4, సెప్టెంబర్ 2013, బుధవారం

సమైక్యాంధ్ర ఉద్యమకారులారా రాజకీయనాయకులతో జాగ్రత్త!

కోస్తా, రాయలసీమ ప్రజలు గత నెల రోజులుగా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమించారు. ప్రజలలో వచ్చిన ఈ అనూహ్య చైతన్యాన్ని గమనించిన రాజకీయ పార్టీలు ఈ ప్రాంతాలలో తమ అస్తిత్వాన్ని కోల్పాతామేమో అనే భయంతో, యాత్రల పర్వం మొదలు పెట్టాయి. ఈ నేపధ్యంలో వచ్చినవే చంద్రబాబు చేస్తున్న ఆత్మ గౌరవ యాత్ర, షర్మిల సమైక్య శంఖారావం.

వై.కా.పా.నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని విభజించినా పర్వాలేదు, సమ న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. అదే పార్టీ ఈ రోజు సమైక్యవాదం వినిపిస్తున్నది. తెలుగు దేశం పార్టీ ఇప్పటికీ రాష్ట్ర విభజనకే కట్టుబడి ఉన్నది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన పై తన అభిప్రాయాన్ని మార్చుకుని, కేంద్రానికి మళ్ళీ లేఖ రాసి ఆత్మగౌరవ యాత్ర చేపట్టాలని మహాసభ కోరుతోంది.

మన రాష్ట్రంలో విభజన పోకడలకు మూల కారణం రాజకీయ పార్టీలు. తమ వోట్ల రాజకీయాలకు తెలుగు జాతి ఐక్యతను తాకట్టు పెట్టిన ఈ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాల్సిందిగా విశాలాంధ్ర మహాసభ విజ్ఞప్తి చేస్తోంది. ఓట్లకోసం , సీట్ల కోసం నాడు రాష్ట్ర విభజనకు అంగీకరించి తప్పు చేసామని పార్టీలు బహిరంగంగా ప్రకటించాలని మహాసభ డిమాండ్ చేస్తోంది. ఎటు గాలి వీస్తే అటు తిరిగే గాలివాటం రాజకీయాలను మానుకోవాలని మహాసభ పిలుపునిస్తున్నది. 

రాజకీయ పార్టీలు చేస్తున్న యాత్రలను చూసి ప్రజలు మోసపోవద్దని విశాలాంధ్ర మహాసభ కోరుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఒక శాంతియుత ధర్మ యుద్ధం. ఈ ప్రజా ఉద్యమం రాజకీయాలకి అతీతంగా జరుగుతోంది. తెలుగు జాతిని మోసం చేసిన రాజకీయ పార్టీలకి ఈ ఉద్యమ నాయకత్వాన్ని అప్పచెబితే మనకు మళ్ళీ వెన్నుపోటు పొడుస్తారు. కాబట్టి రాజకీయ నాయకుల యాత్రల పరంపర నేపధ్యంలో, సమైక్యవాద ఉద్యమకారులు అందరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విశాలాంధ్ర మహాసభ విజ్ఞ్యప్తి చేస్తోంది.

నలమోతుచక్రవర్తి                                                                                    పరకాలప్రభాకర్    
అధ్యక్షులు                                                                                             ప్రధానకార్యదర్శి 

4 కామెంట్‌లు:

  1. ఆంద్ర ప్రజలారా, మూడేసి పార్టీలు మారిన రాజకీయుల నిరుద్యోగులతో జాగ్రత్త!

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. Both of them have a job, atleast till the next election. In any case, Andhras are already careful about them and don't need me to warn them.

      తొలగించండి
  3. కేంద్రం తెలంగాణా ప్రక్రియను వేగవంతం చేసి ౨౧౫ రోజులనుంచి ౧౨౫ రోజులకు కుదించి పలమేంట్ శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టే దిశగా పావులు కదుపుతున్నది!కనుక ఈ అనిశ్చితికి తెరపడి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడబోతున్నది!చివరికి తప్పక న్యాయం,ధర్మం జయించితీరుతాయి!

    రిప్లయితొలగించండి