27, డిసెంబర్ 2012, గురువారం

అఖిలంలో సమైక్యవాదం వినిపించండి-'విశాలాంధ్ర మహాసభ' రాయబారం


సాక్షి :    

బొత్సతో పరకాల ప్రభాకర్ భేటి!

హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని బొత్సకు పరకాల వినతిపత్రం సమర్పించారు. అన్ని పార్టీల అధ్యక్షులను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్ వైఖరి ఉండాలని బొత్సను కోరామని.. అందుకు స్పందించిన బొత్స తమ అభిప్రాయాలను హైకమాండ్‌కు నివేదిస్తామని హామీ ఇచ్చారని పరకాల వెల్లడించారు.


సూర్య:   


అఖిలంలో సమైక్యవాదం వినిపించండి

హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో సమైక్యవాదానికి అనుకూలంగా వాదనను వినిపించాలని పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణకు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు బుధవారం గాంధీభవన్‌లో పిసిసి ఛీప్‌కు ఓ వినతిపత్రం అందజే శారు. ఈ సందర్బంగా విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ విశాలాంధ్రతోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సమైక్యవాదన వినిపించాలని ఇతర రాజకీయ పార్టీలను కలసి కోరుతామన్నారు. టిఆర్‌ఎస్‌ను కోరుతారా అని అడగ్గా సమయం కేటాయిస్తే ఆ పార్టీ నేత హరీష్‌రావును కలసి విజ్ఞప్తిచేస్తామని ప్రభాకర్‌ పేర్కొన్నారు.


ఆంధ్ర భూమి:


‘సమైక్య’గళం వినిపించండి

హైదరాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని విశాలాంధ్ర మహాసభ నాయకులు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కోరారు. విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ పరకాల ప్రభాకర్ నేతృత్వంలో పలువురు ప్రతినిధులు బుధవారం గాంధీభవన్‌లో బొత్సను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రభాకర్ మీడియాతో రాష్ట్రాన్ని ముక్కలు చేయరాదనే అభిప్రాయాన్ని అఖిలపక్షం ముందు వెల్లడించాలని బొత్సను కోరినట్లు చెప్పారు. మీరు, మీ పార్టీ, తెలుగు జాతి ఐక్యతను, రాష్ట్ర సమగ్రతను కాపాడాలని రాష్ట్ర ప్రజలు కాంక్షిస్తున్నారని బొత్సకు చెప్పామని ఆయన తెలిపారు. బ్రిటీష్ పాలనలో, నిజాం పాలనలో తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉన్నారని, అనేక మంది నాయకుల త్యాగాల ఫలితంగా 1956 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. ఇలా అన్ని పార్టీల అధ్యక్షులను, ఇతర ముఖ్య నాయకులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు పరకాల తెలిపారు. టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావునూ కలిసి వినతి పత్రం ఇస్తారా? అని ప్రశ్నించగా, కెసిఆర్ అప్పాయింట్‌మెంట్ ఇస్తే తప్పకుండా కలుస్తామని ఆయన సమాధానమిచ్చారు.


ఆంధ్రప్రభ: 


బొత్సతో 'విశాలాంధ్ర' నేతల భేటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను బుధవారం గాంధీవభన్‌లో విశాలాంధ్ర మహాసభ నాయకులు కలిశారు. ఈ నెల 28వ తేదీన కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో సమైక్యవాదాన్ని పార్టీ పరంగా మరింత గట్టిగా వినిపించాలని పేర్కొంటూ మహాసభ ప్రతినిధులు ఆయనకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రా న్ని ముక్కలు చేయవద్దని మెజార్టీ ప్రజ లు కోరుకుంటున్నారని తెలిపారు. తెలు గు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని ప్ర జల గాఢమైన ఆకాంక్ష అని వినతి పత్రంలో మహసభ నాయకులు పేర్కొన్నారు. బ్రిటిష్‌ పాలనతో పాటు నిజాం పాలనలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఒక్కటవ్వాలని దశాబ్దాలుగా జరగిన ఉద్యమాల వల్లే 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిందని అందులో పేర్కొన్నారు. అప్పటి పోరాట ఫలితం కారణంగానే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించి ఇతర భాషా సమూహాలకు ఆదర్శంగా నిలిచామని తెలిపారు.


అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో విశాలాంధ్ర మహాసభ కన్వీనర్‌ పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ, సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలను కలిసి అఖిలపక్ష సమావేశంలో ఇదే అభిప్రాయన్ని వినిపించాలని కోరనున్నామని తెలిపారు. టిఆర్‌ఎస్‌ను కలిసి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఖచ్చితంగా వారిని కూడా కలిసి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు అధికార కాంక్షతోనే రాష్ట్ర సమైఖ్యతకు ముప్పువాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.
 

రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలని ప్ర భుత్వ విప్‌ జగ్గారెడ్డి ఇటీవల చేసిన ప్రకటనపై విశాలాంధ్ర మహసభ నాయకు లు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన ఈ మేరకు పార్టీ అధిష్టానవర్గానికి లేఖ రాయనున్నట్లు స్పష్టం చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.

ప్రజాశక్తి: 

 
బొత్సను కలిసిన పరకాల ప్రభాకర్‌ బృందం


రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ విశాలాంధ్ర మహాసభ కన్వీనర్‌ పరకాల ప్రభాకర్‌ నేతృత్వంలో బొత్స సత్యనారాయణు కలుసుకున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం చేయకుండా చూడాలని వినతిపత్రం అందించారు.


 కొమ్మినేని.ఇన్ఫో : 

విశాలాంధ్ర మహాసభ రాయబారం  

 ఒకపక్క తెలంగాణవాదులుకానివ్వండి, తెలంగాణ.జెఎసి నేతలు, ప్రజాసంఘాల నేతలు కాని విస్తారంగా తెలంగాణవాదానికి అనుకూలంగా అభిప్రాయానికి కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే, సమైక్య వాదాన్ని ఆ స్థాయిలో కాకపోయినా, ప్రాతినిద్యంగానైనా వినిపించడానికి విశాలాంధ్ర మహాసభ నడుం కట్టింది.ఈ మహాసభ నేత పరకాల ప్రభాకర్ పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవలసిన అవసరం గురించి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా అన్ని పార్టీల నేతలను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నామని చెప్పారు.దీనిపై తమ అధిష్టానానికి తెలియచేస్తానని బొత్స చెప్పినట్లు పరకాల చెప్పారు. ఆ తర్వాత టిడిపి నేత యనమల రామకృష్ణుడును కూడా కలుసుకుంటున్నట్లు ఈ నెతలు చెప్పారు.ఈ రెండు రోజులు ఇరుప్రాంతాల వాదనలు వినిపించడానికి ఎవరికి వారు పోటీపడడం సహజమే.అందులో భాగంగా విశాలాంధ్ర మహాసభ కూడా రాయబారం జరుపుతోందనుకోవాలి.

TV9 'వారధి' కార్యక్రమంలో నలమోతు చక్రవర్తి (26.12.2012)

వీడియో లంకెలు

మొదటి  భాగం : http://www.youtube.com/watch?v=1tq0ErqlvGU
రెండవ భాగం    : http://www.youtube.com/watch?v=2bsrx-vf0Uo
మూడవ భాగం : http://www.youtube.com/watch?v=OUIXS7aBGS0

8, అక్టోబర్ 2012, సోమవారం

సమైక్యమే లక్ష్యం - కర్నూలు 'విశాలాంధ్ర మహాసభ' లో వక్తలు

ఆంధ్రజ్యోతి :  ఆంధ్ర ప్రదేశ్ సమైక్యంగా ఉండాలన్న దే విశాలాంధ్ర మహా సభ లక్ష్యమని సీనియర్ జర్నలిస్టు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళా క్షేత్రంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విజభన జరగటానికి వీలు లేదని, అన్ని ప్రాంతాల ప్ర జలు కోరుకుంటున్నారని అన్నారు. తె లంగాణ ఉద్యమకారులు కొన్ని కారణాలు చూపి ప్రత్యేక తెలంగాణ కా వాలని కోరుకుంటున్నారన్నారు. తె లంగాణ వాదులు ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలు మానుకోవాలని హిత వు పలికారు. కలిసి ఉంటే జరిగే అభివృద్ధిని గురించి వివరిస్తామని చెప్పా రు.

వెనుకబాటు తనం అన్ని ప్రాంతాలలో ఉందని, కొన్ని జిల్లాలు అభివృ ద్ధి చెందినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టు కాదని తెలిపా రు. దూషణలతో, దుర్మార్గాలతో ప్ర త్యేక తెలంగాణ రాదని, కలిసి ఉండాలనే కోరిక రాయలసీమ, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉందని అన్నారు. మొదటి సారిగా ఢిల్లీలో నిర్వహించిన విశాలాంధ్ర మహా సభకు కులదీప్ నయ్యర్, సంజయ్ బారు, కేపీఎస్ గి ల్ వంటివారు హాజరయ్యారన్నారు. ఈ సదస్సులు అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ విడిపోవడానికి పది కారణాలు చెబితే సమైక్యంగా ఉండడానికి వెయ్యి కారణాలు చెబుతామ న్నారు.

ప్రజలకు వాస్తవాలు తెలియజేయటానికి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.


ప్రాంతీయ అసమానతలు తొలగించాలి

ఆంధ్ర భూమి :  రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలను తొలగించి సమగ్రతను కాపాడాలని మంత్రి టీజీ వెంకటేష్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణవాదులు చెప్పే ప్రతిమాట అవాస్తవమేనని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంగా ఇవ్వాలని వారు ఒక్క కారణం చెబితే సమైక్యంగా ఉంచడానికి తాము లక్ష కారణాలు చెబుతామన్నారు. అబద్దాలు చెబుతూ, అభివృద్ధిని దాచిపెడుతూ వెనుకబాటుతనం పేరుతో ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారన్నారు. సమైక్యవాదులు చూపిన లెక్కల్లో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో వెల్లడైందన్నారు. ఆ తరువాత సెంటిమెంటు పేరుతో ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే వారు ఉద్యమం చేపట్టారని మండిపడ్డారు. రాయలసీమ వాసుల త్యాగంవల్లే నాడు రాజధానిని హైదరాబాదుకు తరలించారన్నారు. ఆరోజే తాము అడ్డుకునే ఉంటే అది జరిగేది కాదేమోనని అభిప్రాయపడ్డారు. అయితే తెలుగువారంతా కలిసి ఉండేందుకు తమ పెద్దలు అడ్డు చెప్పలేదని పేర్కొన్నారు. విశాలాంధ్ర మహాసభ నాయకుడు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వాదాన్ని బూచిగాచూపి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తెలంగాణ చేరుకున్న తరువాత ఇప్పుడు పదవుల కోసం ప్రత్యేక వాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సూచించారు. రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాన్ని వివరించేందుకే కర్నూలులో సభ నిర్వహించామన్నారు. ఇందులో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అభివృద్ధికి సంబంధించిన చిత్రాలు, ఇతర వివరాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. తెలంగాణవాదులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఢిల్లీలో నిర్వహించిన ఫోటోలు, వివరాలతో కూడి ఎగ్జిబిషన్ ద్వారా తిప్పికొట్టగలిగామని పేర్కొన్నారు. పాత్రికేయులు సి.నరసింహారావు మాట్లాడుతూ తెలుగుమాట్లాడే వారంతా ఒక్కటిగా ఉండాలన్న ఉద్ధేశ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందని గుర్తుచేశారు. ఇపుడు కొందరు నాయకులు తమకు అవసరమైన పదవుల కోసం తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.


రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం

సాక్షి : రాష్ట్ర సమైక్యతను కాపాడుదామని విశాలాంధ్ర మహాసభ నాయకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సీ క్యాంప్‌లోని టీజీవీ కళాక్షేత్రంలో విశాలాంధ్ర మహా సభ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. మంత్రి టీజీ వెంకటేష్ దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. సమైక్యతను కాపాడేందుకు విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేశామన్నారు. ఈ సభ ద్వారా వాస్తవ అభివృద్ధిని అన్ని ప్రాంతాల ప్రజలకు వివరిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రాంతం కంటే రాయలసీమ రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎంతో వెనుకబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణవాదులు పది కారణాలు చెబితే, సమైక్యంగా ఉండేందుకు వంద కారణాలు చూపిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

అధికారం కోసమే ప్రత్యేక వాదం

రాయలసీమ వెనుకబాటు తనాన్ని వాస్తవ రూపంగా లెక్కల్లో చూపించిన విశాలాంధ్ర మహాసభను అభినందిస్తున్నామని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్రంలో అధికారం కోసమే కొంత మంది ప్రత్యేక వాదం పేరుతో ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధానిని తరలించకుంటే కర్నూలు లక్ష కోట్ల అభివృద్ధిని సాధించేదన్నారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక నాయకునిగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నానన్నారు. సీమలో అన్ని వనరులు సమృద్ధిగా ఉన్నాయని, అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అన్ని వర్గాల వారు సహకరిస్తే ఇక్కడి నుంచి 10 వేల మెగా వాట్ల పవన విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చన్నారు. అంతకుముందు పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నరసింహరావు, శ్రీనివాసరెడ్డి, బివి.రెడ్డి, కుమార్ చౌదరి, రవితేజ, వెంకటేశ్వర్లు, లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు.

4, అక్టోబర్ 2012, గురువారం

చర్చోపచర్చలు....నిజమా....?

తెలంగాణా వాదులు నిజమైన ప్రజాస్వామ్యిక వాదులైతే....వీరు నిజంగా తెలంగాణా కోసమే వీళ్ళు పోరాడుతుంటే ,వీళ్ళు కొన్ని ఆలోచించాలి.కేసీఆర్ ని నిలదీసి అడగాలి......
1 .కేంద్ర ప్రభుత్వము గానీ,కాంగ్రెస్ ప్రభుత్వము గానివ్వండి తెలంగాణా గురించి కేసీఆర్ ఒక్కడితోనే చర్చలు జరపడము ఏమిటి...? అంటే తెలంగాణా ప్రాంతములోని నాయకులు అనుకుంటున్న వారు అందరు చర్చలకు పనికిరాని........, తెలివితేటలూ లేని....... అనేనా ...?
2 . వీళ్ళల్లో వీళ్ళు రహస్యముగా తొలివిడత,తుదివిడత అంటూ రాష్ట్రము గురించి రహస్య చర్చలు చేసుకుని పంచుకోవటానికి ఇదేమన్నా గాంధీభవన లేక కేసీఆర్ వారసత్వ ఆస్థా...?
3 .ఒకవేళ తెలంగాణా ఏర్పాటు గురించి చర్చలు అయితే ఈ రాష్ట్రములో ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియకుండా వేరే పార్టీ నాయకుడితో చర్చిండం అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు యెంత గోప్పవాల్లో మనము ఊహించుకోవచ్చు.......!
4 .లేదా.... కేసీఆర్ కి తెలంగాణా ప్రజల ఆత్మా గౌరవము మీద నమ్మకము ఉంటె కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపాదించిన "తనసొంత ప్రత్యెక ఎజెండా" మీద చర్చలు జరిపి ఉంటె కేసీఆర్ నిజాయతీగా ,ధైర్యముగా తెలంగాణా సమాజానికి ఆ ఎజెండా ఏమిటి,చర్చల సారాంశము ఏమిటో తెలంగాణా కోసము ఉద్యమిస్తున్న అన్ని ఉద్యమ సంఘాలకి,అందరు ఉద్యమ నాయకులకు ,తెలంగాణా జాతి యావత్తుకి చెప్పాల్సిన బాధ్యతా కేసీఆర్ మీద ఉంది.
5 . లేదా..... తెలంగాణా కోసము ఉద్యమిస్తున్న అన్ని ఉద్యమ సంఘాలు ,అందరు ఉద్యమ నాయకులు ,తెలంగాణా జాతి యావత్తు కేసీఆర్ ని నిలదీసి ,నిగ్గదీసి ఆ వివరాలు రాబట్టాల్సిన బాధ్యతా వీరి మీద ఉంది......అలా చెయ్యకపోతే వీళ్ళని సదా "బాంచన్ నీ కాల్మొక్తా" అంటూ ఆ దొరకి ఊడిగము చేసే బా ....లు వీళ్ళు అనుకోవాలి.

