శుక్రవారం 17 మే 2013

ఆంధ్ర రాష్ట్రోద్యమము - విశేషాలు

మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా 1912 మే లో నిడదవోలు లో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ ముగిసింది. ఆన్ని తెలుగు జిల్లాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మాత్రమే తీర్మానం చెయ్యాలని నిర్ణయించి తీర్మానాన్ని వాయిదా  వేసారు.

నిడదవోలు సభలో నిర్ణయించిన ప్రకారం 1913 మే 26 గుంటూరు జిల్లా బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. తరువాతి కాలంలో అనేక ఆంధ్ర పట్టణాలలో ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఈ సభల స్ఫూర్తితో వివిధ  ఆంధ్రేతర నగరాలలోను విదేశాలలోనూ ఆంధ్ర మహాసభల పేరుతో ఆంధ్రులు కలసి తమ సమస్యలకు తగు  పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చెశారు. అప్పటి కొన్ని విశేషాలు:









 

  
 Ramineni Bhaskaredra Rao through email

శనివారం 11 మే 2013

వేర్పాటువాద తిమిరంతో సమరం


ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ: వేర్పాటువాదాన్ని సమర్థించడం మాత్రమే తెలంగాణ పట్ల అభిమానానికి గీటురాయిగా, సమైక్యతను కోరడం అంటే తెలంగాణ శ్రేయస్సును వ్యతిరేకించడంగా చిత్రీకరించడంలో విభజన వాదులు కొంతవరకు సఫలీకృతులయ్యారు. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర సమైక్యతను కోరే లక్షలాది మంది ఇవాళ మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడడానికి ఇది ముఖ్య కారణం. ఈ చిత్రీకరణ కేవలం వేర్పాటువాద వ్యూహకర్తల గడుసైన ఎత్తుగడ మాత్రమే. ఇది నిశిత పరీక్షకు నిలబడలేదు. వాస్తవాల వెలుగు ప్రసరిస్తే ఈ చీకటి పారిపోతుంది.

విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర సమైక్యతను కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం ప్రధానంగా మేధోపరమైనది. మేము మన రాష్ట్రం ఎందుకు ఒకటిగా ఉండాలి అనే విషయమై రాస్తున్నాము. రాష్ట్ర విభజనను కోరేవారు చేస్తున్న ఆరోపణలు, ఆక్షేపణలు, ప్రకటనలు అసత్యాలనీ, అర్థ సత్యాలనీ, వక్రీకరణలనీ నిరూపిస్తూ ప్రచురణలు, పుస్తకాలు వెలువరిస్తున్నాము. ప్రదర్శనలు, మీడియా వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాము. టెలివిజన్ చర్చల్లో పాల్గొని మా వాదన వినిపిస్తున్నాము. సోషల్ మీడియాలో మా అభిప్రాయాలని ప్రకటిస్తున్నాము. వేర్పాటువాదుల అసమంజస ప్రవర్తనని, అసంబద్ధ వాదనలని, అప్రజాస్వామిక వైఖరిని, వారి బలప్రయోగాన్ని, హింసాత్మక ధోరణుల్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము.

మాకు ఏ ప్రాంతం పట్ల అయిష్టత లేదు. ఏ ప్రాంత ప్రజల పట్ల ద్వేష భావం లేదు. మేము వ్యతిరేకించేది వేర్పాటు వాదాన్ని. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వేర్పాటు వాదులను, మేము వ్యతిరేకించేది కేవలం తెలంగాణ వేర్పాటు వాదులను మాత్రమే కాదు. రాయలసీమ వేర్పాటు వాదులను, కోస్తా వేర్పాటు వాదులను కూడా అంతే పట్టుదలతో వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకిస్తాం. విభజనవాదం ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నది అని చరిత్ర ఎరిగిన వారు ఎవ్వరూ అనరు. 1969లో తెలంగాణ వేర్పాటు వాదులు విజృంభిస్తే 1972లో కోస్తా, రాయలసీమల్లో పెద్ద ఎత్తున వేర్పాటు ఆందోళన జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మరోసారి జరుగుతోంది. అంతే.

కోస్తా, రాయలసీమల్లో విభజనవాదం తలెత్తినపుడు అంతకు మూడు సంవత్సరా ల మునుపు ఆందోళన చేసిన తెలంగాణ వేర్పాటువాద నాయకులు మిన్న కుండడం చూస్తే రాష్ట్ర విభజన వాంఛనీయత పట్ల వారికి ఏ మాత్రం నిబద్ధత లేదని ఇట్టే అవగతమవుతుంది. 'దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం' అన్నది కేవలం కట్టుకథ అనీ అతిశయోక్తి అలంకార ప్రయోగమని తెలుస్తుంది. ఈ ఆందోళనలు కేవలం వారి రాజకీయ వ్యూహాలలో, బేరసారాలలో, లావాదేవీలలో భాగాలు మాత్రమే అనేది తేటతెల్లమవుతుంది. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం అభం శుభం తెలియని సామాన్య ప్రజలను అబద్ధాలతో, అర్ధ సత్యాలతో, వక్రీకరణలతో రెచ్చగొట్టి వారిలో ప్రాంతీయ విద్వేష భావం ప్రజ్వలింపచేసి, వారిని వేర్పాటు వాదం వైపు మళ్లించే ఈ నాయకుల మీద మా పోరాటం.

ఇటువంటి స్వార్థ నాయకుల మాటలు విని, అవి యదార్థమని నమ్మి, రాష్ట్ర విభజనే మార్గాంతరం అని అనుకుంటున్న సామాన్య ప్రజల పట్ల మాకు వ్యతిరేకత లేదు. వారికి వాస్తవాలు తెలియచేసి, సమైక్యతా వాదాన్ని వినిపించి, వారి ఆలోచనలను మార్చి, రాష్ట్ర సమైక్యతను కాపాడాలన్నది మా ఆశయం. వారి మనసులను గెలుచుకోవడం మా లక్ష్యం. మూడు ప్రాంతాలలోనూ ప్రజల మస్తిష్కాలలో నుంచి వేర్పాటు వాదాన్ని ఆనవాళ్ళు కూడా లేకుండా తొలగించడం మా ఉద్దేశం. ఓట్ల కోసం కల్లబొల్లి మాటలతో వేర్పాటు వాదాన్ని రెచ్చగొడుతూ నాలుక భుజాన వేసుకుని తిరిగే మాటకారి రాజకీయనాయకులకు వారి పార్టీలకు ఎక్కడా, ఏ ప్రాంతంలోనూ ఆదరణ లభించని వాతావరణాన్ని నిర్మించడం మా ధ్యేయం.

మా ఆశయ సాధనకున్న అవరోధాలు చాలా పెద్దవి. మా మాట సామాన్య ప్రజలకు చేరనివ్వకుండా ఈ నాయకులు, వారి తాబేదార్లు అనేక అడ్డంకులు కలిగిస్తున్నారు. మేము ఎక్కడ సభపెట్టినా దాన్ని భగ్న ం చేయడం, మా మీద దాడులు చెయ్యడం, మమ్మల్ని కొట్టడం, మా పుస్తకాలు తగుల బెట్టడం వారికి పరిపాటి అయిపోయింది. మేము చెప్పే మాట జనసామాన్యానికి చేరితే, వీరి ఆటలు సాగవు అని వీరి భయం. ఒక చిన్న పుస్తకానికి, ఒక ఉపన్యాసానికి, ఒక పత్రికా ప్రకటనకి, ఒక ప్రదర్శనకి, ఒక బహిరంగ చర్చకి భయపడే ఉద్యమం కూడా ఒక ఉద్యమమేనా? వాదనలో పసలేని వారే దౌర్జన్యాలకి దిగుతారు అన్నదానికి తెలంగాణ వాదుల వేర్పాటు వాదుల హింసాత్మక ప్రవర్తన కంటే రుజువు ఏమి కావాలి?

'రుజువులు లేని ఉద్యమం: తెలంగాణ వేర్పాటు వాదుల 101 అబద్ధాలు వక్రీకరణలు' అన్న పుస్తకంలో ఆందోళనకారులు రాష్ట్ర విభజనకు చూపిస్తున్న కారణాలలో నిజం లేదని సమగ్రంగా వివరించాం. మా పుస్తకం ఎంత శక్తిమంతమైనదో వేర్పాటువాదులు అందులో మేము రాసిన ఒక్క విషయాన్ని కూడా పూర్వపక్షం చేయలేకపోయారు. ఒక్క అంశాన్ని కూడా తప్పుపట్టలేకపోయారు. పుస్తకం మీద జరిగిన ప్రతి చర్చలోనూ మమ్మల్ని ఆడిబోసుకున్నారు. మాది దురహంకారమన్నారు; మేము రెచ్చగొడుతున్నామన్నారు; మేము తెలంగాణ ప్రజల మనో భావాలను అగౌరవ పరుస్తున్నామన్నారు; ప్రజాభిప్రాయంపట్ల మాకు గౌరవం లేదన్నారు; ఇంతమంది అవునంటున్నది మేమెలా కాదనగలమన్నారు; మరెన్నో మాటలు మిగిలారు. కొంతమంది సోషల్ మీడియాలో మా మీద పచ్చి బూతులు కూడా ప్రయోగించారు. వ్యక్తిగత దూషణలకు హద్దూ పద్దూ లేకుండాపోయింది.

కాని ఒక్కరంటే ఒక్కరు ఇదిగో ఈ పుటలో ఇక్కడ ఈ దోషం ఉంది అని మాత్రం ఎత్తి చూపలేకపోయారు. మా గణాంకాలను తప్పు పట్ట లేకపోయారు. మా తర్కాన్ని వేలెత్తి చూపలేకపోయారు. మేము ఇచ్చిన భాష్యానికి ప్రత్యామ్నాయ వివరణ ఇవ్వలేకపోయారు. మా విశ్లేషణకు సమాధానం చెప్పలేక పోయారు. మా భావ ప్రకటనా స్వేచ్ఛ మీద సాక్షాత్తు ప్రెస్‌క్లబ్‌లో దాడి జరిగితే, పాత్రికేయులే మా పుస్తకాన్ని తగుల బెడితే దేశవ్యాప్తంగా లబ్ధ ప్రతిష్ఠులైన మన పౌర హక్కుల సంఘాల పెద్దలు ఒక్కరంటే ఒక్కరికి ఆ దుశ్చర్యను ఖండించడానికి నోరు రాలేదు. హక్కుల పరిరక్షకులుగా దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రతిష్ఠను ఇంత చవకగా వారు పోగొట్టుకుంటారని మేము ఊహించలేదు.

మొత్తం తెలంగాణ ప్రాంత ప్రజలందరి పక్షాన మాట్లాడుతున్నట్లు వేర్పాటువాద నాయకులు మనల్ని నమ్మమంటారు. కాదు, వారు కేవలం రాష్ట్ర విభజనను కోరుకునే వారి పక్షాన మాత్రమే మాట్లాడుతున్నారని యావత్ తెలంగాణ ప్రాంత ప్రజానీకం పక్షాన కాదనీ మేమంటున్నాం. రాష్ట్రంలో మూడు ప్రాంతాలలోనూ విభజన వాదులున్నారు. అలాగే మూడు ప్రాంతాలలోను సమైక్య వాదులున్నారు ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి విభజన వాదం బిగ్గరగా వినపడుతుంది. బిగ్గరగా వినపడినంత మాత్రాన బలంగా ఉన్నట్టు లెక్క కాదు. ఈవాళ్టికి వేర్పాటు వాదులు ఇంత బీభత్స వాతావరణం సృష్టించినా తెలంగాణలో విశాలాంధ్ర వాదం బలంగా ఉంది. విశాలాంధ్ర మహాసభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు చాలా ఎక్కువ మంది సభ్యులుగా ఉండడమే దీనికి ప్రబల తార్కాణం.

తమ వాదన బలంగా ఉందనడానికి ఈ మధ్య జరిగిన కొన్ని ఉప ఎన్నికల ఫలితాలు తప్ప వేర్పాటు వాదులకు మరొక ఆధారం లేదు. 1969 నుంచి 2009 దాక తెలంగాణలో -నాలుగు దశాబ్దాల పాటు -విభజనవాదానికి ఎక్కడా పచ్చి మంచినీళ్ళు కూడా పుట్ట లేదు. భారతీయ జనతా పార్టీ, ఇంద్రారెడ్డి పార్టీ, దేవేందర్ గౌడ్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలు ఎంత ఆయాస పడ్డా వారు సాధించిన ఎన్నికల ఫలితాలు అంతంత మాత్రమే అన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. మొన్న పరకాల ఉప ఎన్నికలో నెగ్గడానికి టి ఆర్ ఎస్‌కి తలప్రాణం తోకకొచ్చింది. పట్టుమని పదివేల మంది కూడా లేని సమీకరణని చూపించి దాన్నే 'మిలియన్ మార్చ్'అనుకోమన్నప్పుడే వేర్పాటు వాదులకున్న ప్రజా బలమెంతో అర్థమయ్యింది. బుకాయింపులకు, డబాయింపులకు కూడా ఒక అడ్డూ ఆపూ ఉంటాయి.

విభజన వాద సమైక్యవాద భావజాలాల మధ్య ఎప్పుడు సంఘర్షణ జరిగినా సమైక్యవాదమే విజయం సాధించింది. ఈ సారి కూడా సమైక్యవాదమే గెలుస్తుందని మా విశ్వాసం. తెలంగాణలో మా సభలు సజావుగా జరుపుకుని అసలు విషయాలను ప్రజలకు వివరిస్తే ఇప్పుడున్న కొద్ది బలం కూడా విభజనవాదులు కోల్పోతారు. అందుకే మమ్ములను ప్రజలలోకి వెళ్ళకుండా మా వాదనను ప్రజలకు చేరకుండా వారు మమ్మల్ని శతవిధాలా అడ్డుకుంటున్నారు. మా వాదన అంటే వారికి అభద్రతా భావం. లేకపోతే వారు ఆ పని చెయ్యరు.

మాతో బహిరంగ చర్చలకు అడపాదడపా వేర్పాటు వాదులు సవాళ్ళు విసురుతూ ఉంటారు. కానీ సమయం వచ్చేటప్పటికి పత్తా లేకుండా పోతారు. వారు విసిరిన ప్రతి సవాలునూ మేము స్వీకరించాం. చర్చకు సిద్ధమయ్యాం. గతంలో ఒక మాజీ మంత్రి చర్చకు పిలిచి ఆయన అనుచరులతో మా మీద దాడి చేయించి ఉడాయించారు. నిన్న కాక మొన్న ఒక విభజనవాద శాసనసభ్యుడు చర్చకు రమ్మని సవాలు విసిరారు. మేము స్వీకరించాం. ఇవ్వాళ్టి వరకూ అతగాడు మళ్ళీ కిమ్మనలేదు.

భావజాల వ్యాప్తికి అప్రజాస్వామిక మూకలు సృష్టించే అడ్డంకులను అదృష్టవశాత్తు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రానురాను బలహీన పరుస్తోంది. మేము ఇంటర్నెట్‌లో పెట్టిన 'రుజువులు లేని ఉద్యమం' పుస్తకం సాప్ట్ కాపీలు కొన్ని వేలు డౌన్‌లోడు అవుతున్నాయి. పుస్తకాల ప్రతులు కావలసిన వారు సంప్రదించాల్సిన ఈ మెయిలు అడ్రసు, ఫోన్ నెంబరు సోషల్ మీడియా లో ప్రకటించాం. రోజు కు కొన్ని వందల మంది పుస్తకాల కోసం అడుగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఎడెతెరిపిలేకుండా పుస్తకాలు కావాలని ఎస్ ఎం ఎస్‌లు, ఈ మెయిల్సు వస్తున్నాయి. మా వాదన, మా మాట, మేము చెప్పే వాస్తవాలు ప్రజ లలోకి లోతుగా, నిశ్శబ్దంగా వెడుతున్నాయి.

మేము వేర్పాటు వాదాన్ని వ్యతిరేకిస్తే దాన్ని తెలంగాణ ప్రజానీకానికి మేము వ్యతిరేకమన్నట్టుగా వేర్పాటువాదులు చిత్రీకరిస్తున్నారు. విభజన వాదుల అబద్ధాలను ఎత్తి చూపితే తెలంగాణ ప్రజలను అబద్ధాలాడేవాళ్ళు అంటారా అని తిరగేస్తున్నారు. తెలంగాణలోని సామాన్య ప్రజలకు సమైక్యవాదులను శత్రువులుగా చూపించాలని వీరి ప్రయత్నం.

వేర్పాటువాదాన్ని సమర్థించడం మాత్రమే తెలంగాణ పట్ల అభిమానానికి గీటురాయిగా, సమైక్యతను కోరడం అంటే తెలంగాణ శ్రేయస్సును వ్యతిరేకించడంగా చిత్రీకరించడంలో విభజన వాదులు కొంతవరకు సఫలీకృతులయ్యారు. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర సమైక్యతను కోరే లక్షలాది మంది ఇవాళ మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడడానికి ఇది ముఖ్య కారణం. ఈ చిత్రీకరణ కేవలం వేర్పాటువాద వ్యూహకర్తల గడుసైన ఎత్తుగడ మాత్రమే. ఇది నిశిత పరీక్షకు నిలబడలేదు. వాస్తవాల వెలుగు ప్రసరిస్తే ఈ చీకటిపారిపోతుంది. తెలంగాణలో ఉన్న అసంఖ్యాక విశాలాంధ్ర వాదులు ఈ ఎత్తుగడను, ఈ అభూత కల్పనను ఛేదించాలి. ముసిరిన ఈ తిమిరంతో సమరం చేయాలి.

ఇంతకు ముందూ ఇప్పుడు విశాలాంధ్ర కోరిన వారు, కోరుతున్న వారూ నిఖార్సయిన తెలంగాణ ప్రాంత శ్రేయోభిలాషులు అనడానికి రావి నారాయణరెడ్డి తో మొదలుకొని పీవీ నరసింహరావు వరకూ, దేవులపల్లి రామానుజరావు నుంచి నర్రా మాధవరావు వరకూ అనేక మంది నిష్ఠ గల నాయకులు మనకు ఉదాహరణలుగా నిలబడతారు. కాని ఇవాళ రాష్ట్ర విభజన కోరే నాయకులందరూ తెలంగాణ హితైషులు అనడానికి వారి రాజకీయ చరిత్రలలో దాఖలాలు బహు తక్కువ.

తెలంగాణ మీద అభిమానానికి విభజనవాదం గీటురాయి కాదు. విభజన వాదం వేరు, తెలంగాణ మీద మమకారం వేరు. ఈ రెండిటినీ ఒకటిగా చూపించి పబ్బం గడుపుకోవాలని వేర్పాటువాద నాయకుల ప్రయత్నం. అయితే ఈ రెండిటికీ వైరుధ్యం లేదని, విశాలాంధ్రలో మన ప్రాంత ప్రయోజనాలు సురక్షితమని తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశాలాంధ్ర వాదులు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వెలిబుచ్చడానికి సంకోచించకుండా ధైర్యంగా ఇక ముందుకురావాలి. చరిత్ర, ఆర్థిక గణాంకాలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సహజీవన పరంపర వారి వాదనకు పెట్టని కోటలుగా నిలుస్తాయి. 'వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ కాదు' అన్న రావి నారాయణ రెడ్డి గర్జన తెలంగాణలో విశాలాంధ్ర వాదుల మంత్రం కావాలి.

తెలంగాణ ప్రయోజనాలకి తెలంగాణ వేర్పాటువాదులు, రాయలసీమ ప్రయోజనాలకి ఆ ప్రాంతానికి చెందిన విభజనవాదులు, కోస్తా ప్రయోజనాలకి అక్కడ విభజనవాదం వినిపించేవారు గుత్తేదార్లుగా చెలామణీ అయ్యే క్షుద్ర రాజకీయ క్రీడకి తెర దించాలి. మూడు ప్రాంతాలలో ఉన్న సమైక్య వాదులంతా ఉదాసీనతను వీడి క్రియాశీలకంగా పనిచేస్తే విభజన వాద భావజాలాన్ని తెలుగు నేల నుంచి శాశ్వతంగా సాగనంపగలుగుతాం.


- డాక్టర్ పరకాల ప్రభాకర్
ప్రధాన కార్యదర్శి, విశాలాంధ్ర మహాసభ

శనివారం 20 ఎప్రిల్ 2013

The Beginnings of Fascism?


‘When you fail to shoot, you beat with the butt’ so goes an old adage. This is what happened on 16th April ‘13, in the hall named for Suravaram Pratap Reddy, scholar-writer and pioneer-editor of the old Hyderabad State. On prior intimation to police and with the permission of the authorities, a meeting was called in the Press Club, Basheer bagh by the Visalandhra Mahasabha - an organization committed to the political and cultural integrity of the Telugu speaking people - to launch the Telugu version of their publication ‘Refuting an Agitation’ . The publication seeks to place in public domain facts and figures relating to some 100 assertions often made by the Telangana protagonists to incite emotions. The issues raised over the years were carefully collected, categorized and researched with an open mind to see if there is any room for genuine grievance. It has taken the organization more than two years to do all this and bring out a publication which gives unbiased and authentic information. Its English edition was launched in New Delhi some time ago in the presence of eminent journalists and writers and sent to all columnists, opinion-makers, MPs and MLAs of the State. Of late, many people have come to rely on the publication for authentic information. As a result, there is considerable disenchantment with the claims of the Telangana protagonists! Even, they have come to realize that their claims are not supported by statistics and switched to basing their case on ‘sentiment’ which all well-meaning people know cannot be the basis for dividing a State! Should sentiment be the criterion, we have to have more than 500 States in India!

The book was launched by Mehboob Ali, a veteran of the Telangana Struggle of the 1950s which not only fought the Nizam-supported Razakars bravely but rid Telangana of all feudalism and paved the way for what is now Andhra Pradesh. As the meeting progressed, some journalists came in, asked the police officers in plain clothes to leave the hall which they meekly did in spite of prior information to them that the trouble was brewing. Some hoodlums claiming to be journalists broke into the hall, broke the microphones and burnt copies of the book in the hall itself, all under the confused gaze of the policemen. Ironically, the venue is barely two hundred meters away from the office of the Dy. Commissioner who was briefed by the writer himself a day In advance about the possibility of inspired violence. There were at least a hundred policemen and officers including the ‘task-force’ bouncers whereas the trouble makers were about 25 or 30. When this writer, who presided over the meeting, later protested to the Dy. Commissioner, he pleaded helplessness on the ground that the incident took place inside the Press Club hall! He even seems to think that the journalists in their own premises are above the law!

The incident raises some questions of deep concern. Press Club should be the place where the right to freedom of speech is to be upheld more than anywhere else. Even if a section of the press is opposed to the book being launched – in the normal circumstance there can be no opposition – there is a way to protest. A day later another meeting can be held to counter or question the facts the book presents. Burning a book that too in the premises of the Press Club shows their utter contempt for freedom of speech about which they often yell from the rooftops and almost borders on fascist tendencies among a section of journalists. This menace, only the well-meaning among them can put down! If the self-correcting mechanism breaks down, freedom of the Press itself would be in jeopardy. We would like to tell our journalist friends that books are not for burning!

The police also have a few lessons to learn. Every police officer is administered an oath at the beginning of his or her career to uphold the Constitution which promises freedom of speech and the right to assemble “peaceably and without arms”. Failing to afford protection, in spite of prior intimation to them as in the instant case, would amount to abdication of professional responsibility. The confusion in the minds of senior officers whether they can intervene in the Press Club premises to restrain the misbehaving journalists has resulted in the whole force being reduced to mute spectators. This is precisely what happened on an earlier occasion again in the press club, when the Bangladesh activist, Taslima Nazreen was assaulted and humiliated by an MLA and a few of his fundamentalist followers right under the nose of the Police, while launching a book questioning religious orthodoxy. Our police officers are either inadequately briefed about the rights of the people or do not know their job well or trying to be more ‘tactful’ than correct in their conduct. If this kind of inaction is tolerated on part of the police officers, consequences can be disastrous and even normally law-abiding people, in their frustration, would be forced to take law into their hands! As long as the duty of the police is to prevent violence and lawlessness, it doesn’t matter where it takes place, in the Press Club or a university or even a temple or a mosque. None of these places are above the law of the land or people connected with them have any immunity from police action. Law-abiding people expect the Police to uphold their right to assemble and make their voices heard. The day the police fail to do this, democratic rights have no meaning! Let them not drive the law-abiding people to desperation! In any case let not our police force be over-awed by hooliganism whatever quarters it comes from!

-Anjaneya Reddy, Member Core Committee, Vishalandhra Mahasabha (presided over the aborted meeting); formerly of the Indian Police Service

మంగళవారం 16 ఎప్రిల్ 2013

'విశాలాంధ్ర మహాసభ' పుస్తకావిష్కరణ ఆహ్వానము



ఆంధ్ర ప్రదేశ్ లో విభజన వాదులు ప్రచారం చేస్తున్న అసత్యాలను, వక్రీకరణలను క్రోడీకరించి వాటిని గణాంకాలతో సహా తప్పులు గా నిరూపిస్తూ విశాలాంధ్ర మహాసభ రూపొందించిన పుస్తకం Refuting An Agitation: 101 Lies and Dubious Arguments యొక్క తెలుగు అనువాదం 

రుజువులు లేని ఉద్యమం
తెలంగాణ వేర్పాటు వాదుల 101 అబద్ధాలు, వక్రీకరణలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఆవిష్కరింప బడుతోంది.

తేదీ: బుధవారం 17 ఏప్రిల్ 2013

సమయం: ఉదయం 11:30 గంటలు

వేదిక: ప్రెస్ క్లబ్, దేశోద్ధారక భవన్, బషీర్ బాగ్, హైదరాబాద్

.
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ మెహబూబ్ అలీ  
పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.


శ్రీ సి. అంజనేయ రెడ్డి ( మాజీ డి జి పి )
సభకు అధ్యక్షత వహిస్తారు.

ఇట్లు
నలమోతు చక్రవర్తి                                                పరకాల ప్రభాకర్
అధ్యక్షులు                                                           ప్రధాన కార్యదర్శి


శనివారం 16 మార్చి 2013

Visalandhra Mahasabha pays tributes to Amarajeevi ‘Potti SreeRamulu’



Visalandhra Mahasabha has paid rich tributes to Amarajeevi Potti Sriramulu on the occasion of his Jayanti today. Visalandhra Mahasabha members gathered at the statue of Amarajeevi near the Secretariat and recalled his sacrifice for creating a state for the Telugu people. Creation of Andhra State in 1953 was the first crucial step for the eventual formation of Andhra Pradesh in 1956. Thus Potti Sriramulu’s sacrifice resulted in not only the formation of Andhra Pradesh but also the reorganization of India’s polity on linguistic basis.

Visalandhra Mahasabha Secretary Sri Parakala Prabhakar and members Sri Chegondi Ramajogaiah, Sri Kumar Chowdry Yadav, Sri K. Srinivas, K. Vikram, kethiry Sreenivasa Reddy, Sri Padiri Ravitheja rededicated themselves to protect the unity of Telugu people and the state of Andhra Pradesh.

'విశాలాంధ్రోద్యమం' పై అలనాటి పుస్తకాలు



బుధవారం 23 జనవరి 2013

'Refuting an Agitation - 101 lies & dubious arguments of T separatists'

విభజనే పరిష్కారం కాదు - విశాలాంధ్రమహాసభ పుస్తకావిష్కరణ సభలో వక్తలు




ఈనాడు దినపత్రిక కథనం:

'ªÃ†¾Z N¦µ¼•ÊÅî ®¾«Õ®¾u©Õ X¾J³Äˆª½¢ ÂëÛ. “¤Ä¢Åé ÆGµ«%-Cl´-Åî¯ä X¾J³Äˆª½¢ Æ«ÛÅêáÑ ÆE -“X¾-ŸµÄ-E -OÕ-œË-§ŒÖ -«Ö-° ®¾-©£¾É-ŸÄª½Õ-œ¿Õ ®¾¢•§ýÕ ¦Çª½Õ ƯÃoª½Õ. N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É®¾¦µ¼ ª½Ö¤ñ¢C¢*Ê 'éªX¶¾Üu-šË¢’û §ŒÖ¯þ Æ>˜ä†¾¯þ Ð Åç©¢’ú „߿թ 101 ƦŸÄl´©Õ, Ƅî¾h« „߿ʩÕÑ X¾Û®¾hÂÃEo ‚§ŒÕÊ «Õ¢’¹-@Á-„Ã-ª½¢ ƒÂ¹ˆœ¿ ÂÃE®Ïd-{Öu-†¾¯þ ¹x¦ü©ð Nœ¿ÕŸ¿© Íä¬Çª½Õ. ÆÊ¢ÅŒª½¢ «ÖšÇx-œ¿Õ-ÅŒÖ ¨ X¾Û®¾hÂÃEo ¯äÊÕ ‚N†¾ˆ-J¢ÍŒ-¦ð-ÅŒÕ-Êo-{Õx ÅçL®Ï Âí¢Ÿ¿ª½Õ ƒÂ¹ˆœËÂË £¾É•ª½Õ Â럿lE ¤¶òÊÕx, ¨ „çÕªá-@Áx©ð ÂîªÃª½Õ. ƒC Åç©¢’ÃºÂ¹× «uAêªÂ¹ X¾Û®¾h-¹-«ÕE „ç@ïx-Ÿ¿lE ÅçL¤Äª½Õ. ƪáÅä, Åç©¢’ÃºÂ¹× «uAêª-¹¢’ïî, «ÕŸ¿l-ÅŒÕ-’Ã¯î ¯äF Âê½u-“¹-«Ö-EÂË ªÃ©äŸ¿Õ. “X¾èÇ-²Äy-«Õu¢©ð “X¾A ŠÂ¹ˆJÂÌ ÅŒ«Õ ¦µÇ„éÊÕ «u¹h¢ Íäæ® £¾Ç¹׈ …¢C. ÆC ©ä¹¤òÅä “X¾èÇ-²Äy-«Õu¢ ÍŒE¤ò-ªá-ʘäx ʯÃoª½Õ. ê«©¢ ¯Ã ¦µÇ„éÊÕ «u¹h¢ Í䧌՜ÄEꠃ¹ˆœËÂË «ÍÃaÊÕ. ¨ X¾Û®¾hÂÃEo “X¾A ŠÂ¹ˆª½Ö ŠÂ¹²ÄJ ÍŒŸ¿„ÃL. ŠÂ¹ •ª½o-L-®¾Õd’Ã, X¾J¬ð-Ÿµ¿-¹×-œË’à ¦ÇŸµ¿u--ÅçŒá-ÅŒ¢’à ‚©ð*¢* ¨ X¾Û®¾hÂÃEo Nœ¿ÕŸ¿© Íä¬ÇÊE ÅçL¤Äª½Õ.

“X¾-¦µ¼Õ-ÅÃy-EÂË ª½£¾Ç®¾u E„äC¹ ®¾«Õ-Jp¢ÍŒ-œ¿¢ «©äx ¡Â¹%†¾g ¹NÕšÌÂË Í眿fæXª½Õ «*a¢C. ƪáÅä ‚ E„äC¹ „çáÅÃhEo X¾JQLæ®h ÍÃ©Ç «Õ¢* ®¾«ÖÍê½¢ ƒÍÃaª½Õ. ªÃ†¾Z¢©ð ÍÃ©Ç “¤Ä¢ÅÃ©Õ „çʹ¦œË …¯Ãoªá. Åç©¢’ú, ªÃ§ŒÕ-©-®Ô-«Õ-©-Â¹× Íç¢CÊ ¯äÅŒ©ä «áÈu-«Õ¢“ÅŒÕ-©Õ’à X¾EÍä®Ï¯Ã ÂíEo ¦µ÷’îR¹ X¾J®ÏnŌթ «©x ‚ “¤Ä¢ÅÃ©Õ ÆGµ«%Cl´ Âéä-¹-¤ò-§ŒÖªá ƯÃoª½Õ. Åç©¢’úåXj \ Eª½g§ŒÕ¢ B®¾Õ¹ׯÃo Åç©Õ’¹Õ “X¾•© Dª½`ÂÃL¹ “X¾§çÖ-•-¯Ã-©-ÊÕ Ÿ¿%†Ïd©ð åX{Õd-Âí-„ÃL. «á¢¦ªáÂË D{Õ’Ã å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ-ÊÕ ÆGµ«%Cl´ Íäæ®¢Ÿ¿Õ-Â¹× “X¾¦µ¼ÕÅŒy ª½¢’¹ åX{Õd-¦-œ¿Õ-©-ÊÕ åX{d’Ã, “¹„äÕ-ºÇ wåXj„ä{Õ ®¾¢®¾n©Õ Â¹ØœÄ ƒÂ¹ˆ-œË-Âí-ÍÃa-§ŒÕ-¯Ão-ª½Õ. ƪáÅä, “X¾•© 客šË-„çÕ¢{Õ-ÊÕ …Ÿäl-¬Á-X¾Ü-ª½y-¹¢’à Eª½x¹~u¢ Íä§ŒÕ-¹Ø-œ¿-Ÿ¿Õ. '¯Ã «ÕÊ®¾Õ Åç©¢’ú \ªÃp{ÕÂ¹× „çá’¹Õ_ ÍŒÖX¾Û-Ōբ˜ä.. ¯Ã ‚©ð-ÍŒ-Ê(-„çÕi¢œþ) «Ö“ÅŒ¢ ‚¢“ŸµÄ „çjX¾Û …¢C. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¯äÊÕ ‚¢“ŸµÄ, Åç©¢’ú “¤Ä¢ÅÃ©Â¹× „ê½-Cµ-©Ç¢šË„Ã-œË-EÑ ¯ÃÂ¹× ‚¢“ŸµÄ, Âî²Äh, Åç©¢’ú “¤Ä¢Åéðx ¦¢Ÿµ¿Õ-«Û-©Õ-¯Ão-ª½Õ. Oª½¢ÅÃ Â¹ØœÄ „ê½-Ÿµ¿Õ©ä, ‰Â¹u¢’à …¢œä “¤Ä¢ÅéÊÕ ÆGµ«%Cl´ Í䧌֩¯äC ¯Ã ÆGµ“¤Ä§ŒÕ¢ ƯÃoª½Õ. “X¾Åäu¹ ªÃ†¾Z¢ «©x ®¾«Õ®¾u©Õ BJ¤ò«Û. “¤Ä¢Åé ÆGµ«%-Cl´Åî¯ä X¾J³Äˆª½¢ ©Gµ®¾Õh¢Ÿ¿-¯Ão-ª½Õ. N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É®¾¦µ¼ ÆŸµ¿u¹~ל¿Õ -‡-¯þ.ÍŒ“¹«Jh «ÖšÇx-œ¿Õ-ÅŒÖ ¨ X¾Û®¾hÂÃEo Åïí¹ˆœä ªÃ§ŒÕ©ä-Ÿ¿E, ‡¢Åî «Õ¢C ¹%†ÏÅî DEo ª½Ö¤ñ¢C¢ÍÃ-«ÕE ÅçL¤Äª½Õ. “X¾«áÈ ÂéNÕ®¾Õd ƬðÂú «ÖLÂú «ÖšÇx-œ¿Õ-ÅŒÖ ªÃ†¾Z N¦µ¼•Ê Æ¢¬Á¢©ð “X¾¦µ¼Õ-ÅŒy¢ ‡²ÄqKqE X¾J’¹-º-Ê-©ðÂË B®¾Õ-Âî-„Ã-Lq¢Ÿ¿-¯Ão-ª½Õ. ƒE®Ïd{Öušü X¶¾ªý Âïþ-X¶Ïx-Âúd „äÕ¯ä-èü-„çÕ¢{Õ ‡Tb¹Øu-šË„þ œçj-éª-¹dªý Æ•§ýÕ-®¾-£ÏÇo «ÖšÇx-œ¿Õ-ÅŒÖ Åç©¢’ú \ªÃp˜ãjÅä «Ö„î-ªá-®¾Õd-©Õ X¾Û¢VÂ¹×¯ä Æ«ÂìÁ¢ …¢Ÿ¿E, ŠÂ¹ «Üu£¾Ç¢ “X¾Â꽄äÕ ¦Ç„îŸäy-’Ã-©-ÊÕ éªÍŒa-’í-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E ÅçL¤Äª½Õ. “X¾¦µ¼Õ-ÅŒy¢ ÆEo Æ¢¬Ç©ÊÕ X¾J’¹-º-Ê-©ðÂË B®¾ÕÂíE ÅŒTÊ Eª½g§ŒÕ¢ „ç©x-œË¢Íé-¯Ão-ª½Õ. ¨ Âê½u-“¹-«Õ¢©ð N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É®¾¦µ¼ “X¾ŸµÄÊ Âê½uŸ¿Jz X¾ª½Âé “X¾¦µÇ-¹ªý, Æœ¿Õ-®¾Õ-«Õ-Lx •§ŒÕ-“X¾-ÂÆý, ª½ÍŒªáÅŒ ®Ï.Ê-Jz¢£¾Ç-ªÃ-«Û-©Õ ¤Ä©ï_-¯Ão-ª½Õ. Âê½u-“¹-«Ö-EÂË «á¢Ÿ¿Õ ªÃ•u®¾¦µ¼ ®¾¦µ¼Õuœ¿Õ êÂOXÔ ªÃ«Õ-ÍŒ¢“Ÿ¿ªÃ«Û ÂÃæ®X¾Û ¹تíaE „çRx-¤ò-§ŒÖ-ª½Õ.


'ŸîXÏœÎ ŠšËd«Ö-˜äÑ 
-¨-¯Ã-œ¿Õ Ð å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ
®¾-„çÕi-ÂÃu¢“Ÿµ¿ ªÃ†¾Z¢©ð Åç©¢’ú „ê½Õ ŸîXÏœÎÂË, N«Â¹~Â¹× ’¹Õª½-«Û-ÅŒÕ-¯Ãoª½-¯äC ŠšËd-«Ö˜ä-ÊE, ƒC Åç©¢’ú …Ÿ¿u-«Õ-ÂÃ-ª½Õ-©Õ Í䮾ÕhÊo “Ÿî£¾Ç-X¾Ü-JÅŒ “X¾Í꽫ÕE N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É®¾¦µ¼ æXªíˆ¢C. œµËMx©ð «Õ¢’¹-@Á-„Ã-ª½¢ 'éªX¶¾Üu-šË¢’û §ŒÖ¯þ Æ>˜ä†¾¯þÑ Ð Åç©¢’ú „߿թ 101 Æ®¾ÅÃu©Õ, Ƅî¾h« „ß¿Ê©Õ Æ¢{Ö ‹ X¾Û®¾h¹¢ Nœ¿ÕŸ¿© Íä®Ï¢C. ƒ¢Ÿ¿Õ©ð 101 Æ¢¬ÇLo “X¾²Äh-N¢*¢C. Æ¢Ÿ¿Õ©ð ÂíEo..
Ÿî-XϜΠ‡«J «©x?: ‚¢“Ÿµ¿-„Ã-@ÁÙx Âß¿Õ. EèÇ¢ ¤Ä©Ê, ²ÄnE¹ ¦µ¼Ö²Äy«Õu ‚CµX¾-ÅŒu-„äÕ Åç©¢’ú©ð ŸîXÏœÎÂË Â꽺«ÕE ‚ “¤Ä¢ÅŒ ª½ÍŒ-ªá-ÅŒ-©¢Åà ’¹ÕJh¢ÍÃ-ª½Õ. ƒŸä ª½ÍŒªáÅŒ©Õ ‚¹®Ït¹¢’à Âî²Äh, ªÃ§ŒÕ©®Ô«Õ “¤Ä¢Åé „ÃJåXj ‚§ŒáŸµÄ©Õ ‡Â¹×ˆ-åX-šÇd-ª½Õ. ƒX¾Ûpœ¿Õ Åç©¢’ú …Ÿ¿u«ÖEÂË ¯Ã§ŒÕ-¹-ÅŒy¢ «£ÏÇ-®¾Õh-Êo-„Ã-ª½Ö ¦µ¼Ö²Äy«Õu «ÕÊ®¾hÅŒy¢ ¹LTÊ „Ãêª. 
¦µ¼-§ŒÕ-åX-œ¿Õ-ÅŒÕ-ÊoŸç-«-ª½Õ?: Âî²Äh, Åç©¢’ú© «ÕŸµ¿u “X¾§ŒÖ-ºË¢Íä ¦®¾Õq©åXj “X¾Åäu¹ „ß¿Õ©Õ ªÃ@ÁÙx „ä¬Çª½Õ. Åç©¢’ú „éä èÇ’îЂ¢“ŸµÄ „Ã©ä ¦µÇ’î ÆE E¯ÃŸÄ-L-ÍÃa-ª½Õ. «â®Ô ÊC ‡ª½Õ-åX-¹׈-ŌբŸ¿E ¦ãC-J¢ÍÃ-ª½Õ. ƒ«Fo ƒÅŒª½ “¤Ä¢Åé „ê½Õ ¦µ¼§ŒÕ¢Åî ¦Aê婂 Í䮾Õh-¯Ãoªá.
ÅçªÃ®¾ é’©ÕæX “X¾•© «Õ¯î-¦µÇ-„Ã-©Ç?: 2004 ‡Eo¹©ðx ÅçªÃ®¾ 54 Æå®¢Hx ²Än¯Ã©Â¹× ¤òšÌÍä®Ï 26 «Ö“ÅŒ„äÕ é’L*¢C. Åç©Õ-’¹ÕŸä-¬Á¢åXj ¯äª½Õ’à ¤òšÌ Íä®ÏÊ Íî˜ä N•§ŒÕ¢ ²ÄCµ¢ÍÃ-ª½Õ. Dʪ½n¢ ÅçŸä¤Ä ¤Ä©ÊåXj «uAêªÂ¹ÅŒ «©äx ÅçªÃ®¾ é’©ÕX¾Û. 2008©ð 16«Õ¢C ÅçªÃ®¾ ‡„çÕt©äu-©Õ ªÃ°¯Ã«Ö Íäæ®h ê«©¢ \œ¿Õ’¹Õêª «ÕSx é’LÍê½Õ. 2009©ð 45²Än-¯Ã-©ðx ¤òšÌ Íäæ®h ê«©¢ 10 é’LÍê½Õ. ®¾y§ŒÕ¢’à ê®Ԃªý 15„ä© ‹{Õx, ‚§ŒÕÊ Â¹×«Ö-ª½Õ-œ¿Õ êš̂ªý ê«©¢ 150 ‹{x ‚CµÂ¹u¢Åî é’LÍê½Õ. 2012©ð •JTÊ …X¾ ‡Eo¹©ðx «Ö“ÅŒ„äÕ ÅçªÃ®¾ «Õ¢* N•§ŒÖ©Õ ²ÄCµ¢*¢C. ÅçªÃ®¾ ¹¢ÍŒÕÂî{ X¾ª½Âé …X¾ ‡Eo¹©ðx ÆA¹†¾d¢ OÕŸ¿ é’L*¢C. å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ Âêíp-êª-†¾¯þ ‡Eo¹©ðx ÅçªÃ®¾ Æ®¾©Õ ¤òšÌê C’¹Â¹ ¤ò«œ¿¢ ’¹«Õ-¯Ã-ª½|¢.
Åç©¢’ú …Ÿîu-’¹Õ-©-åXj N«Â~Ã?: ƒŸî Æ“X¾-«Ö-ºË-¹-„çÕiÊ ‚ªîX¾º. ƒŸä E•„çÕiÅä „ÃšË X¾J³Äˆª½¢ Â¢ ¯Ãu§ŒÕ-X¾-ª½¢’Ã, w˜ãj-¦Õu-Ê-©ü-©ð-ÊÖ X¶ÏªÃuŸ¿Õ Íä§çáÍŒÕa. ƒX¾pšË «ª½Â¹× ƒ©Ç¢šË X¶ÏªÃuŸ¿Õ ŠÂ¹ˆšÌ ŸÄÈ©Õ Âé䟿¯äC E•¢. ƒC Ÿäy†¾ X¾ÜJÅŒ “X¾ÍÃ-ª½¢©ð ¦µÇ’¹¢ «Ö“ÅŒ„äÕ.
Åç©¢’ú NM¯ÃEÂË ¯ç-“£¾Þ «uAêªÂ¹¢ Âß¿Õ: -¯ç“£¾Þ \¯Ãœ¿Ö N¬Ç©Ç¢“Ÿµ¿-Â¹× «uAêªÂ¹¢ Âß¿Õ. Åç©Õ’¹Õ, ¹Êoœ¿, «ÕªÃK¸ ¦µÇ†¾ «ÖšÇxœä “¤Ä¢Åéðx …Êo å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ªÃ†¾Z N¦µ¼•ÊÊÕ «Ö“ÅŒ„äÕ Åí©ÕÅŒ «uAêª-ÂË¢ÍÃ-ª½Õ. Ÿä¬Á “¬ì-§ŒÕ-®¾Õq Ÿ¿%³Ädu N¬Ç©Ç¢“Ÿµ¿ \ªÃp{Õ Í䧌֩E ‚§ŒÕÊ EèÇ«Ö-¦Ç-Ÿþ©ð ƯÃoª½Õ. NM¯ÃEo >ÅŒÕh©«ÖJ «ª½ÕœËÅî Æ«Ö§ŒÕ¹ «Ÿµ¿Õ«Û N„ã¾Ç¢’à ‚§ŒÕÊ ¤ò©Çaª½¯ä “X¾Íê½¢ „äªÃp{Õ „ß¿Õ©Õ Í䮾Õh-ÊoŸä. Eèǫ֦ǟþ “X¾®¾¢’¹¢©ð-ÊÖ ‚§ŒÕÊ ¨ X¾ŸÄ©ÊÕ …X¾§çÖ-T¢ÍŒ©ä-Ÿ¿Õ. ‚§ŒÕÊ ‚ªîV ''¦µÇ-ª½-ÅŒŸä-¬Á¢ FC, ¯ÃŸä Âß¿Õ «ÕÊ¢Ÿ¿JC. ¦µÇª½ÅŒ «ÖÅŒ å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ©äŸÄ …ÅŒh-ª½-“X¾Ÿä¬ü “X¾•©C «Ö“ÅŒ„äÕ Âß¿Õ. «ÕÊ¢Ÿ¿ª½¢ Ÿä¬Á¢©ð ¦µÇ’¹-²Äy-«á-©¢. £Ïǫ֩§ŒÖ© ÊÕ¢* ¹¯Ãu-¹×-«ÖJ «ª½Â¹× OÕ Æ¢Ÿ¿JC. å£jÇ-ŸÄ-ªÃ-¦ÇŸþ, Eèǫ֦ǟþ OÕC ÆE, Æ©£¾É¦ÇŸþ, œµËMx ¯ÃC ÆE ¯ÃÂ¹× OÕª½Õ ÍçX¾p©ä-ª½Õ. £ÏÇ«Ö-©-§ŒÖ-©Õ, œµËMx, ƒÅŒª½ “¤Ä¢Åéðx OÕª½Õ ÂÕ-ÅŒÕ-Êo˜äx å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ¯ÃÂ¹× £¾Ç¹׈ …¢C.ÑÑÆ-¯Ão-ª½Õ.
1956Â¹× «á¢Ÿ¿Õ \C Åç©¢’Ã-º?: -E-èÇ-EÂË Åç©¢’ú ªÃ†¾Z„äÕ ©äŸ¿Õ. „äªÃp{Õ „ß¿Õ©Õ …Ÿäl-¬Á-X¾Ü-ª½y-¹¢’à ͌J“ÅŒÊÕ ÅŒX¾ÛpŸÄJ X¾šËd-®¾Õh-¯Ão-ª½Õ. 
Ÿä¬ÇEÂË ²ÄyÅŒ¢“ÅŒu¢ «*aÊX¾Ûœ¿Õ Åç©¢’ú, «ÕªÃšÇyœÄ, ¹Êoœ¿¢ «ÖšÇxœä “¤Ä¢ÅéÅî ¹؜ËÊ å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ “¤Ä¢ÅÃEo EèÇ¢ ¤ÄL®¾Õh-¯Ão-ª½Õ. ¦µÇ†¾ “X¾§Œá¹h ªÃ³ÄZ© \ªÃp{Õ ®¾«Õ-§ŒÕ¢©ð å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ªÃ†¾Z¢ '‚¢“Ÿµ¿-“X¾Ÿä¬ü, ¦ï¢¦Ç§ýÕ ªÃ†¾Z¢ (“X¾-®¾Õh-ÅŒ¢ «Õ£¾É-ªÃ-†¾Z), ¹ªÃg-{¹ђà N¦µ¼•ÊÂ¹× ’¹Õéªj¢C. å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ¯Ãœ¿Õ å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ªÃ³ÄZEÂË ªÃ•ŸµÄE. Åç©¢’ÃºÂ¹× Âß¿Õ.
Æ-¯Ãu-§ŒÕ¢ •JT¢Ÿç-¹ˆ-œ¿?: ‚¢“Ÿµ¿-“X¾Ÿä¬ü \ª½pœËÊ ÅŒª½Õ„ÃÅŒ Åç©¢’ú©ð 15 ©Â¹~© å£ÇÂÃdª½x ÆŸ¿ÊX¾Û ‚§ŒÕ-¹-{Õd-Â¹× F@ÁÙx «ÍÃaªá. Âî²Äh¢“Ÿµ¿©ð 10©Â¹~© å£ÇÂÃd-ª½Õx, ªÃ§ŒÕ-©-®Ô-«Õ©ð 骢œ¿Õ ©Â¹~© å£ÇÂÃdª½Õx «Ö“ÅŒ„äÕ ÆŸ¿Ê¢’à ²Ä’¹Õ©ðÂË «*a¢C.
®¾-„çÕi-¹u „ßÄEÂË «ÕŸ¿l´ÅŒÕ ©äŸÄ? : „ä-ªÃp-{Õ-„Ã-Ÿ¿Õ-©Õ Í䮾ÕhÊo Ÿ¿Õ“†¾p´-ÍÃ-ª½¢. ƒX¾pšËÂÌ ªÃ†¾Z¢ ®¾„çÕi-¹u¢’Ã¯ä …¢Ÿ¿¯ä N†¾§ŒÕ¢ ’¹ÕJh¢ÍÃL. 2009 œË客¦ª½Õ 9« ÅäD “X¾Â¹{ÊÅî ªÃ“AÂË ªÃ“Åä N¬Ç©Ç¢“Ÿµ¿ …Ÿ¿u«Õ¢ åX©Õx-G-ÂË¢C. Æ¢Ÿ¿Õê ê¢“Ÿ¿¢ ÅŒÊ “X¾Â¹{ÊåXj „çʹ׈ ÅŒT_¢C. Åç©¢’ú “X¾•©¢Åà N¦µ¼•ÊÂ¹× ÆÊÕ¹ة«ÕE ÆÊÕÂî©ä¢. NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´-©ðx •JTÊ ‡Eo¹© X¶¾LÅéä DEÂË EŸ¿ª½zÊ¢. N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É-®¾-¦µ¼©ð ÍÃ©Ç «Õ¢C Âê½u-¹ª½h-©Õ Åç©¢’ú “¤Ä¢ÅÃEÂË Íç¢CÊ „Ãêª. Åç©¢’ú©ð Æ¢Ÿ¿ª½Ö N¦µ¼•ÊÂ¹× ÆÊÕ¹Ø-©-«Õ¯ä „ß¿Ê ®¾éªj¢C Âß¿E D¢Åî ®¾p†¾d-«Õ-«Û-Åî¢C.
Ââ“é’®ý £¾ÉOÕ ƒ«y©ä-Ÿ¿Õ: -ªÃ³ÄZ-Eo N¦µ¼->-²Äh-«ÕE Ââ“é’®ý ‡X¾Ûpœ¿Ö ÆCµÂÃ-J-¹¢’à “X¾Â¹-šË¢ÍŒ©ä-Ÿ¿Õ. ‚ ¤ÄKd ‡Eo¹© “X¾ºÇ-R-¹-©ð-ÊÖ DEåXj ®¾p†¾d-„çÕiÊ “X¾Â¹{Ê ©äŸ¿Õ. 2004©ð ªÃ†¾ZX¾A Íä®ÏÊ “X¾®¾¢’¹¢©ð-ÊÕ ªÃ†¾Z N¦µ¼•Ê Æ¢¬Á¢ ©äŸ¿Õ. Åç©¢’úåXj \ÂÃGµ-“¤Ä§ŒÕ ²ÄŸµ¿ÊÂ¹× “X¾¦µ¼Õ-ÅŒy¢ ¹%†Ï Í䮾Õh¢Ÿ¿E «Ö“ÅŒ„äÕ …¢C. ÂíÅŒh ªÃ³ÄZ© X¾ÛÊ-Jy-¦µ¼-•Ê Â¹NÕ†¾¯þ ®Ï¤¶Äª½Õq „äÕª½ê ÂíÅŒh ªÃ³ÄZ© \ªÃp{Õ X¾JQ©Ê •ª½Õ-’¹Õ-ŌբŸ¿E 2004 ‡Eo¹©Â¹× «á¢Ÿ¿Õ •JTÊ Ââ“é’®ý «Jˆ¢’û ¹NÕšÌ ®¾«Ö„ä¬Á¢ BªÃtE¢*¢C. Ââ“é’®ý “X¾A-¤Ä-Ÿ¿-Ê-ÊÕ Æ¢U¹J®¾Öh ‚¯Ãœ¿Õ ÅçªÃ®¾©ð …Êo ‡.Êꪢ“Ÿ¿ ÅŒ«Õ ¤ÄKd ÅŒª½X¶¾ÛÊ ®¾¢ÅŒÂ¹¢ Â¹ØœÄ Íä¬Çª½Õ

రాష్ట్ర ఏర్పాటే పరిష్కారం కాదు 
సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది. అదే లేనప్పుడు ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే’ అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో గౌరవ సీనియర్ ఫెలో సంజయ్‌బారు అన్నారు. విశాలాంధ్ర మహాసభ ‘రెప్యూటింగ్ యాన్ ఎజిటేషన్ (తెలంగాణ వేర్పాటువాదుల 101 అబద్ధాలు, తప్పుడు వాదనలు)’ పేరుతో రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం ఢిల్లీలోని కానిస్ట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగింది.  

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్‌బారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పరిష్కారం కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పే హక్కు అందరికీ ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాసిన ఈ పుస్తకావిష్కరణలో పాల్గొనవద్దంటూ తనకు దేశంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా అమెరికా నుంచి పలువురు ఈమెయిల్స్ పంపారని ఆయన చెప్పారు.  

ఈ సందర్భంగా కొన్ని మెయిల్స్‌ను ఆయన చదివి వినిపించారు. తెలంగాణ కోసం ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక బాగుందని కితాబిచ్చిన ఆయన అందులోని ఆరో చాప్టర్‌ను మాత్రం తప్పుపట్టారు. వెనుకబడిన ప్రాంతాలైన తెలంగాణ, రాయలసీమ నుంచే ఎక్కువమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారని, వారు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే అభివృద్ధి జరగలేదన్నారు. ఇరు ప్రాంతాల్లోనూ తనకు ఆత్మీయులున్నారని, ఒక రకంగా చెప్పాలంటే రెండు ప్రాంతాలకు తాను వారధిలాంటివాడినని చెప్పారు.  

దేశంలో ముంబైకి దీటుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడులు పెట్టాయని.. తర్వాత ప్రైవేటు రంగ సంస్థలు పెరిగి అభివృద్ధి జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎంతో కాలంగా సెంటిమెంట్ ఉంద న్నారు. ఇరు ప్రాంతాల్లోని తెలుగు వారికి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సంజయ్ బారు అభిప్రాయపడ్డారు. మరో అతిథి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అజయ్ సాహ్నీ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టులు పుంజుకుంటారని... ఆ ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపైనా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.  

రాష్ట్ర విభజనకు రాజకీయ కారణాలను మాత్రమే కాక అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజనలో రెండో ఎస్సార్సీని పరిగణనలోకి తీసుకోవాలని ప్రముఖ కాలమిస్టు అశోక్ మాలిక్ అన్నారు. రెప్యూటింగ్ యాన్ ఎజిటేషన్ పుస్తకంలో తెలంగాణ కోరుకునేవారు చెబుతున్న కారణాలతోపాటు, పలు అంశాలను పేర్కొన్నారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్, నలమోతు చక్రవర్తి, అడుసుమిల్లి జయప్రకాశ్, రచయిత సి.నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

పుక్కిట పట్టిన పసలేని వాదనలే అన్నీ!

సాక్షి వ్యాసం ( 23/01/2013): 

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు గురించి ఉద్యమ కారులు నొక్కి చెబుతున్న అంశాలు, చేస్తున్న ఆరోపణలు, తమకి సానుకూలమైనవిగా చెప్పుకుంటున్న అంశాలలోని వాస్తవాలను పరిశీలించడానికి విశాలాంధ్ర మహాసభ ప్రచు రించిన పుస్తకం ‘అసంగత ఉద్యమం: తెలం గాణ వేర్పాటువాదుల నూటొక్క అబద్ధాలు, అసంబద్ధ ఆరోపణలు’ (REFUTING AN AGITATION: 101 LIES & DUBIOUS ARGUMENTS OF TELANGANA SEPARATISTS). ఈ పుస్తకం ఉద్దేశం ఉపోద్ఘాతంలో వివరంగానే ఉంది. తెలంగాణ వేర్పాటువాదులు చేస్తున్న ఈ ఆరోపణలు, అంశాలు చిరకాలంగా ఎవ రూ పరిశీలించక పోవడంవల్ల తిరిగి ఎవరూ సవాలు చేయలేదని ఇందులో చెప్పారు. వారు చెబుతున్నవన్నీ నిజాలేనని వారైనా నమ్ము తున్నారా? లేకుంటే తమ ఉద్యమం మనుగడ కోసం వీటిని ప్రచారం చేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నదీ పుస్తకం. తాము చెబుతున్న అంశాలూ, చేస్తున్న వాదనలూ నిజమైనవేనని వారు మనసావాచా నమ్ముతూ ఉంటే ఈ పుస్తకం వాటికి తగిన సమాధానం ఇవ్వగల దని కూడా పేర్కొన్నారు. పుస్తకంలో నాలుగు విభాగాలున్నాయి. మొదటి భాగం చరిత్ర గురించి, రెండోది భాషా సంస్కృతులను గురించి, తరువాతి రెండు భాగాలు ఆర్థిక రాజ కీయాంశాల గురించి ఇలా వివరిస్తున్నాయి.

తమ వాదనలు వాస్తవమేనని తెలంగాణ వేర్పాటువాదులు పదేపదే నొక్కి చెబుతున్నా రు. ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురయిందనీ, దోపిడీకీ, అవమానాలకూ గురయిందని చెబు తున్నారు. ఇందులోని వాస్తవం ఏమిటో వెతికి పట్టుకునే సమయం, అవకాశం లేని వారికి ఈ పుస్తకం అసలు నిజాలు ఏవో వెల్లడించగలదు. అటు ఆంధ్ర ప్రాంతం గురించి, ఇటు తెలం గాణ గురించి అన్ని అంశాల పట్ల అవగాహన లేని కొన్ని పార్టీలు, చాలామంది రాజకీయ నాయకులు ఇది న్యాయబద్ధమైన ఉద్యమం అంటూ మద్దతు ఇస్తున్నారు.

తెలంగాణ నిర్లక్ష్యానికి గురయిందని, వెనుకబడిందని, దోపిడీకి గురయిందని ప్రత్యే క తెలంగాణ రాష్ట్రవాదులు మొదట వాదనలు ప్రారంభించారు. ఈ వాదనలను నల్లమోతు చక్రవర్తి My Telugu Roots అనే పుస్తకంలో బహు శా మొదటిసారి సవాలు చేశారు. ఈ రచనను తెలంగాణవాదులు ఎవరూ ఖండిచలేకపో యారు. పైగా అంతవరకు తమ ఉద్యమానికి పునాదిగా చేసుకున్న ఆర్థిక వెనుకబాటుతనం వాదన పూర్వపక్షం కావడంతో సహనం కోల్పో యారు. చక్రవర్తి మీద భౌతికంగా దాడి జరి గింది. శ్రీకృష్ణ కమిటీ కూడా ఆర్థిక వెనుక బాటుతనం వాదనను నిరాకరించింది. దీనితో ఆ వాదానికి ఊపిరిపోయింది. తరువాత నిరు ద్యోగ సమస్య, నీళ్ల వాటా దగ్గర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని... ఇలా వాదాలు వచ్చాయి. తరువాత ఇచ్చిన స్వయంపాలన నినాదం కూడా మన లాంటి ప్రజాస్వామిక దేశాలలో ఎంత అసంబద్ధమో వెల్లడైంది. విశా లాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాసిన ఈ ఉపోద్ఘాతం అలెగ్జాండర్ సోల్జ్‌నిత్సిన్ నోబెల్ పురస్కారం అందుకుంటున్నప్పుడు చెప్పిన మాటతో ముగించారు. అది- ‘వాస్తవాన్ని చెప్పే ఒక్క పదం ముందు కూడా ఈ విశాల విశ్వం తేలికై పోతుంది’.

చరిత్ర విభాగంలో ఖండనమండనలు

ఇందులో వేర్పాటువాదులు తరుచు ప్రస్తా వించే పదిహేను చారిత్రకాంశాలు, వాటికి విశా లాంధ్ర మహాసభ ఖండనలూ, వివరణలూ ఉన్నాయి. 2500 సంవత్సరాల తెలుగువారి చరిత్రలో తెలంగాణ 2200 సంవత్సరాల పాటు ప్రత్యేక ఉనికిని కలిగి ఉందంటూ ఉద్యమకారులు చేసే ప్రస్తావనను మహాసభ అసత్యమని పేర్కొన్నది. సమీప గతంతో సహా తెలుగువారంతా ఎప్పుడూ ఒకే రాజకీయ అధికారం కింద ఉన్నారని ఆయా చారిత్రక సందర్భాలను ప్రస్తావించారు. కొన్ని కొన్ని సమయాలలో వేర్వేరు రాజకీయ అధికార శిబి రాల కింద ఉన్నప్పటికీ తెలుగువారంతా భాషా సాంస్కృతిక ఐక్యతతోనే ఉన్నారని వివరించా రు. నిజాం కాలంలో ఉన్న మత సామరస్యం ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత భగ్నమైం దన్న వాదనను కూడా ఖండించారు. అప్పుడు ముస్లింలు 12 శాతమే అయినా సైనిక, పోలీసు వ్యవస్థలలో 90 శాతం వారికే ప్రాధాన్యం ఉండేదని దీనికి సమాధానం ఇచ్చారు. ఆం ధ్రతో తెలంగాణను విలీనం చేయడానికి నెహ్రూ బద్ధవ్యతిరేకి అంటూ వినిపించే వాదం లోను, విశాలాంధ్ర ఏర్పాటు విస్తరణవాద మేనని ప్రథమ ప్రధాని వ్యాఖ్యానించార నడంలోను ఎంత మాత్రం నిజంలేదని వీరు పేర్కొన్నారు. ‘దేశ శ్రేయస్సు దృష్ట్యా విశా లాంధ్ర ఏర్పరచాలని నిర్ణయించాం’ అన్న పతాక శీర్షికతో ఉన్న ‘ఆంధ్రపత్రిక’ క్లిప్పింగ్‌ను కూడా ఇచ్చారు. నెహ్రూ ‘ఏరిన రచనలు’ నుం చి నిజామాబాద్ బహిరంగ సభ ప్రసంగం ఉదహరించారు. ఈ రెండు ప్రాంతాలను కల పడం అంటే ‘ఒక అమాయక వధువుకూ, తెం పరి వరుడికీ పెళ్లి చేయడమే అంటూ నెహ్రూ చెప్పారంటూ తెలంగాణ వాదులు చేసే వాద నను కూడా ‘విశాలాంధ్ర’ పత్రిక క్లిప్పింగ్ సాయంతో ఖండించారు.

భాషా సంస్కృతులు
ఆంధ్ర, తెలంగాణ ప్రజలు వేర్వేరంటూ, ఆం ధ్ర అన్నపదం ఇటీవల తెలంగాణ అన్న పదానికి వ్యతిరేకార్థంగా ఉపయోగించడం లోని అసంబద్ధతను మొదటిగా ఖండించడం కనిపిస్తుంది. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి స్వయంగా ‘ఆంధ్రుల చరిత్ర సం స్కృతి’ అన్న పుస్తకం రాశారని గుర్తు చేశారు. ‘రెండున్నర జిల్లాల భాష’, కోస్తా వారి తెలు గును తమ మీద రుద్దారన్న ఆరోపణ, ప్రతి తెలంగాణ ప్రాంతీయుడు ఉర్దూ మాట్లా డతా డన్న వాదనను, తెలుగు భాషాభివృద్ధికి నిజాం అవకాశం కల్పించినట్టు చెప్పే మాటను మహా సభ తిరస్కరించింది.

ఆర్థిక వ్యవహారాలు

ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు నిజాం కాలంలో తెలంగాణ ఎంతో సంపద్వంతంగా ఉండేదన్న వాదనతో విశాలాంధ్ర మహాసభ ఏకీభవించలేదు. ఇందుకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా 25 శాతం నుంచి 300 శాతం పన్ను విధించేవారని రావి నారా యణరెడ్డిగారి ‘వీరతెలంగాణ’ పుస్తకం నుంచి ఉదాహరణ చూపించారు. 610 జీవో ఉల్లంఘన ఆరోపణ, ఉద్యోగాల రిజర్వేషన్లలో అన్యాయాలు జరిగాయంటూ గిర్‌గ్లానీ కమి షన్ సిఫారసు చేసిందన్న ఆరోపణను మహా సభ వ్యతిరేకించింది. ఆంధ్రప్రదేశ్ హయాంలో తెలంగాణలో విద్య వెనుకబడిందన్న ఆరో పణ, రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ యాభై శాతం ఇస్తున్నా, అది తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్న వాదనను ఈ పుస్తకం తిరస్కరించింది. 1956కు ముందు చాలా పరి శ్రమలు ఉన్నప్పటికీ, రాష్ట్రావతరణ తరువాత అవి మూతపడ్డాయన్న వాదనను మహాసభ తిరస్కరించింది.

రాజకీయ వ్యాఖ్యలు

పెద్దమనుషుల ఒప్పందం చట్టబద్ధమైన ఒప్పందంకాదని, అధికార పంపిణీకి చెందిన ఒడంబడిక అని ఇందులో పేర్కొన్నారు. 1969 నాటి ఉద్యమంలో 350 మంది చనిపోయారం టూ పదే పదే తెలంగాణ నాయకులు చెప్పడం పచ్చి అబద్ధమని ఇందులో తెలిపారు. డిసెం బర్ 9 ప్రకటన తరువాత చిదంబరం చేసిన ప్రకటన వల్ల యువకుల ఆత్మహత్యలు పెరిగా యని ఆరోపించింది. నాలుగున్నర కోట్ల తెలం గాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారన్న నాయకుల వ్యాఖ్యలను, సమైక్య ఆంధ్రకు మద్దతు లేదన్న మాటను కూడా ఈ పుస్తకం తప్పు పట్టింది. నిజాం, అప్పటి భూస్వామిక వ్యవస్థ మూలంగానే ప్రజలు దారుణమైన దోపిడీకి గురైనారని చాలా చరిత్ర పుస్తకాలు, సృజనాత్మక రచనలు పేర్కొంటున్నాయని, చివరిగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు దోపిడీదారులు అన్న ఆరోపణకు సమాధా నంగా మహాసభ పేర్కొన్నది. 

శనివారం 19 జనవరి 2013

Refuting an Agitation – Invitation to Book Release

Dear Friends,

Visalandhra Mahasabha is launching a new book titled: Refuting an Agitation- 101 Lies and Dubious Arguments of Telangana Separatists. Please view the invitation attached to this post.

The event is going to be held at the Constitutional Club in New Delhi on 23rd Jan 2013 at 2:30 PM. Prominent journalists from many national media houses are going to participate. The book will be released by Sri Sanjay Baru. Others speakers include Ashok Malik, Ajai Sahni and Kuldip Nayar. Many political leaders from our State are also going to be present at the event.

I am looking forward to seeing you all.

Regards,
Nalamotu Chakravarthy




గురువారం 27 డిసెంబర్ 2012

అఖిలంలో సమైక్యవాదం వినిపించండి-'విశాలాంధ్ర మహాసభ' రాయబారం


సాక్షి :    

బొత్సతో పరకాల ప్రభాకర్ భేటి!

హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని బొత్సకు పరకాల వినతిపత్రం సమర్పించారు. అన్ని పార్టీల అధ్యక్షులను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్ వైఖరి ఉండాలని బొత్సను కోరామని.. అందుకు స్పందించిన బొత్స తమ అభిప్రాయాలను హైకమాండ్‌కు నివేదిస్తామని హామీ ఇచ్చారని పరకాల వెల్లడించారు.


సూర్య:   


అఖిలంలో సమైక్యవాదం వినిపించండి

హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో సమైక్యవాదానికి అనుకూలంగా వాదనను వినిపించాలని పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణకు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు బుధవారం గాంధీభవన్‌లో పిసిసి ఛీప్‌కు ఓ వినతిపత్రం అందజే శారు. ఈ సందర్బంగా విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ విశాలాంధ్రతోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సమైక్యవాదన వినిపించాలని ఇతర రాజకీయ పార్టీలను కలసి కోరుతామన్నారు. టిఆర్‌ఎస్‌ను కోరుతారా అని అడగ్గా సమయం కేటాయిస్తే ఆ పార్టీ నేత హరీష్‌రావును కలసి విజ్ఞప్తిచేస్తామని ప్రభాకర్‌ పేర్కొన్నారు.


ఆంధ్ర భూమి:


‘సమైక్య’గళం వినిపించండి

హైదరాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని విశాలాంధ్ర మహాసభ నాయకులు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కోరారు. విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ పరకాల ప్రభాకర్ నేతృత్వంలో పలువురు ప్రతినిధులు బుధవారం గాంధీభవన్‌లో బొత్సను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రభాకర్ మీడియాతో రాష్ట్రాన్ని ముక్కలు చేయరాదనే అభిప్రాయాన్ని అఖిలపక్షం ముందు వెల్లడించాలని బొత్సను కోరినట్లు చెప్పారు. మీరు, మీ పార్టీ, తెలుగు జాతి ఐక్యతను, రాష్ట్ర సమగ్రతను కాపాడాలని రాష్ట్ర ప్రజలు కాంక్షిస్తున్నారని బొత్సకు చెప్పామని ఆయన తెలిపారు. బ్రిటీష్ పాలనలో, నిజాం పాలనలో తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉన్నారని, అనేక మంది నాయకుల త్యాగాల ఫలితంగా 1956 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. ఇలా అన్ని పార్టీల అధ్యక్షులను, ఇతర ముఖ్య నాయకులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు పరకాల తెలిపారు. టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావునూ కలిసి వినతి పత్రం ఇస్తారా? అని ప్రశ్నించగా, కెసిఆర్ అప్పాయింట్‌మెంట్ ఇస్తే తప్పకుండా కలుస్తామని ఆయన సమాధానమిచ్చారు.


ఆంధ్రప్రభ: 


బొత్సతో 'విశాలాంధ్ర' నేతల భేటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను బుధవారం గాంధీవభన్‌లో విశాలాంధ్ర మహాసభ నాయకులు కలిశారు. ఈ నెల 28వ తేదీన కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో సమైక్యవాదాన్ని పార్టీ పరంగా మరింత గట్టిగా వినిపించాలని పేర్కొంటూ మహాసభ ప్రతినిధులు ఆయనకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రా న్ని ముక్కలు చేయవద్దని మెజార్టీ ప్రజ లు కోరుకుంటున్నారని తెలిపారు. తెలు గు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని ప్ర జల గాఢమైన ఆకాంక్ష అని వినతి పత్రంలో మహసభ నాయకులు పేర్కొన్నారు. బ్రిటిష్‌ పాలనతో పాటు నిజాం పాలనలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఒక్కటవ్వాలని దశాబ్దాలుగా జరగిన ఉద్యమాల వల్లే 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిందని అందులో పేర్కొన్నారు. అప్పటి పోరాట ఫలితం కారణంగానే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించి ఇతర భాషా సమూహాలకు ఆదర్శంగా నిలిచామని తెలిపారు.


అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో విశాలాంధ్ర మహాసభ కన్వీనర్‌ పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ, సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలను కలిసి అఖిలపక్ష సమావేశంలో ఇదే అభిప్రాయన్ని వినిపించాలని కోరనున్నామని తెలిపారు. టిఆర్‌ఎస్‌ను కలిసి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఖచ్చితంగా వారిని కూడా కలిసి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు అధికార కాంక్షతోనే రాష్ట్ర సమైఖ్యతకు ముప్పువాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.
 

రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలని ప్ర భుత్వ విప్‌ జగ్గారెడ్డి ఇటీవల చేసిన ప్రకటనపై విశాలాంధ్ర మహసభ నాయకు లు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన ఈ మేరకు పార్టీ అధిష్టానవర్గానికి లేఖ రాయనున్నట్లు స్పష్టం చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.

ప్రజాశక్తి: 

 
బొత్సను కలిసిన పరకాల ప్రభాకర్‌ బృందం


రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ విశాలాంధ్ర మహాసభ కన్వీనర్‌ పరకాల ప్రభాకర్‌ నేతృత్వంలో బొత్స సత్యనారాయణు కలుసుకున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం చేయకుండా చూడాలని వినతిపత్రం అందించారు.


 కొమ్మినేని.ఇన్ఫో : 

విశాలాంధ్ర మహాసభ రాయబారం  

 ఒకపక్క తెలంగాణవాదులుకానివ్వండి, తెలంగాణ.జెఎసి నేతలు, ప్రజాసంఘాల నేతలు కాని విస్తారంగా తెలంగాణవాదానికి అనుకూలంగా అభిప్రాయానికి కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే, సమైక్య వాదాన్ని ఆ స్థాయిలో కాకపోయినా, ప్రాతినిద్యంగానైనా వినిపించడానికి విశాలాంధ్ర మహాసభ నడుం కట్టింది.ఈ మహాసభ నేత పరకాల ప్రభాకర్ పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవలసిన అవసరం గురించి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా అన్ని పార్టీల నేతలను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నామని చెప్పారు.దీనిపై తమ అధిష్టానానికి తెలియచేస్తానని బొత్స చెప్పినట్లు పరకాల చెప్పారు. ఆ తర్వాత టిడిపి నేత యనమల రామకృష్ణుడును కూడా కలుసుకుంటున్నట్లు ఈ నెతలు చెప్పారు.ఈ రెండు రోజులు ఇరుప్రాంతాల వాదనలు వినిపించడానికి ఎవరికి వారు పోటీపడడం సహజమే.అందులో భాగంగా విశాలాంధ్ర మహాసభ కూడా రాయబారం జరుపుతోందనుకోవాలి.

TV9 'వారధి' కార్యక్రమంలో నలమోతు చక్రవర్తి (26.12.2012)

వీడియో లంకెలు

మొదటి  భాగం : http://www.youtube.com/watch?v=1tq0ErqlvGU
రెండవ భాగం    : http://www.youtube.com/watch?v=2bsrx-vf0Uo
మూడవ భాగం : http://www.youtube.com/watch?v=OUIXS7aBGS0

సోమవారం 8 అక్టోబర్ 2012

సమైక్యమే లక్ష్యం - కర్నూలు 'విశాలాంధ్ర మహాసభ' లో వక్తలు

ఆంధ్రజ్యోతి :  ఆంధ్ర ప్రదేశ్ సమైక్యంగా ఉండాలన్న దే విశాలాంధ్ర మహా సభ లక్ష్యమని సీనియర్ జర్నలిస్టు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళా క్షేత్రంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విజభన జరగటానికి వీలు లేదని, అన్ని ప్రాంతాల ప్ర జలు కోరుకుంటున్నారని అన్నారు. తె లంగాణ ఉద్యమకారులు కొన్ని కారణాలు చూపి ప్రత్యేక తెలంగాణ కా వాలని కోరుకుంటున్నారన్నారు. తె లంగాణ వాదులు ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలు మానుకోవాలని హిత వు పలికారు. కలిసి ఉంటే జరిగే అభివృద్ధిని గురించి వివరిస్తామని చెప్పా రు.

వెనుకబాటు తనం అన్ని ప్రాంతాలలో ఉందని, కొన్ని జిల్లాలు అభివృ ద్ధి చెందినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టు కాదని తెలిపా రు. దూషణలతో, దుర్మార్గాలతో ప్ర త్యేక తెలంగాణ రాదని, కలిసి ఉండాలనే కోరిక రాయలసీమ, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉందని అన్నారు. మొదటి సారిగా ఢిల్లీలో నిర్వహించిన విశాలాంధ్ర మహా సభకు కులదీప్ నయ్యర్, సంజయ్ బారు, కేపీఎస్ గి ల్ వంటివారు హాజరయ్యారన్నారు. ఈ సదస్సులు అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ విడిపోవడానికి పది కారణాలు చెబితే సమైక్యంగా ఉండడానికి వెయ్యి కారణాలు చెబుతామ న్నారు.

ప్రజలకు వాస్తవాలు తెలియజేయటానికి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.


ప్రాంతీయ అసమానతలు తొలగించాలి

ఆంధ్ర భూమి :  రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలను తొలగించి సమగ్రతను కాపాడాలని మంత్రి టీజీ వెంకటేష్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణవాదులు చెప్పే ప్రతిమాట అవాస్తవమేనని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంగా ఇవ్వాలని వారు ఒక్క కారణం చెబితే సమైక్యంగా ఉంచడానికి తాము లక్ష కారణాలు చెబుతామన్నారు. అబద్దాలు చెబుతూ, అభివృద్ధిని దాచిపెడుతూ వెనుకబాటుతనం పేరుతో ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారన్నారు. సమైక్యవాదులు చూపిన లెక్కల్లో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో వెల్లడైందన్నారు. ఆ తరువాత సెంటిమెంటు పేరుతో ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే వారు ఉద్యమం చేపట్టారని మండిపడ్డారు. రాయలసీమ వాసుల త్యాగంవల్లే నాడు రాజధానిని హైదరాబాదుకు తరలించారన్నారు. ఆరోజే తాము అడ్డుకునే ఉంటే అది జరిగేది కాదేమోనని అభిప్రాయపడ్డారు. అయితే తెలుగువారంతా కలిసి ఉండేందుకు తమ పెద్దలు అడ్డు చెప్పలేదని పేర్కొన్నారు. విశాలాంధ్ర మహాసభ నాయకుడు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వాదాన్ని బూచిగాచూపి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తెలంగాణ చేరుకున్న తరువాత ఇప్పుడు పదవుల కోసం ప్రత్యేక వాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సూచించారు. రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాన్ని వివరించేందుకే కర్నూలులో సభ నిర్వహించామన్నారు. ఇందులో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అభివృద్ధికి సంబంధించిన చిత్రాలు, ఇతర వివరాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. తెలంగాణవాదులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఢిల్లీలో నిర్వహించిన ఫోటోలు, వివరాలతో కూడి ఎగ్జిబిషన్ ద్వారా తిప్పికొట్టగలిగామని పేర్కొన్నారు. పాత్రికేయులు సి.నరసింహారావు మాట్లాడుతూ తెలుగుమాట్లాడే వారంతా ఒక్కటిగా ఉండాలన్న ఉద్ధేశ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందని గుర్తుచేశారు. ఇపుడు కొందరు నాయకులు తమకు అవసరమైన పదవుల కోసం తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.


రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం

సాక్షి : రాష్ట్ర సమైక్యతను కాపాడుదామని విశాలాంధ్ర మహాసభ నాయకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సీ క్యాంప్‌లోని టీజీవీ కళాక్షేత్రంలో విశాలాంధ్ర మహా సభ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. మంత్రి టీజీ వెంకటేష్ దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. సమైక్యతను కాపాడేందుకు విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేశామన్నారు. ఈ సభ ద్వారా వాస్తవ అభివృద్ధిని అన్ని ప్రాంతాల ప్రజలకు వివరిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రాంతం కంటే రాయలసీమ రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎంతో వెనుకబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణవాదులు పది కారణాలు చెబితే, సమైక్యంగా ఉండేందుకు వంద కారణాలు చూపిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

అధికారం కోసమే ప్రత్యేక వాదం

రాయలసీమ వెనుకబాటు తనాన్ని వాస్తవ రూపంగా లెక్కల్లో చూపించిన విశాలాంధ్ర మహాసభను అభినందిస్తున్నామని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్రంలో అధికారం కోసమే కొంత మంది ప్రత్యేక వాదం పేరుతో ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధానిని తరలించకుంటే కర్నూలు లక్ష కోట్ల అభివృద్ధిని సాధించేదన్నారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక నాయకునిగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నానన్నారు. సీమలో అన్ని వనరులు సమృద్ధిగా ఉన్నాయని, అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అన్ని వర్గాల వారు సహకరిస్తే ఇక్కడి నుంచి 10 వేల మెగా వాట్ల పవన విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చన్నారు. అంతకుముందు పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నరసింహరావు, శ్రీనివాసరెడ్డి, బివి.రెడ్డి, కుమార్ చౌదరి, రవితేజ, వెంకటేశ్వర్లు, లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు.