి కుత్తుకనే అదిమి అదిమి పడతారని
    ఆక్రోశిస్తే శాంతికి అంతరాయమంటారని ||ఎవర||

    తెలంగాణ వేరంటె తెలివి లెక్క పెడతారని
    ఆత్మహత్య ధోరణంచు హంగామా చేస్తారని ||ఎవర||

    ‘ముల్కి’ మంత్రులందరును ముఖ్యమంత్రి భజన చేస్తారని
    దొడ్డిదారి పదవులతో దొడ్డవారు అవుతారని ||ఎవర||

    ప్రతినిధులు ప్రజల మరచి పదవి పథము పడతారని
    బ్రహ్మానందుని పదమున బ్రహ్మపదము కంటారని ||ఎవర||

    విచ్చలవిడి ఖర్చులతో విలాసాలు చేస్తారని
    కేంద్రంపై నిందమోపి కేరింతలు కొడతారని ||ఎవర||

    బార్డరువీరులు ద్రోహుల ఆర్డరు పాటిస్తారని
    చేటుగూర్చినోనికి తమ ఓట్లు అందజేస్తారని ||ఎవర||

    చేతకు సిద్ధాంతానికి చీమ ఏన్గు తేడాయని
    వట సావిత్రి వ్రతమును వారకాంత చేస్తుందని
    ఎవరనుకొన్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు.

    రిప్లయితొలగించండి
  2. What is the use of poetry / literature without substance and bereft of truth ? No wonder because of this kind of tendencies in the Telugu literary field, majority of educated Telugus have stopped reading Telugu books. The only culture now we have to live with is "jajjanakadai janare" kind of songs and some silly songs sung by unemployed professional agitators mostly belonging to political parties who still want us to believe in their failed ideology.

    రిప్లయితొలగించండి