27, డిసెంబర్ 2011, మంగళవారం

‘రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం’

మిత్రులారా,


‘విశాలాంధ్ర మహాసభ’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడడం కోసం కృషి చేస్తున్న సంస్థ. రాజకీయాలకు అతీతమైనది. ‘విశాలాంధ్ర మహాసభ’ తెలంగాణ, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలకు చెందిన మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు మరియు సమాజశ్రేయస్సు కోసం కృషి చేస్తున్న అనేకమంది వ్యక్తులు కలిసి స్థాపించిన సంస్థ.
మనరాష్ట్రంలో జరుగుతున్న వేర్పాటువాద ఆందోళన, హింస మరియు విధ్వంసక చర్యలను ప్రోత్సహిస్తూ, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురైయ్యారన్న అసత్య ఆరోపణల ఆధారంగా సాగుతున్నది. విభజనవాదులు అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.మా ఉద్దేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఆందోళన పూర్తిగా అసమంజసమైనది.
ఈ సందర్భంలో, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర సమైక్యతను కాపాడుదాంఅనే అంశం పై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ నిర్వహించతలపెట్టింది. మన రాష్ట్రానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక మరియు చారిత్రక నిజాలను మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ ద్వారా ప్రజల ముందుకు తేవడం యీ ప్రయత్నం యొక్క ముఖ్య ఉద్దేశం.
వేర్పాటువాద ఆందోళన ప్రచారం చేస్తున్న నిందలు,అవాస్తవాలు,వక్రీకరణలు, అసత్యాలను ఖండించి నిజానిజాలను తెలిసుకోవడంలో మా యీ ప్రయత్నం సహాయపడుతుందని ఆశిస్తున్నాము.

December 29th 11.00 AM – 4.00 PM

Venue: Sundaraiah Vignanan Kendram, Bagh Lingampally, Hyderabad.

24, డిసెంబర్ 2011, శనివారం

'విగ్రహాలను వెంటనే పునఃప్రతిష్ఠించండి' : విశాలాంధ్రమహాసభ

డిసెంబర్ 20 వ తేదీన విశాలాంధ్రమహాసభ ప్రతినిధులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆయన కార్యాలయంలో కలిసి ట్యాంక్ బండ్ పై విధ్వంసానికి గురయ్యిన తెలుగు మహనీయుల విగ్రహాలను వచ్చే ఉగాదిలోగా  పునఃప్రతిష్ఠించాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు. దానికి సానుకూలంగా స్పందించిన సీఏం విగ్రహాల పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. మిలియన్ మార్చ్ రోజున ట్యాంక్ బండ్ పై ఆందోళనకారులపై చర్య తీసుకొంటే వచ్చే పరిణామాలను దృష్టిలో ఉంచుకొనే విగ్రహాల ధ్వంసాన్ని ఆపలేకపోయామన్నారు. పోలీసుచర్యలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయివుంటే పరిస్థితి అదుపుతప్పుతుందేమోనన్న ఆలోచన చేశామన్నారు.




22, డిసెంబర్ 2011, గురువారం

దార్శనికుడు పి.వి.

"ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగ
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ''

1972లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శాసనసభలో చదివిన ఈ కవితార్థం చరితార్థం కావించిన వాడు పాములపర్తి వేంకట నరసింహారావు దేశమంతా 'పి.వి'గా పిలుచుకున్న తొలి తెలుగు ప్రధాని. పి.వి. రాజకీయ చతురతలో రాణించాడు; ఏ కుల, వర్గ, మతాల గుంపును దరిచేరనివ్వలేదు. ఆయన దృక్పథం ప్రజాస్వామ్యం. దృష్టి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు జరిపారు; కాంగ్రెస్ అధ్యక్షునిగా, బడుగువర్గాలకే ప్రాధాన్యమిచ్చి రాజ్యాధికారానికి స్వాగతించారు.

తెలుగు భాషకు పట్టనున్న దుర్గతి ఊహించి తెలుగు అకాడమీ స్థాపించారు. తెలుగు అధికార భాషా సంఘ స్థాపనలో పి.వి. కృషి ఉంది. రాష్ట్రంలో, బోధనా భాషగా తెలుగు ప్రాముఖ్యత గురించి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. తెలుగు బోధన తప్పనిసరిగా పదవ తరగతి వరకు అమలులో ఉండేలా చూశారు.1973లో అకాడమీ అధ్యక్షులుగా 'ఉత్తరోత్తరా ఏమి జరుగుతుందో చెప్పలేం' అన్నారు.

1933లో అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్ న్యూడీల్ అనే కొత్త ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లుగా ప్రధాని పి.వి. భావి భారతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుందని గ్రహించి తన దార్శనిక దృష్టితో అటువంటి కొత్త ఆర్థిక కార్యక్రమాన్ని మన దేశంలో ప్రవేశపెట్టారు. తద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు.

కేంద్రీకృత ప్రణాళికా విధానాన్ని వదిలి, ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ మార్కెట్‌కు ప్రవేశం కల్పించారు. 1995లో పోఖ్రాన్-2 అణు పాటవ పరీక్షలను పి.వి.నే సాహసోపేతంగా నిర్వహించారు. దేశ అవసరాలు, ఆలోచనలు పూర్తిగా తెలిసిన వివేకవంతమైన పాలకుడు పి.వి. 1988లో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉంటూ అంతర్జాతీయంగా మేధావి అని గుర్తింపు పొందారు. ఐక్యరాజ్యసమితిలో ఆయన ప్రసంగానికి, వివిధ దేశాల ప్రతిని«ధలు వినమ్రంగా లేచి నిలుచుని పదినిముషాల పాటు చప్పట్లతో ప్రశంసలు కురిపించారు.

పి.వి.కి భవిష్యత్తు పట్ల చక్కని అవగాహన ఉంది. మానవుని క్రమవికాసం అరనిందులు దర్శించురని ప్రస్తావిస్తూ "ఈ అభూత పరిణామ క్రమంలో భారతదేశం అనేక ఇతర దేశాలకన్నా విజయవంతంమైన సమాజంగానూ, భాగస్వామిగా వ్యవహరించే మహదావకాశాలు కలిగి ఉందని నా ప్రగాఢ విశ్వాసం'' అని దృఢంగా చెప్పారు. పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఒకే విధంగా నడిచిన పి.వి. స్థితప్రజ్ఞుడు. తన మనసుకు నచ్చింది చేసేవాడు. అంతటి మహామనిషికి భరతజాతి చిత్తశుద్ధితో నివాళి అర్పించగా; ఆయన సేవలు నిరంతరం పొందిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మాత్రం ఆయనను చివరిదశలో అశాంతికి గురిచేసింది.

పలు కోర్టు కేసుల్లో సతమతమైనా, ఆయన ఎవరినీ విమర్శించలేదు సరికదా తన కేసులు తానే వాదించి నెగ్గారు. మరణానంతరం ఆయన అంతెవాసు లు, పార్టీ నేతలు ఘోరంగా వ్యవహరించారు. అందరు ప్రధానులకు అం తిమ సంస్కారాల వేదికలు నిర్మించిన ఢిల్లీ నేతలు పి.వి.కి. ఆరడుగుల నేల ఇవ్వ మనసురాలేదు సరికదా ఆయన దేహాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలోకి అనుమతించని 'గొప్ప' నాయకత్వం ప్రపంచంలో ఇదేనేమో! అయినా తెలుగు ప్రజల గుండెల్లో పి.వి. చిరంజీవి.

- డా. బి. దామోదరరావు
పి.వి.స్మారక పీఠం, కరీంనగర్
(డిసెంబర్ 23న పి.వి.నరసింహారావు వర్ధంతి)

యూపీ కి కేంద్రం కొర్రీలు - నమస్తే తెలంగాణా ఆక్రోశం

నాలుగు రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉత్తర్ ప్రదేశ్ చేసిన అసెంబ్లీ ప్రతిపాదన పైన కేంద్రభుత్వం అడిగిన ప్రశ్నల పై మాయావతి స్పందన ఎలా ఉన్నా మన యెల్లో జర్నల్ నమస్తే తెలంగాణా ఏడుపు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నేటి నమస్తే తెలంగాణా దినపత్రిక లో వచ్చిన ఎడిటోరియల్ చదివి తరించండి.

ఉత్తరప్రదేశ్ శాసన సభ పంపించిన రాష్ట్ర విభజన తీర్మానానికి కేంద్రం కొర్రీలు పెట్టి తిప్పి పంపడంతో కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి బయటపడ్డది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఆరోపించినట్టుపజాభివూపాయాన్ని పట్టించుకోక పోవడం, ప్రధాన సమస్యలను దాటవేయడం కాంగ్రెస్ స్వభావం. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర విభజనను కాదనలేక, తిరస్కరించలేక కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనాన్ని గ్రహించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ‘కాంక్షిగెస్ కో ఖతం కరో’ నినాదం చేపట్టారు. కానీ ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఈ విషయం ఎంతో ముందే గ్రహించి అక్కడ కాంగ్రెస్ పార్టీ పాలనను సమాధి చేశారు.


రాష్ట్రాల విభజనపై కేంద్రానికే అధికారం ఉన్నదని, తాము తీర్మానం చేసినందు వల్ల ఇక బాధ్యత కేంద్రానిదే అని మాయావతి ఇప్పటికీ అంటున్నారు. మాయావతి వాదనలో ఔచిత్యం ఉన్నది. భిన్న సాంస్కృతిక, భౌగోళిక మండలాలతో వైవిధ్య భరితమైన మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక్క ప్రాంత పక్షం వహించడం వల్ల మరో ప్రాంతం అణచివేతకు గురికావచ్చు. ఆనాడు ధర్ కమిషన్ హెచ్చరించింది కూడా ఇదే. భాష పేరుతో మరో ప్రాంత సాంస్కృతిక అస్తిత్వానికి ముప్పు వాటిల్లకూడదనే భావన కూడా ఆనాడే గ్రహింపునకు వచ్చింది. అందువల్ల కేంద్రం తీర్పరి పాత్ర పోషించాల్సిందే. అయితే కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించక పోవడం అనుచితంగా ఉంటుందనే భావన కూడా ఏర్పడింది. అందుకనే రాష్ట్రాన్ని సంప్రదించాలి తప్ప, రాష్ట్ర అభివూపాయాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. రాజ్యాంగం ఇంత స్పష్టంగా ఉన్నది కనుకనే యూపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాజ్యాంగం తనకు కట్టబెట్టిన బాధ్యతకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించక పోవడం వల్లనే ఇప్పుడు రాష్ట్రాల విభజనకు సంబంధించి చిక్కులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ విషయంలో మాదిరిగానే యూపీ పట్ల కూడా కేంద్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్త్తున్నది.


రాజ్యాంగంలోని 3 వ అధికరణం ప్రకారం రాష్ట్ర శాసన సభ అభివూపాయాన్ని రాష్ట్రపతి ద్వారా కోరాలే తప్ప హోం మంత్రిత్వ శాఖ లేఖ రాయడం సరైంది కాదని మాయావతి అంటున్నారు. ఇది జరగాలంటే మొదట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనను సూత్రబద్ధంగా అంగీకరించాలె. ఇష్టం లేకపోతే ఆ విషయం ధైర్యంగా చెప్పాలె. కానీ తన నిర్ణయం చెప్పకుండా, కాలయాపన కోసం కొర్రీలు పెట్టి హోం మంత్రిత్వ శాఖ ద్వారా లేఖలు పంపడం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించడమే. మనదేశంలో రాష్ట్రాల ఏర్పాటు కొత్తేమీ కాదు. ఇదే ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ కూడా విడిపోయింది. 1998 సెప్టెంబరు 22 వ తేదీన పార్లమెంటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అభివూపాయాన్ని కోరింది. 2000 సంవత్సరం మార్చి 30వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ తరువాత రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అప్పుడే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ కూడా ఏర్పడ్డాయి. అప్పుడు రాష్ట్రాలను కాలయాపన కోసం ఇటువంటి అసంబద్ధ ప్రశ్నలు వేయలేదు. మన దేశంలో రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ఇది మొదటిసారి కాదు. అందుకు అనుసరించవలసిన విధానాలు స్థిరపడి ఉన్నాయి. 

యూపీ రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వేసిన ప్రశ్నలు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయాలని నిర్ణయించుకున్నదని తెలిసిపోతుంది. కొత్త రాష్ట్రాల సరిహద్దులు ఏమిటి? ఏ జిల్లాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయి? వాటి వైశాల్యం, జనాభా ఎంత వంటి ప్రశ్నలు అర్థం లేనివి.


అవి ముంజేతి కంకణం మాదిరిగా చూస్తేనే కనబడుతున్నాయి. ఆయా ప్రతిపాదిత రాష్ట్రాల రాజధాని సమస్య కూడా లేదు. ఏ ప్రాంతం వారూ బుద్ధి జ్ఞానం లేకుండా మరో ప్రాంత రాజధాని కావాలని కోరడం లేదు. కోరినా అసంబద్ధమైన కోరికను ఎవరూ హర్షించరు. రాష్ట్ర విభజన జరిగితే ఐఎఎస్ అధికారులు ఎంత మంది ఏ రాష్ట్రంలో ఉంటారనేది సూత్ర బద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు చర్చించాల్సిన గొప్ప అంశమా అనే ఆశ్చర్యం కలుగుతున్నది. ఆదాయ పంపకం, రుణాల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగా అడగడం వింతగా ఉన్నది. రాష్ట్రాల రుణ భారాన్ని సమస్యగా చెప్పడం కూడా అర్థ రహితమే. ఈ విదేశీ రుణాల గురించి మాట్లాడాలంటే, ఈ తరహా ఆర్థిక విధానాలకు ఆద్యులలో ఒకరైన ప్రధాని మన్మోహన్‌సింగ్ జవాబుదారు అవుతారు.


ఆధిపత్య దేశాలు , వారి తాబేదారులు మొత్తం మూడవ ప్రపంచ దేశాలకు తెచ్చిపెట్టిన సమస్య ఇది. అన్ని రాష్ట్రాలూ రుణభారంతోనే ఉన్నాయి. విభజన జరిగినప్పుడు ఆస్తులు, రుణాలు న్యాయబద్ధంగా పంపకాలు చేయడానికి ఇప్పటికే అనుసరించిన విధానాలు మార్గదర్శకంగా ఉంటాయి. ఇది కూడా కేంద్రానికి తెలియదని కాదు. తెలిసి చేస్తున్న కుతర్కాలు ఇవి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యూపీ ప్రభుత్వానికి పంపిన ప్రశ్నావళిని బుద్ధి పూర్వకంగా పత్రికలకు విడుదల చేసింది. దీనిని కాంగ్రెస్ నాయకులు పారదర్శకతగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులకు పారదర్శకతపై అంత నమ్మకం ఉంటే, తెలంగాణ విషయంలో ఆజాద్, ప్రణబ్ జరుపుతున్న చర్చల సారాన్ని ఎందుకు వెల్లడించడం లేదు? తెలంగాణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గడియకోసారి చెబుతున్నారు. కానీ పరిష్కార యత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎందువల్ల తాత్సారం జరుగుతున్నదో చెప్పడం లేదు. ఇక్కడి నాయకులు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్నదేమిటో తెలియదు. యూపీ విషయంలోనైనా, తెలంగాణకు సంబంధించి అయినా ప్రజలు కోరేది ఒక్కటే. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వ్యవహరించాలె, ప్రజల మనోభావాలు గౌరవించాలె.

19, డిసెంబర్ 2011, సోమవారం

విశాలాంధ్రోద్యమాన్ని నేను హృదయపూర్వకంగా బలపరుస్తున్నాను: స్వామి రామానందతీర్థ (14 .2 .1950)

1950 ఫిబ్రవరి 13,14 వ తేదీలలో విశాలాంధ్రమహాసభ స్థాయిసంఘ సమావేశం వరంగల్ లో అయ్యదేవర కాళేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగింది. ఆ సమావేశాలకి మాడపాటి హనుమంతరావు, టంగుటూరి ప్రకాశం,స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు,కే.వీ.రంగారెడ్డి, బులుసు సాంబమూర్తి,అబ్దుల్ సలీం, కాళోజి మొదలైన ప్రముఖులు హాజరైయారు.  

ఆ సందర్భంగా ప్రసంగించిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానందతీర్థ, హైదరాబాద్ సంస్థాన విచ్ఛిత్తి భాషాప్రయుక్త రాష్ట్రాల నిర్మాణానికి ప్రస్తావన కావాలని, విశాలాంధ్రోద్యమం న్యాయమైనది, సహజమైనది అని , ఎనిమిది తెలంగాణా జిల్లాలు చేరనిదే ఆంధ్రరాష్ట్రం సమగ్రంకాదని అన్నారు.




ఆంధ్రప్రభ,ఫిబ్రవరి 15,1950





11, డిసెంబర్ 2011, ఆదివారం

తెలంగాణ ఊరువాడా 'విశాలాంధ్ర' అని నినదించిన వేళ

నైజాం ప్రాంతంలో తెలుగు భాషా పరిరక్షణకు, తెలుగు వారి ఆత్మా గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రారంభమైన 'ఆంధ్రోద్యమం' నిజాంపాలన నుండి విముక్తి లభించడంతోనే ఆగలేదు. 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అనే నినాదం తెలంగాణ సాయుధ పోరాటం నాడే వినవచ్చింది. 1950 లోనే 'విశాలాంధ్రమహాసభ' వరంగల్ లో స్థాయిసంఘ సమావేశాన్నినిర్వహించి అన్ని ప్రాంతాల ప్రముఖులను ఒక వేదిక పై తెచ్చి 'విశాలాంధ్ర' ఏర్పడాలని తీర్మానాలు చేసింది.

హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి విశాలాంధ్ర వెంటనే ఏర్పడాలని అభిలాషించినా, శాసనసభలో మెజారిటీ సభ్యులు ఆ మేరకు తీర్మానాన్ని సమర్ధించినా, వారు తమ వ్యక్తిగత అభిప్రాయములను ఇతరులపై రుద్దలేదు.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పై దేశమంతటా చర్చ జరుగుతున్న సమయంలో తెలుగువారందరూ ఒకే గొడుగు కిందకు రావాలని, విశాలాంధ్ర ఏర్పడాలని, తెలంగాణ ఊరువాడా ఎన్నో తీర్మానాలు వెలువడ్డాయి.ఈనాడు తమ ప్రాంత చరిత్రే తెలియని  అజ్ఞానులు, స్వార్థపరులు 'విద్రోహం' అంటూ కొత్త వాదనలు లేవదీస్తున్నారు, అమాయకులను తప్పుదారి పట్టిస్తున్నారు, వేర్పాటువాదంతో ఒక ప్రాంతప్రజల కష్టాలన్నీ తొలగింపబడతాయి అని మాయమాటలు చెబుతూ తరాలుగా మిమ్మల్ని అణిచివేసింది మేముకాదు ఇతర ప్రాంతాల వారు అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, స్వార్థచింతనతో తమ భవిష్యత్తు బాగుంటే చాలన్న ఉద్దేశంతో ఎన్నో కష్టాల పిమ్మట ఒకటిగా చేరిన తెలుగువారిని చీల్చాలని చూస్తున్నారు. వారు ఎన్ని చేసినా నిజాలను దాయడం అంత సులువకాదు



ఆంధ్రపత్రిక, డిసెంబర్ 3,1955



ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955

 
ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955




ఆంధ్రపత్రిక, డిసెంబర్ 27,1955

ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే!


10, డిసెంబర్ 2011, శనివారం

విశాలాంధ్ర ఏర్పాటుకే మొగ్గు చూపిన హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ (డిసెంబర్,1955)

ఇదివరకే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫార్సులపై ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం(అక్టోబర్,1955 )లో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణమే విశాలాంధ్ర ఏర్పడాలని ఏకాభిప్రాయానికి వచ్చిన సంగతి చదివాము. అదే సంవత్సరం నవంబర్ మాసాంతంలో శాసనసభ లో హైదరాబాద్ రాష్ట్ర భవిష్యత్తుపై చర్చను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అధికార తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానం విషయం పై ప్రసంగించిన బూర్గులగారు ఈ క్రింది విధంగా అన్నారు:

"రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫార్సులపై ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్మానాన్ని రూపొందించారు.అందులో లోపాలోపాలు నాకు తెలుసు.


సభలోని అన్ని వర్గాలనూ తీర్మానం సంతృప్తికలిగించలేదని కూడా నాకు తెలుసు. ప్రతిపాదించదలచినట్టు ఇప్పటికే నోటీసు రెండు డజన్ల సవరణలు ఈ విషయాన్ని విదితం చేస్తున్నవి.


కర్నాటక, సంయుక్త మహారాష్ట్రలను ఏర్పాటు చేసే విషయంలో కూడా అభిప్రాయభేదాలున్నవి. తెలంగాణలో మూడు రకాల అభిప్రాయములున్నవి. తక్షణ విశాలాంధ్ర నిర్మాణానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యవర్గం ఇచ్చిన సలహాను పాటించాలని కొందరు అంటున్నారు.శాశ్వతంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మరికొందరు అంటున్నారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫారసును ఆమోదించడమే మంచిదని వేరొక వర్గం అంటున్నారు.నివేదిక పై దాదాపు 25 మంది సభ్యులు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘముకు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. సభ్యులందరూ అదే విధంగా సభలో తమ అభిప్రాయాలను తెలియచెయ్యడం సాధ్యం కాక పోవచ్చు. సభ్యుల అభిప్రాయాలను భారత ప్రభుత్వానికి తెలియజేస్తాం.వ్యవధి లేనందువల్లచర్చలో పాల్గొనే అవకాశం లభించని సభ్యుల లిఖితపూర్వక అభిప్రాయములను అంగీకరించడమా అంగీకరించపోవడమా అనేది సభాపతి నిర్ణయించాలి. ఏమైనా ఈ విషయమై తుది నిర్ణయం చేసే అధికారం పార్లమెంటుదే.

ఆంధ్ర పత్రిక, డిసెంబర్ 1,1955


సభలో ఎక్కువ మంది సభ్యులు తమ అభిప్రాయములు వెల్లడించడానికి అవకాశం కల్పించడం కోసం చర్చ సుదీర్ఘంగా సాగింది

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 4,1955

ఎనిమిది రోజుల పాటు బూర్గుల గారు ప్రతిపాదించిన తీర్మానాన్ని హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ చర్చించింది. సభలో మెజారిటీ సభ్యులు తక్షణ విశాలాంధ్ర ఏర్పాటునే సమర్ధించారు.చర్చలో మొత్తం 147 సభ్యులు పాల్గొనగా వారిలో 103 మంది వెంటనే విశాలాంధ్రను నిర్మించడానికి అనుకూలంగా మాట్లాడారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని 29 మంది వాదించారు.15 మంది ఎటూ చెప్పలేదు.అంతటితో చర్చను ఆపి తదుపరి శాసనసభ సమావేశం మొదటి రోజున దానిని కొనసాగించాలని నిర్ణయించి శాసనసభ సమావేశం వాయిదా పడింది. నేటి తరం వేర్పాటువాదులు, వారి అబద్ధాల విషపత్రిక తిరిగి రాయలేని చారిత్రిక సత్యం ఇది.

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955
 

 

8, డిసెంబర్ 2011, గురువారం

'ఏకాభిప్రాయంతోనే కొత్త రాష్ట్రాలు' - రాజ్యసభలో హోం శాఖ సహాయమంత్రి

ఆంధ్రజ్యోతి: ఇక నుంచి దేశంలో ఒక రాష్ట్రాన్ని విభజించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ ప్రతిపాదనపై సంబంధిత రాష్ట్రంలో విస్తృత ఏకాభిప్రా యం ఉన్నప్పుడు మాత్రమే తాము ముందుకు కదులుతామని కేంద్రం ప్రకటించింది. "కొత్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల విస్తృత పర్యవసానాలు ఉంటాయి.

అందువల్ల రాష్ట్ర విభజనపై సంబంధిత రాష్ట్రంలో విస్తృత ఏకాభిప్రాయం ఉన్నప్పుడు.. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాక మాత్రమే కొత్త రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం ముందుకు కదులుతుంది'' అంటూ రాజ్యసభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం, దానిపై సాధారణ ఏకాభిప్రాయం మీద ఆధారపడి కేంద్రం చర్యలు ఉంటాయని బుధవారం రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి తెలిపారు.

RAJYA SABHA
UNSTARRED QUESTION NO. †1608. 
TO BE ANSWERED ON THE 7th DECEMBER, 2011/AGRAHAYANA 16, 1933 (SAKA)

DIVISION OF UP INTO FOUR SEPARATE STATES

1608. SHRI MOHAN SINGH:


Will the Minister of HOME AFFAIRS be pleased to state:

(a) whether a proposal to divide the present geographical unit of Uttar Pradesh into four parts has been passed by the State Assembly;

(b) if so, whether Central Government intends of formulate separate States of Gorkhaland, Vidarbha, Bundelkhand including Telangana, etc;

(c) if not, the reason therefor;

(d) whether there is any plan to bring various parts of India, suffering the agony of backwardness, into the race for development by providing them special packages; and 

(e) if not, the reasons therefor?

ANSWER

MINISTER OF STATE IN THE MINISTRY OF HOME AFFAIRS
(SHRI JITENDRA SINGH) 

(a): Yes Sir.

(b) & (c): Creation of any new State has wide ramifications and direct bearing on the federal polity of our country. The Government of India moves in the matter only when there was a broad consensus in the parent State, that one part thereof may be separated to form a new State. Government takes decision on the matter of formation of new States after taking into consideration all relevant factors. Action by the Government would depend on the felt need and general consensus.


(d) to (e): Under the Backwards Regions grant Fund, central assistance is granted to identified backward districts/ regions. Besides, State-specific need based special dispensation is made as and when required through existing programmes, schemes under Annual/Five Year Plans.


జనవాక్యం: తెలుగు పీఠమా? ఆంధ్ర పీఠమా?

జనవాక్యం,ఆంధ్ర జ్యోతి : ఎట్టకేలకు తెలుగు భాషకు ప్రాచీనహోదా, ఆ పీఠం మైసూర్‌లో కాకుండా తెలుగు నేలపై నెలకొల్పటానికి అంగీకారం పొందటం జరిగింది. ఇది అందరూ సంతోషించదగ్గ సఫలత. అయితే ఒక విషయంలో జాగరూకులమూ ఆలోచించవలసిన అగత్యం ఉంది. రాష్ట్ర విభజన ఉద్యమం పేరిట జరిగిన అన్యాయాల, అవమానాల, జాబితాలో భాష, భాషావేత్తలు, కవులు పొట్టిశ్రీరాములు, ఆర్థర్ కాటన్, తెలుగు తల్లి, కాసు బ్రహ్మానందరెడ్డి, వంటి ప్రముఖులే గాక, ఆంధ్రా బేంక్, ఆంధ్ర మహిళాసభ వంటి సంస్థలు, ప్రాంతీయ దైవాలు, తిరుపతి లడ్డూ కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగు వేరు ఆంధ్రం వేరు, సీమాంధ్రులది ఆంధ్రభాష, తెలంగాణ వారిది తెలుగు భాష అన్న వాదనలు కూడా బయలుదేరాయి. ఇన్నాళ్ళూ 'మన' రాజధాని అన్న భావంతో రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు పరంగా ఎన్ని విద్యా, వైద్య పార్రిశామికాది సంస్థలు హైదరాబాదులో వెలసినా కిమ్మనలేదు. కాని నేటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలుగు పీఠాన్ని మైసూర్ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని సి.నా.రె, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి రచయితలు బుద్ధప్రసాద్, పురంధేశ్వరి వంటి మంత్రులు ఇతర ప్రముఖులు విజయవంతమైన ప్రయత్నాలు చేశారు.

బహుప్రయత్న లబ్దమైన ఈ సంస్థ హైదరాబాదులో నెలకొన్నాక- ఇది మా తెలుగుపీఠం ఇందులో మీరు వేలు పెట్టకండి, మీ ఆంధ్ర పీఠం మీరు తెచ్చుకోండి అనే సందర్భమూ రావచ్చు. అందులో కృషిచేసే పండితులకు, భాషా వేత్తలకు ఇతర సిబ్బందికి- పైన పేర్కొన్న ప్రముఖులకు జరిగిన 'సన్మానం' జరగదని, ఆ సంస్థకు ట్యాంక్ బండ్ మీది విగ్రహాలకు పట్టిన గతి పట్టదని భరోసా ఏమైనా ఉన్నదా? ఇప్పటికే సాహిత్యపీఠం ఉన్న రాజమండ్రీ, సాహిత్య రాజధానిగా పేరొందిన విజయవాడ అనువైన ప్రదేశాలు అన్న విషయం పరిగణలోకి తీసుకోవాలి.

అసలింతకూ ఈ పీఠం కర్ణాటకలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా ఏం చెయ్యాలి? ఏ విషయాలమీద పరిశోధన చేపట్టాలి? ఎట్టి పరిశోధకుల్ని, భాషా వేత్తలను నియమించుకోవాలి? ప్రాచీన భాషా? క్లాసికల్ భాషా? ఏ పేరుతో పిలవాలి? ఈ అర్థాన్నిచ్చే తెలుగు పదమేది? ఏదో ఒకటిలే అనుకున్నా, వచ్చిన ప్రతిపత్తిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలి? - ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించండి మహాప్రభో అని ఏ మంత్రిత్వ శాఖ వారికి మొర పెట్టుకోవాలి? తమిళ, కన్నడ ప్రభుత్వాల వలె మన భాషకూ ఒక మంత్రిత్వ శాఖ ప్రారంభించటం అత్యవసరం కాదా? ఇలాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకొని ముందుకు సాగాలి. మాతృభాష పట్ల శ్రద్ధాభక్తులున్న అందరూ తలోచెయ్యీ వెయ్యాల్సిన అవసరం ఉంది.

- ప్రసాద్ మున్షీ, ఆర్.కె.పురం, సికింద్రాబాద్

7, డిసెంబర్ 2011, బుధవారం

చిన్న రాష్ట్రాలకు నేను వ్యతిరేకం : కుల్దీప్ నయ్యర్

ఆంధ్రజ్యోతి: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాను వ్యతిరేకమని, రెండో ఎస్సార్సీ వేసేందు కు ఇది సమయం కాదని ప్రముఖ జర్నలిస్టు, మాజీ హై కమిషనర్ కుల్దీప్ నయ్యర్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక రా ష్ట్రాల డిమాండ్లు అన్ని సమస్యలనూ ఆటోమేటిక్‌గా పరిష్కరించలేవని, పైగా ఎవరూ పరిష్కరించలేని మరిన్ని సమస్యలను సృష్టిస్తాయని స్పష్టం చేశారు. 'భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రాల సమస్య' అనే అంశంపై బోడోల్యాండ్ విద్యార్థి విభాగం మంగళవారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జాతీయ సదస్సు నిర్వహించింది.

ఇందులో కు ల్దీప్ నయ్యర్ పాల్గొని ప్రసంగించారు. చిన్న రాష్ట్రాల ఆ కాంక్షలు సమంజసమే కావొచ్చని, వీటి కోసం ఎస్సార్సీ వేయాల్సి ఉంటుందని, అయితే, తన దృష్టిలో రెండో ఎ స్సార్సీ వేసేందుకు కూడా ఇది సరైన సమయం కాదని వివరించారు. దేశంలో మరెన్నో సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు ఎస్సార్సీ వేస్తే ఇక ఆ హంగామాలో పనులేమీ జరగవని చెప్పారు. మొదటి ఎస్సార్సీ సమయంలో ఇలాగే జరిగిందని, తాను అదంతా చూశానని, కాబట్టి ఇప్పుడు రెండో ఎస్సార్సీ వేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఏ రాష్ట్రంలోని ఆకాంక్షలపైనైనా ఎస్సార్సీ వేసే ముందు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎస్సార్సీతో ఆర్థికంగా కేంద్రంపై చాలా భారం పడుతుందని, దీనికి కేంద్రం డబ్బు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. అందుకే చిన్న రాష్ట్రాలకు తాను అనుకూలం కాదని తేల్చి చెప్పారు. తెలంగాణకు కూడా తాను అనుకూలం కాదని స్పష్టం చేశారు. మరొకవైపు కూడా మనోభావాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుకు ఇది సరైన సమయం కాదన్నారు. దీనివల్ల దేశం, రాష్ట్రం నాశనం కాకూడదని హితవు పలికారు.

ఒకవేళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటే.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కుల్దీప్ నయ్యర్ సూచించారు. తెలంగాణ అంశంలో కేంద్రం తప్పు చేసిందని, ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత కమిషన్‌ను ఏర్పాటు చేసిందని.. అలా కాకుండా ముందే కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఆ తర్వాత ప్రకటన చేసి ఉండాల్సిందని చెప్పారు.

ఒకవేళ తెలంగాణ ఏర్పాటైతే గూర్ఖాల్యాండ్, బోడోల్యాండ్, వి దర్భ, యూపీలో నాలుగు రాష్ట్రాల ఏర్పాటును డిమాండ్ చేస్తారని, ఇది సరైనదేనా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా తాను గౌరవిస్తాను. కానీ, ఆంధ్రప్రదేశ్ విభజనకు మాత్రం అంగీకరించనని స్పష్టం చేశారు.

6, డిసెంబర్ 2011, మంగళవారం

విశాలాంధ్ర ఏర్పడితే చాలా సంతోషిస్తాను : పండిట్ నెహ్రూ (11.12.1955)

1955 అక్టోబర్ మాసంలో ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు విశాలాంధ్ర ఏర్పాటు వెంటనే జరగాలని ఏకాభిప్రాయమునకు వచ్చారని చదివాము

భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు డిసెంబర్ 11 న గుంటూరు రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆంధ్ర రాజకీయ మహాసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ కార్యవర్గం విశాలాంధ్ర ఏర్పడాలని చెప్పిందని, దానిపై ఇరు ప్రాంతాల నాయకులు కలిసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. విశాలాంధ్ర ఏర్పడితే తాను మిక్కిలి సంతోషిస్తానని, త్వరలోనే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘ నివేదిక పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుందని, ఆ నిర్ణయాలు పార్లమెంట్ పరిశీలనకు వస్తాయని చెప్పారు.



ఆ తర్వాత పండిట్ నెహ్రూ నిజామాబాద్ నందు మార్చ్ 5,1956 తేదీన విశాలాంధ్ర ఏర్పాటును ప్రకటించిన విషయం తెలిసినదే.

29, నవంబర్ 2011, మంగళవారం

ప్రత్యేక తెలంగాణ నినాదం ఆత్మహత్యా సదృశమైనది : జే.వీ.నర్సింగరావు(15.08.1969)

ఈ మధ్యకాలంలో వేర్పాటువాదులు తమ అబద్ధాల విషపత్రికలో, వారి మద్దతుదారులు కొంతమంది అంతర్జాలంలో చరిత్రను తిరగ రాసేస్తున్నారు. ఈ క్రమంలో 1956 లో  సీమాంధ్ర నాయకులు తెలంగాణ జిల్లాలను బలవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో కలిపివేసుకొన్నారు అనే కథ ప్రచారం చేస్తున్నారు. పనిలోపని గా నవంబర్ ఒకటిని విద్రోహ దినంగా పాటించాలని సకల జనులకు హుకం జారీ చేసారు. అయితే పాపం వీరి పిలుపుకి అటుకుడివైపు భాజపా నుండిగాని  ఇటుఎడమ వైపు సీపీఐ-ఎంఎల్ నుంచి గాని, తెరాస మినహా ప్రధాన రాజకీయ పక్షాల నుండి అంత స్పందన రాలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న సీపీఐ-ఎంఎల్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే తాము నవంబర్ ఒకటిని విద్రోహ దినంగా పాటించమని , తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని 1956లో వ్యక్తమైన ఆకాంక్షను విద్రోహంగా చూడడం చారిత్రక తప్పిదమవుతుందని బహిరంగంగానే ప్రకటించారు.

ఇప్పటికే ఈ బ్లాగ్లో వేర్పాటువాదుల చెప్పే అనేక అబద్ధాలను ఎండగట్టడం జరిగింది. వేర్పాటువాదులు తమ వాదనకు సాక్షాలుగా ప్రచారం చేసుకొనే వాటిలో 1955 లో హైదరాబాద్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉండిన శ్రీ జే.వీ.నర్సింగరావు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమైనవి. ఇండియన్ ఎక్ప్రెస్ లో వచ్చిన ఈ న్యూస్ రిపోర్ట్ లో ఆయన కాంగ్రెస్ అధినాయకత్వం విశాలాంధ్రను బలవంతంగా ఎవరిపైనా రుద్దదనీ , తనకు రక్షణలపై (Safeguards for Telangana) నమ్మకం లేదనీ, హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ విశాలాంధ్ర ఏర్పాటుకు అనుకూలంగా వ్యక్తం చేసిన అభిప్రాయానికి తెలంగాణ ప్రజల మద్దతు లేదనీ, తొంభై శాతం ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారనీ సెలవిచ్చారు. అయితే ఆయన లెక్కలకు ఆధారాలు మాత్రం చూపలేదు.ప్రజలు ఎన్నుకొన్న శాసనసభ సభ్యులు విశాలాంధ్ర విషయంపై ఎన్నికలలో పోటీ చేయలేదు కాబట్టి వారి అభిప్రాయాలు చెల్లవని కూడా సెలవిచ్చారు.

అదలా ఉంచితే, పాపం మన నవయుగ వేర్పాటువాదులకు జే.వీ.నర్సింగరావు గారు తదనంతర కాలంలో వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలియదు. తెలిసినా దానిని బహిరంగ పరచరు.జే.వీ.నర్సింగరావు వ్యాఖ్యలను వేదవాక్కులుగా భావించే వారు ఈ క్రిందివాక్కులను కూడా బాగా అరిగించుకొంటారని ఆశిస్తున్నాను. 

మొదటగా 1969 ఏప్రిల్ 20 న హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో చేసిన ప్రసంగంలో ఆయన శ్రీ పీ.వీ.నరసింహారావు తో పోటాపోటీగా సమైక్యవాదాన్ని సమర్ధించి ప్రత్యేక రాష్ట్రవాదానికి స్వస్తి చెప్పాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేసారు.

ఆంధ్ర జనత, ఏప్రిల్ 21,1969


అదే సంవత్సరం స్వాతంత్య్రదినోత్సవాన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదాలో అనేక పత్రికలకు విడుదల చేసిన సందేశంలో ప్రత్యేక తెలంగాణ నినాదం  ఆత్మహత్యా సదృశమైనదిగా పేర్కొన్నారు.త్వరలో ఆయన పూర్తి సందేశ పాఠాన్ని బ్లాగ్లో పోస్ట్ చేస్తాం.

ఆంధ్రజనత, ఆగష్టు 15,1969


విభజన పరిష్కారం కాదు !

ఆంధ్రభూమి సంపాదకీయ పేజీ: నైజాం రాజ్యాన్ని అప్పటి కేంద్ర మంత్రి సర్దార్‌పటేల్ సైనిక చర్యతో పాకిస్థాన్‌లో కలవకుండా విమోచనం చేసి భారత్‌లో విలీనం చేసిన తర్వాత భాషా రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. నైజాంలోని మరాఠా మాట్లాడే ప్రాంతాలను కన్నడం మాట్లాడే ప్రాంతాలను విడదీసి, మహారాష్టల్రోను, కర్నాటకలోను కలిపారు. మిగిలిన తెలుగు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధప్రదేశ్ ఏర్పరిచారు. దానికి అప్పటి హైదరాబాద్ అసెంబ్లీలోని మెజారిటి తీర్మానంతోనే చేశారు. దాన్ని ‘టీరనీ ఆఫ్ మెజారిటి’అనో కుట్ర, మోసం అనో అప్పుడెవరూ గోల చేయలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అధికారం, పదవులకోసం కొందరు రాజకీయవాదులు, తెలంగాణకు అన్యాయం జరిగిందని, వెనుకబడి అభివృద్ధి చెందలేదని తెలంగాణను వేరే రాష్ట్రంగా విడగొట్టాలని ఉద్యమం లేవదీశారు. దానిమీద శ్రీకృష్ణ కమిటీని వేస్తే, రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా తెలంగాణకు వేరే ప్రాంతీయ సంఘంతో కొంత ఆర్థిక ప్యాకేజి ఇచ్చి అభివృద్ధిచేయాలని నివేదిక ఇవ్వగా దాన్ని తెలంగాణవాదులు అంగీకరించలేదు. ఇపుడు ఆ వేర్పాటువాదులు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబరు 1వ తేదీని విద్రోహ దినమని నల్లజెండాలు ఎగురవేశారు.

సీమాంధ్ర ధనికవర్గాలు తెలంగాణాను కొల్లగొడుతూ, తెలంగాణను విడిపోనివ్వరని కొందరి వాదన. తెలంగాణకు అన్యాయం జరిగిందంటే అందుకు గతంలో వివిధ పదవులు పొందిన తెలంగాణ వారు కూడా కారణమే. మరి తెలంగాణలోని ధనిక వర్గాలు దోపిడి చేయనట్టుగా మాట్లాడ్డం విడ్డూరం. తెలంగాణ ప్రజా ఉద్యమమని, సమైక్యవాదం పెట్టుబడిదారుల డబ్బుతో నడిచే ఉద్యమమని తెలంగాణ వాదులు చిత్రిస్తున్నారు. ఉదారవాదులు కొందరు ఎందుకీ గోల తెలంగాణ ఇచ్చేస్తే పోలా అంటున్నారు. ఒకవేళ తెలంగాణ ఇచ్చినా పదవుల పేచీతో అందులో కొన్ని జిల్లాలు వెనుకబడ్డాయని ఫలానా జిల్లాలవారు తమకు అన్యాయం చేస్తున్నారని విడిపోవాలంటే చిన్న రాష్టవ్రాదులు ఒప్పుకొని మళ్లా విడగొడతారా? ఈమధ్యనే నెల రోజులు పైగా చేసిన సకల జనుల సమ్మెలో మద్యం దుకాణాలను, సినిమాలను మినహాయించడం, రైలు రోకోను మార్పుచేయడం విమర్శలకు తావిచ్చాయి. బలవంతపు బంద్‌లు సమ్మెలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, దిన కూలీలకు ఉపాధి లేకుండా చేయడం, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా శిక్షలొద్దనడం, పనిచేయకపోయినా జీతాలివ్వాలనడం ఈ ఉద్యమాలు నడిపే వారికే చెల్లింది! ఈ ఉద్యమ నేపథ్యంలో సాగదీయడం కేవలం ఈ రెండు ప్రాంతాల్లో అధికారంలోకి రావడమే కాంగ్రెస్ లక్ష్యమని కొందరంటున్నారు. ఇక బిజెపి రాజకీయ ప్రయోజనాలకోసం తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తుండగా, పెద్ద రాష్ట్రాలకంటె చిన్న రాష్ట్రాల్లో పోలీసు బలగాలు తక్కువగా ఉంటాయి కనుక వారిని సులభంగా ఎదుర్కోవచ్చని మావోయిస్టులు చిన్న రాష్ట్రాల వేర్పాటు ఉద్యమాన్ని బలపరుస్తున్నారని కొందరి అభిప్రాయం.

1969 లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎందుకు తిరస్కరించారో గమనించాలి. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో రాజధాని, సచివాలయం, శాసనసభా మందిరాలు, హైకోర్టు, ఉద్యోగులు వారికి ఇళ్లు, నదీ జలాలు తదితర సమస్యలు పరిష్కరించాల్సి వుంటుంది. తెలంగాణ ఒక్కటే కాదు. ఆంధ్రప్రదేశ్‌ను మూడు నాలుగు ముక్కలు చేయడం, ఇతర రాష్ట్రాల్లో కూడ చిన్న రాష్ట్రాల సమస్యలను పరిష్కరించవలసి ఉంటుంది. దానికి బదులు రాష్ట్రాలను విడదీయడానికయ్యే పైన చెప్పిన ఖర్చులతో ఆ వెనుకబడిన ప్రాంతాల్లో స్కూళ్లను, ఆసుపత్రులను, త్రాగునీరు- సాగునీరు, రోడ్లు మొదలైన వాటిని సమకూరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. తెలంగాణ లాయర్లు డిమాండ్ చేసినట్టు 42 శాతం పదవులు/ ఉద్యోగాలు తెలంగాణ వారికిచ్చి వాటిని అమలుచేయడానికి- ముఖ్యమంత్రి ఇతర మంత్రి పదవులను తెలంగాణలోని దళిత, ముస్లిం, బి.సి, స్ర్తి పురుషులకు ఇవ్వడం ద్వారా- మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించనియ్యాలి. దీనివల్ల వేర్పాటువాదం, విభజన సమస్యలు లేకుండా సామాజిక న్యాయం కూడ కలసి వస్తుంది. పశ్చిమ బెంగాల్లో ‘గూర్ఖా ల్యాండ్’ సమస్య పరిష్కార పద్ధతిని గురించి తెలుసుకోవాలి.

 - పాలంకి అంబరీషుడు

విఫల సమ్మె చాటిన జన మనోరథం

ఆంధ్రజ్యోతి జనవాక్యం: 'వేరు తెలంగాణ' తెలంగాణ ప్రాంతంలోని సకల జనుల మనోరథం కాదని ఇటీవలి 'సకల జనుల సమ్మె ఘోర వైఫల్యం' సువ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఈ 55 ఏళ్లలో ముఖ్యంగా ఒక దశాబ్దంగా 'చిచ్చు బుడ్డి' వలే పొంగి చల్లారుతున్న ఉద్యమం కేవలం అసంతృప్తులు, ఆత్మన్యూనతా వంచితులు, అధికార స్వార్థ వాంఛా పరులు కాలక్షేపానికి నడుపుతోన్నదేనని తిరుగు లేకుండా తేలిపోయింది. రావి నారాయణ రెడ్డి, రామానంద తీర్థ, రామకృష్ణ రావు తరాలవారూ, ఎంఎస్ రాజలింగం, పాగ పుల్లారెడ్డి తరాలవారూ, నర్రా మాధవరావు, ఎన్.రాజేశం, నాగేందర్, జనార్ధన్‌రెడ్డి, ముఖేష్ ప్రభృత తరాల వారూ ఆంధ్రప్రదేశ్ యథాతథంగా ఉండాలని అభిలషించేవారూ తెలంగాణ అంతటా ఎందరో వున్నారు.

దూషణ తిరస్కారాలకూ దౌర్జన్య హింసాకాండలకూ వెరచి వారు నోరుతెరవలేకున్నారు. 'ఆకాశిక్' రాజేశం వంటి వారు వెరపులేక రాస్తూనే ఉన్నారు. అది నిష్ఠుర నిజం. సాటి తోటి ఇతర ప్రాంతీయులను దుష్టులు, దుర్మార్గులు, దొంగలు, దోపిడీదారులు అని దుర్భాషలాడేవారికి ఈ 55 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిన వారిలో తెలంగాణ ప్రముఖులు ఎందరో వున్నారని తెలుసా, తెలియదా? వారంతా 'ఆత్మ గౌరవం' లేని 'చవటలూ, దద్దమ్మలే' అని వీరి ఉద్దేశమా? మరీ పదేళ్లుగా, కొత్తగా కొమ్ము లు వచ్చిన కోడెలు వలే చెలరేగుతున్నవారు అడ్డూ, అదుపూ లేకుండా నోరు పారవేసుకుంటూ వుండటాన్ని అసహ్యించుకుంటున్న వారు తెలంగాణ అంతటా ఎందరో వున్నారు.

ఏమంటే ఏమి తలనొప్పో అనే భీతితో ఉదాసీనంగా ఉంటున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వారు తమ అభిమానం వెల్లడిస్తూ వుండటమే ఇందుకు తార్కాణం. ఎన్నికల ఫలితాలను ఒక్కసారి పరకాయించి చూస్తే 'కుహనా' తెలంగాణవాదుల 'స్థితిగతులు' ఏమిటో సుస్పష్టం. 90 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ వారివలెనే వీరికీ 'పరాలంబనం' అనివార్యం అనేది కనపడేదే! నిన్న మొన్నటి ఉప ఎన్నిక కూడా, ఎంత ఉద్రేక ఆవేశాల మధ్య జరిగినా ఈ సంగతినే ధ్రువపరిచింది కదా! సకల జనులూ 'వేరు తెలంగాణ' కోరేవారైతే అట్లా ఎందుకు జరుగుతోంది? అన్ని ఆగాలనూ, ఆగడాలనూ సహిస్తూ ఉన్న వారు సమయం వచ్చినప్పుడు తమ మనోరథం, నిజాభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లే కదా. మొన్నటి సకల జనుల సమ్మె కాలసర్పం వలె, 'ఆంధ్రజ్యోతి' సంపాదకుడు వివేకంతో సరిగ్గా సందర్భోచితంగా ఊహించినట్లు 'వైకుంఠపాళిలోని పెద్ద పామై' కాటు వేయటంతో కృత్రిమ ఉద్యమం కుదేలై కూలబడింది.

సకల ఆంధ్ర జనులకూ సత్యమైన 'పరమ పథం' ఏమిటో అందుకు అవసరమైన 'సోపానా'లేవో సావధానంగా ఆలోచించుకునే అవకాశం మరోసారి అందుకే లభించింది. అందుకే నర్రా మాధవరావూ, 'ఆకాశిక్' పత్రికా సంపాదక నిర్వాహకుడు ఎన్. రాజేశం ప్రభృతులే కాక కొండంత మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారు కూడా 'సద్భావన'తో 'సన్మార్గ' అన్వేషణకు నడుం కట్టారు. 'తెలంగాణ అన్యాయానికి గురైంది. వలస వచ్చిన వారు దోచుకుపోతున్నారు. సహజ సంపద అంతా అన్యాక్రాంతం అయిపోతుంది' అనే అంగలార్పు ఎంత సబబో సమంజసమో చర్చలు, సమాలోచనల ద్వారా తేల్చుకునే ప్రయత్నం ప్రారంభించారు. కొంచెం ఆలస్యమైనా ఇది వాంఛనీయ పరిణామం.

దీనికి ఆటంకాలు కలిగించటం, దౌర్జన్యానికి పాల్పడటం, సభలు కూడా జరుపుకోనివ్వక పోవడం అవివేకం అవుతుంది. ఆక్రోశంతో, ఆవేశకావేశాలతో 'ఉడికి'పోతున్నవారు ఇకనైనా తిట్లు, శాపనార్థాలు, అఘాయిత్యాలు, దౌర్జన్య హింసాకాండలు కట్టిపెట్టి శాంతియుత పరిష్కారానికి కలిసిరావటం అత్యవసరం.....ఆంధ్రప్రదేశ్‌లో సకల జనులు ఇతోధిక శాంతి, సౌభాగ్యాలు, అభ్యుదయం సాధించి, సమకూర్చుకోవచ్చు. ఇళ్లు పడగొట్టడం కష్టం కాకపోవచ్చు. కాని కట్టుకోవటం ఎంత కష్టమో గ్రహించాలి. జై సకలాంధ్ర జనులకూ జై. 

- మద్దాలి సత్యనారాయణ శర్మ, హైదరాబాద్

27, నవంబర్ 2011, ఆదివారం

మానవ హక్కుల సంఘాల నాయకులకు ప్రవాసాంధ్రుని మరో బహిరంగ లేఖ


నేను మొదట రాసిన ఉత్తరము కు మన మానవ హక్కుల వారు వెంటనే స్పందిస్తారని ఏమి ఆశించలేదు. ఎందుకంటే వారు కసాయి కర్కోటకులకు మాత్రమే మనవ హక్కులు వున్నాయని గుర్తించి వారి తరపున పోరాడి పోరాడి మన మానవ హక్కుల వారి హృదయాలు కూడా కొంచెము ఖఠినమైన మాట వాస్తవము. ఆ మధ్య ఒక మిత్రుడు నమస్తే పోలవరము లో వంట “చెరకు” ను కాపాడుకోవాలి అన్నట్లుగా వ్యాసము రాసినట్లు గుర్తు. అదే వ్యాసము లో పెనము వేడి ఎక్కింది అని రొట్టె ముక్క కోసము ప్రజలు ఎదురు చూస్తున్నారు అని కూడా రాయటము జరిగింది. మా మిత్రుడు కి తెలియనిది కాదు రొట్టె ముక్క పోలవరము రూపం లో వచ్చింది అని, కానీ అదే గోడ పత్రిక లో అలా రాస్తే బాగుండదు అని అనుకున్నాడేమో, వంట “చెరకు” పైన బాగా ద్రుష్టి పెట్టినట్లుంది.


ఈ వంట “చెరకు” ఉద్యమము పేరు చెప్పి రహదారి మీద వచ్చే పోయే వాహనాల మీద రాళ్ళు వేస్తాడు, ఎవ్వరిని ఎమైన అంటాడు ఎందుకంటే మన మానవ హక్కుల వారు తప్పకుండ కాపాడతారని తెల్సు కదా, మరి చదువుకున్నది వైద్య వృత్తి కదా ఆ మాత్రము తెలియకుండ వుంటుంది అని అనుకోను. ఈ “చెరకు” ఆంధ్ర వారి మీద మాత్రమే దాడి చెయ్యలేదు చివరికి ఖమ్మం జిల్లా నుండి వస్తున్న ప్రజల పైన కూడా దాడి చేసాడు. ఒక తల్లి తన మనుమరాలిని స్కూల్ లో చేర్పించుట కొరకు ఖమ్మం నుండి కారు లో వస్తుంటే వారి మీద దాడి చేస్తాడు. ఉద్యమము ముసుగు లో ఏదైనా చెయ్యవచ్చు కదా అందులో ఎలాగైన మన జేబు సంస్థ లు మానవ హక్కుల వారు ఉన్నారన్న విషయము “చెరకు” కు బాగానే తెల్సు కదా. అదే “చెరకు” కూతురి పెళ్లి కి మాత్రము కరుణించాలి అని కన్విన్సు చేయ్యబోతారు మన హక్కుల సోదరులు. కానీ, మనుమరాలి చదువు కోసము ఎక్కడి రెజిస్త్రేషనో తెలియక ఏదో కారును అద్దెకి తీసుకుని వస్తున్నందులకు వారి పైన ఏ మాత్రము జాలి చూపించనవసరము లేదని వారి చేతులు కాళ్ళు విరగ్గోట్టాల్సిందే అని అంటుంటే చూస్తూ ఊరుకుంటారు మన మానవ హక్కుల పేరు చెప్పుకునే వాళ్ళు. మన టీవీ లు ఏమో కొన్ని విషాద గీతాలు ఆయన మొఖము ను దగ్గిర గా చూపిస్తూ “చెరకు” మనసు ఎంత తియ్యనో, కూతురి పెండ్లి కోసము ఎంత విషాదాన్ని అనుబవిస్తున్నాడో అని పాడతారు. వైద్య వృత్తి చేస్తూ ప్రజలు గాయపడితే కట్లు కట్టాల్సిన వ్యక్తి అదే ప్రజల కాళ్ళు చేతులు విరగ్గోడతా వుంటే చూస్తూ ఉండాల్సిందే అని కూడా మన హక్కుల సోదరులు సెలవిస్తున్నారు

ఈ ప్రజాస్వామ్య వనము లో మనము వర్షాల కోసమో, వంట “చెరకు” కోసమో చెట్ల ను కాపాడుకోవాల్సిందే కానీ కలుపు చెట్టు కూడా వంట “చెరకు” అని పోజులు కొడుతుంటే ఈ కలుపు మొక్క ను తీసి మంచి మొక్క వెయ్యాల్సిందే అన్న విషయము వ్యవసాయ ఆదారిత దేశము లో జీవిస్తున్న మనకు తెలియంది కాదు. అయినా సరే నేను మన మానవ హక్కుల వారు చెప్పే మాటలే నమ్ముతాను కాబట్టి తప్పకుండ అది వంట చెరకు అయినా కలుపు మొక్క అయినా కాపాడుకోవాల్సిందే  ఎందుకంటే ఆ కలుపు మొక్క మనకు తెలియకుండా ఎదైనా వైద్యానికి వ్యాది మందుగా పనికి వస్తుందేమో పరిశోధన చెయ్యాలి కదా అందుకని మన రక్షణ వ్యవస్థ ఆ పనిలో వుందని అనుకుంటున్నాను.

పైన చెప్పిన వంట “చెరకు” కే మానవ హక్కులు వున్నప్పుడు లండన్ స్కూల్ అఫ్ ఎకానామిక్స్ లో PhD చేసిన Dr పరకాల కు మాత్రము హక్కులు లేవు అని అంటున్నారు.  ప్రతి పౌరుడు ను రక్షించుకోవాలి అని చట్టము చెప్తుంది కాబట్టి పేపర్ల లోనో , నమస్తే పోలవరము ల లాంటి గోడ పత్రికల ల లోనో వ్యాసాల లో రాయించుకునే “చెరకు” లాంటి వారితో పాటు అందరి హక్కులు కాపాడుకోటానికి మన మానవ హక్కుల వారు ఇప్పటికైన కృషి చేస్తారని ఆశిస్తాను. బావ ప్రకటన స్వేఛ్చ కొరకు ఎటువంటి ఆటంకాలు కలగకుండ మన హక్కుల సోదరులు పాటు పడాలి అని ప్రాధేయ పడుతున్నాను. ఇప్పటికైన మన మానవ హక్కుల హృదయాలు కరుగుతాయో లేక కలుపు మొక్క లను మాత్రమే కాపాడాలని చెప్తారో వారి ఆలోచన కే వదిలేద్దాము.

మనము ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడకుండా అశ్వథామ హతా హత: అనుకుంటూ వుంటే రేపు తెలంగాణా లో కాని ఆంధ్ర ప్రదేశ్ లో కాని ఏర్పడే రాజ్యాలు మన మానవ హక్కులని కాపాడి మనల్ని అందలము ఎక్కించి సింహాసనము పైన కూర్చొండబెడతారు అనుకోటము అంత అవివివేకము ఇంకొకటి లేదు అని చెప్పదలచుకున్నాను. ఈ రోజున మమత దీది ని చూస్తూనే వున్నాము అన్న సంగతి తెలియంది కాదు అలాగే మన చెన్నారెడ్డి, రాజ శేఖర్ రెడ్డి ప్రబుత్వాల లో కూడా మనకు బాగానే అవగతమైంది కదా. అలాగే జలగం వెంగల రావు గారి ప్రబుత్వం లో జరిగిన ఘోరాలు మనసున్న మానవుడు ఎవ్వరు మర్చిపోరు అనే అనుకుంటున్నాను. ఇప్పటికైన మన మానవ హక్కుల సోదరులు మేల్కొని సమాజము లోని ప్రతి పౌరుని మానవ హక్కులను కాపాడటానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాను.
 నేను ఇంతవరకు, అంటే ఇలాంటి దాడులు చెయ్యకముందు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని పాకులకు విజ్ఞప్తి. నేను మన ప్రాంతీయ వాడిని కాబట్టి నాకు కొద్దో గొప్పో ప్రేమ ఈ ఉద్యమము మీద వుండేది అని చెప్పటానికి ఏ మాత్రము సందేహించను. కానీ, నేను మానవ హక్కుల ను హరించి వేసి ఎవరి మీదనో దండయాత్ర చేసి ఏదో సాదిద్దాము అన్న సిద్దాంతానికి వ్యతిరేకము అని మరి ఒక్కసారి తెలియ చేసుకుంటున్నాను. మానవ హక్కుల విఘాతము గురించి మాత్రమే మాట్లాడుతున్నాను కాబట్టి ఆ కోణము లో మాత్రమే విజ్ఞులు అర్ధము చేసుకుని మానవ హక్కులకి భంగము కలగకుండా Dr పరకాల హక్కులని కాపాడవలసిందిగా మరొక్కసారి నా మిత్రులని కోరుకుంటున్నాను.


Vemsani Ramana

Portsmouth, Ohio,
USA

26, నవంబర్ 2011, శనివారం

రాష్ట్ర విచ్ఛిత్తి మంచిది కాదు : పీ.వీ.నరసింహారావు (20.04.1969)

 ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమావేశం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏప్రిల్ 20 ,1969 న జరిగింది. పీ వీ నరసింహారావు గారి ప్రసంగం ప్రారంభం కావడానికి ముందు కొంత మంది గందరగోళం సృష్టించతలపెట్టినా ఆయన  తొణకక,బెణకక తన వాణిని వినిపించారు.

ఆంధ్రపత్రిక, ఏప్రిల్ 21,1969: ఆంధ్ర దేశంలో ప్రజల భవిష్యత్తు దృష్ట్యా, భారతదేశ భవిష్యత్తు దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ విచ్ఛిత్తి మంచిది కాదు, విశాల దృక్పథం కలిగి దేశంలో వెనుకబడిన ప్రాంతాల ప్రజలను ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని మనం రూపొందించుకొని అమలు చేయవలసి వుంది అని విద్యా మంత్రి శ్రీ పీ.వీ.నరసింహారావు నేడు గాంధీ భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోని  తెలంగాణ సభ్యుల సమావేశంలో గంటకు పైగా చేసిన గంభీర ప్రసంగం లో ఉద్భోదించారు.

ప్రజాప్రతినిధులైన వారు ఉభయప్రాంతాలలో పర్యటించి, ఒకరి కష్టసుఖాలు ఒకరు గ్రహించి, సంస్కృతీ సమైక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గతంలో జరగవలసినంతగా ఈ పని జరుగలేదని విద్యా మంత్రి ఉద్గాటించారు.ఉద్యోగాల గూర్చి, అన్యాయాల గూర్చి  పరీక్షించి చూస్తే ఆరోపణలు అతిశయోక్తులని తేలిపోగలదని అన్నారు



ఆంధ్ర పత్రిక April 21,1969


ఆంధ్ర జనత, 21  ఏప్రిల్,1969 : 
 ప్రసంగపాఠం: ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా ప్రాంతంలో ఉత్పన్నమైన సమస్య ఒక్క ఈ రాష్ట్రానికే పరిమితమైనది కాదు.యావత్ భారత దృష్టి నుండి దీనిని పరిశీలించ వలసివున్నది. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి ఈ సమస్య దేశవ్యాప్తంగా వుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పట్ల అనేక దశాబ్దాల క్రిందటి నుంచీ కాంగ్రెస్ విశ్వాసంగా వుంటూవచ్చింది.1905 లో బెంగాల్ విభజన నాటినుంచీ కూడా భాషా ప్రాతిపదికను కాంగ్రెస్ స్వీకరిస్తూ, ప్రచారం చేస్తూ వచ్చింది.

భాషాప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రంలో జనసామాన్యాన్ని సమీకరించి,సంఘటిత మొనర్చి , సంఘీభావాన్ని సాధించి, వారి ఆదర్శాలు,ఆశయాలు,కోరికలు గ్రహించి నెరవేర్చడానికి మార్గం ........ఉంటుందని భారత జాతీయ కాంగ్రెస్ పదే పదే చెప్తూ వచ్చింది.

ఆ తర్వాతకూడా కేవలం ఒక్క భాషా ప్రాతిపదికమీదన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలా...ఆర్ధిక పరిపాలన సౌలభ్యాది అంశాలను కూడా పరిగణించాలా అని ఆలోచించడం,ఈ ఇతర అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని భాషా రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించాలని భావించడం జరిగింది.ప్రాతిపదిక మాత్రం భాషే ఉంటుందన్న మౌలిక సిద్ధాంతం మాత్రం మారలేదు

ఆంధ్రప్రదేశ్ అవతరణ

1953 లో అఖిల భారత స్థాయిలో భాషారాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రాతిపదికనను పరిశీలించడానికి కేంద్రం ఒక కమిషన్ను నియమించింది. భాషా ప్రాతిపదికను 1953 లోజరిగిన హైదరాబాద్ మహాసభలో కూడా ఆమోదించడం జరిగింది.

ఆ కమిషన్ హైదరాబాద్ వచ్చింది.తెలంగాణలోను మిగత హైదరాబాదు రాష్ట్రంలోని  ఇతర ప్రాంతాలలో కూడా పర్యటించి సాక్ష్యాలు సేకరించింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఉన్నదిఉన్నట్లుగానే ఉంచాలని చెప్పినవారు చాలా కొద్దిమంది. తెలుగు, మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని హెచ్చుమంది సూచించారు.తెలుగు ప్రాంతాన్ని(తెలంగాణ ను )వేరుగా వుంచాలా, ఆంధ్ర రాష్ట్రంలో విలీనం  చేయాలా అన్న సమస్యపై కూడా కాంగ్రెస్ వాదులు తమ సాక్షాల్నిచ్చారు.ఆనాడు విలీనీకరణపై భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. అయితే చివరకు అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థికరణ సిద్ధాంతాన్ని అంగీకరించి,..హిందీ రాష్ట్రాలను అలాగే వుంచి మిగతా దేశాన్ని ఆయా భాషల ప్రాతిపదికపై భాషా రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. 1956 లో సమగ్ర ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది.

తిరిగి ఉద్భవించిన సమస్య

ఆ సమస్యే మళ్ళీ మనముందుకు వచ్చింది. రెండు విధాలవాదనలో మార్పు లేదు అయితే ఈ సమస్యను అఖిల భారత స్థాయిలో మాత్రమే జాతీయ దృష్టితో మాత్రమే  పరిశీలించి నిర్ణయం తీసుకోవలసివున్నది. ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితంగా నిర్ణయించే వీలులేదు.

యావద్భారతదేశాన్ని చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించాలన్నా అది మాత్రం కుదిరేదికాదన్న నిర్ణయాన్ని ఇదివరకే సకల అంశాలు పరిశీలించి తీసుకోవడం జరిగింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ను రెండు మూడు ముక్కలు చేయాలా వద్దా అన్నది ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని చర్చించి తీసుకోవలసిన నిర్ణయం కాదు. అది అఖిల భారత స్థాయిలో జరుగవలసిన చర్చ. చరిత్రకందని కాలంలో ఎన్నడో అంగ,వంగ, కళింగ..ఇలా 56 రాష్ట్రాలు, రాజ్యాలు భారతదేశంలో ఉండేవి.ఇవాళ మళ్ళీ అన్ని రాష్ట్రాలు కావాలంటే అఖిల భారత స్థాయిలోనే చర్చ జరగాలి.

అయితే ఈ నిర్ణయం జరిగిపోయింది.విశాలమైన రాష్ట్రంలో నైసర్గిక సంపదను ఇతర సౌకర్యాలను గరిష్ట స్థాయిలో హెచ్చు ప్రయోజనం సాధించుకోవడానికి వినియోగించుకొని గొప్ప అభివృద్ధిని సాధించుకోవచ్చునని,ప్రజలకు అవకాశాలు బాగా వుంటాయని భావించడం జరిగింది.అందువల్ల దేశం యాభైఆరో, అరవయ్యో ముక్కలైతే తప్ప ఆంధ్ర ప్రదేశ్ ముక్కలై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదు, వచ్చినా అప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రం వస్తుందో రెండు ముక్కలుగా రెండు తెలంగాణ రాష్ట్రాలు వస్తాయో చెప్పలేము

పన్నెండేళ్ళ చరిత్ర

గత పన్నెండేళ్లలో మనకు అన్యాయం జరిగిందని అభిప్రాయం వచ్చింది. ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి వుంది. సమైక్యత అన్నది విలీనం అన్నది ఒక కాగితంపై సంతకం చేసినంతమాత్రం చేత యాదృచ్చికంగా , మానవ కృషి అవసరం లేకుండా రాదు. ప్రజల సమైక్యతకు ఇరు ప్రాంతాల ప్రజల విలీనీకరణ, ఏకీకరణకు ఉద్దేశపూర్వక చర్యలు తీసుకొన్నట్లు లేవు.ఒక మన రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా ఇది జరుగలేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో మన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వుండిన శ్రీ యు యెన్ దేబార్ గారిని నేను ఇటీవల కలుసుకొన్నప్పుడు వారు కూడా ఇదే చెప్పారు.విలీనీకరణ అయిపోయిందన్న ఉదాసీన వైఖరితో వారున్నారు,ప్రజల విలీనీకరణ చట్టాల ద్వారా రాదు,చాలా చర్యలు తీసుకోవలసి వుంది,మీరు చర్యలు తీసుకోండి,తెలంగాణ ఉద్యమం ఆందోళన కలిగిస్తున్నది అని వారు చెప్పారు.

నేడు మనం మొత్తం చరిత్రనంతా సింహావలోకనం చేస్తే, ఈ చర్యల అవసరం మనకు స్పష్టమవుతుంది.
స్కాట్లాండ్ ఇంగ్లాండ్ విలీనమై 250 ఏళ్ళు గడిచినా ఇంకా ప్రజలలో సమైక్యతా భావం రాలేదు.కావున దీనిపై మనం తొందరపడడం మంచిది కాదు. నిర్ణయాన్ని మార్చుకొనరాదు.స్కాట్లాండ్ ఇంగ్లాండ్ విలీనీకరణ జరిగిన అర్థరాత్రి జరిగిన సభలో స్కాట్లాండ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతూ ఈ విలీనీకరణ వల్ల ఉత్పన్నం కానున్న అనేక సమస్యల గురించి ముందే హెచ్చరించడం జరిగింది.అప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని మాట్లాడుతూ సంవత్సరంలోపల ఈ సమస్యలను పరిష్కరించి పార్లమెంట్ సభ్యుడిని సంతృప్తి పరచి, మొత్తం స్కాట్లాండ్ ప్రజలను సంతృప్తి పరచడానికి చర్యలు తీసుకొంటానని వాగ్దానం చేసారట.

అందువల్ల సానుభూతితో చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించుకోవలసి వుంది. అంతేకాని,కేవలం 12 సంవత్సరాల అనుభవంతో, ఆవేశంతో నిరాశ చెంది మళ్ళీ విడిపోదామనుకోవడం తొందరపాటు అవుతుంది. అందుకు జరుగుతున్న ఉద్యమాన్నితమకు  నైవేద్యం పెట్టుకొని, మనల్ని అనుకరించమని చెప్పడం కూడా సమంజసం కాదు

సాంస్కృతిక ప్రాతిపదిక పై నాకు అచంచలమైన విశ్వాసం వుంది. సాంస్కృతికంగా ఆంధ్ర -తెలంగాణ ప్రాంతాలను సమైక్యం చేయడానికి విలీనం చేయడానికి ప్రయత్నం జరగలేదు.దేశంలో అనేక విచ్చిన్నకర ధోరణులకు కూడా ఇదే కారణం. మన పార్లమెంట్ సభ్యులు ఉభయప్రాంతాలవారూ పార్లమెంట్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గురించి, పోచంపాడు ప్రాజెక్టు గురించి అడుగుతారు కాని దేశం గురించి అడగరు.మన శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాలు గురించి అడుగుతారు.వారి ఆలోచనలు వారి వారి నియోజకవర్గాలకు పరిమితమయిపోయాయి.జిల్లా పరిషత్ సభ్యుల ఆలోచనలు వారి వారి బ్లాకులకు పరిమితమైపోయాయి. విశాల దృక్పథం లేకపోవడమే నేటి దేశ పరిస్థితికి కారణం.ఇందులో మన బాధ్యత కూడా ఎంతవుంది అని మనమందరం ఆత్మ పరిశీలన చేసుకోవలసివుంది. సాంస్కృతికంగా చూసినా,ఆర్థికంగా చూసినా ఇది అభివృద్ధికి అవరోధం,అసంతృప్తికి దారి తీస్తుంది.

స్వార్థ ప్రయోజనాలు

మనకీ నేడు స్వార్థ ప్రయోజనాలు తయారయ్యాయి. వెనుకబడిన ప్రాంతంఅని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది.వెనుకబడిన ప్రాంతాల సమస్యలు దేశంలో ఎక్కడ చూసినా ఒకటే అనే చైతన్యం రాలేదు. రాయలసీమ,కల్యాణదుర్గం,పొదిరి(నెల్లూరు జిల్లా )వంటి ప్రాంతాలు వెళ్లి చూస్తే మన తెలంగాణాయే మేలనిపిస్తుంది.

పెద్దమనుషుల ఒప్పందం

1956 లో పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది.ఆ ఒప్పందం ఎంతవరకూ అమలు జరిగిందో చూడాలి.ఆ ఒప్పందం యొక్క భావము,లక్ష్యము ముఖ్యం. అన్ని సమస్యలకు ఆ ఒప్పందం పరిష్కారం కాదు.అది ఒక ప్రాథమిక పత్రమే , తుది పత్రమనుకోవడం పొరబాటు. 1956 లో ఊహించగలిగినంత మేరకు ఊహించి ఆ సూత్రాలను ఆ ఒప్పందంలో చేర్చారు.భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే సమస్యలకు ఆ ఒప్పందం పరిష్కారం కాదు. అందువల్ల భావం ముఖ్యం గాని అందులోని భౌతిక అర్థం ముఖ్యం కాదు. భావం వుంటే ఒప్పందమే అనవసరం. ఈ ఒప్పందానొక తుది పత్రంగా, దానికొక జటిలత్వాన్ని ఇచ్చి అర్థం చేసుకోలేకపోయాం.భావబలం వుంటే అక్షరాలా ఏముందన్నదాన్ని పట్టించుకోనవసరం వుండదు. ఆ భావాన్ని ఆచరణలో పెట్టడంలో లోపాలు గురించి ఆ వైపునా, ఈ వైపునా ఎంతైనా చెప్పవచ్చు. జనవరి 19 వ తేదీ అఖిలపక్ష ఒప్పందంలో ప్రభుత్వం ఈ లోపాలను స్వయంగా ఒప్పుకున్నది. ఇదొక పెద్ద కన్సెషన్ అయినప్పటికీ పర్యవసానం తద్విరుద్ధంగా వచ్చింది.పొరపాటును ఒప్పుకుంటే, ప్రజలు సంతృప్తి పడి భవిష్యత్తు గురించిన విశ్వాసం ఏర్పడుతుందనుకొన్నాము. కాని ప్రజాహృదయాల్ని సక్రమంగా అవగాహన చేసుకోనలేకపోయారేమోనన్నదే ప్రశ్న.

ముల్కి నిబంధనలు

హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ముల్కి నిబంధనలు ఉండేవి కాని ఆ రోజుల్లో ముల్కి సర్టిఫికేట్ ఇచ్చేవారే నాన్ ముల్కీలు. అందువల్ల న్యాయం జరుగలేదు.పెద్ద మనుషుల ఒప్పందంవల్ల 1956 లో రక్షణలు వచ్చాయి. వెనుకబడినతనం వల్ల రాలేదు.వెనుకబడినతనం వల్లనే వస్తే మనకన్నా వెనుకబడివున్న ప్రాంతాలకూ వచ్చేవి.మైసూర్ లో విలీనమైన కర్ణాటక ప్రాంతానికి రాలేదు, మహారాష్ట్రలో విలీనమైన మరాట్వాడా ప్రాంతానికి రాలేదు. దేశంలో ఏ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతానికి రాలేదు.పెద్ద మనుషుల ఒప్పందం నుంచి మనకు మాత్రమే వచ్చింది.ఆ ఒప్పందాన్ని కేంద్రం గౌరవించడం వల్లనే వచ్చింది. ఈ ఒప్పందం భగ్నమైతే రక్షణలు వుండవు. పన్నెండు సంవత్సరాల కాలంలో జరిగిన లోపాల పరిమాణాన్ని అంచనా వేయాలి.దాని ఫలితాన్ని అంచనా వేయాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల సంఘం నివేదికలలో లోపాలే కనిపిస్తాయి.లోపాలు చూపించడమే వాటి పని, అందుకనే అన్నీ లోపాలే వున్నాయనలేము కదా.అలాగే ప్రాంతీయ సంఘం నివేదికలలో లోపాలు గురించే వుంటుంది. ఎందుచేతనంటే  వున్న లోపాలను చూపించడమే కమిటీ పని. అంత మాత్రాన అన్ని లోపాలే జరిగాయనుకోరాదు.

తెలంగాణకు చెందిన శ్రీ విటల్ రావు గారు జిల్లాల్లో తిరిగి అంకెల వివరాలు సేకరించారు.నాన్ ముల్కీల సంఖ్య నిచ్చారు. దాదాపు 5200 మంది నాన్ ముల్కీలు ముల్కీలకు ఉద్దేశించిన ఉద్యోగాల్లో వున్నట్లు తేలింది. ఇందులో 1600 మంది ఉపాధ్యాయులు ,1800  మంది నర్సులు,ఆగ్జిలరీ నర్సులు, మిడ్ వైఫ్లు, 400 మంది స్టెనోగ్రాఫర్లు, 300  మంది ప్యూన్లు మిగిలినవారు ఇతరులు.లోపం యొక్క పరిమాణాన్ని ఆలోచించక తప్పదు. ఈ 1600 మంది ఉపాధ్యాయులను జిల్లా పరిషత్ వారే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇప్పుడు లభించకపోవడం వల్లనే చేర్చుకొన్నారు. 1956 తర్వాత శిక్షణ అవకాశాలను ఎంతో అభివృద్ధి చేసుకొన్నాము.మరో రెండు శిక్షణ కళాశాలలు ఈ మే నుంచి ప్రారంభమవుతున్నాయి.భవిష్యత్తులో ఈ లోపం జరుగదు. నర్సులున్నారంటే దేశమంతా కేరళ నర్సులున్నారు. స్థానికంగా మహిళలు లభించక కేరళవారిని నియమించుకోవలసి వచ్చింది . ఇప్పుడు ప్రభుత్వము, ఆంధ్రమహిళాసభ నర్సుల శిక్షణా సౌకర్యాలను పెంపొందిస్తున్నాయి.అయినా ఎక్కువమంది ఈ సౌకర్యాల్ని ఉపయోగించుకోవడం లేదు.స్టెనోగ్రాఫర్లు ఆనాడు ఇక్కడ లభించలేదు. సౌకర్యాలను ఉపయోగపరచుకొనే చైతన్యాన్ని కూడా వెనుకబడిన ప్రాంతాల్లో కలిగించవలసివుంటుంది.

ఇవన్నీ తీసేస్తే ఇక 1200 మంది మేరకు ముల్కీలకు రావలసిన ఉద్యోగాలు రాలేదని తేలుతుంది. తెలంగాణ ప్రాంతంలో లక్షాఏడు వేల ముల్కీ ఉద్యోగాలలో ఈ 1200 ఎంత అని ఆలోచించాలి.

మిగులు నిధులను ఉన్నతాధికారుల సంఘం నిర్ణయించనున్నది కనుక ఇప్పుడు చర్చించడం సమంజసం కాదనుకొంటాను.

లోపాలు ఎందుకు జరిగాయని ఆలోచిద్దాం. పరిపాలన రంగంలో లోపాలు సర్వత్రా వుంటాయి.రక్షణల అమలును అధికారులకు అప్పగించాము.అందువల్ల లోపాలు అమలు జరిగాయి. సమీక్షాయంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పుడు ఏర్పాటు చేసుకొంటున్నాము కనుక, అవకాశం ఇచ్చి చూడడం మన ధర్మం 






వాదన కాని వాదం పలాయనవాదం

విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులతో చర్చకు సిద్ధం అని బహిరంగ లేఖ రాసిన TNF మనసు మార్చుకున్నట్లుంది. వారి లేఖకు విశాలాంధ్రమహాసభ తరపున పరకాల ప్రభాకర్ గారు బదులు ఇచ్చిన సంగతి విదితమే ( http://visalandhra.blogspot.com/2011/11/blog-post_22.html ) ఇప్పుడేమో వారు విశాలాంధ్రను కోరుకొనే వాళ్ళు తెలంగాణాలో ఎవరు ఉన్నారో చూపమని అభ్యంతరకరమైన పదజాలంతో ప్రభాకర్ గారి  పేస్ బుక్ వాల్ పై ఒక ప్రత్యుత్తరాన్ని  పోస్ట్ చేసారు. దానిని  చదివిన తర్వాత అసలు వారికి  ఏ విధమైన నిర్మాణాత్మకమైన చర్చలోనూ పాల్గొనే ఉద్దేశంలేదని అనిపిస్తుంది. మీరే చదివి చూడండి

మీ అభినందలకు, మా ప్రతి అభివందనాలు..

సమైక్య వాదం అన్ని ప్రాంతాలలోనూ వున్నది అని చెప్పి, తెలంగాణా ప్రాంతం వాళ్ళు కూడా సమైక్యంద్ర కోరుకుంటున్నారు అని చెప్పడంలో, మీ అర్థం ఏంటి, మీ అభిప్రాయాలను రుద్దే ప్రయత్నమే కదా..?

సమైక్యాంధ్ర కోరుకునే వాళ్ళు తెలంగాణా లో వున్నారు అనేది పచ్చి అబద్ధమే అని మేము భావిస్తున్నాం, ఇంత వరకు మేము చూడలేదు, వినలేదు. దానికి మీ దగ్గర ఆధారాలు, వెక్తుల పేర్లు వుంటే బయట పెట్టండి. తెలంగాణా ప్రాంత ప్రజల్లో సమైక్యంద్ర వాదులంటే, మీ తెలుగు రూట్స్ చక్రవర్తి గురించేనా మీరు మాట్లడేది, ముందు వాడి రూట్స్ ఎక్కడివో చెప్పమనండి. సమైక్య వాదం అన్ని ప్రాంతాల్లో వుంది అని, మా తెలంగాణా ప్రజలని మబ్బే పెట్టడం కోసమే కదా మీరు ఈలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.

సమైక్యంద్ర వాదులు అన్ని ప్రాంతాల్లో వున్నారో లేదో మీరే నిరూపించాలి, కాని విభజన వాదులు ఆంధ్ర లో, తెలంగాణా లో వున్నారు అని మీరు గ్రహించాలి, అది మా సొంత అభిప్రాయం కాదు, ఆంధ్ర జే.ఏ.సి. చేసిన ఇటివల చేసిన వాక్యలు, మద్దతు చుడండి “రాష్ట్ర విభజన ప్రజాస్వామ్య ఆకాంక్ష”. ఆంధ్ర జే.ఏ.సి. వారికి మా తెలంగాణా ప్రాంత ప్రజల నుండి కృతజ్ఞతలు.

మా మట్టుకు అయితే రాష్ట్ర విభజన అనేది ఆత్మ గౌరవ పోరాటం., మా ఉనికి కోసం పోరాటం, మా స్వపరిపాలన కోసం పోరాటం.

సమైక్యంద్ర పాలనలో మేము గ్రహించింది ఏమిటి అంటే, మీలాంటి ఆంధ్ర మేధావులతో, ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి, చెప్పి , ఆ అబద్ధాన్ని నిజం చేసి, తెలంగాణా ప్రజల మీద రుద్దే తత్వం ఎప్పటి నుండో అనుసరిస్తున్న పాత సూత్రం.

దానికి నిదర్శనం మీ రాతలు చూస్తే అర్థం కూడా అయ్యింది, విశాలాంద్ర వాదాలు, 1956 లో, 1969 లో, మరియు 1972 లో విన పడ్డాయి అని.. ఇప్పుడు 2011 లో కూడా వినిపిస్తున్నాయి (మీతో).. 1972 జై ఆంధ్ర ఉద్యమం ప్రత్యేక వాదమని అని గుర్తించాలి, మీరు సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసిన, ప్రత్యేక వాదం కోసం ఉద్యమం చేసిన మా తెలంగాణా రాష్ట్ర సాధనకు అడ్డ పుల్ల వేసేందుకే అని గత చరిత్ర చెప్పుతుంది.. బిన్న అభిప్రాయాలూ ఆంధ్ర ప్రాంతం లో వున్నాయి అని గ్రహించండి. అంతెందుకు ఇదువరకు మీకున్న అభిప్రాయాలకు, ఇప్పటి అభిప్రాయాల్లో తేడా వుందో లేదో గ్రహించాలి, సొంత ఇంట్లో ఎకబిప్రాయం తెచ్చుకోండి, విభజన వాదమా? విశాలాంద్ర వాదమా? మా తెలంగాణా ప్రాంతలో అప్పటికి ఇప్పటికి ఒకటే మాట, ఒకే బాట.. తెలంగాణా రాష్ట్ర సాధన. ఇట్లాంటి అబద్ధాలను చెప్పి నమ్మిచ్చే ప్రయత్నాలు మానుకోవాలి.

సమైక్యంద్ర బ్రోకర్లు ఇంతకు మించి చెప్పేది ఏముంది, రాష్ట్రం సమైక్యంగా వుండాలి, తెలంగాణాను ఇంతకు ఇంత దోచుకోవాలి, ఇక్కడ వున్న వరనులను, నీళ్ళను, ఉద్యోగ అవకాశాల మీద దోపిడీకి అలవాటు పడ్డ ప్రానమాయే ,ఇప్పటికి ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు ఏమయిపోవాలి, తెలంగాణా బంగారు బాతును ఎందుకు వదలాలి?ఇక్కడ వనరులను, విద్య , ఉద్యోగ అవకాశాలను కొల్ల గొట్టడమే కదా సమైక్యాంధ్ర ఏకైక అజెండా, మీ వ్యాపారాలకు, మీ పెట్టుబడుల లావా దేవిలకే కదా మీకు ఈ తెలంగాణా ప్రజలు, వాళ్ళకున్న వనరులు.

ఇదంతా సుత్తి అనసవరం, మీ అజెండా మీకుంది , మా అజెండా మాకు వుంది, పాయింట్ కి వద్దాం, “మీరు అన్నట్టు విశాలాంద్ర కోరుకునే వారు తెలంగాణా లోను వున్నారు”.. ఆ తెలంగాణా వాసులేవ్వరో బయటికి రమ్మనండి, వాళ్ళ రూట్స్ ఎక్కడివో చెప్పమను, జనం లోకి రమ్మను, అంతెందుకు నేటిజేన్స్ ముందుకు రమ్మనండి… విశాలాంద్ర కు జై కొట్టే తెలంగాణా ప్రాంతం వాళ్ళ ఉనికిని నిరుపించుకోమనండి.

జై తెలంగాణా
తెలంగాణా నేటిజేన్స్ ఫోరం
TNF – Telangana Netizens Forum

23, నవంబర్ 2011, బుధవారం

రైలు, రాస్తారోకోలపై సుప్రీం కన్నెర్ర

 విశాలాంధ్ర దినపత్రిక : రైలు/రోడ్డు దిగ్బంధనాలపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసింది. రైలు, రోడ్డుపై రాకపోకలను అడ్డుకునేందుకు ప్రయత్నించే ఆందోళనకారులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. రైలు, రోడ్డు రాకపోకలను అడ్డుకోవటం ద్వారా సాధారణ పౌరుల కార్యకలాపాలను స్తంభింపజేస్తున్నారని, ఫలితంగా ప్రజలు చెప్పలేని ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్‌ జి.ఎస్‌. సంఘ్వీ, జస్టిస్‌ ఎస్‌.డి. ముఖోపా ధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం దీనిని ఎదుర్కొనేందుకు పటిష్ట వంతమైన సలహాలు యిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మూడు వారాల గడువు యిచ్చింది. ఈ విధంగా చేయటంలో విఫలమైతే ఆందోళన కారులను క్రిమినల్‌ నేరం క్రింద శిక్షించేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించిం ది. ''రైలు, రాస్తారోకో ఆందోళనకు పిలుపు యిచ్చే వారిని తప్పనిసరిగా శిక్షించవలసిందిగా మేయు ఆదేశాలు జారీ చేయాల్సి వుంటుంది. వారికి వ్యతిరేకంగా పెట్టే కేసులను మూడు మాసాలలో పరిష్కరించాలి. ఇందు కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయాలని మేము భావిస్తున్నాం'' అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.