1, అక్టోబర్ 2012, సోమవారం

కర్నూలులో 'విశాలాంధ్ర మహాసభ'



Dear Friends,

Visalandhra Mahasabha is conducting a media exhibition and workshop in Kurnool this Sunday, October the 7th, 2012. The format will be similar to the past events that our organization has conducted in Delhi, Hyderabad, Vijayawada, and Tirupati.

The event will be held in T.G.V. Kalakshetram in Kurnool. The exhibition is going to be inaugurated by Minister Sri T.G. Venkatesh. Prominent personalities from Kurnool Sri B. V. Reddy, Sri G. Pullaiah, Sri K.C. Kalkura, Dr. K. Madhaiah will speak at the event.

Visalandhra Mahasabha members C. Anjaneya Reddy, Parakala Prabhakar, Challagulla Narasimha Rao, Kumar Chowdhary Yadav, Chegondi Ramajogaiah, Padiri Raviteja, Sunkara Venkateswar Rao, Laxman Reddy and several others will also present their views.

It is very important that we continue to voice our views on integration. The just finished Telangana march and separatists efforts in Delhi are an indication that the fight is far from over.

Drive to Kurnool from Hyderabad is less than 3 hours and the road is excellent. I urge you all to participate in the event and make it a big success.

Nalamotu Chakravarthy

9, సెప్టెంబర్ 2012, ఆదివారం

చిన్న బ్రేకు తర్వాత ఉద్యమిద్దాం!

ఆంధ్ర భూమి సంపాదకీయ పేజీ (02/09/2012) :  ఉద్యమాలకీ ‘బ్రేకు’లుంటాయి. లేకుంటే, ఉద్యమాలు చేసే వాళ్ళకీ, చూసే వాళ్లకీ కూడా బోరు కొడుతుంది. ఆ బ్రేకులు ఒక్కొక్కసారి సినిమాల్లో ‘ఇంటర్వల్ బ్రేకు’ల్లా వుండొచ్చు. లేదా టీవీ సీరియల్స్‌లో ‘కమర్షియల్ బ్రేకు’ల్లాగయినా వుండవచ్చు.

నిజమే మరి. ఉద్యమాలు కూడా డొన్ని సినిమాల్లా మూడు గంటల్లో తేలిపోతాయి. కొన్ని సీరియళ్ళలాగా ఏళ్ళతరబడి, ఎపిసోడ్ల తరబడి సాగుతుంటాయి. బంగి అనంతయ్య తరహా ఉద్యమాలున్నాయనుకోండి. నడి రోడ్డు మీద ఒక మారువేషంతో మూడు గంటల పాటు నడుస్తుంది. వంటగ్యాస్ ధరకు వ్యతిరేకంగా ఆయన ఆడ వేషం కట్టుకుని నెత్తిమీద గ్యాస్ బండ పెట్టుకుని నినాదాలిస్తారు. ఎంత సేపని బండను మోస్తారు? గంటన్నర తర్వాత వంక కోసం చూస్తారు. ఈ లోగా ఎవరో అధికారి వచ్చి ట్రాఫిక్ దిగ్బంధమయిందని చర్చలకు చెట్టుకిందకు తీసుకు వెళ్తాడు. బండ దించి పక్కకు వెళ్తారు అనంతయ్య. ఇదే ఇంటర్వెల్ బ్రేకు. తర్వాత మళ్ళీ బండ ఎత్తుకుంటారు. ఈ లోగా మీడియా వారు ‘గొట్టాల’ (కెమేరాల)తో వస్తారు. ఉద్యమం క్లయిమాక్సుకు వస్తుంది. నినాదాలు హోరెత్తించేస్తారు. వెంటనే పోలీసులు చక్కటి వ్యానుతో వస్తారు. నెత్తిన బండతో పాటు వ్యాను ఎక్కేస్తారు. అంతే శుభం కార్డు పడిపోతుంది.

ఈ ఉద్యమం ఒక పూటలో తేలిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్వంటీ-ట్వంటీ మ్యాచ్ లాంటిది. ఇది లోబడ్జెట్ ఉద్యమం. చేయడానికి వందలమంది ఉండనవసరం లేదు. ఒక్కరున్నా చేసుకోవచ్చు. ప్రేమించి, పెళ్ళాడలేక పోతున్నవారూ, రిటయిరయ్యాక పింఛను రానివారూ- ఇలా ఎవరయినా సరే, ఈ తరహా ఉద్యమాన్ని ప్రయత్నించవచ్చు. ఒక టెలిఫోన్ టవర్‌నో, ఒక హోర్డింగ్, ఒక నీళ్ళ ట్యాంకునో చూసుకుని ఎక్కేయటమే. బాజా లూ (మీడియా), భజంత్రీలు (పోలీసులూ) తమ స్వంత ఖర్చుల మీద వచ్చేస్తారు. ‘దూకేస్తాను, దూకేస్తాను’- అని బెదిరించ వచ్చు. మధ్యలో అలిసిపోతే, ఇంటర్వెల్ బ్రేకు ఇచ్చుకోవచ్చు. కిందనుంచి పోలీసులు, ‘బర్గలో, పిజ్జాయో’ పొట్లాం కట్టి పైకి విసురుతారు. బంతిని అందుకున్నట్టు, అందుకుని భోంచేయవచ్చు. ఈలోగా కింద ఉత్కంఠతో నరాలు తెగిపోతున్న జనం కూడా, పక్కకు వెళ్ళి టీ తాగి వస్తారు. ఆ తర్వాత పోలీసులే పరిష్కార మార్గం వెతుకుతారు. ప్రేమించిన ప్రియుణ్ణి వెతికి పట్టి, వాడి చేతికి పుస్తెలు తాడు యిచ్చి నీళ్ళ ట్యాంకు పైకి పంపిస్తారు. వాడు గాలిలో మూడు ముళ్ళూ వేశాక దిగివచ్చేస్తే, జనంతోపాటు అందరూ ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ఉద్యమాలకు మధ్యలో ఒకే ఒక్క బ్రేకు సరిపోతుంది.

కానీ ‘సీరియల్ ఉద్యమాల’తోనే సమస్య. ఎందుకంటే వీరు తీసుకునే సమస్యలకు వెనువెంటనే పరిష్కారాలు దొరకవు. ఆ మాటకొస్తే, అలా పరిష్కారాలు దొరకని సమస్యలనే వీరు ఎంచుకుంటారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ, మంద కృష్ణ ఎస్సీల వర్గీకరణ, అద్వానీ, మోడీల రామమందిర నిర్మాణం, అన్నా హజారే లోక్‌పాల్- ఇలాగన్నమాట. ‘మొగలి రేకులు’ సీరియల్ అయినా ముగుస్తుందేమో కానీ, ఈ ఉద్యమాలు ముగియవు. అందుకని వీటికి ‘ఇంటర్వెళ్ళు’ సరిపోవు. మాటిమాటికీ ‘కమర్షియల్ బ్రేకుల్లాం’టివి ఇస్తూ వుండాలి. ఇందువల్ల వారు విశ్రాంతి తీసుకోవచ్చు. నిరాహార దీక్షల వల్ల బరువు తగ్గి వున్నట్లయితే పూడ్చుకోవచ్చు. ఈ ఉద్యమాలను అభిమానించే జనం కూడా, మధ్య, మధ్యలోచదువుల్లాంటివి చదువుకోవచ్చు. ఉద్యోగాల్లాంటివి చేసుకోవచ్చు. అయితే పేరుకు ‘కమర్షియల్’ బ్రేకులయినా, ప్రయోజనమున్నట్టుండాలి. పక్క చానెల్‌కు వెళ్ళకూడదు. ‘చూస్తూనే వుండాలి’. కాబట్టి ఉద్యమాలు నడపటానికే కాదు, బ్రేకులు ఇవ్వడానికి కూడా వ్యూహం ఉండాలి.

తెలంగాణ ఉద్యమానికి ఇలాంటి బ్రేకులు ఇవ్వడంలో ఆరితేరి పోయారు కేసీఆర్. అందుకనే బ్రేకుల వేళల్లో కూడా ఆయన అభిమానులూ, అనుచరులూ ఆయన్ను వదలి పక్క పార్టీలకు వెళ్ళరు. ఆ మధ్య ఆయన తన ఉద్యమానికి వరుసగా ఇచ్చిన రెండు బ్రేకుల్ని చూడండి. ఒక్కటి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కోసం ఆయన కుమార్తె కె. కవిత చేశారు. ఈ బ్రేకు అందర్నీ ఆకర్షించింది. విరామం ఇచ్చినట్టూ వుంది. ప్రయోజనమూ ఉంది. కేవలం కేసీఆర్ సామాజిక వర్గానికో, లేక కేసీఆర్ కుంటుంబానికో టీఆర్‌ఎస్ పరిమితమయిందన్న అతిపెద్ద ఆరోపణలకు, ఈ బ్రేకు అతి చిన్న సమాధానం.

అలాగే ఈ మధ్య జగన్మోహన రెడ్డి తన ‘నిరవధిక ఓదార్పు’కు కూడా ‘బ్రేకు’ ఇచ్చారు. ఈ ‘బ్రేకు’లో తల్లి విజయమ్మ ‘చేనేత కార్మికుల ఆకలి చావులు’, ‘రైతుల సమస్యలు’ అంటూ తెలంగాణలో చొచ్చుకు పోతున్నారు. అప్పుడు కేసీఆర్ ఏం చేశారు? బ్రేకుకు బ్రేకే సమాధానం అనుకున్నారో లేక ‘పక్క చానెల్లో బ్రేకు ఇచ్చిన వేళకే మనమూ బ్రేకు ఇవ్వాలి’ అని అనుకున్నారో ఏమో- ఇదే సమయానికి తెలంగాణ ఉద్యమాన్ని అలా ఉంచి, ‘విద్యుత్ కోత’ల మీద ఆందోళనలు మొదలుపెట్టారు.

మంద కృష్ణ కూడా అంతే. ఆయన చేపట్టిన ఎస్సీల వర్గీకరణ సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. కానీ, మధ్యమధ్యలో బ్రేకులు ఇచ్చి, ఆయన గుండెకు చిల్లులు పడ్డ బాలల గురించీ, వికలాంగుల గురించీ నిరసనలూ, నిరాహారదీక్షలూ చేస్తుంటారు. మోడీనే చూడండి. కాసేమపు ‘హిందూ త్వ’ఎజెండాను పక్కన పెట్టి ‘సద్భావనా యాత్ర’ మొదలు పెట్టలేదూ? లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ తన పార్టీ ప్రధాన కార్యక్రమాలను పక్కన పెట్టి, ‘సురాజ్య’ యాత్ర చేస్తున్నారా? లేదా?

కానీ, ఈ దేశంలో బ్రేకులు లేనిది కేవలం ఒక్క ఉద్యమానికే- అదే సామాన్యుడి బతుకు పోరు. అది వాడికి నచ్చినా నచ్చకపోయినా, సాగుతూనే ఉంటుంది. ఒక్క బ్రేకూ ఉండదు. కడకు మృత్యువే శుభం కార్డు వేస్తుంది.

-సతీష్ చందర్ 

3, సెప్టెంబర్ 2012, సోమవారం

తెలంగాణాలో విశాలాంధ్రోద్యమము - మూడవ భాగము

రెండవ భాగం తరువాయి

కొంత కాలము పట్టినది

ఈ విధముగ ప్రారంభమైన విశాలాంధ్రోద్యమము హైదరాబాదు నగరములో అడుగుపెట్టి, తెలుగు సీమలో వ్యాపించుటకు కొంతకాలము పట్టినది. ఉస్మానియా విశ్వవిద్యాలయమున జరిగిన మొట్టమొదటి ఆంధ్రాభ్యుదయోత్సవాల సందర్భమున అయ్యదేవర కాళేశ్వరరావుగారు హైదరాబాదుకు వచ్చి, విశాలాంధ్ర మహాసభను మాడపాటి హనుమంతరావు పంతులుగారి సలహాతో ప్రారంభించుటకు ప్రయత్నించిరి. ఈ సందర్భమున సుల్తాను బజారులోని ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యాలయమున ఇందుకొరకై ఒక సమావేశము జరిగియుండెను. ఆ సమావేశానికి అపుడు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసుకు ఉపాధ్యక్షులుగానున్న పల్లెర్ల హనుమంతరావు గారు అధ్యక్షత వహించిరి. సమావేశములో మాడపాటి హనుమంతరావు పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, పి.పుల్లారెడ్డి,  దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావు, యం.ఎస్.రాజలింగం మొదలైన వారు పాల్గొని, కొంతకాలము ఆగి ఈ ఉద్యమమును ప్రారంభింపవలెనని అభిప్రాయపడిరి.

అంకురార్పణ- ప్రజాస్వామిక వాతావరణము 


ఇట్టి పరిస్థితులలో హైదరాబాదు రాష్ట్రమున జనరల్ ఎన్నికలు జరిగినవి. మొట్టమొదటిసారిగా శాసనసభకు బాధ్యతవహించు ప్రభుత్వము ఏర్పడినది. కమ్యునిస్టులు తెలంగాణ పోరాటమును విరమించి శాసనసభలో ప్రవేశించిరి. ఈ ప్రజాస్వామిక వాతావరణములో విశాలాంధ్రోద్యమ వ్యాప్తికి తగిన తరుణము ఆసన్నమైనదని ఉద్యమకారులు అభిప్రాయపడినారు. ఈ అభిప్రాయముతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల కార్యాలయమున మీర్ అహమ్మదలీఖాన్ గారి ప్రేరణతో మీర్ అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావు, నందగిరి వెంకట్రావు గారలు 13 ఆగస్టు, 1953 నాడు సమావేశమయి, హైదరాబాదు రాష్ట్రములో విశాలాంధ్రోద్యమము ప్రారంభింపవలెనని నిర్ణయించి, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి గారలతో సంప్రదింపవలెనని నిశ్చయించిరి. ఈ సంప్రదింపులు 20 ఆగస్టు 1953 నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్సులోని ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల కార్యాలయములో జరిగినవి. ఈ సంప్రదింపులలో మాడపాటి హనుమంతరావు, అహమ్మదలీఖాన్, సురవరం ప్రతాపరెడ్డి, నందగిరి వెంకట్రావు , దేవులపల్లి రామానుజరావు, పల్లెర్ల హనుమంతరావు, సర్దారుల్లాఖాన్, భోజ్ రాజ్ గారలు పాల్గొని యుండిరి. ఆనాడు ఈ ఎనిమిది మంది సంతకాలతో 1953 సెప్టెంబరు 14 వ తేదీనాడు సాయంకాలం 5 గంటలకు పట్టభద్రుల కార్యాలయములో ఒక పెద్ద సమావేశమును జరుపుటకు నిర్ణయించబడినది. ఆ సమావేశమునకు నగరము నుండి, జిల్లాల నుండి నూరుమందికి పైగా ప్రతినిధులు ఆహ్వానింపబడిరి. సమావేశపు నోటీసు సురవరం ప్రతాపరెడ్డి గారు ఇంగ్లీషులో వ్రాసిరి. 14 సెప్టెంబరు 53 నాటి  సమావేశమున మాడపాటి హనుమంతరావు, పల్లెర్ల హనుమంతరావు, భోజ్ రాజ్, బొజ్జం నరసింహులు, కొమ్మవరపు సుబ్బారావు, ఆదిరాజు వీరభద్రరావు, ఎస్.శ్యామారావు, కమతం వెంకటరెడ్డి, మీర్ అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావు, సర్దారుల్లాఖాన్ , మడూరి శంకరలింగం, రంజిత్ సింగ్, భద్రదేవ్, నూకల సర్వోత్తమరెడ్డిగారలు పాల్గొనిరి. మాడపాటి హనుమంతరావుగారు ఈ సమావేశమునకు అధ్యక్షత వహించిరి. ఈ విధముగ హైదరాబాదు నగరమున, జిల్లాలలో విశాలాంధ్రోద్యమ అభిప్రాయాలు క్రమక్రమముగ వ్యాపింపసాగినవి. విశాలాంధ్ర మహాసభను స్థాపించవలెనని అభిప్రాయములు బలపడినవి. ఇది ఇట్లుండగా మద్రాసులో ఆంధ్రరాష్ట్రము కొరకు పొట్టి శ్రీ రాములు ఆత్మార్పణము తరువాత భారత ప్రభుత్వముచే ఆంధ్ర రాష్ట్ర స్థాపన ప్రకటన జరిగినది. ఈ పరిస్థితిలో 1953 ఏప్రిల్ నెలలో విజయవాడ యందు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యనిర్వాహక వర్గ సమావేశము జరిగియుండెను. ఈ సమావేశము మిక్కిలి ముఖ్యమైనది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘానికి సంజీవరెడ్డిగారు అధ్యక్షులుగా నుండిరి. ఈ సందర్భమున తెలంగాణా ప్రతినిధులు కొందరు విజయవాడకు వచ్చిన బాగుండునని కాళేశ్వరరావుగారు మాడపాటి హనుమంతరావు పంతులు గారికి వ్రాసిరి. మాడపాటి హనుమంతరావుగారు తమ ఆంతరంగికులను సంప్రదించి, అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావులను విజయవాడ వెళ్ళమని కోరిరి. వీరి విజయవాడకు వెళ్లకముందు కొండా వెంకటరంగారెడ్డిగారిని కలుసుకొనిరి. రంగారెడ్డి గారు కొంత ముందుగానో, ఆలస్యముగనో, అనివార్యముగ విశాలాంధ్ర ఏర్పడగలదనియు, ఈ విషయమై తమను కలుసుకొనిన ముగ్గురు, అనగా మాడపాటి హనుమంతరావు,అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావుగారలు పనిచేయుట తమకు సమ్మతమేనని ప్రోత్సహించిరి. విజయవాడలో ఈ ఉభయులకు ఘన స్వాగత మీయబడినది. అక్కడ ఈ ఉభయులు సంజీవరెడ్డి, కాళేశ్వరరావు మొదలైన కాంగ్రెస్ నాయకులతో సంప్రదించిరి. ఆంధ్రనాయకులు విశాలాంధ్రకు తమ సంపూర్ణ సముఖత్వమును వెల్లడించి, విశాలాంధ్ర ఉద్యమము తెలంగాణమునుండియే సాగవలెనని అభిప్రాయపడిరి. ఆనాడు విజయవాడలో యీ విషయమై జరిగిన బహిరంగ సభలో పై ఉభయులు ప్రసంగించిరి. దీని తరువాత హైదరాబాదు, సికిందరాబాదు మునిసిపల్ కార్పొరేషనులు హైదరాబాదు రాష్ట్ర విభజన జరిగి, హైదరాబాదు రాజధానిగ విశాలాంధ్ర ఏర్పదవలెనని తీర్మానించినవి. 2  వ జూన్ 1953  నాడు హైదరాబాదులో హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెసు సర్వసభ్య సమావేశము రామానందతీర్థ అధ్యక్షతన జరిగినది. అందులో విశాలాంధ్ర, ఐక్య కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రముల స్థాపన వాంఛించుచు తీర్మానము జరిగినది. ఈ సంఘటనలు హైదరాబాదు, సికిందరాబాదు నగరాలలోను తెలంగాణ జిల్లాలలోను విశాలాంధ్రోద్యమ వ్యాప్తికి బలమైన ఊతనిచ్చినవి. కమ్యునిస్టు పార్టీ విశాలాంధ్రను బలపరుచుచు ప్రకటన గావించినది. 1953 ఆగస్టు 14 ,15 తేదీలలో హిమాయత్ నగర్ లో తెలంగాణా రైతుసంఘ కార్యాలయమున బద్ధం ఎల్లారెడ్డిగారి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభ కార్యవర్గ సమావేశములో విశాలాంధ్ర కావలెనను తీర్మానము ఆమోదింపబడినది. తరువాత కొన్నినెలలకు ఈ ఆంధ్రమహాసభ సమావేశము ప్రతాపగీర్జి కోఠిలో జరిగినది. విశాలాంధ్రము సత్వరముగ ఏర్పడవలెనని  తీర్మానింపబడినది. 1953  ఆగస్టు 24  వ తేదీనాడు రెడ్డి విద్యార్ధి వసతి గృహమున విశాలాంధ్రోద్యమమును బలపరచుటకై మాడపాటి హనుమంతరావుగారి అధ్యక్షతన ఒక సమావేశము జరిగినది. ఇందులో దేవులపల్లి రామానుజరావు, వి.బి. రాజు, గురుమూర్తి, వెంకటేశం, వాసుదేవనాయక్,  అహమ్మదలీఖాన్, సర్దారుల్లాఖాన్, డాక్టరు రంగాచారిగార్లు విశాలాంధ్ర నిర్మాణము తొందరగా జరుగావలెనని ఉపన్యసించిరి. 1953  అక్టోబరు 2 వ తేదీన ఆంధ్రరాష్ట్ర స్థాపన జరిగినది. ఈ సందర్భమున కర్నూలులో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సమావేశమున హైదరాబాదు రాజధానిగ విశాలాంధ్ర స్థాపన జరుగావలెనని తీర్మానింపబడినది. ఇది గమనించదగినది. ఆంధ్ర రాష్ట్రావతరణ ఉత్సవాలలో పాల్గొనుటకు హైదరాబాదునుండి సుమారు రెండునూర్ల మంది విశాలాంధ్రోద్యమాభిమానులు కర్నూలుకు వెళ్లియుండిరి. 1953 అక్టోబరు ఒకటవ తేదీ సాయంకాలము కర్నూలులో తెలంగాణా ప్రతినిధుల సమావేశము జరిగినది. ఆ సమావేశములో అనంతశయనం అయ్యంగార్, బెజవాడ గోపాలరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైన ఆంధ్ర నాయకులు పాల్గొనిరి. సమగ్రమైన చర్చలు జరిగిన పిదప తెలంగాణా ప్రతినిధులు విశాలాంధ్రకు కృషి చేయడానికి నిర్ణయించిరి.


డా.దేవులపల్లి రామానుజరావు 

31, ఆగస్టు 2012, శుక్రవారం

కె.సి.ఆర్.అవాకులు..చెవాకులు..

                    సాధారణ శాంతి భద్రతలకు,   దేశ సార్వభౌమత్వానికి భంగకరం కాని   రీతిలో ఎవరైనా తమ  కోర్కెల  సాధన కోసం ఉద్యమాలు చెయ్యడం రాజ్యాంగబద్ధమే కనుక దాన్ని  ఎవ్వరూ తప్పుబట్టబోరు. ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ఉద్యమాన్ని కూడా  - అది పెడ పోకడలు పోనంతవరకూ-వ్యతిరేకించాల్సిన అవసరం  కూడా ఎవరికీ లేదు      ఈ దేశ ప్రజలకు - ప్రత్యేకించి  ఈ రాష్ట్ర ప్రజలకు -- ఉద్యమాలు కొత్తవేమీ  కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వారు చెప్పుకునే స్వేచ్చ ఉంది.    అయితే  ఇటీవల  కొందరు ప్రత్యేక తెలంగాణ  ఉద్యమ నేతలు     ప్రజలను రెచ్చగొట్టడానికి  బాధ్యతారహితంగా తమకు తోచినట్లు మాట్లాడడం   సర్వ సాధారణం అయిపోయింది.  ఎప్పటికప్పుడు తన ఉత్తేజ పూరిత ఉపన్యాసాలతో  జనాన్ని ఆకట్టుకుంటూ,  అబద్ధాలు చెప్పి  వారిని రెచ్చగొడుతూ,తన పబ్బం గడుపుకుంటూ వస్తున్న  టి.ఆర్.యస్.అధ్యక్షుడు కేసీఆర్ తాజాగా ఇందుకోసం  చరిత్ర వక్రీకరణకు కూడా పూనుకోవడం దారుణం.

                        ఇటీవల ఆయన తవ్వి తీసిన చారిత్రక విశేషం--నన్నయ్య తెలుగులో ఆదికవి కాడనీ,ఆయన   సంస్కృత   మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం మాత్రమే చేసినందున ఆయన కేవలం అనువాదకవి మాత్రమేననీ. ‘బసవపురాణం'రాసిన పాల్కురికి సోమనాథుడు తెలుగులో ఆదికవి అని తేల్చారాయన.’ ఈ ముచ్చట కూడా ఆంధ్రోల్లు అబద్ధం చెప్తరు. నేను ఇట్లా అంటే వాల్లు కొట్లాటకు వస్తరు. పక్కన ఓ కవి (నందిని సిద్దారెడ్డి) ఉండడం వల్ల ఈ మాట.ధైర్యంగా చెబుతున్నా’ ననికూడా సెలవిచ్చారాయన.

                           అలా కేసీఆర్ అలనాటి మహాకవులకు కూడా నేటి మన ప్రాంతీయ తత్త్వపు బురదను అంటించాలని చూడడం క్షమించరాని నేరం.పాల్కురికి సోమనాథుడు నేడు తెలంగాణ అని పిలువబడుతున్న ప్రాంతానికి చెందినవాడనే నమ్మకంతోనే, మితిమీరిన ప్రాంతీయ అభిమానంతో  ఆయన  అలా సోమనాథ కవిని ఆదికవిని చేయబూనారనేది స్పష్టం.  నన్నయ్య నేడు ఆంద్ర ప్రాంతంగా పిలువబడుతున్న ప్రాంతానికి చెందినవాడనేది నిర్వివాదాంశం. అయితే మహాభారత అనువాదాన్ని ఆరంభించిన నన్నయ్య భట్టు (క్రీ.శ.1026 ప్రాంతం) కంటే ‘కుమార సంభవ' కావ్యం రాసిన నన్నెచోడుడు ముందరివాడని  మానవల్లి రామకృష్ణ కవి గారి వంటి ప్రముఖ విమర్శకులు  కొందరు వాదించినా, నన్నయ్యే ఆదికవి అని    హెచ్చుమంది సాహిత్య చరిత్రకారులు తేల్చారు..అందుచేతనే తెలంగాణకు చెందిన  మహాకవి సినారె ‘ఆదికవి నన్నయ్య అవతరించిన నేల’ అంటూ ఓ సినీ గీతంలో  కూడా రాశారు. ఇక ఇప్పుడు , క్రీ.శ.1300 ప్రాంతంలో  ‘పండితారాధ్య చరిత్రము' రాసిన  పాల్కురికి సోమన తెలుగులో ఆదికవి  అంటున్నారు కేసీఆర్. పోనీ   భారతం అనువదించిన నన్నయ్య లాగానే  ‘కుమారసంభవం' అనే సంస్కృత కావ్యాన్ని అనువదించిన నన్నెచోడుడు, ‘గణిత సార సంగ్రహం ‘ అనే అనువాద గ్రంథం రాసిన పావులూరి మల్లన్నలు  కూడా  అనువాద కవులే కనుక   కేసీఆర్ లెక్క ప్రకారం  వారిరువురూ కూడా  ఆదికవి  గౌరవానికి  తగినవారు కాదనుకుందాం.  తేనెలొలికే తేట తెలుగులో ‘సుమతీ  శతకం', ‘నీతి శాస్త్ర ముక్తావళి' అనే రాజనీతి గ్రంథం రాసిన  బద్దెన కూడా వారి దృష్టిలో ఆదికవి గౌరవానికి నోచుకోలేదా?  పోనీ చాళుక్య యుగానికే    చెందిన తెలుగు కవులు  వేములవాడ భీమకవి, అమృత నాథుడు వీరి కంటికి ఆనలేదా ?  నేటి తూర్పు గోదావరి జిల్లా దాక్షారామానికి చెందిన మల్లికార్జున పండితారాధ్యుడు (జననం క్రీ.శ.1140) ‘శివ తత్త్వ సారం’ అనే  తెలుగు శతకం రాసినట్లు కూడా కేసీఆర్ కు తెలియకపోవడం చిత్రం !   మరీ విచిత్రమేమిటంటే ఆ మల్లికార్జున పండితారాధ్యుని అనంతరం ‘మల్లికార్జున పండితారాధ్య చరిత్ర' పేరుతో క్రీ. శ.1300 లో కావ్యం రాసిన పాల్కురికి సోమనాథుడు తెలుగులో ‘ఆదికవి ‘ అని శ్రీవారు తీర్మానించడం !!   కేసీఆర్ గారి ఈ చారిత్రక హ్రస్వ దృష్టికి కారణం మితిమీరిన వారి ప్రాంతీయ దురభిమానమేనని వేరుగా చెప్పాల్సిన పని లేదనుకుంటాను.  ఇప్పుడిక మల్లికార్జున  పండితారాధ్యుని కంటే ఆయన చరిత్రను ద్విపద కావ్యంగా రాసిన పాల్కురికి సోమన ముందరికాలానికి చెందినవాడని నిరూపించే  దుస్సాహసానికి కేసీఆర్ పూనుకోరు కదా !!!

                    ఇక కేసీఆర్ చే  ‘ఆదికవి'గా గుర్తించబడిన పాల్కురికి సోమన వాస్తవంగా  ఏ ప్రాంతానికి చెందినవాడో విచారిద్దాం. ‘బసవ పురాణం', ‘మల్లికార్జున పండితారాధ్య చరిత్ర' అన్న కావ్యాలు రాసిన పాల్కురికి సోమన ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుని సమకాలికుడని కొందరి భావన. దీనికి ఆధారం పిడుపర్తి సోమన అనే కవి రాసిన ‘బసవ పురాణం'లో పాల్కురికి సోమన ప్రతాపరుద్రుని కాలంలో ఉండేవాడని చెప్పడం. అతడు బహుశా క్రీ.శ.1296-1323 మధ్య కాలంలో ఓరుగల్లును పాలించిన  రెండవ ప్రతాపరుద్రుడికి సమకాలికుడని  మనం  భావించినా, అతడు ఓరుగల్లుకు చెందినవాడని నిర్ధారించడం కష్టం.ఓరుగల్లుకు 70 మైళ్ళ దూరంలో ఉన్న పాలకుర్తే ఒకనాటి సోమనాథుని స్వస్థలం అయినట్టి పాలకురికి అని కొందరి భావన. కాని ఈ సిద్ధాంతం సర్వజనామోదం పొందలేదు. సువిశాలమైన కాకతీయ సామ్రాజ్యంలో నాడు దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాలు అంతర్భాగాలు. ఆ సువిశాల సామ్రాజ్యంలో ప్రతాపరుద్రునికి సమకాలికునిగా సోమనాథుడు   ఉన్నాడని అంటే, వరంగల్ జిల్లా పాలకుర్తే    సోమనాథుని స్వస్థలం పాలకురికి అని నిర్ధారించబూనడం  తొందరపాటు కాగలదు. పాలకుర్తి , పాల కురికి గ్రామనామాలు వేర్వేరు. తెలంగాణ వీరవనిత ‘చాకలి ఐలవ్వ ‘ గా ప్రసిద్ధురాలైన చిట్యాల ఐలమ్మ స్వస్థలం పాలకుర్తి. ఇక ఇప్పుడు నాటి కాకతీయ సామ్రాజ్యంలో పాలకురికి గ్రామం ఎక్కడ ఉన్నదో పరిశీలిద్దాం.

              నిజాం  రాష్ట్రపు గ్రామనామాల పట్టికను నిశితంగా పరిశీలించిన విఖ్యాత పరిశోధకులు డా.చిలుకూరి నారాయణ రావు వరంగల్ జిల్లాలో అసలు పాలకురికి అనే పేరుగల గ్రామమే లేదని తేల్చారు.  మరో పరిశోధకులు ఆర్. నరసింహాచార్యులు గోదావరి జిల్లాలోని పాల కురికి గ్రామమే సోమనాథుని జన్మస్థలమని   పేర్కొన్నారుగానీ ,  వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలలోనూ పాలకురికి పేరుతో గ్రామమేదీ లేదు.  కిట్టెల్ పండితుడు  దక్షిణ మహారాష్ట్రలో పాలకురికి పేరుగల ఒక గ్రామముందని పేర్కొన్నారు.అయితే సోమనాథుని భాష, శైలి వగైరాలను పరిశీలిస్తే అతడు దక్షిణ మహారాష్ట్రకు చెందినవాడయ్యే అవకాశమే లేదు.కన్నడ భాషలో ‘కురికి', ‘గురికి' శబ్దాలు గ్రామానికి పర్యాయపదాలు.మన తెలుగులో కుర్రు (కసుకుర్రు,బోడసకుర్రు మొ.), కుచ్చి (పోతుకుచ్చి మొ.), తమిళ భాషలో కురిచ్చి (పాంచాల కురిచ్చి మొ.) శబ్దాలు ఇలాంటివే. కుర్రు శబ్దం కొన్ని గ్రామనామాలలో కాల క్రమంలో ‘కుర్తి' (పాలకుర్తి, చీమకుర్తి మొ.) గానూ, మరికొన్ని గ్రామనామాలలో ‘కూరు' (నిమ్మకూరు, పొదలకూరు)గానూ రూపాంతరం చెందింది. అలా పాలకుర్తి గ్రామనామం యొక్క  పూర్వరూపం ‘పాలకుర్రు' అవుతుందే కానీ ‘పాలకురికి' అయ్యే అవకాశమే లేదు.

పైపెచ్చు కురికి, గురికి శబ్దాలతో అంతమయ్యే గ్రామనామాలు కన్నడ దేశంలోనే ఉన్నాయి.సోమనాథుడు తెలుగులో మహాకవి. కన్నడ  భాషలోనూ    కొన్ని రచనలు చేసాడు. ఉభయ భాషలు మాట్లాడే ప్రజలు ఆయన్ని అమితంగా గౌరవిస్తారు.అతడి భాష, శైలి వగైరాలు  కూడా అతడు కన్నడ భాషా ప్రభావం ఉన్న ప్రాంతానికి చెంది ఉంటాడని సూచిస్తున్నాయి. కర్నాటక రాష్ట్రం తుమ్కూరు తాలూకాలో పాలకురికి పేరు గల ఓ గ్రామం ఉంది.ఇది మన అనంతపురం జిల్లా మడకసిరకు కేవలం ఇరవై మైళ్ళ దూరంలో ఉంది.కన్నడిగులు దీనినిప్పుడు హాలకురికి
అంటున్నారు.  ఇదే సోమనాథుని జన్మస్థలమని  డా. చిలుకూరి అభిప్రాయపడ్డారు.ఇది సమంజసమే.ఎందుకంటే కన్నడ భాషలో ‘ప' శబ్దం ‘హ' గా పలుకబడుతుంది. పల్లిని వారు ‘హళ్లి' అంటారు. పులిని ‘హులి' అంటారు.పామును ‘హావు' అంటారు. మనం ‘పాల పరిమి ‘ అనే గ్రామాన్ని వాళ్ళు ‘ హాల హరివి ‘ అంటారు..అలానే పాల కురికి గ్రామనామం  కన్నడిగుల పలుకుబడిలో ‘హాల కురికి'గా మారిందనేది సుస్పష్టం.

                       ఇంత చర్చించిన తరువాత , భాషా సరిహద్దులు లేని నాటి కాకతీయ రాజ్యంలోని  (నేటి కర్నాటక రాష్ట్రంలోని ) పాలకురికి కి చెందిన  ఓ మహాకవిని , ఆయన్ని  తనకు తాను  నేటి తెలంగాణ ప్రాంతానికి చెందినవాడని భావించేసి, ఆ కారణంగా ఆయన్ని  కూడా  తన ప్రాంతీయ దురభిమానపు కళ్ళద్దాలలోంచి చూస్తూ,  (నేటి  కోస్తా ఆంద్ర ప్రాంతానికి చెందిన )   నన్నయ్య స్థానంలో ఆదికవిని చేయబూనే కేసీఆర్ చర్య  ఎవరికైనా జుగుప్స కలిగించక మానదు. ఒకవేళ ఆ మహాకవి నిజంగా తెలంగాణ కు చెందినవాడే అనుకున్నా, ఏరకంగా చూసినా ఆయన తెలుగులో  ఆదికవి కాబోడనేది సుస్పష్టం.రాజకీయనేతలు జనం మనోభావాలు రెచ్చగొట్టడానికి పలికే పచ్చి అబద్ధాలలో భాగమే కేసీఆర్ పలికిన ఈ అవాకులు, చెవాకులు.అంతకంటే వాటికి ఎటువంటి విశ్వసనీయత లేదు.

                           నేటి కోస్తా ఆంద్ర ప్రాంతానికి చెందినంతమాత్రం చేత నన్నయ్య తెలుగులో ఆదికవీ, తెలుగు ప్రజల ఆరాధ్యకవీ కాకుండా పోతాడా ? భాషకు రాష్ట్ర, ప్రాంతీయ ఎల్లలు విధించడం సమంజసమేనా ? నేటి తెలంగాణ ప్రాంతానికి చెందిన  సురవరం ప్రతాపరెడ్డి, వానమామలై వరదాచార్యులు, పల్లా  దుర్గేశ్వర శర్మ, కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, సినారె, బిరుదురాజు రామరాజు వంటి  గొప్ప సాహితీవేత్తలను  ఎటువంటి సరిహద్దులు లేకుండా ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన  తెలుగువారైనా అభిమానిస్తారు. ఇందుకోసం ఆ అభిమానులు   కూడా తప్పనిసరిగా నేటి తెలంగాణ ప్రాంతంలో పుట్టాల్సిన అవసరమేమీ లేదు.భాషా, సాహిత్యాలు, కళలను  అభిమానించడానికి, ఆ యా సాహితీమూర్తులు, కళాకారులను ఆరాధించడానికి  మన  మనస్సులో మనం ఏర్పరచుకున్న ప్రాంతీయ అడ్డుగోడలు ఎన్నటికీ ఆటంకం కాబోవు.ఎంచేతంటే అవి సార్వకాలీనమైనవేకాక, సార్వజనికమైనవి కూడా!!

         తెలుగుతల్లి స్థానంలో కేసీఆర్ తెలంగాణ తల్లిని కొత్తగా ప్రవేశపెట్టారు.  ఆమేమో మాత అట; తెలుగుతల్లేమో దయ్యమట.తెలుగు ఆణెము - అంటే తెలుగు మాట్లాడే ప్రాంతం - అనే అర్థంలో ఆ ప్రాంతాన్ని తెలంగాణము  అన్నారని కేసీఆర్ మరచినట్లున్నారు.  యాసలో కొంత తేడా ఉన్నా,  అక్కడి వారిదీ, ఇక్కడి  వారిదీ- ఇరువురిదీ తెలుగు  మాట్లాడే ప్రాంతమే. కాకపోతే ఈ రెండు ప్రాంతాలవారూ  సుదీర్ఘ కాలంపాటు పరాయి పాలనలో మగ్గారు. ఒకరు నిజాం  నిరంకుశత్వంలో కనలిపోతే, మరొకరు బ్రిటీష్ సామ్రాజ్యవాదుల పదఘట్టనల కింద నలిగి నల్లేరయ్యారు. ఆంద్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు నిజాం పాలన యొక్క దాస్య సంకెళ్ళనుంచి ప్రజల్ని విముక్తం చేసే పోరాటంలో ముందు పీటీన నిలిచాయి. ఆ పోరాటంలో తెలంగాణ వీరులతో భుజం కలిపి నిలిచిన ఎందఱో కోస్తా ఆంద్ర ప్రాంత యోధులు సైతం నేలకొరిగారు.  ఇప్పుడు కొత్తగా ‘ఒకరిది తెలుగు భాష  - ఇంకొకరిది తెలంగాణ భాష ‘ అంటూ శ్రీవారు కొత్త పల్లవి అందుకున్నారు. ఇద్దరిదీ తెలుగు భాషే కాకపోతే విశాలాంధ్ర నిర్మాణానికీ, అందుకోసం  ముందుగా తెలంగాణ  విముక్తికీ , కోస్తా ఆంద్ర ప్రజలు ఎందుకు ఉద్యమించారు ? ఎందఱో త్యాగధనులు ఆ సాయుధ రైతాంగ ఉద్యమంలో అసువులెందుకు  కోల్పోయారు ?  

                   ‘ఆంధ్రమాత స్థానంలో ఆంధ్రోల్లు తెలుగుతల్లిని  కొత్తగా ముందుకు తీసుకు వచ్చా ‘రంటూ  మరో పచ్చి అబద్ధం పలికారు కేసీఆర్.  నిజానికి ఆంధ్రము , తెలుగు - ఈ రెండు పదాలనూ తెలుగువారు ఒకే అర్థంలో ప్రయోగించారు.’మాతా నీకిదే వందనం..ఆంద్ర మాతా నీకిదే వందనం' అనీ ,‘ మా తెలుగుతల్లికీ మల్లెపూదండ' అనీ, ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా..గతమెంతో ఘన కీర్తి కలవోడా..’ అనీ తెలుగు ప్రజలు ఇష్టంగా పాడుకునే   పాటలన్నీ  తెలుగు కవులు ఇంచుమించుగా ఒకే కాలంలో సృష్టించారు.  ఇంతకాలం విభజనవాదులు తెలంగాణ పది జిల్లాలలో ‘ఆంద్ర' అనే శబ్దం మీద వ్యతిరేకత కలిగించే ప్రయత్నం చేశారు.ఇప్పుడేమో ఏకంగా ‘తెలుగు’అనే శబ్డంపైనే వారు కత్తి కట్టారు. ప్రజల్ని ఇంకా ఎక్కడికి తీసుకుపోదలచారో వారు ? ‘తెలుగు', ‘ఆంద్ర' శబ్దాలను ఒకే అర్థంలో వాడారు కనుకనే మెదక్ జిల్లా జోగిపేటలో తెలుగువారిని ఏకం చేసే ఉద్దేశంతో జరిపిన సభను  ‘ప్రథమ ఆంద్ర మహాసభ ‘అన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ లోని తెలుగువారు స్థాపించుకున్న గ్రంథాలయానికి ‘శ్రీ కృష్ణదేవరాయ ఆంద్ర భాషా నిలయం' అని పేరు పెట్టుకున్నారు.బొగ్గుల కుంటలో ‘ఆంద్ర సారస్వత పరిషత్తు' వెలిసింది.’ఆంద్ర మహిళా సభ' అలాగే స్థాపించుకున్నారు.మాడపాటి హనుమంతరావు గారిని ‘ఆంద్ర పితామహ' అని పిలుచుకున్నారు. తెలుగువారిని ఒక్కటి చేసి,  భాషాభివృద్ధి ద్వారా వారి మధ్య సాంస్కృతిక సమన్వయం  సాధించే ఉద్దేశంతో ఏర్పరచిన  తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం సంగతి సరేసరి. అప్పుడు పనికొచ్చిన ‘ఆంద్ర', ‘తెలుగు' పదాలు ఇప్పుడెందుచేత  గిట్టనివిగా అయ్యాయో శ్రీవారే సెలవివ్వాలి. అంతేకాదు;  ‘ఆణెము ‘ అంటే దేశము అనే అర్థం ఉన్న  కారణంగానే ‘తెలుగు మాట్లాడే ప్రదేశము ‘అనే అర్థంలో తెలంగాణ అనే శబ్దం ఏర్పడితే, తీరా ఇప్పుడు  ‘మా  ప్రజలు మాట్లాడేది తెలుగు కాదు ; మా తల్లి తెలుగుతల్లి కాదు’ అని నొక్కి వక్కాణిస్తున్న  కేసీఆర్ తన మాటలవెనుక ఆంతర్యమేమిటో కూడా సెలవివ్వాలి. ఆత్మలు ఉండడమే కనుక నిజమే అయితే ‘తెలుగువాడవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడేదవు సంగతేమిటిరా; అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా ?’ అని చురకలు అంటించిన కాళోజీ నారాయణరావు గారి ఆత్మ  కేసీఆర్ తీరు చూసి ఘోషించి తీరుతుంది.
                        
                  కోస్తా ఆంద్ర, రాయలసీమ ప్రజలను కించపరుస్తూ, ‘అక్కడ పన్నుల ఎగవేత ఎక్కువ.వాల్లు చట్టాలను ఉల్లంఘిస్తారు.’ అంటూ కొత్త రాగాలు తీస్తున్నారు   కేసీఆర్. రాష్ట్రంలోని ఎన్నో పరిశ్రమలు వాటి కార్యాలయాలను సౌలభ్యం కోసమని హైదరాబాద్ లో పెట్టుకుని, అక్కడే పన్నులు చెల్లిస్తున్న కారణంగానే హైదరాబాద్ ఆదాయం, అందుచేత తెలంగాణ ఆదాయం ఎక్కువగా  కనిపిస్తూ ఉన్నదనే వాస్తవాన్ని  అక్కడి ప్రజలు గ్రహించకుండా  ఇంకా ఎంతకాలమో  తాను వారి కళ్ళకు గంతలు కట్టలేనని   కేసీఆర్ గుర్తిస్తే మంచిది.ఒకప్రాంత ప్రజలంతా నిజాయతీపరులుగానూ,   మరో ప్రాంత ప్రజలంతా పన్ను ఎగవేతదారులుగానూ ఉండడం ఎలా సాధ్యమో, ఈ కుతర్కం పన్నిన కేసీఆరే వివరించి ఉంటే బాగుండేది.

                   విద్వేషం అనే విషం చిమ్మే ఇటువంటి వారి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.

ఇలాంటివారిని జనం నిలదీసి, ప్రశ్నించే రోజు రావాలని కోరుకుందాం.

                                                                                                            -ముత్తేవి రవీంద్రనాథ్

29, ఆగస్టు 2012, బుధవారం

తేనెలొలుకు తెలుగు

నేడు ప్రపంచంలో ఎన్నో ప్రాంతీయ భాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన మాట వాస్తవం. వాటిలో తేనెలొకు మన తేట తెలుగు భాష ప్రస్తుతాని కైతే ప్రమాదం లేదని ఢంకా భజాయించి చెప్పొచ్చు. వేయి సంవత్స రాలకు పైగా తలవంచకుండా రెపరెపలాడుతున్న ఘనచరిత్ర కలి గిన మాతృ భాష మనది. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’గా పేరుగాం చిన తెలుగు వెలుగు... వెలవెలబోయే పరిస్థితి కనీసం మనత రం బ్రతికి ఉండగా రాదు! తెలుగు భాష మహా సముద్రం వంటిది. కొన్ని ఇతర భాషా పదాలు ప్రవాహాలుగా వచ్చి చేరినంత మాత్రాన ఇందులో కాలుష్యం పెరగదు! అయితే, నానాటికీ మనం పెంచి పోషించుకుంటున్న ‘మమ్మీ, డాడీ’ల సంస్కృతి ఇలాగే కొనసాగితే మాత్రం... తెలుగు భాషకు భవిష్యత్తులో ఆటంకం తప్పదు. కనుక, మన తెలుగు భాషను కంటికి రెప్పలా కాచుకునే బాధ్యత నేటి తెలుగు యువలోకానిదే అని తెలియజేస్తూ... ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా జరుపుకుంటున్న నేపథ్యంలో ‘సూర్య’ ప్రత్యేక కథనం...

logo1
భావ వ్యక్తీకరణలో భాష అత్యంత ముఖ్యం. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని భాషల ఆధిపత్యమే నడుస్తున్నా... ఎవరికివారికి మాతృభాషపై ఉన్న మమకారం ప్రత్యేకమైందే. ఇలా మాతృభాష గురించి చె ప్పేటప్పుడు మన తెలుగు గురించి మరింత ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే, మాటకై నా... పాటకైనా మన శైలిలో ఉన్న ప్రత్యేకతే వేరు. అమ్మలా కమ్మనైనది.. మాధుర్యంలో అమృతానికి మించినది.. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌’గా గుర్తింపు పొందింది.. ఇలా మన తెలు గు భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అచ్చతెలుగు నుడికారాలు, ఛందస్సులు, పద ప్రయోగాల్లో చురుక్కులు, చమక్కులు, ప్రాంతాలవారీగా యాసలు... మొత్తంమీద మన తెలుగు నిజంగా వెలుగు భాషే. ద్రవిడ భాషల్లోకెల్లా మన అక్షర మాలది ప్రత్యేకమైన గుర్తింపు. ‘తెలుగదేల యన్న దేశంబు తెలుగేను, తెలుగు రేడ నేను తెలుగొకొండ, ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి, దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు. అలా అనడమే కాదు... మన తెలుగు గొప్పదనం దశదిశలా చాటేం దుకు తన వంతు కృషి చేశారు. ఆదికవి నన్న య మొదలు... ఈకాలం ప్రముఖుల వరకూ ఎందరో మహానుభావులు మాతృభాష గొప్ప దనాన్ని మరింత ఇనుమడింప చేశారు.

మన భాషలో, భావనలో... మన సంస్కృతి లో, సంప్రదాయంలో అన్నింట్లోనూ తెలుగే. అలాంటి తెలుగు భాషాభ్యున్నతి కోసం ఎనలే ని సేవ చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. వాడుక భాషలో భోధన జరగాలంటూ... రామ్మూర్తి పంతులు ఉద్యమించారు. దాన్ని ఆచరణ సాధ్యం చేసి చూపారు. వ్యవహారిక భాషా పితామహుడిగా కీర్తి గడించారు. ఇలా తెలుగు వెలుగు కోసం... ఓ చిలకమ ర్తి, ఓ గురజాడ, ఓ కందుకూరి వీరేశలింగం వంటి ఎందరో మహానుభావులు కృషి చేశా రు. ఆంధ్రులైన మనమే కాదు... తెల్లదొరలు సైతం మన భాషను చూసి మురిసిపోయారు. చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ లాంటి మహాశయులు... తెలుగు భాష వ్యాప్తికి తమవంతు చేయూత నందించారు. తెలుగును భారత ప్రభుత్వం కూడా ప్రాచీన భాషగా కూడా గుర్తించింది.

అయితే ప్రపంచకీరణ నేపథ్యంలో ఆంగ్ల విద్య వ్యామోహంలో పడి ఇప్పుడు తెలుగును చిన్నచూపు చూస్తున్నారు. ఈ పరిణామం సాహితీవేత్తల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఎంతో ఘనచరిత్ర ఉన్న మన తీయ నైన తెలుగును పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని, తెలుగు భాషను కాపాడుకోవాలని పలువురు భాషా వేత్తలు పిలుపిస్తున్నారు

భాషా సేవలో మనమెక్కడ?

శాస్త్ర / సాంకేతిక పారిభాషిక పదాలకు (Scientific / Technical Jargon) తెలుగు పదాలు లేకపోవడం అనర్థం కాదు, కానీ ఉంటే దైనందిన విద్యార్థి జీవితంలోనూ తెలుగును ఉపయోగించే అవకాశం ఉంటుం ది. ఒక భాష బ్రతికి ఉండాలంటే దానికో ప్ర త్యేక దినోత్సవం పెట్టి ఉత్సవాలు చెయ్యటం కాదు! పిల్లలతో ఆ భాషలోనే సంభాషిస్తూ... భాషకు కొత్త ఊపిరూదాలి. నిజానికి! Mummy, Daddy అని పిలిచినంత మా త్రాన అమ్మ, నాన్న అన్న భావనలోని ప్రేమ తగ్గదు! ఎన్నో సాంస్కృతిక, రాజకీయ అంత రీకరణలు (Transformations), యుద్ధా లు తట్టుకుని చరిత్రలో నిలిచిన తెలుగు భాష కు మన రోజువారీ సంభాషణలే ప్రాణవా యువులు అవుతాయనుకోవటం సరి కాదు! చేయవలసిన పని మరొకటి.

అదేంటంటే తెలుగు భాషలో పుస్తకాలు వెలువరించటం, తెలుగు పుస్తకాలు కొని / అరువు తీసుకొని చదవటం, వెలుగులోకి రాని మంచి పుస్తకాలను నలుగురికి పరిచయం చేయటం ఇవి ఎంతమంది చేస్తున్నారు? ‘ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు అన్న సామెత’ మనదే! దురదృష్టవ శాత్తూ అది మనకు చక్కగా వర్తిస్తుంది! నేటి అవసరాలకు తగినట్టు కొత్త పదాలతో భాషను పరిపుష్టం చేయటం ఎంత అవసరమో కాలానుగుణంగా వస్తున్న సామెతలు, లోకోక్తులు, జాతీయాలు తెలుసుకుని వాటిని అవసరమైనప్పుడు వాడు కోవటం కూడా భాషావికాసానికి అవసరం! మన దృష్టిలో అవన్నీ ఎప్పుడో బళ్ళో చదువు కుని వదిలేసిన సంగతులు! సంధులు, సమా సాలు, ఛందస్సు అనవసర కష్టాలు.

తెలుగు భాషోద్యమం...

 
annamayya1 


సుమారు శతాబ్దం చరిత్ర కలిగిన వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యుడు శ్రీ గిడుగు రామ మూర్తి పంతులు. ఆయన ఈ ఉద్యమాన్ని ప్రా రంభించి దాదాపుగా ఒకటిన్నర శతాబ్దం కా వొస్తోంది. గ్రాంథిక భాషలో రచనలు చేయని వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూసే రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే భాషలోనే రచనలు ఉం డాలని తిరుగుబాటు చేసి, ఏటికి ఎదురీది, స వాళ్ళను ఎదుర్కొని వ్యావహారిక భాషను ప్రా చుర్యంలోకి తెచ్చిన కార్యసాధకుడు ఆయన. గిడుగు కాదు పిడుగు అనిపించుకున్నాడు. 1966 లో మనరాష్ట్రంలో అధికార భాషా సం ఘం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయా ల్లో తెలుగు భాషను అమలు చెయ్యాలన్నది ఆ సంస్థ ప్రధాన ఆశయం. 45 ఏళ్ల తర్వాత కూ డా పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఐక్యరాజ్య స మితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యా ప్తంగా అంతరించిపోతున్న మాతృభాషల్లో తె లుగు కూడా ఒకటని, దీని కి రెండు దశాబ్దా లలోపు సమయముందని తెలుస్తోంది. ఇది మాతృ భాషాభిమానులందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.


kavulu 
ఇవి చేయాలి...

1. అధికార భాషా సంఘం చిత్తశుద్ధితో పని చేసి వెంటనే కార్యాలయాలన్నిటిలో తెలుగు భాషనే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పదకోశాలలో కృత్రిమమైన అను వాదాలను సవరించాలి. ప్రజలకు అర్థమయ్యే విధంగా అనువాదాలుండాలి గానీ అనువాద కుల పాండిత్య ప్రతిభ ప్రదర్శనకు వేదిక కాకూడదు.
2. బహుళ వాడుకలో ఉన్నా ఇతర భాషా ప దాలను యథాతధంగా వాడటం వలన నిరక్ష రాస్యులకు కూడా సులువుగా అర్థమవుతా యి. ఉదాహరణకి రైలు, బస్సు, రోడ్‌ మొద లయినవి. వీటిని మన భాషా పటిమతో అను వాదం చేసి అందర్నీ గందరగోళపరిచే పని మానుకుంటే అదికార భాష అమలు సులభసాధ్యమవుతుంది.
3. ప్రపంచీకరణ నేపధ్యంలో ఆంగ్ల అవసరా న్ని సాకుగా చూపి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్న కార్పోరేట్‌ కాలేజీలను నియత్రించాలి.

4. ప్రాచీన భాష హోదా కేవలం నిధులు సాధించడం, ఖర్చు చెయ్యడం కోసం కాక వాస్తవంగా పరిశోధన, ప్రచురణ మొదలైన వాటికోసం మాత్రమే... కావాలి.
5. ఏ విషయాన్నైనా ప్రజాబాహుళ్యం లోకి చొచ్చుకుపోయేటట్లు చేసేవి వివిధ కళారూ పాలు. వీటిని తగిన రీతిలో ప్రోత్సహించినపు డు భాష ప్రజల్లోకి వెడుతుంది.
6. మన భాషలోని ప్రముఖ కావ్యాల్ని, నాట కాల్ని... అన్నిటినీ ఇతర భాషల్లోకి అనువాదా లు చేయించాలి. అంతేకాదు. వాటిని ఇతర భాషా ప్రాంతాల్లో ప్రచారం చెయ్యడానికి అవ సరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి ఆయా ప్రాంతాల కళారూపాల సహకారం తీసుకోవ చ్చు. పరభాషలో సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు తెలుగు భాషా వ్యాప్తికి ఉపకరించే కథలను, సన్నివేశాలను ఎన్నుకోవాలి.

తెలుగు మహాసభలు...
 
ప్రపంచ తెలుగు మహాసభలు మొదటిసారిగా హైదరాబాదులో 1975 నిర్వ హించారు. ఆ సందర్భంగా ఎందరో తెలుగు ప్రముఖుల్ని సన్మానించారు. కొన్ని ముఖ్యమై న పుస్తకాల్ని ప్రచురించారు. ఆనాటి సభల జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది. 1981 రెండవ ప్ర పంచ తెలుగు మహాసభలు కైలాలంపూర్‌ (మ లేషియా)లో జరుగగా... 1990 మూడవ ప్ర పంచ తెలుగు మహాసభలు మారిషస్‌లో జరి గాయి. ఆ తరువాత 37 ఏళ్ళకు ఇప్పుడు మ ళ్లీ రాష్ట్రంలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి.

నాలుగో ప్రపంచ తెలుగు మహాసభ లను డిసెంబర్‌ 27 నుంచి 29వ తేదీ వరకు తిరుపతి పట్టణంలో నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. మహాసభల నిర్వహణ పై సీఎం కిరణ్‌ మంగళవారం సమీక్ష నిర్వ హించారు. ఈ సభల నిర్వహణకు రూ.25 కోట్లు మంజూరు చేయాల్సిందిగా సీఎం అధి కారులను ఆదేశించారు. మొదటి విడతగా రూ.5 కోట్లు విడుదల చేయడానికి సీఎం అంగీకరించారు. మహాసభల నిర్వహణ లో టీటీడీ, తెలుగు వర్సిటీ, సాంస్కృతిక వ్య వహారాల శాఖ, సమాచార శాఖలు ప్రధాన బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. సమా వేశంలో మంత్రులు వట్టి వసంతకుమార్‌, రఘువీరారెడ్డి, శ్రీదర్‌బాబు, డీకే అరుణ పాల్గొన్నారు.

మంత్రి వట్టి వసంతకుమార్‌ మా ట్లాడుతూ.. 1975లో ప్రపంచ తెలుగు మహా సభలు మొదటిసారి గా హైదరాబాద్‌లో నిర్వ హించారని.. 37 ఏళ్ల అనంతరం డిసెంబర్‌ 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తు న్నామని వెల్లడించారు. ఈ సభలకు 16 దేశా ల నుంచి వెయ్యిమంది ప్రతినిధులు హాజరు కానున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో సంగీత, నాటక, లలితకళా అకాడమీలను పునరుద్ధరిం చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

గిడుగు కాదు పిడుగు

 
Gidugu_Ramamurthy2 
ఆంధ్రభారతి కృత్రిమ (గ్రాంధిక) అలంకారాల భారంతో కుంగి కృశిస్తూ కళ తిప్పి ఉన్న సమ యంలో సజీవమైన ప్రజల వాడుక భాషా ప్రయోగాల తో ఆంధ్రభారతికి నవ్యత చేకూర్చడానికి ఒక మహోద్య మం నడిపిన మహామనిషి గిడుగు రామ్మూర్తి పంతు లు. కాలం మారింది... సాహిత్యం సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోవాల్సి ఉంది. వ్యవహారిక భాషతోనే ఇది సాధ్యమన్నది ఆయన దృఢ విశ్వాసం. సాధారణంగా మార్పును సమాజం అంత తేలికగా అంగీకరించదు. కందుకూరి వీరేశలింగం వితంతు పునర్వివాహానికి ఉద్యమించినపుడు, ఇతర సాంఘిక సంస్కరణలు ప్రబోధించినపుడు ఆయనకు ఎదురైన గట్టి సవాళ్లవంటివే రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాషోద్యమాన్ని చేపట్టినపుడూ ఎదురయ్యాయి.

వ్యవహారిక భాష పేరు తల చుకుంటే తెలుగు సాహిత్యం మైలు పడిపోతుందన్న భాషా ఛాందసులు తెలుగు సాహితీలో కాన్ని ఏలుతున్న రోజులవి. గిడుగు సాహసించి ఈ కొత్త ప్రతిపాదన చేసినపుడు వారు ఎదురుతిరిగారు. అయినా గిడుగు వెనుకంజ వేయలేదు. శద్ధగ్రాంథికవాదులను ఢీకొని వారిని నిరుత్తరులను చేశారు. జయంతి రామయ్యపంతులు, రాజా విక్రమదేవవర్మ, పిఠాపురం రాజా వంటి ఉద్దండులు గిడుగును ఎదుర్కొన్నారు. ఆనాటి వ్యవహారిక ప్రయోగాలను ఉటంకిస్తూ వారివాదాన్ని గిడుగురామ్మూర్తి పంతులు తిప్పికొట్టారు. గిడుగువారిది ప్రజా ఉద్యమం.

అందుకనే ఆనాటి కవులు, పత్రికలు గిడుగు వారి వ్యవహారిక భాషావాదాన్ని స్వీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. 1915 నుంచి 1919 వరకు రామ్మూర్తి బరంపు రం నుంచి మద్రాసు వరకు ఊరూరా తిరిగి పండితులను ఢీకొన్నారు. వేటూరి ప్రభాకర శాస్ర్తి వంటి పండితుల చేత తన వాదాన్ని అంగీకరింపేశారు. జయంతి రామయ్య పంతులు, వేదం వెంకటరామశాస్ర్తి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తి వంటి ప్రముులు రచించిన గ్రంథాల్లో దోషాలను చూపించి ఉద్దండ పండితులేక గ్రాంథికభాష పట్టుబడక తప్పులు రాస్తున్నపుడు బడి పిల్లలకు నేర్ఫడమా అని గిడుగువారు వాదించారు. నాడు గ్రాంధికభాషలో దిట్ట, మంచి వక్త అయిన కొక్కొండ వెంకటరత్నాన్ని తన వాదనతో గిడుగు మట్టికరిపించారు.

తెలుగు వెలుగు... శంకరంబాడి

 
sankarambadi 
తెలుగు రచయి తలలో శంక రంబాడి సుందరా చారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. సుందరాచారి, 1914 ఆగష్టు 10న తిరుపతిలో జన్మించాడు. మదనపల్లెలో ఇంటర్మీడియే ట్‌ వరకు చదివాడు. చిన్న తనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండే వాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావం దనం వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యా న్ని తెంపివే సాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు.

తిరుపతిలో హోటలు సర్వర్‌గా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆంధ్రపత్రిక లో ప్రూఫ్‌ రీడరుగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన. అమిత మైన ఆత్మ విశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోధ్ధారక కాశీనా ధుని నాగేశ్వరరావు పంతులు నీకు తెలుగువచ్చా అని అడిగాడు. దానికి సమాధా నంగా మీకు తెలుగు రాదా అని అడిగాడు. నివ్వెరపోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియలేదు అని చెప్పిన మాతృభాషాభిమాని శంకరంబాడి సుందరాచారి.

ఆంగ్లేయులపై అక్షరాగ్ని గరిమెళ్ళ

 
GarimellaSatyanarayana
 
మాకొద్దీ తెల్లదొరతనమూదేవా!
మాకొద్దీ తెల్లదొరతనమూ
మా ప్రాణలపై పొంచి
మానాలు హరియించే...

జాతీయ కవి గరిమెళ్ల సత్యనారాయణ రచించిన ఈ గేయం తెల్లదొరల గుండెల్ని జల్లుమనిపించింది. స్వాతంత్య్ర సంగ్రామం లో పోరాటాలను తమ భుజస్కందాలపై మో స్తూ ప్రజల్లో స్వాతంత్రోద్యమ కాంక్షను రగి ల్చిన ఘనకీర్తిగల జాతిమరిచిన జాతిరత్నం గరిమెళ్ల సత్యనారాయణ. స్వాతంత్య్రోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనా రాయణది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గే యాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడు తూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. ‘మాకొద్దీ తెల్ల దొరతనం...’ తో పాటు ‘దం డాలు దండాలు భారత మాత’ అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్య్ర ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరి మెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మా రుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరత నం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జా తీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలు గునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.

1921 లో గరిమెళ్ళ ‘స్వరాజ్య గీతములు’ పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తి గీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో వుండగా త మిళ, కన్నడ భాషలు నేర్చుకున్నాడు. తమి ళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువ దించాడు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశాడు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రం థాలను తెలుగులోకి అనువదించాడు. భోగ రాజు పట్టాభిసీతారామయ్య ఆంగ్లంలో వ్రాసి న ‘ది ఎకనామిక్‌ కాంక్వెస్ట్‌ ఆఫ్‌ ఇండియా’ అనే గ్రంథాన్ని తెలుగులోకి అను వదించా డు. చివరిదశలో గరిమెళ్ళ పేదరికం అనుభ వించాడు.

ఆ రోజుల్లో దేశోద్ధారక కాశీనాథు ని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డాడు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతి నెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. చివరిదశ లో ఒక కన్ను పోయింది. పక్షవాతం వచ్చింది. దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యా చన మీద బ్రతికాడు. స్వాతంత్య్రానంతరం మన పాలకు ల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు.

20, ఆగస్టు 2012, సోమవారం

తెలంగాణాలో విశాలాంధ్రోద్యమము - రెండవ భాగము


మొదటి భాగము తరువాయి

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము కావలెననియు, మద్రాసు నుండి విడిపోవలెననియు అభిప్రాయము మొట్టమొదటిసారి 1912 లో కలిగినది. తమిళులతో కూడిన మద్రాసు రాష్ట్రములో ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధికి సరియైన అవకాశాలు దొరకకపోవుటే ఈ అభిప్రాయానికి మూలము. ఆంధ్రరాష్ట్రోద్యమమును ప్రారంభించి దానికి నాయకత్వం వహించినది స్వర్గీయ కొండా వెంకటప్పయ్య పంతులు, స్వర్గీయ నాగేశ్వరరావు పంతులు, స్వర్గీయ న్యాయపతి సుబ్బారావు పంతులు, స్వర్గీయ కట్టమంచి రామలింగారెడ్డి గారలతో పాటు, స్వర్గీయులు  ప్రకాశం పంతులుగారు , బులుసు సాంబమూర్తిగారు, పట్టాభి సీతారామయ్య పంతులు గారు మొదలైన పెద్దలు. మొట్టమొదట భాషా రాష్ట్రవాదము కాంగ్రెసు వర్గాలలో  కొంత అలజడిని కల్గించినది. భాషారాష్ట్రాల ఆవశ్యకతను గూర్చి ఇంగ్లీషులో ఒక ఉద్గ్రంథమును వ్రాసి, భాషారాష్ట్ర వాదమును పట్టాభి సీతారామయ్యగారు సహేతుకముగ సమర్ధించిరి. ఆంధ్ర కాంగ్రెసు నాయకులు అఖిల భారత కాంగ్రెసుచే భాషా రాష్ట్రాల సూత్రమును ఆమోదింపచేసి, మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెసు సంఘమును సాధించిరి. తరువాత క్రమక్రమముగ ఆంధ్ర రాష్ట్రోద్యమము బలపడి, మనకు స్వాతంత్ర్యము వచ్చిన తరువాత ఆంధ్రరాష్ట్రము ఏర్పడినది. ఆంధ్రరాష్ట్రోద్యమమును గూర్చి ఆంధ్రదేశములో ఎటువంటి అభిప్రాయ భేదము లేకుండెను. అన్ని రాజకీయపక్షాలీ ఉద్యమమును సమర్థించినవి. మద్రాసులో జరిగిన ఇరువదవ ఆంధ్రమహాసభ సమావేశానికి ఆచార్య రాధాకృష్ణగారు అధ్యక్షత వహించిరి. తరువాత వారు ఇంగ్లాండుకు వెళ్లి, ఆంధ్ర రాష్ట్ర స్థాపన గూర్చి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ తో సంప్రదింపులు కూడ జరిపిరి. మొదటినుండియు ఆంధ్రోద్యమము పట్ల సంపూర్ణమైన సానుభూతిని కలిగి రాధాకృష్ణ గారు అవసరమైనపుడు తగిన సహాయమును చేసినారు.

విమోచన ఉద్యమము  


భారత దేశమునకు స్వాతంత్య్రము వచ్చిన తరువాత హైదరాబాదు ప్రజల యొక్క విమోచనోద్యమానికి క్రొత్త బలము చేకూరినది. భారత యూనియన్లో ప్రవేశించుటకు హైదరాబాదు నిజామ్ నిరాకరించుటతో హైదరాబాదు ప్రజల విముక్తి ఉద్యమములో నూతనాధ్యాయము ప్రారంభమైనది. 1947 లో చెలరేగిన రజాకారు అమానుష చర్యల ఫలితముగ హైదరాబాదు ప్రజలు వేల సంఖ్యలో పొరుగు రాష్ట్రాలకు తాత్కాలికముగా వలస పోయిరి. హైదరాబాదాంధ్రులు విజయవాడ,కర్నూలు ప్రాంతాలకు వెళ్ళిరి. ఈ వెళ్ళుటలో ఉభయ ప్రాంతాల రాజకీయ సమైక్యత యొక్క మనస్తత్వము వెల్లడియగుచున్నది. 1947 జూలైలో విజయవాడయందు అయ్యదేవర కాళేశ్వరరావు గారి యింటిలో స్వామీరామానంద తీర్థ అధ్యక్షతన ఇట్లు తాత్కాలికముగ వలసపోయిన రాజకీయ కార్యకర్తల సమావేశము జరిగి, హైదరాబాదు ప్రజల స్వాతంత్ర్య పోరాట చర్యా సంఘము స్థాపితమైనది. దీని శాఖ యొకటి కర్నూలులో
స్థాపితమైనది. ఈ చర్యా సంఘము పక్షాన మాట్లాడుచు, హైదరాబాదులో ప్రజలకు ఫాసిస్టు పరిపాలననుండి విముక్తి కలిగి బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన జరుగవలెనని స్వామి రామానంద తీర్థ ఉద్ఘాటించిరి. ఇదే నెలలో మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర కాంగ్రెసు సంఘమువారు హైదరాబాదు ప్రజల సహాయ సంఘము నొకదానిని కాళేశ్వరరావు గారి అధ్యక్షతన నెలకొల్పిరి.

పోలీసు చర్య 


1948 ఏప్రిల్ 26 నాడు బొంబాయిలో రాజేంద్రబాబుగారి అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెసు స్థాయీ సంఘ రహస్య సమావేశము జరిగినది. దీనికి హైదరాబాదు కాంగ్రెసు నాయకులు కూడ వెళ్ళియుండిరి. ఈ రహస్య సమావేశములో హైదరాబాదుపై పోలీసుచర్య జరుపవలెనని వాదించిన వారిలో కాళేశ్వరరావు గారు ముఖ్యులు. ఈ సందర్భమున ఆంధ్ర రాష్ట్రము కావలెనని ఆంధ్ర నాయకులు రాజేంద్రబాబును కోరగా, వారు ఆంధ్రులకు మాత్రమే వెంటనే రాష్ట్రము నిచ్చుటకు నిర్ణయించినచో మహారాష్ట్ర, కర్నాటకలకు కూడ ఈయవలసి యుండుననియు, ఈ అన్ని సమస్యలు ఒకే సారి నిర్ణయించుట మంచిదని తెలిపిరి. మొత్తముమీద 13 సెప్టెంబర్ నుండి 17  సెప్టెంబర్ (1948 ) వరకు హైదరాబాదు పై పోలీసు చర్య జరిగి ప్రజల విముక్తి జరిగినది. 1948 నవంబరులో హైదరాబాదుకు కాళేశ్వరరావుగారు వచ్చి, స్థానిక కాంగ్రెసు నాయకులైన స్వామీజీ మొదలైన వారితో సంప్రదించిరి. ఆ సందర్భంలో హైదరాబాదు విభజన జరిగి, విశాలాంధ్ర, ఐక్య కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రాల కొరకు పనిచేయవలెనని నిర్ణయింపబడినది. 1949 ఏప్రిల్ లో తిరిగి కాళేశ్వరరావుగారు హైదరాబాదుకు వచ్చినప్పుడు హైదరాబాదు తెలుగు నగరమనియు, అది తెలుగు సీమకు రాజధాని యనియు మహారాష్ట్ర నాయకులు ఒప్పుకొని ఉద్ఘాటించుట జరిగినది. ఆ సమయమున రామకృష్ణారావుగారిచ్చిన తేనేటి విందు సందర్భమునకూడ హైదరాబాదు సకలాంధ్రమునకు రాజధానియని అందరు ఒప్పుకొనుట జరిగినది. సకలాంధ్రమునకు హైదరాబాదు రాజధానియని వ్యాపించుచున్న భావము సర్దారు పటేలుగారి దృష్టికి ఎట్టులో తీసుకొని రాబడినది. అపుడాయన ఈ విషయమై కాళేశ్వరరావు గారికి వ్రాసిన ఉత్తరములో ఇప్పుడే హైదరాబాదు విభజనను గూర్చిన ఆందోళన చేయవద్దని హెచ్చరించిరి. తరువాత 1949 మే నెలలో డెహ్రాడూన్ జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశ సందర్భమున హైదరాబాదు కాంగ్రెసు నాయకులతో మాట్లాడుచు సర్దార్ పటేల్ గారు హైదరాబాదు విభజన గూర్చి ఆందోళన చేయు సమయము ఆసన్నము కాలేదనియు, ఒక అయిదు సంవత్సరాల కాలమున ఈ పని జరుగుటకు తగిన వాతావరణము సృష్టింప బడగలదనియు తెలిపిరి. ఈ విధముగ, తరువాత హైదరాబాదు విభజనోద్యమమునకు తగిన వాతావరణము కల్గించబడినది. హైదరాబాదు సకలాంధ్రమునకు రాజధానియని కూడ గుర్తించబడినది. ఇట్లు గుర్తించిన అప్పటి మద్రాసు ఆంధ్ర కాంగ్రెసు నాయకులలో మొదటివారు కాళేశ్వరరావుగారు. మద్రాసు ఆంధ్రులకు లభించదని వీరు మొదటి నుండియు అభిప్రాయపడిరి. జనవరి 1950 లో మద్రాసులో సమావేశమయిన ఆంధ్ర
కాంగ్రెసు శాసనసభ్యులు కర్నూలు ఆంధ్రుల తాత్కాలిక రాజధానియని , హైదరాబాదు శాశ్వత రాజధాని యనియు నిర్ణయించుట గమనింపదగిన విశేషము. ఆంధ్రరాష్ట్ర అవతరణమునకు ఒక రోజు ముందు అనగా 3౦ వ సెప్టెంబరు 1953 నాడు సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సంఘమువారు కూడ కర్నూలు తాత్కాలిక రాజధాని, హైదరాబాదు శాశ్వత రాజధానియని నిర్ణయించిరి. కమ్యునిస్ట్ పార్టీవారు మొదట నుండియు, అనగా 1947 వ సంవత్సరము నుండియు హైదరాబాదు సంస్థానమును విచ్చిన్నము గావించి, మదరాసు రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతమును తెలంగాణాముతో కలిపి వేసి విశాలాంధ్రమును హైదరాబాదు రాజధానిగా ఏర్పాటు చేయుట తమ ఆశయమని ఉద్ఘాటించుచు, యీ ఉద్యమము జనసామాన్యములో వ్యాపించుటకు కృషి సల్పుచుండిరి.

కృత్రిమ రాష్ట్రము - ప్రజల ఆకాంక్ష

ఇంగ్లీషువారి రాజ్యవిస్తరణ ఫలితముగ ఆంధ్ర, మహారాష్ట్ర,
కర్ణాటకములతో కూడిన కృత్రిమ రాష్ట్రము అసఫ్జాహి పరిపాలన క్రింద ఏర్పడినది. మధ్య యుగములో నిరంకుశ పరిపాలన క్రింద ప్రజలు నలిగిపోయినారు. పోలీసు చర్య తరువాత ఏర్పడిన ప్రజాస్వామిక వాతావరణమున హైదరాబాదు విభజన జరిగి ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు పొరుగు రాష్ట్రాలలోని ఆయా భాషాప్రాంతాలతో కలిసి విశాలాంధ్ర, సంయుక్త మహారాష్ట్ర, ఐక్య కర్ణాటకములు ఏర్పడవలలెనని ప్రజలు ఆకాంక్షించినారు. ఈ ఆకాంక్ష పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రములోని అన్ని రాజకీయ పక్షాల తీర్మానాలయందు ప్రతిబింబితమైనది. సాంస్కృతిక సంస్థలు యీ అభిప్రాయములను బలపరచినవి. పోలీసు చర్య తరువాత  తూపురాన్ జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు 1949 ఫిబ్రవరి సమావేశములో భాషా రాష్ట్రాలను బలపరుచటయే కాక అది వాస్తవముగా విశాలాంధ్ర సారస్వత సమావేశాముగ జరిగినది. తరువాత పరిషత్తు సభలు యీ మార్గముననే నడిచినవి. ఆలంపురములో రాధాకృష్ణ పండితుని ఆశీర్వచనములతో ప్రారంభమైన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలు వాస్తవముగ సకలాంధ్ర సారస్వత సభలు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఇతర సారస్వత సంస్థలు విశాలాంధ్రోద్యమమును సంపూర్ణముగ బలపరిచినవి. పోలీసు చర్య జరిగిన వెంటనే కీ.శే. సర్దారు జమలాపురం కేశవరావుగారి అధ్యక్షతన ఘణపురంలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సమావేశములో విశాలాంధ్ర కావలెనని ఉద్ఘాతించు తీర్మానము ఆమోదింపబడినది. ఈ తీర్మానమును అప్పటి తెలంగాణా ఏకైక దినపత్రికయగు గోలకొండ సంపాదకీయమున బలపరిచిరి. రాజకీయముగ, ఒక బహిరంగ సభలో ఇట్టి ఉద్ఘాటన జరుగుట బహుశా ఇదియే మొదటి పర్యాయమేమో! నిజామాబాదులో 1950 మార్చి నెలలో శ్రీ దిగంబరరావు బిందూ అధ్యక్షతన జరిగిన హైదరాబాదు స్టేటు కాంగ్రెసు సమావేశమున హైదరాబాదు రాష్ట్రమును విభజించి ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను తత్పరిసర భాషా ప్రాంతాలతో కలిపి వేయవలెనని తీర్మానింపబడినది. ఈ తీర్మానమును ప్రతిపాదించినవారు బూర్గుల రామకృష్ణారావు గారు. ఈ తీర్మానమునకు రంగారెడ్డి, చెన్నారెడ్డి గారాల ఆమోదము కూడ లభించెను. 1950 వ సంవత్సరమున ఫిబ్రవరి 12, 13 తేదీలలో వరంగల్లులో అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన జరిగిన విశాలాంధ్ర మహాసభ స్థాయీ సంఘ సమావేశములో విశాలాంధ్ర తీర్మానము ఆమోదించుట జరిగినది. ఈ సమావేశములో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు పాల్గొనిరి. ఈ విశాలాంధ్ర స్థాయీ సంఘ సభ్యుల పట్టికను పరిశీలించినపుడు ఇందులో అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రతినిధులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు కనిపించుచున్నారు. కాంగ్రెస్సే కాక ఇతర రాజకీయ పక్షాలు కూడా, ముఖ్యముగా కమ్యునిస్టు, సోషలిస్టు పక్షాలు విశాలాంద్రోద్యమానికి ఎంతో బలమును చేకూర్చినవి.

డా.దేవులపల్లి రామానుజరావు 


11, ఆగస్టు 2012, శనివారం

పరకాల ప్రభాకర్ తో ఎడిటర్స్ టైం - మహా టీవీ (03/08/2012)

Part 1



Part 2



Part 3


కేసీఆర్ కుసంస్కారి!

ఆంధ్రజ్యోతి, ఆగస్టు 9: 'తెలుగు తల్లి'ని తెలుగు దెయ్యం అనగలిగిన కుసంస్కారి టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ విమర్శించారు. వెర్రి తలలు వేస్తోన్న ప్రాంతీయ విద్వేషానికి ఇది పరాకాష్ఠ అని అభివర్ణించారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సభలో కేసీఆర్ తెలుగుతల్లిని దెయ్యంతో పోల్చుతూ మాట్లాడడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేవారు. "తల్లి అందరి కీ ఒక్కటే. అది భాషకు సంబంధించినది. కేసీఆర్ మా ట్లాడేది తెలుగు భాష. ప్రస్తుతమున్న లిపి, వ్యాకరణం తెలుగు భాషదే. అటువంటి భాషకు తల్లి అయిన తెలుగును దెయ్యం అనే నీచానికి కేసీఆర్ దిగజారడాన్ని ఆయన ప్రాంతానికి చెందిన తెలుగువారంతా ఖండించాల్సిన అవస రం ఉంది'' అని జయప్రకాష్ అన్నారు. 1942లోనే శంకరంబండి సుందరాచార్య 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' రాశారని, ఆనాడే తెలంగాణలో ఆంధ్ర మహా సభ సమావేశాలు ప్రారంభమయ్యాయని, ఈ చరిత్ర కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు.

తన ఉ ద్యమం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ నిస్పృహలతో భాషను, కవుల ను, సాహిత్యాన్ని, తల్లిని చిన్నబుచ్చడం కేసీఆర్‌కు మంచిది కాదన్నారు. నన్నయ భట్టు ఆది కవి అవునో కాదో తెలుగు భాషా గ్రంథాలను తరిచి చూసుకుంటే తెలుస్తుందని చె ప్పారు. వెయ్యేళ్ల క్రితం జీవించిన కవులకు తన సంకుచిత భావాలను అంటగట్టి ప్రాం తాన్ని విడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ జిల్లాల నుంచి ఆంధ్ర కం టే ఎక్కువ ఆదాయం వస్తుందని చెబుతున్న కేసీఆర్... ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఆంధ్ర ప్రాంతం వెనుకబడిందని ఒప్పుకొంటారా అని ప్రశ్నించారు


"నన్నయ్య ఆదికవి కాదని, పాల్కురికి సోమనాథుడే ఆదికవి అని టీఆర్ఎస్ నేత కేసీఆర్ చెబుతున్నారు. అలాగే తెలుగుతల్లి ఆంధ్రాకే పరిమితమని, తెలంగాణకు తెలంగాణ తల్లి అని చెబుతున్నారు. రాజకీయ స్వార్థం కోసం సాహిత్యకారులు, చరిత్రకారులను వివాదాల్లోకి లాగడం దారుణం'' అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మల్లెల లింగారెడ్డి వ్యాఖ్యానించారు.

తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిది నన్నయ్య కవితా యుగమేనని, అలాగే ఆయన భారతాన్ని అనువాదం చేయలేదని, అది ఆయన సృష్టేనన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నన్నయ్యను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం తగదని కేసీఆర్‌కు లింగారెడ్డి హితవు పలికారు. పాల్కురికి సోమనాథుడు కన్నడ కవితా లక్షణాలను అలవర్చుకున్న కవి అని, సి. నారాయణరెడ్డి, కాళోజీ వంటి కవులు అన్ని ప్రాంతాలకు చెందినవారని, అలాంటివారిని కూడా ఒక ప్రాంతానికే పరిమితం చేయొద్దని సూచించారు.

"భారత మాత అంటే ఉత్తర, దక్షణ, మధ్య భారతమాతలుండరు. భారత జాతి మొత్తానికీ ఆమే తల్లి. అదో మధుర భావన. అలాగే తెలుగుతల్లి కూడా తెలుగు ప్రజలకు ఓ మధుర భావన. అలాంటి తెలుగు తల్లిని ముక్కలు చేసి, దానితో నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఎదుగుతామంటే కుదరదు'' అని కేసీఆర్‌కు స్పష్టం చేశారు. నన్నయ్య ఆదికవి కాదంటూ చేసిన వ్యాఖ్యలపై తెలుగు సాహితీ లోకానికి, తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్‌ను లింగారెడ్డి డిమాండ్ చేశారు.

10, ఆగస్టు 2012, శుక్రవారం

తెలంగాణాలో విశాలాంధ్రోద్యమము - మొదటి భాగము

డా.దేవులపల్లి రామానుజరావు పేరు తెలియని తెలుగువారు ఈ తరంలో ఉన్నారేమో గాని మన తల్లిదండ్రుల, తాతల తరంలో ఉండి ఉండరు. తెలంగాణా ప్రాంతంలో పుట్టి పెరిగి నిజాముల పరిపాలనలో తెరమరుగవుతున్న తెలుగు భాషాసంస్కృతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎనలేని సేవ చేసిన వారియందు ఆయన ముఖ్యుడు. ఆయన ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా సేవలందించి, గ్రంథాలయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినారు. ఆయన వ్రాసిన 'తెలంగాణాలో జాతీయోద్యమాలు'  లోని 'విశాలాంధ్రోద్యమము' భాగాన్ని ఇక్కడ సీరియల్ గా పోస్ట్ చేస్తున్నాము. మొత్తం టైపు చేయబడిన తర్వాత దానిని ఈబుక్ రూపంలో అందరికి అందుబాటులో ఉంచుతాము


ఆంధ్రావళికి మోదము - చారిత్రాత్మక ప్రకటన


భారత ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ 5వ మార్చి 1956 నాడు నిజామాబాదులో సుమారు రెండు లక్షల ప్రజలతో కూడిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో విశాలాంధ్ర ఏర్పడవలెనని భారత ప్రభుత్వము చేసిన నిర్ణయమును ప్రకటించిన సందర్భము ఆంధ్రదేశ చరిత్ర లో చరిత్రాత్మకమైన, మహోజ్వలమైన ఘట్టము. రెండువందల సంవత్సరాల తరువాత తిరిగి తెలుగు ప్రజలందరు రాజకీయముగా ఏక కుటుంబీకులు కాగల అవకాశము నిచ్చిన భారత ప్రధాని ప్రకటన ఆంధ్రావళికి మోదము చేకూర్చినది. ఈ ప్రకటన నిజామాబాదున జరుగుటయందు కూడ ఒక విధమైన ఔచిత్యము కన్పించుచున్నది. ఈ నిజామాబాదులోనే పోలీసు చర్యకు చాలా సంవత్సరాల ముందు జరిగిన ఆంధ్ర మహాసభ నాలుగవ సమావేశములో ఆంధ్రోద్యమము రాజకీయోద్యముగా రూపొందినది. పోలీసు చర్య తరువాత ఈ నిజామాబాదు పట్టణములోనే జరిగిన హైదరబాద్ స్టేట్ కాంగ్రెసు మహాసభలో హైదరాబాద్ విభజన గావించి ఆంధ్ర,మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలను పొరుగునున్న ఆ భాషా రాష్ట్రాలతో కలిపివేయవలెనని తీర్మానించనైనది.ఆ నిజామాబాదు లోనే 1956 సంవత్సరమున విశాలాంధ్ర ప్రకటన జరిగినది.

ఇంగ్లీష్ సామ్రాజ్య వ్యాప్తితో భారతదేశమున రాష్ట్రాల ఏర్పాటు ప్రజల అవసరాలతో  నిమిత్తము లేక పరదేశ పరిపాలకుల అవసరాలకు ఉపయోగ పడునట్లుగా జరిగింది.తత్ఫలితముగ కుతుబ్ షాహీల పాలన ముందే కాక నిజామ్ షాహీల పాలనమందు కూడ కొంతకాలము ఏకముగా నుండిన ఆంధ్రులు మద్రాసు, హైదరాబాదు రాష్ట్రాలలో చీలిపోవుట జరిగినది. సుమారు నూటయేబది సంవత్సరాలకు పైగా చీలిపోయిన తరువాత తిరిగి ఏకము కావలెనను అభిలాష 1900 సంవత్సరములో మొట్టమొదట పొడసూపినది. బ్రిటిష్ ఆంధ్రుడైన కీర్తిశేషులగు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు గారు హైదరాబాదుకు వచ్చి 1900 సంవత్సరములో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయము, 1904 సంవత్సరములో విజ్ఞానచంద్రికా గ్రంథమండలిని స్థాపించి, ఉభయ ప్రాంతాలలో నున్న తెలుగువారిని వైజ్ఞానికముగ దగ్గరకు తీసుకొనివచ్చిరి. ఈ నైజ్ఞానికోద్యమము క్రమక్రమముగ నాటక ప్రదర్శనాలు, పత్రికలు, వైజ్ఞానికుల పర్యటనలు మొదలైన సాంస్కృతికోద్యమాల ద్వారా వ్యాపించి, బలపడి, పోలీసు చర్య జరిపిన కొన్ని సంవత్సరాలలోనే సాంస్కృతికముగ విశాలాంధ్ర స్థాపన కావించినది.అందుచేతనే తెలంగాణా నాయకులైన కొండా వెంకటరంగారెడ్డిగారు 1955 జూలై నెలలో జరిగిన తెలుగుభాషా సమితి శాఖ ప్రారంభోత్సవ సమయమున సాంస్కృతికముగ విశాలాంధ్ర ఏర్పడినదని ఉద్ఘాటించిరి. రాజకీయ 
విశాలాంధ్రకు పూర్వమే సాంస్కృతిక విశాలాంధ్ర ఏర్పడుట సహజము, స్వాభావిక పరిణామము. 

రెండు దశాబ్దాల క్రిందట భావన


రాజకీయముగ విశాలాంధ్రకూడ రెండు దశాబ్దాల క్రిందట భావించిన ఉద్యమమనియే చెప్పవచ్చును. హైదరాబాదులోని ఆంధ్రోద్యమమును గురించి ఇది విశాలాంధ్రోద్యమముగ పరిణమించ వచ్చునను అనుమానము ఇరువది సంవత్సరాల క్రిందట  అప్పటి హైదరాబాదు ప్రభుత్వమునకు కలిగినది. 1936 లో హైదరాబాదు ప్రభుత్వమునకు హోం సెక్రటరీగా నుండిన నవాబు ఆలియావర్ జంగ్ బహద్దూర్ అప్పుడు ఆంధ్రమహాసభ అధ్యక్షులుగా నుండిన మాడపాటి హనుమంతరావు పంతులుగారితో ప్రభుత్వమునకు గల పై అనుమానమును వెల్లడించియుండిరి. 1946వ  సంవత్సరములో కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్యగారు " విశాలాంధ్రలో ప్రజారాజ్యము" అను పుస్తకమును వ్రాసి, పై అనుమానము సకారణమైనదని నిరూపించియున్నారు. హైదరాబాదులోని  సాంస్కృతోద్యమము విశాలాంధ్రమునకు పునాదులు వేసినది. దేవులపల్లి రామానుజరావు సంపాదకత్వమున 1947  లో వరంగల్లు నుండి వెలువడిన " శోభ" మాస పత్రిక విశాలాంధ్ర దృక్పథముతో నడిచినది.

రెండు పాయలు


ఈ శతాబ్దమున ఆంధ్రోద్యమము రెండు పాయలుగా అభివృద్ధి పొందినది.ఇందులో మొదటిది మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర రాష్ట్రోద్యమము. మన దేశమున భాషారాష్ట్రోద్యమము భారత జాతీయోద్యమమునకు అనుబంధముగ నిర్వహింపబడినది. భాషారాష్ట్రాలను భారత జాతీయ కాంగ్రెసు స్వాతంత్య్రమునకు పూర్వమే బలపరచి తన రాష్ట్ర కాంగ్రెసు సంఘాలను ఈ ప్రాతిపదిక మీదనే నిర్మించినది. భారతదేశమునకు
స్వాతంత్య్రము రాకపూర్వము మద్రాసు రాష్ట్రములోని ఆంధ్రోద్యమము ఆ రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతమునకు మాత్రమే పరిమితమైన రాష్ట్రోద్యమముగ నుండెను. రెండవ పాయ హైదరాబాదులోని ఆంధ్రోద్యమము. ఈ ఉద్యమము యొక్క లక్ష్యము పోలీసుచర్యకు పూర్వము వరకు హైదరాబాదులో బాధ్యతాయుత ప్రభుత్వస్థాపనయై యుండెను. కాని భారతదేశమునకు స్వాతంత్య్రము ప్రాప్తించి స్వదేశ సంస్థానాలు స్వతంత్ర భారతమునందలి అంతర్భాగాలైన తరువాత ఉభయప్రాంతాలలోని ఆంధ్రోద్యమ దృక్పథములో స్పష్టమైన, సహజమైన పరిణామాలు కన్పించినవి. ఈ పరిణామమే తిరిగి ఆంధ్రులందరు ఏక రాష్ట్రవాసులు కావలెనను ఉద్యమముగ రూపొందినది.ఇటువంటివే సంయుక్త మహారాష్ట్ర, ఐక్య కర్నాటక ఉద్యమాలు. కావుననే మైసూరు,హైద్రాబాదు రాష్ట్రాలు స్వతంత్ర భారత యూనియన్ లో చేరిన తరువాత 26 వ నవంబరు 1949 వ సంవత్సరమున విశాలాంధ్ర మహాసభ స్థాపన జరిగినది. ఈ మహాసభ తరువాత 1950 ఫిభ్రవరి 13 ,14 తేదీలలో సమావేశమై, విశాలాంధ్ర తన ఆదర్శముగా ప్రకటించినది. 1953 అక్టోబరు  2వ తేదీనాడు మద్రాసు రాష్ట్ర విభజన, అక్కడి తెనుగు ప్రాంతాలతో కూడిన ఆంధ్రరాష్ట్ర స్థాపన జరిగినది. ఇది విశాలాంధ్ర రాష్ట్రస్థాపనకు తొలిమెట్టు. 

8, ఆగస్టు 2012, బుధవారం

తెలంగాణా లో కులపిచ్చి లేదా?

(రాళ్లభండి రవీంద్రనాథ్): తెలంగాణా లో కులపిచ్చి లేదు - ఒక వితండ వాదన: మన తెలంగాణా వాదులు ఒక విచిత్రమైన కనీ, వినీ ఎరగని వాదన ఒకటి చేస్తూ ఉంటారు. అది తెలంగాణా లో కుల పిచ్చి ఆంధ్రాలో లాగా లేదు. కులగజ్జి లేదా కులాభిమానం అభిమానం భారత దేశం అంతటా ఉన్న జాడ్యం. బిహార్, యూపీ, ఎంపీ, బెంగాల్, ఒరిస్సా, తెలంగాణా లోని కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ కూడా దీనికి అతీతం కాదు అన్ని ప్రాంతాల లోనూ కుల పిచ్చి ఉంది. కుల పిచ్చి లేదన్నప్పుడు, దళితులు తెలంగాణా ప్రాంతం వారైన మంద కృష్ణ మాదిగ ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? కోదండరామ రెడ్డి తన పేరు చివరన రెడ్డి తొలగించుకొన్నాడు అంటారు కానీ అతని రికార్డులు అదే యూనివర్సిటీ రికార్డులు చెక్ చేస్తే రెడ్డి అనే పేరుని తొలగించుకోలేదని అర్థమవుతుంది. రెడ్డి అనే పేరుతో తనని పిలవ వద్దని ఊళ్లో వాళ్లకి చెబుతాడు. అంతే.
 
ఇంక ఈ గౌడ్, యాదవ్ అనే పేర్లు మీకు సీమాన్ద్రా ప్రాంతం లో పెట్టుకోరు. ఈ గౌడ్, యాదవ్, ముదిరాజ్, శర్మ, శాస్త్రి, యానాది, రెడ్డి, మాదిగ, పేర్లు తెలంగాణా నాయకులు ఎందుకు పెట్టుకొంటున్నారు. అవేమైనా రాముడు, కృష్ణుడు లాంటి పేర్లా? అవి కులాల కి సంకేతాలు కావా? పైగా ఆ మాట అడిగితె దాట వెత బాట పడతారు. ఏతా వాతా తేలేదేమిటంటె కుల పిచ్చి లేదు అని డబ్బా కొట్టుకొనే తెలంగాణాలో కుల పిచ్చి ఎంత నర నరాల్లో జీర్ణించుకొని పోయిందో అర్థం కావడం లేదా?

28, జులై 2012, శనివారం

తమ వార్తా పత్రికలో మూడు నెలలలో తెలంగాణా వచ్చేస్తుందని అబద్ధాలు రాసి, ప్రజలని మభ్య పెడుతూ వస్తున్నా టీఆరెస్ బాకా ఊదే పత్రిక నమస్తే తెలంగాణా పత్రికలో ఎదుటివారు అంటే మెయిల్ టుడే అనే ఆంగ్ల పత్రికలోనూ, సాక్షి, ఆంద్ర భూమి పత్రికలలోనూ వచ్చిన వార్తని అబద్ధం అని సీమాంధ్రుల అక్కసు అని తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కిన తీరు చూడ ముచ్చటగా ఉంది. దాని లంకె మరియూ వార్త యొక్క పూర్తీ పాఠం ఈ కింది విధంగా ఉన్నాయి.
http://www.namasthetelangaana.com/News/article.asp?Category=1&subCategory=3&ContentId=133428

తెలంగాణపై ఆఖరి దశలోనూ అక్కసు
n నివేదిక పంపే అధికారం హోంకు లేదు
- అదే జరిగితే రాజ్యాంగ ఉల్లంఘనే
- తెలంగాణపై రాజకీయ నిర్ణయం రావాల్సి ఉంది
- ఏమీ పట్టించుకోని సీమాంధ్ర మీడియా
- చిత్తు కాగితం దొరికినా విత్రంగా చూస్తున్నారు
- కన్నెర్ర చేస్తున్న ప్రత్యేకవాదులు
- అసత్య కథనాలు నమ్మొద్దని ప్రజలకు వినతి

(టీ మీడియా, న్యూఢిల్లీ) సీమాంధ్ర మీడియా..భగ్గుమన్న తెలంగాణవాదులు ఆంగ్ల పత్రిక సింగిల్‌కాలం భవిష్యవాణిఅమోఘంగా వినిపించిన ఆంధ్ర మీడియాఅంతా అయిపోయిందంటూ విశ్లేషణలు కేంద్ర హోం శాఖ ఓ నివేదికను రూపొందిస్తున్నట్లు, అందులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదన్న అభివూపాయం ఉండబోతున్నట్లు, ఆ నివేదికను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి హోం శాఖ త్వరలో అందజేయనున్నట్లు మెయిల్ టుడే అనే ఆంగ్ల పత్రిక ఊహాజనిత కథనాన్ని ప్రచురించడం.. దానికి సాధ్యాసాధ్యాలను కనీసంగానైనా అంచనా వేయకుండా.. కేంద్రం ఇక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వన తెలంగాణపై సీమాంధ్ర మీడియా అక్కసు వెళ్లగక్కడంపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండటమే కాకుండా.. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు వస్తున్న తరుణంలో ఇటువంటి ప్రచారాలు తెలంగాణ సమాజాన్ని గాయపర్చే అవకాశాలు ఉంటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి రాష్ట్ర విభజన చేయాలా వద్దా అనే విషయంలో నిర్ణయం హోంశాఖకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. దేశంలో ఏదైనా రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా, రాష్ట్ర విభజనపై అటో ఇటో నిర్ణయం తీసుకోవాలన్నా అది కేంద్ర కేబినెట్ పని. దానిపై పార్లమెంటు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. దానిని రాష్ట్రపతి ఆమోదించాలి. రాష్ట్రపతి సిఫారసు మేరకు కొత్త రాష్ట్రం ఏర్పాటు జరుగుతుంది. ఇంత ప్రక్రియ జరగాల్సి ఉండగా.. తెలంగాణ ఇస్తే ఇబ్బందులు తలెత్తుతాయంటూ హోం శాఖ ఏకంగా రాష్ట్రపతికి నివేదిక పంపేందుకు సిద్ధపడుతున్నదని, తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా లేదని అందులో పేర్కొనబోతున్నారంటూ ఓ అంగ్ల పత్రికలో వచ్చిన ఊహాజనిత కథనాన్ని ఆంధ్ర మీడియా తలకెత్తుకోవడంపై తెలంగాణవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దున్నపోతు ఈనిందంటే లేగను కట్టేయమన్నట్లు వీటి వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతాజేసి అసలు అలాంటి నివేదికేదీ లేదని తెలుస్తున్నది.


కానీ.. సదరు ఆంగ్ల పత్రిక మాత్రం ఆ నివేదికలో మంత్రిత్వ శాఖకు సంబంధించి పలు పెండింగ్ అంశాలు ఉండనున్నట్లు తన జ్యోతిష్యాన్ని జోడించింది. అనేక సమస్యలపై చాలా కాలంగా ఏటూ తేల్చుకోలేక సతమవుతున్న హోం శాఖ ఏదో మంత్రమేసినట్లుగా ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారాలు కనుగొని.. రాష్ట్రపతికి నివేదించనున్నట్లు తన ఊహాశక్తిని ప్రదర్శించిందని పరిశీలకులు అంటున్నారు. సున్నితమైన అఫ్జల్ గురు క్షమాభిక్ష మొదలుకుని, అతి సున్నితమైన తెలంగాణ అంశం దాకా దేన్నీ వదలకుండా హోం శాఖ తన నివేదికలో పరిష్కారమార్గాలను పేర్కొనబోతున్నట్లుగా కథనాన్ని వండి వార్చింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఉగ్రవాద చట్టాన్ని కేంద్రం వ్యతిరేకించనున్నట్లు, అఫ్జల్ గురుకు ఉరిశిక్ష తప్పదన్నట్లు, ప్రత్యేక రాష్ట్రం సాధ్యపడనట్లు, సర్వ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఓ ఎన్‌సైక్లోపీడియా మాదిరిగా హోం శాఖ నివేదిక ఉండనున్నట్లు తన రచనా పాటవాన్ని ప్రదర్శించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణపై నిర్ణయం తీసుకోనప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయానికి రావడం.. అది కూడా వ్యతిరేక నిర్ణయానికి రావడం అసాధ్యమన్న కనీస విశ్లేషణను సైతం ఆ కథనం విస్మరించినట్లు కనిపిస్తున్నది.

గత సంవత్సర కాలంగా ‘ఆ నాలుగు పార్టీలు’ వైఖరి చెప్పాలంటూ ప్రతి నెలా చివరి రోజున ఆరున్నొక్కరాగంలో ఆలపిస్తున్న హోం మంత్రి చిదంబరం పాట కూడా ఆ పత్రికకు వినపడలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం వెల్లడిస్తే మిగిలిన మూడు పార్టీలు నిర్ణయానికి వస్తాయని, దాని తర్వాతే కేంద్రం నిర్ణయం తీసుకోగలుగుతుందని హోం మంత్రివర్యులు మొత్తుకుంటున్న విషయం సదరు పత్రిక చెవినపడలేదు. సంప్రతింపుల ప్రక్రియ సాగుతోదంటూ ఏడాదిగా సాగదీస్తున్న గులాంనబీ ఆజాద్ విన్యాసాలు దానికి కనపడలేదు. తెలంగాణపై ఒక నిర్ణయానికి రావడానికి రాష్ట్ర నేతలందరి అభివూపాయాలు సేకరిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం హడావుడి చేస్తుండగానే.. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయానికి వచ్చేసినట్లుగా రాయడం సత్య దూర మన్న విషయాన్ని తొక్కిపట్టింది. కాంగ్రెస్‌ను కాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన నివేదికలో తెలంగాణపై కేంద్ర నిర్ణయాన్ని ప్రకటించే సాహసం చేయలేదన్న వాస్తవాన్ని మరుగునపరిచింది. రానున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా తెలంగాణపై అందరు నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానన్న ఆజాద్ మాటలను ఆ కథనం అసలు పరిగణించలేదు.

ఆజాద్‌ను కాదని తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి వెల్లడించనంత వరకు కేంద్ర మంత్రి వర్గం ఏం చేయలేదని, కేంద్ర మంత్రి వర్గం అంటే అది కేవలం కేంద్ర హోం శాఖ ఒక్కటే కాదన్న రాజ్యంగ స్పూర్తిని పూర్తిగా విస్మరించి తెలంగాణ సమస్య పరిష్కారం అంతా హోం శాఖ చేతిలోనే ఉన్నట్లు కథనాన్ని ప్రచురించిందని ఉద్యమ శ్రేణులు ఆక్షేపణ తెలుపుతున్నాయి. కనీసం జరుగుతున్న పరిణామాలను పట్టించుకోకుండానే తెలంగాణపై అంతా నాకే తెలుసన్నట్లుగా భవిష్యవాణిని వినిపించిందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సినిమా గాసిప్స్‌ను అమోఘంగా వండి వార్చె సదరు పత్రిక ఇప్పుడు సంచలనాల కోసం తెలంగాణలాంటి సున్నిత అంశాలను కూడా గాసిప్స్ రొంపిలోకి దింపుతోందదని తెలంగణవాదులు విమర్శిస్తున్నారు. ఇక ఏ ఆధారం లేకుండా, స్థానిక అంశాలతో ఏ మాత్రం పరిచయం లేని మెయిల్ టుడే ప్రచురించిన కథనం అదేదో రాజపవూతమైనట్లు.. అన్నీ తెలిసిన సీమాంధ్ర మీడియా సంస్థలు ఇక అంతా అయిపోయిన ప్రచారం చేయడంపై తెలంగాణవాదులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

తెలంగాణ ప్రజల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మీడియా సంస్థలకు తెలంగాణపై విషం గక్కడం ఇదే మొదటి సారి కాదని గుర్తు చేస్తున్నారు. ఆజాద్ ఇరు ప్రాంత నేతలతో సంప్రతింపులు ముగించి అధినేత్రి సోనియాకు ఇచ్చిన నివేదికలో తెలంగాణ అవసరం లేదని ఆజాద్ పేర్కొన్నట్లుగా ప్రచారానికి దిగారని పేర్కొంటున్నారు. ఆ నివేదిక ఏదో తామే ఇచ్చినంతగా బిల్డప్ ఇచ్చాయని తెలంగాణవాదులు చెబుతున్నారు. నిజానికి ఆ సమయంలో అప్పటికి ఆజాద్ సంప్రతింపుల ప్రక్రియను ముంగించనూ లేదు.. తుది నివేదికను సమర్పించనూ లేదని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే 14ఎఫ్ తొలగింపు, ప్రాణహిత-చే ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయ మార్గాలంటూ గోల చేశాయని అంటున్నారు. వారి మదిలో దాగున్న కోర్కెను సందర్భానికనుగుణంగా ప్రజలపై రుద్ది, వికృతానందం పొందటం ఆ మీడియా సంస్థలకు అలవాటుగా మారిందని తెలంగాణవాదులు నిప్పులుగక్కుతున్నారు.


తమ ఆకాంక్షలను, అజెండాలను ఢిల్లీ పెద్దలకు ఆపాదించడం వారికి పరిపాటిగా మారిందని, ‘మనం మండించి వండిన వార్తలను ఖండించే వారు దండించే వారు లేరన్న ధీమా’తో సీమాంధ్ర మీడియా వికృత చేష్టలు రోజు రోజుకు మీతిమీరిపోతున్నాయని తెలంగాణవాదులు ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణ రాదని రోడ్డు మీద ఓ పిచ్చి కాగితం దొరికినా దాని ఆధారంగా ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఊదర కొట్టేదాకా ఈ పైత్యం వెళ్లిందని ఎద్దేవా చేస్తున్నారు. ఇందులో భాగంగానే మెయిల్ టుడే కథనానికి ఎక్కడలేని పవివూతతను ఆపాదించి, తెలంగాణ రాదని చెప్పడం ద్వారా తమ కుళ్లుబోతు తనాన్ని వెల్లబోసుకున్నారని మండిపడుతున్నారు. ఏదో లక్ష్యంతో, ఏవో ప్రయోజనాలాశించి మెయిల్ టుడే రాసుకున్న సింగల్ కాలమ్ ఐటమ్‌ని గంటల తరబడి మోతబెట్టిన సీమాంధ్ర మీడియాను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజానీకం లేదని ఉద్యమ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ తేల్చెయ్యాలన్న కృతనిశ్చయంతో మేడమ్ ఉన్నారన్న వార్తలు వెలువడగానే అర్థం పర్థం లేని కథనాలతో ప్రజలను గందరగోళ పరచాలనుకుంటే అది అయ్యే పని కాదని పలువురు కాంగ్రెస్ నేతలు సైతం చెబుతుండటం గమనార్హం.


సున్నితవాతావరణంపై దాడి!
ప్రస్తుతం తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తీవ్రత హెచ్చు స్థాయిలో ఉంది. దశాబ్దాల అణచివేతల నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమం కల్పించిన భావోద్వేగాలు తెలంగాణ గుండెల్లో నిండి ఉన్నాయి. ఇప్పటికే ఒకసారి నోటిదాకా వచ్చిన కూడును సీమాంధ్ర నేతలు కట్టగట్టుకుని, రాజీనామా డ్రామాలాడి నేలపాలు చేశారని తెలంగాణ ఉద్యమ శ్రేణులు విమర్శిస్తున్నాయి. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణకు ఏ కాస్త సానుకూల వాతావరణం కనిపిస్తున్నదని అనిపించినా సీమాంధ్ర నేతలు దానిని నాశనం చేయడానికి ప్రయత్నించారని, ఇప్పుడు కూడా అదే తీరులో వారి ప్రవర్తన ఉందని నేతలు అంటున్నారు.

అన్నింటికంటే మించి తెలంగాణ ఏర్పాటు చేయడమా? నిరాకరించడమా? అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా జరగాల్సిన నిర్ణయమని, అనేక రాజకీయ సమీకరణాలు ఈ నిర్ణయంతో ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా తెలంగాణ విషయంలో ఒక నిర్ణయం వెలువడుతుందని సంకేతాలు ఉన్నాయి. ఆ నిర్ణయం ఎలా ఉంటుందన్నది చెప్పలేకపోయినా.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తెలంగాణలో భావోద్వేగాల తీవ్రత నేపథ్యంలో సానుకూలంగానే నిర్ణయం ఉంటుందన్న ఆశాభావాల వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిస్థితుల నేపథ్యంలో అధిష్ఠానం అనివార్యతతో కూడిన సానుకూల నిర్ణయం ప్రకటిస్తుందన్న వాదన ఉంది. ఇదే విషయంలో తమకు సంకేతాలు ఉన్నాయని కొందరు రాజకీయ నేతలు చెప్పడం మినహా కాంగ్రెస్ అధిష్ఠానం మనసులో ఏమున్నదన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మొత్తంగా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. సానుకూల సంకేతాలు ఎలా ఉన్నా.. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు తెలంగాణ జేఏసీ సంసిద్ధమవుతున్నది.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 30 చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. రాగల నిర్ణయం ఏదైనాప్పటికీ ముందే ఊహాగానాలు చేసి, ప్రతికూల ఫీలర్లు వదలడం ప్రమాదకరమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే ఇటువంటి ప్రతికూల ప్రచారాలు దాదాపు 800 మంది తెలంగాణ బిడ్దలను బలిగొన్నాయి. కరడుగట్టిన సమైక్యవాదులైన లగడపాటి వంటి వారి అసత్య ప్రచారాలు, తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు చేసిన ప్రయత్నాలకు మనసు కకావికలమై, వీరంతా ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఇప్పుడు మళ్లీ తెలంగాణకు వ్యతిరేకంగా ఊహాగానాలతో కూడిన కథనాలు ప్రసారం చేయడం తెలంగాణ యువకులను రెచ్చగొట్టడమే అవుతుందన్న అభివూపాయాలను తలపండిన నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఒక రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఒక శాఖ స్వతంవూతించి నిర్ణయం తీసుకునే అవకాశాల్లేవని వారు స్పష్టం చేస్తున్నారు. అదే జరిగితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని వారు తేల్చి చెబుతున్నారు. 2009 డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటన కూడా కేంద్రం తరఫున చేసిందే తప్పించి, హోం శాఖ తనకు తానుగా చేసింది కాదని వారు గుర్తుచేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ప్రస్తుతం ఉన్న సున్నితవాతావరణాన్ని దెబ్బతీసేందుకు తప్ప మరొకందుకు కాదని వారు అంటున్నారు. ఈ సున్నిత వాతావరణం దెబ్బతిని, జరగరాని ఘటనలు ఏవైనా జరిగితే అందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు.