28, జూన్ 2012, గురువారం

సమైక్యవాది కీ.శే. పి.వి.నరసింహారావు 91వ జయంతి సందర్భంగా 'విశాలాంధ్ర మహాసభ' శ్రద్ధాంజలి



 'విశాలాంధ్ర మహాసభ' ఈ నెల 28వ తేదీన కీ.శే. పి.వి.నరసింహారావు 91వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలతో  శ్రద్ధాంజలి ఘటించింది.ప్రముఖ రాజనీతిజ్ఞుడు, బహు  భాషా కోవిదుడు,  దక్షిణాది రాష్ట్రాల నుండి ఎన్నికైన తొలి భారత ప్రధాని, గొప్ప సంస్కరణ అభిలాషి కీ.శే. పి.వి.నరసింహారావుకు 'విశాలాంధ్ర మహాసభ' నేతలు పరకాల ప్రభాకర్, సి. ఆంజనేయరెడ్డి,ఐపీఎస్(రిటైర్డ్), నలమోతు చక్రవర్తి, వి.లక్ష్మణరెడ్డి,కుమార్ యాదవ్ చౌదరి,సుంకర వెంకటేశ్వరరావు,కె .శ్రీనివాసరెడ్డి తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా 'విశాలాంధ్ర మహాసభ' నేత పరకాల ప్రభాకర్ ప్రసంగిస్తూ పి.వి.నరసింహారావు సమైక్యవాదియని, రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వారు కృషి చేసారన్నారు. 1969, 1972లో జరిగిన వేర్పాటువాద ఉద్యమాలను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ ను ఐక్యంగా నిలబెట్టిన ప్రముఖ రాజనీతిజ్ఞుడు  పి.వి.నరసింహారావు అని కొనియాడారు.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పి.వి స్వాగతించారని, రాష్ట్రాల విభజన సమస్యను అఖిల భారత స్థాయిలో జాతీయ దృష్టితో పరిశీలించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని భావించేవారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనవాదులు పి.వి.నరసింహారావు మాటలను గుర్తు చేసుకొని విజ్ఞతతో వ్యవహరించాలని, రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడాలని పరకాల ప్రభాకర్ విజ్ఞప్తి చేసారు


నలమోతు చక్రవర్తి,

1 కామెంట్‌: