3, జులై 2012, మంగళవారం

సమైక్యంలోనే సమృద్ధి

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ (16/12/2010): అన్నం ఉడికిందో లేదో తెలియడానికి అంతా పట్టుకోనక్కరలేదు. అదే విధంగా ఆంధ్ర- తెలంగాణలు ఏ విషయంలో వెనుకబడ్డాయో, ఏ అంశంలో ముందంజ వేస్తున్నాయో తెలుసుకొనేందుకు అన్ని రంగాలనూ పరిశీలించనవసరం లేదు. ఆ అన్నాన్నే పట్ట్టుకొని చూసినా తేలిగ్గా అర్థమైపోతుంది. అభివృద్ధి గణాంకాల ను పరిశీలిస్తే గత మూడు దశాబ్దాలలో వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ, బియ్యం మిల్లింగ్ వంటి అంశాలలో సీమాంధ్ర కంటే తెలంగాణలోనే ఎంతో మెరుగైన పరిస్థితులున్నాయని విశదమవుతుంది.

రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని 2010-11 సంవత్సరానికి గాను 210 లక్షల టన్నులుగా నిర్ణయించారు. దీనిలో వరి ఉత్పత్తి 148.85 లక్షల టన్నులు. తాజా అంచనా ప్రకారం వరి ఉత్పత్తి లక్ష్యం కంటే ఎక్కువ ఉండే సూచనలే కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉత్పత్తిలో 40 శాతం దాకా తెలంగాణ నుంచి లభించడమే. వరి ధాన్యం ఒక నిత్యావసర వస్తువు మాత్రమే కాదు; వరి అనాది నుంచి మన సంస్కృతిలో ఒక భాగం.

దక్షిణాది ధాన్యాగారంగా మన రాష్ట్రం ప్రసిద్ధి కెక్కింది. పంటలను మన రైతులు 'సస్యలక్ష్మి'గా ఒక ఆరాధాన భావంతో కొలుస్తుంటారు. బియ్యం (అక్షింతలు) లేకుండా ఏ శుభ కార్యమూ జరగదన్నది అందరికీ తెలిసిందే. అటువంటి బియ్యం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముందు ఆంధ్ర ప్రాంతంలో అధికంగా ఉన్నా, తర్వాత ఆ ఘనత ను తెలంగాణ ప్రాంతం దక్కించుకుంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అందుకు ప్రధాన కారణం-తెలంగాణ ప్రాంతంలో నీటి పారుదల అభివృద్ధికి, తద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వృద్ధికి ప్రభుత్వాలు నిర్విరామ కృషి చేయడమే.

ఆంధ్ర ప్రాంతం వలస పాలనలో ఉన్న సమయంలో గోదావరి డెల్టాలో డ్యామ్‌లు, రోడ్ల నిర్మాణం విరివిగా చేపట్టడంతో రవాణా, ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగానే పెరిగాయన్నది వాస్తవ మే. 1858లో ధవళేశ్వరం, 1908లో కృష్ణా బ్యారేజ్‌ల నిర్మాణాల వల్ల ఆంధ్ర ప్రాంతం సస్యశ్యామలమైంది. 1923లో నిర్మించి నిజాంసాగర్ డ్యామ్ మినహా తెలంగాణలో నాడు సరైన నీటిపారుదల సౌకర్యాలే లేవు.

హైదరాబాద్ రాష్ట్రంలో అప్పట్లో సాగునీటి పారుదల ప్రాంతం 5.1 శాతం మాత్రమే ఉండగా, ఆంధ్ర ప్రాంతం లో 30.3 శాతం ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం విద్యు త్ వినియోగంతో సమైక్య రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో మొత్తం వరి ఉత్పత్తిలో తెలంగాణ వాటా 18 శాతం మాత్రమే.

అంటే అప్ప ట్లో 5,46,317 టన్నుల వరి ధాన్యం మాత్రమే ఉత్పత్తి అయ్యేది. తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా ఈ ఉత్పత్తి 2008-09 నాటికి 53,60,547 టన్నులకు అంటే 881 శాతం పెరిగింది. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిం దో చెప్పడానికి నిజానికి ఈ ఉదాహరణ చాలు.

తెలంగాణలో కరీంనగర్, నల్లగొండ జిల్లాలు వరి ఉత్పత్తిలో ముందంజ వేస్తున్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల మధ్య ఉత్పత్తిలో అసమానతలకు కారణం నీటి పారుదల సౌకర్యంలో లోపమే. ఆంధ్ర ప్రాంతం వారు నదీ జలాలను తెలంగాణకు దక్కకుండా దోపిడీ చేస్తున్నారంటూ తెలంగాణవాదులు తరచుగా ఆరోపిస్తుంటారు. ఈ ఆరోపణలో ఎంత మాత్రం వాస్తవం లేదు. 2008-09లో కరీంనగర్ జిల్లాలో 11,75,996 టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా ఆదిలాబాద్ జిల్లాలో 1,98,382 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది.

గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆదిలాబాద్ ఎగువున ఉండగా కరీంనగర్ దిగువున ఉంది. ఎక్కడైనా సరే నది దిగువ ప్రాంతంలోని వారికే తగినంత ప్రయోజనం కలుగుతుంది. కరీంనగర్‌లో ఉత్పత్తి ఎక్కువగా ఉన్నంత మాత్రాన అక్కడివారు ఆదిలాబాద్ నీటిని దోపిడీ చేస్తున్నారని అనగలమా? అలా కానప్పు డు దిగువున ఉన్న ఆంధ్ర ప్రాంతం వారు మాత్రం నదీజలాలను దోపిడీ చేస్తున్నారని అనడంలో ఔచిత్యం ఏముంది?

1956 నుంచి వరి ఉత్పత్తి గణాంకాలను పరిశీలిస్తే వాస్తవ అభివృద్ధి ఎక్కడ జరిగిందో విశదమవుతుంది. 1955-56లో కోస్తాంధ్ర లో వరి ఉత్పత్తి 21,61,560 టన్నులు కాగా రాయలసీమలో 3,41,620 టన్నులుగా ఉంది. అదే సమయంలో తెలంగాణలో 5,46,317 టన్నులు వరి మాత్రమే ఉత్పత్తయింది. 2008-09 నాటి కి ఈ ఉత్పత్తి కోస్తాంధ్రలో 80,65,910 టన్నులకు పెరగగా, రాయలసీమలో 8,14, 676 టన్నులకు పెరిగింది.

అదే సమయంలో తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి 53,60,547 టన్నులకు పెరిగిం ది. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే-వరి ఉత్పత్తి తెలంగాణలో 18 శాతం నుంచి 881 శాతానికి పెరిగిందని. ఈ పెరుగుదలకు వరి పండించే విస్తీర్ణం పెరగడం ప్రధాన కారణం. ఆ విస్తీర్ణం పెరగడానికి నీటి పారుదల సౌకర్యాలు విస్తరించడం అసలు కారణం.

అదే విధంగా వరి ధాన్యం సేకరణ కూడా తెలంగాణలో గణనీయంగా పెరిగింది. వివిధ ప్రభుత్వ సంస్థలు 2008-09లో తెలంగాణ ప్రాంతంలో చేసిన వరి సేకరణ 33,06,139 టన్నులుగా ఉంది. అంటే రాష్ట్రంలోని మొత్తం సేకరణ కంటే ఇది 40 శాతం ఎక్కువ. 2000-01లో కోస్తాంధ్రలో 53.7 శాతం వరి ధాన్య సేకరణ జరగగా, 2006-07 నాటికి అది 52.7 శాతానికి తగ్గింది. కాని అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో సేకరణ 44.9 శాతం నుంచి 46.5 శాతానికి పెరగడం గమనార్హం.

తెలంగాణలో వరి ఉత్పత్తే గాక మొత్తం ఆహార ధాన్యాల ఉత్ప త్తి కూడా గత మూడు దశాబ్దాలుగా గణనీయంగా పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే తమిళనాడులో ఆహార ధాన్యాల ఉత్పత్తి కం టే తెలంగాణలోనే ఎక్కువగా ఉంది. పొరుగున ఉన్న తమిళనాట జనాభా దాదాపు ఏడు కోట్లు కాగా తెలంగాణ జనాభా దానిలో సగం మాత్రమే. అయినా ఆహార ధాన్యాల ఉత్పత్తి తెలంగాణలోనే ఎక్కువ.

ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 42 శాతం, జనాభాలో 40 శాతం ఉన్న తెలంగాణలో 2008-09లో ఆహార ధాన్యాల దిగుబడి రాష్ట్ర ఉత్పత్తిలో 40.4 శాతం ఉంది. అంటే విస్తీర్ణం, జనాభా శాతాలకు దాదాపు సమానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా తెలంగాణ లో జరుగుతున్నదన్న మాట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ శాతం 1956లో 24.9 కాగా 2009 నాటికి 40.4కు పెరగడం. అంటే సమైక్యరాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కోస్తా, రాయ ల సీమల కంటే తెలంగాణలోనే ఆహారధాన్యాల ఉత్పత్తి, సాగునీటి విస్తీర్ణం బాగా పెరిగాయన్న మాట.

దేశంలో మొత్తం ఉత్పత్తయ్యే బియ్యంలో మన రాష్ట్రం వాటా 13 శాతం ఉంది. మొత్తం వరిసాగు చేసే విస్తీర్ణంలో 9 శాతమే మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఉత్పత్తి మాత్రం అంతకుమించి అధికం గా ఉంది. గత దశాబ్ద కాలంలో మన రాష్ట్రంలో వరి పండించే విస్తీ ర్ణం 21.61 లక్షల హెక్టార్లలో పెరగగా అందులో అధిక శాతం తెలంగాణ ప్రాంతానిదే కావడం గమనించవల్సిన విషయం.

1955-56లో మొత్తం సాగు నీటి ప్రాంతం సీమాంధ్రలో 33.3 శాతం కాగా తెలంగాణలో 17.9 శాతం మాత్రమే ఉండేది. కాని 2007-08 నాటికి ఈ విస్తీర్ణం సీమాంధ్రలో 42.7 శాతానికి, తెలంగాణలో 43.1 శాతానికి పెరిగింది. అంటే ఆ కాలానికి వృద్ధి శాతం సీమాంధ్రలో 40.8 శాతం కాగా తెలంగాణలో 140.8 శాతం ఉంది. వరి పంట విస్తీర్ణం కూడా 1955-56లో సీమాంధ్రలో 47.88 లక్షల ఎకరాలు కాగా తెలంగాణలో 19.39 లక్షల ఎకరాలు మాత్రమే ఉండేది.

అది 2005-06 నాటికి సీమాంధ్రలో 63.01 లక్షల ఎకరాలకు పెరగగా తెలంగాణలో 36.52 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే ఆ కాలానికి వరి పంట విస్తీర్ణంలో ఇలా రెట్టింపు పైగా వృద్ధి కనిపిస్తే వరి ఉత్పత్తిలో తెలంగాణ ప్రాంతంలో అనేక రెట్లు వృద్ధి కనిపిస్తోంది. అందుకే గత మూడు దశాబ్దాలలో సీమాంధ్ర కంటే తెలంగాణ నుంచే బియ్యం ఎగుమతులు కూడా అధికంగా జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత వివిధ ప్రభుత్వాలు తెలంగాణ లో నీటి పారుదలకు చేసిన వ్యయం 46 శాతం ఉండగా, ఆంధ్రలో 25 శాతం, రాయలసీమలో 25 శాతం వ్యయం జరిగింది. 'కాగ్' నివేదికల ప్రకారం చూస్తే 1956-2009 డిసెంబర్ మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టులపై మొత్తం 64, 861.72 కోట్ల వ్యయం చేయగా ఇందులో 29,701.03 కోట్లు తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు చేశారు. ముఖ్యంగా 2004-10 మధ్య నీటి పారుదల ప్రాజెక్టులకు మొత్తం 49,912.40 కోట్లు ఖర్చుకాగా దానిలో 23,221.75 కోట్లు అంటే తెలంగాణ ప్రాజెక్టులకు 48 శాతం ఖర్చు చేశారు.

ఏ విధంగా చూసినా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం ఎక్కువగా ప్రయోజనం పొందింది తెలంగాణ ప్రాంతమే. ముఖ్యంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో అప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ ఆదర్శవంతమైన బాటలో పయనిస్తోంది. ఇందుకు ప్రధాన కార ణం ఇప్పటి దాకా వచ్చిన అన్ని ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడమే.

-అడుసుమిల్లి జయప్రకాశ్
మాజీ శాసనసభ్యులు

23 కామెంట్‌లు:

  1. ఇక చాలు బాబో చాలు !
    మీ అభివృద్ధిని తగలెయ్య !!.
    మీ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకోకుండా
    మా ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకే మీరు
    తెలంగాణాకు విచ్చేసితిరని మేము గ్రహించితిమి !!!
    ఇక దయచేసి
    మీ ప్రాతానికి వెళ్లి మీ ప్రాంత అభివృద్ది పై దృష్టి సారించుడి ...!
    ఈ లత్తకోరు
    సమైక్య వాదాన్ని ఇంతటితో వదలుది .
    జై తెలంగాణా జై ఆంద్ర జై రాయల సీమ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీలాంటి అలాగా జనం కోరికలను మన్నించాల్సిన ఖర్మ ఏలిన వారికి పట్టలేదు. మీ కుత్కే పిసికయినా సరే "నిర్బంధ అభివృద్ధి పథకం" కొనసాగాల్సిందే.

      తస్మాత్ జాగ్రత్త: గడుసు పిల్లి వారి లాంటి నిరుద్యోగుల పునరావాసానికి అడ్డు పడితే మసయిపోతారు.

      తొలగించండి
  2. నిజాలు చేదు మాత్రల వంటివి, అలా అని తెలంగాన విరోచనకారులకు ఇవ్వక మానేస్తే రోగం తిరగబడదూ? నిజాలు ఎన్ని సార్లు చెప్పినా బాగుంటాయి, చెప్పండి, చెప్పండి ... ఈమధ్య కొద్దిగా రోగం కుదిరిన లక్షణాలు కనిపిస్తున్నాయ్. :) 600 దగ్గర ఆగిపోయింది. ;)

    రిప్లయితొలగించండి
  3. కుదిరితే దౌర్జన్యవాదం - కుదరకపోతే పలాయనవాదం.ఏ తెలబానుడి వ్యాఖ్యానం చూసినా ఏమున్నది గర్వకారణం - సమస్తం "లత్తకోరు"వ్యవహారం !!!

    రిప్లయితొలగించండి
  4. "'కాగ్' నివేదికల ప్రకారం చూస్తే 1956-2009 డిసెంబర్ మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టులపై మొత్తం 64, 861.72 కోట్ల వ్యయం చేయగా ఇందులో 29,701.03 కోట్లు తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు చేశారు. ముఖ్యంగా 2004-10 మధ్య నీటి పారుదల ప్రాజెక్టులకు మొత్తం 49,912.40 కోట్లు ఖర్చుకాగా దానిలో 23,221.75 కోట్లు అంటే తెలంగాణ ప్రాజెక్టులకు 48 శాతం ఖర్చు చేశారు."

    Comptroller & Auditor General (CAG) is a service whose primary focus is auditing Govt. accounts. I wonder how regional distribution of expenditure can be arrived at by studying audit reports?

    For the sake of argument, let us assume the numbers quoted by the former MLA (frequent party jumper) are correct.

    Assuming the share of 2009-10 is a sixth of the 2004-10 numbers and deducting this we arrive at 41,593.67 and
    19,351.46 for the period 2004-2009. Deducting this from the 1956-2009 numbers we arrive at 23,268.05 and 10,349.57 for the period 1956-2004. In other words, the last five years contributed to over 64% in the overall 53 years.

    Even adjusting for present value of money, this is startling. It appears AP spent a pittance on irrigation between 1956-2004. Yet acreage under paddy (a water intensive wet crop) went upto from 67.27 to 99.53 lakhs (48% up) in the period 1956-2006. Just imagine what it would be now that the last six years when annual irrigation spend jumped 30+ fold!

    Any answers from the "honorable gentleman"?

    రిప్లయితొలగించండి
  5. తెలంగాణాని సమైక్యాంధ్ర లో ఉన్నదువలన మేము నష్టపోయాం, మాకు అన్యాయం జరిగిపోయింది, మేము నాశనమయి పోయాం, మా ఉద్యోగాలు దొబ్బెసారు అని ప్రతీ తెలబానుడూ వాక్రుచ్చుతూ ఉంటాడు. అసలు గణాంకాలు వేరే విధంగా ఉన్నాయి. వాటిని వీళ్లు తప్పుడు లెక్కలు అంటారు. పోనీ నిజమైన లెక్కలు ఏమిటి అంటే వారి నాయకుడు కచరా ఎక్కడో తన వోట్ల కోసం చెప్పిన లెక్కలు లేదా నమస్తే తెలంగాణా లో వారి ఎడిటర్ గారు రాసిన బూతు పురాణ గాధలు చెప్పి అది నిజమని నమ్మమంటారు. ఒకవేళ వాళ్లు చెప్పినట్టే మనం ఒప్పుకోని, ఇంతకాలం మీ ప్రాంత నాయకులు మంత్రులు గాను, ముఖ్య మంత్రులు గాను పనిచేశారు కదా. అప్పుడు ఈ విషయం గురించి ఎందుకు మౌనం గా ఉన్నారంటే మా నాయకులు దొంగలు వాళ్లు మమ్మల్ని మోసం చేశారంటారు. ఇప్పుడు అదే దొంగలు ప్రత్యెక రాష్ట్రం కోరుతున్నారు కదా అంటే అది మాకు తెలియదు మా తెలంగాణా మాగ్గావాలే అని కొత్త మూర్ఖపు వాదనకి వెనుకాడని వాళ్లు చాలామందే ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  6. తెలంగాణా "విరోచనకారులు "...
    "తెలబానులు"
    సమైక్య వాదుల భాష ఎందుకింత అసహ్యంగా తయారయింది.
    దేనిని సూచిస్తోంది ఇది.?
    ఆధిపత్యం, వెటకారం, చులకన భావం, వెక్కిరింతలు సమైక్యత కోరుకునేవారికి తగదు.
    విడిపోవాలనుకునే వారు తిట్టినా అర్ధం వుంది కానీ కలసి వుండాలని కోరుకునేవారు కూడా
    తిట్ల పురాణం తో ఎవరితో ఎలా కలసి వుంటారు?
    ...
    "...తెలంగాణా విరోచనకారుల అశుద్ధం తినమరిగిన పందులు మీరు..." అంటే ఎంత జుగుప్సాకరంగా వుంటుంది.
    ...
    మిత్రులారా దయచేసి సభ్యమైన సవ్యమైన బాషలో విమర్శించండి కానీ ఇలాంటి లత్తకోరు, దగుల్భాజీ భాషను కాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మళ్ళ షురు చేసిన్రేంది? ఎక్కువ తక్కువ నీల్గితే ఆంద్ర సర్కార్ ఊరుకోదు.

      ప్రియాంకా చొప్డా చెప్పినట్టు "చిన్నవాడివి చిన్నగా ఉండు".

      తొలగించండి
    2. http://www.youtube.com/watch?v=_IQN8dGutg0
      ఇది మా బాష, ఏం చేయాల? :))

      తొలగించండి
    3. అయ్యా గౌతమ్ గారు, మీరొక్కసారి ఈ లంకెను http://youtu.be/pB9B7c0BLD4 దర్శించి "సురేఖ అక్క" గారి ముచ్చటైన బాషని,ముక్కు వీరుని బృందం గురించి ఆమె అభిప్రాయాలను తెలుసుకుని తరించండి.మరి మీరీ చెప్పాల ఎవరు "లత్తకోరు,దగుల్భాజీ భాషను" మాట్లాడుతున్నారో !!!

      తొలగించండి
    4. మరొక్క తెలంగాణ వాది ముత్యాలపలుకులు "శ్రీశ్రీశ్రీ కల్వకుర్తి చంద్రశేఖర్ రావ్ గారి" గురించి. http://youtu.be/jKQYZb5twkA

      మీరీ చెప్పాల ఎవరు "లత్తకోరు,దగుల్భాజీ భాషను" మాట్లాడుతున్నారో !!!
      మీకు మరిన్ని సాక్షాలు కావాలంటే బోలెడు ఉన్నాయ్. కావాలా ???

      తొలగించండి
  7. /సమైక్య వాదుల భాష ఎందుకింత అసహ్యంగా తయారయింది.
    దేనిని సూచిస్తోంది ఇది.?/
    అద్ది! ఆహా... అలా... ఆ ఇంట్రాస్పెక్షన్ ఇప్పటికి గాని మొదలవలేదన్న మాట! తనదాకా వస్తేకాని తత్వం బోధపడదు. ఈ మార్పు నమ్మదగ్గదే అయితే..., మాలాంటి వాళ్ళు అవతారం చాలించి, సంగీతం, సాహిత్యం, నవలలు, కవిత్వం అంటూ బ్లాగుల్లో వసుధైక కుటుంబం, తెలుగు, దేశ, విశ్వ మానవ సౌభాతృత్వం, మానవహక్కులు, తాడిత పీడిత జనోద్ధరణ వగైరా వగైరాల గురించి ఆలోచించవచ్చు.:D

    ఏళ్ళక్రితం కచరా వాడిన భాష YouTubeలో రికార్డ్ అయివున్నాయి, ఓ దాన్లో ఇలా సెలవిచ్చారు "లుచ్చే అంటాము, లఫంగే, అంటాము.. ఇది మా భాష, మా సంస్కృతి." మరి మీ సంస్కృతిని సమైక్యవాదులు లేటుగా అయినా గౌరవిస్తే అంత బాధగా వుందా?! :) విభజనకారుల బూతు కవుల కవిత్వానికి ఇక అడ్డు అయిపూ లేవు. ఓ బూతుబాబ ఏకంగా ఓ వెబ్సైట్ తెరిచి 'ల'కారాలతో తెలంగాణ సంస్కృతిక కవిత్వానికి శ్రీకారం చుట్టారు, ఓ సారి వెళ్ళి దర్శనం చేసుకురండి. ఈ జైగో గారు కూడా 'సమెక్కుడు' అనే పదభంధానికి హుక్ అయి ఓ స్వయం ప్రకటిత మావోతోకలిసి నొక్కి నొక్కి భజనచేస్తూ అనిర్వచనీయమైన ఆనందంలో నెలల తరబడి గోస బ్లాగుల్లో ఓలలాడిన వారే! :) ఈ మధ్య కొంచెం సినిమాలు, సూర్యకాంతం, సావిత్రి, సాహిత్యం, హాస్యం, సాంప్రదాయం, కళలూ అంటూ శాంతించారంతే. ;)

    విత్‌డ్రా చేసుకోలేని కేసులు, నాయకత్వం పోరు, వసూళ్ళ పంపిణీలో తేడాల వల్ల ఉజ్జమం చతికిల పడింది కాని, లేదంటే... 'నరుకుతా, తరుముడే, జాగో భాగో, తిరగనియ్యం, వీసా తీసుకు రావాల, ఆంధ్రోళ్ళ బిర్యాని పెండలక్కుంటది, ఆంధ్రబ్రాహ్మణులకి ఉర్దూలో చంఢీయాగం మంత్రాలు తెల్వవ్, ఢిల్లీ ఆంధ్రాభవన్ ఉద్యోగులపై కెమెరాలు వెంటేసుకుని మరీ కొట్టడాలు, కిరోసిన్ వంటి మీద పోసుకుని అగ్గిపుల్ల దొరకలేదని విరమించిన డ్రామాలు, సంక్రాంతికి వూళ్ళకెళ్ళిన ఆంధ్రోళ్ళపై దాడులు చేయున్రి అని బార్డర్లో బస్సులమీద దాడులు, రోడ్లమీద అడ్డుగోడలు కట్టడం, విగ్రహాలు పడగొట్టడాలు...' ఒక్కటా! ఆ వీరంగం చూడాల... :)) పాపం మీరు గిప్పుడే దేశంలోకి వచ్చిన్రేమో కద సారూ? ఔలే, అందుకే అంతా కొత్తగా వుంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "ఢిల్లీ ఆంధ్రాభవన్": ఆంద్ర భవనా, అదెక్కడ ఉంది చెప్మా. "ఏపీ భవన్" గా నామాంతరం చెందిన హైదరాబాదు హౌసు గురించా మీరు చెబుతున్నది?

      తొలగించండి
    2. నాకు తెలిసి ఎ పి భవన్ వేరు, హైదరాబాద్ హౌస్ వేరు.
      ఇండియా గేటు పక్కనున్న హైదరాబాద్ హౌస్ కేంద్ర నిర్వహణలో ఉంది.

      తొలగించండి
    3. Thanks for pointing out the mistake.

      హైదరాబాద్ హౌస్ కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దానికి బదులుగా దగ్గరే ఉన్న భవనాన్ని ఇచ్చింది, అదే ఏపీ భవన్.

      There never was any Andhrabhavan though.

      తొలగించండి
    4. JaiGo,

      do some homework man! before shooting your mouth.

      బదులుగా ఇవ్వడం అంటే నామంతరమా?

      తొలగించండి
    5. జైగో, :)
      ఆంధ్రప్రదేశ్ భవన్ లో 'ప్రదేశ్' మిస్ అయ్యిందని మాత్రమే పిడకలవేట చేసి, తెలగాన భాష, గోస, సంస్కృతి, ప్రాశస్త్యము, వగైరా సీమాంధ్రేడ్ సూటిగా గారిచ్చిన ఇచ్చిన తిరుగులేని ఆధారలతో అవాక్కై,మౌనం వహించడం ద్వారా ఇండైరెక్టుగా అయినా ఒప్పుకున్న మీ నిజాయతి...సామాన్య తెలగాన్స్‌లో కానం, థాంక్సులు. ఇక ఏమీ మాట్లాడకండి, హాథ్ మిలావ్..ఇంద ఈ జీడి అడ్వాన్సుగా స్వీకరించండి. అందుకే మీరంటే నాకో ప్రత్యేకమైన అభిమానం. :D పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు, తెలభానులలో జైగో వేరయా... అంటాను, కాదనకండి. :P

      ఆంద్ర ప్రదేశ్ అంటే కృష్ణా గోదావరీ తీర ప్రాంతంలో నివసించు ఆంధ్ర ప్రజలుండే భూభాగం అని అర్థం, అలాంటి ప్రదేశానికి యమునాతీరాన ఓ భవనమేమిటి?! ఇక్కడ రాష్ట్రమంటే భూమి కాదోయ్, రాష్ట్రమంటే మనుషులోయ్ అని అన్వయించుకుంటే ఆంధ్ర భవనం అనే అనాలి. ప్రజలకు భవనాలుంటాయి భూమికి కాదు అని కుశాగ్రబుద్ధులైన మీకు విదితమే. :)

      తొలగించండి
    6. పప్పుచారు కోడిరెడ్డి లా (Phd) చేసి ఏదో కనిపెట్టేసామూ....'ఆంధ్రాభవన్' కోడిగుడ్డు కు గాడిద ఎంట్రుకలు పీకినాం... అనే ఆనందం కొంచెం సేపైనా మిగలనివ్వరా SNKR ?!

      తొలగించండి
    7. @SNKR:

      So it was a typo! Does not sound like you but I will pass for now.

      ప్రజలకే భవనాలు ఉంటాయి ఒప్పుకున్నాము లెండి. ఇప్పుడు ఏపీ భవన్ అని పిలవబడే భవంతి తెలంగాణకే చెందుతుంది. ఎటు తిరిగి తమరికి యమునా తీరంలో ఏమి అక్కర లేదాయే.

      @PPR: I stand corrected.

      The crux though is as follows:

      - There was never any Andhra Bhavan
      - The future state of Andhra has zero claim on AP Bhavan

      Will you click OK to both these? Or do you want to keep clicking "Retry" ad infinitum?

      తొలగించండి
    8. JaiGo,

      same tricky stuff. All that SNKR missed is 'pradesh'.

      Do you not feel silly about yourself to raise such questions? What is future state of Andhra? AP will continue as-is.

      తొలగించండి
  8. /జై తెలంగాణా జై ఆంద్ర జై రాయల సీమ/

    ముక్కలు ముక్కలు చేయాలని ఎంత దురదో...అక్కడ పాకీయులు..ఇక్కడ వారి సోదర తెలబానులు...ముక్కలు చేసే చాన్స్ అస్సలు వదలనే వదలరు...

    /మీ ప్రాతానికి వెళ్లి/

    అహ...ఈ ప్రాంతం మీ సొంతం ....
    ఖాసిం రిజ్వీ ..నంగా బతుకమ్మ ఆడించాకా మీకు రాసి ఇచ్చాడు మరి...

    రిప్లయితొలగించండి
  9. Something in which our brother in T-movement fit very well
    ------------------------------------------
    Liberals always have to be the victims, particularly when they are oppressing others.
    Modern victims aren’t victims because of what they have suffered; they are victims of convenience for the left..
    Playing the game of He Who Is Offended First Wins, the key to any political argument is to pretend to be insulted and register operating anger.
    Liberals are the masters of finger-wagging indignation.
    They will wail about some perceived slight to a sacred feeling of theirs, frightening people who have never before witnessed the liberal’s capacity to invoke synthetic outrage. Distracted by the crocodile tears of the liberal, Americans don’t notice that these fake victims are attacking, advancing, and creating genuine victims.
    ----------------------

    రిప్లయితొలగించండి
  10. జయప్రకాష్ గారు చెప్పిన సంవృద్ధికి ఒక చక్కని ఉదాహరణ ఇదిగో.

    మొదటి ర్యాంకర్‌ను కాదని ఐదో ర్యాంకర్‌కు సీటు :)http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=135620

    రిప్లయితొలగించండి