28, జులై 2012, శనివారం

తమ వార్తా పత్రికలో మూడు నెలలలో తెలంగాణా వచ్చేస్తుందని అబద్ధాలు రాసి, ప్రజలని మభ్య పెడుతూ వస్తున్నా టీఆరెస్ బాకా ఊదే పత్రిక నమస్తే తెలంగాణా పత్రికలో ఎదుటివారు అంటే మెయిల్ టుడే అనే ఆంగ్ల పత్రికలోనూ, సాక్షి, ఆంద్ర భూమి పత్రికలలోనూ వచ్చిన వార్తని అబద్ధం అని సీమాంధ్రుల అక్కసు అని తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కిన తీరు చూడ ముచ్చటగా ఉంది. దాని లంకె మరియూ వార్త యొక్క పూర్తీ పాఠం ఈ కింది విధంగా ఉన్నాయి.
http://www.namasthetelangaana.com/News/article.asp?Category=1&subCategory=3&ContentId=133428

తెలంగాణపై ఆఖరి దశలోనూ అక్కసు
n నివేదిక పంపే అధికారం హోంకు లేదు
- అదే జరిగితే రాజ్యాంగ ఉల్లంఘనే
- తెలంగాణపై రాజకీయ నిర్ణయం రావాల్సి ఉంది
- ఏమీ పట్టించుకోని సీమాంధ్ర మీడియా
- చిత్తు కాగితం దొరికినా విత్రంగా చూస్తున్నారు
- కన్నెర్ర చేస్తున్న ప్రత్యేకవాదులు
- అసత్య కథనాలు నమ్మొద్దని ప్రజలకు వినతి

(టీ మీడియా, న్యూఢిల్లీ) సీమాంధ్ర మీడియా..భగ్గుమన్న తెలంగాణవాదులు ఆంగ్ల పత్రిక సింగిల్‌కాలం భవిష్యవాణిఅమోఘంగా వినిపించిన ఆంధ్ర మీడియాఅంతా అయిపోయిందంటూ విశ్లేషణలు కేంద్ర హోం శాఖ ఓ నివేదికను రూపొందిస్తున్నట్లు, అందులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదన్న అభివూపాయం ఉండబోతున్నట్లు, ఆ నివేదికను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి హోం శాఖ త్వరలో అందజేయనున్నట్లు మెయిల్ టుడే అనే ఆంగ్ల పత్రిక ఊహాజనిత కథనాన్ని ప్రచురించడం.. దానికి సాధ్యాసాధ్యాలను కనీసంగానైనా అంచనా వేయకుండా.. కేంద్రం ఇక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వన తెలంగాణపై సీమాంధ్ర మీడియా అక్కసు వెళ్లగక్కడంపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండటమే కాకుండా.. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు వస్తున్న తరుణంలో ఇటువంటి ప్రచారాలు తెలంగాణ సమాజాన్ని గాయపర్చే అవకాశాలు ఉంటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి రాష్ట్ర విభజన చేయాలా వద్దా అనే విషయంలో నిర్ణయం హోంశాఖకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. దేశంలో ఏదైనా రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా, రాష్ట్ర విభజనపై అటో ఇటో నిర్ణయం తీసుకోవాలన్నా అది కేంద్ర కేబినెట్ పని. దానిపై పార్లమెంటు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. దానిని రాష్ట్రపతి ఆమోదించాలి. రాష్ట్రపతి సిఫారసు మేరకు కొత్త రాష్ట్రం ఏర్పాటు జరుగుతుంది. ఇంత ప్రక్రియ జరగాల్సి ఉండగా.. తెలంగాణ ఇస్తే ఇబ్బందులు తలెత్తుతాయంటూ హోం శాఖ ఏకంగా రాష్ట్రపతికి నివేదిక పంపేందుకు సిద్ధపడుతున్నదని, తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా లేదని అందులో పేర్కొనబోతున్నారంటూ ఓ అంగ్ల పత్రికలో వచ్చిన ఊహాజనిత కథనాన్ని ఆంధ్ర మీడియా తలకెత్తుకోవడంపై తెలంగాణవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దున్నపోతు ఈనిందంటే లేగను కట్టేయమన్నట్లు వీటి వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతాజేసి అసలు అలాంటి నివేదికేదీ లేదని తెలుస్తున్నది.


కానీ.. సదరు ఆంగ్ల పత్రిక మాత్రం ఆ నివేదికలో మంత్రిత్వ శాఖకు సంబంధించి పలు పెండింగ్ అంశాలు ఉండనున్నట్లు తన జ్యోతిష్యాన్ని జోడించింది. అనేక సమస్యలపై చాలా కాలంగా ఏటూ తేల్చుకోలేక సతమవుతున్న హోం శాఖ ఏదో మంత్రమేసినట్లుగా ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారాలు కనుగొని.. రాష్ట్రపతికి నివేదించనున్నట్లు తన ఊహాశక్తిని ప్రదర్శించిందని పరిశీలకులు అంటున్నారు. సున్నితమైన అఫ్జల్ గురు క్షమాభిక్ష మొదలుకుని, అతి సున్నితమైన తెలంగాణ అంశం దాకా దేన్నీ వదలకుండా హోం శాఖ తన నివేదికలో పరిష్కారమార్గాలను పేర్కొనబోతున్నట్లుగా కథనాన్ని వండి వార్చింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఉగ్రవాద చట్టాన్ని కేంద్రం వ్యతిరేకించనున్నట్లు, అఫ్జల్ గురుకు ఉరిశిక్ష తప్పదన్నట్లు, ప్రత్యేక రాష్ట్రం సాధ్యపడనట్లు, సర్వ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఓ ఎన్‌సైక్లోపీడియా మాదిరిగా హోం శాఖ నివేదిక ఉండనున్నట్లు తన రచనా పాటవాన్ని ప్రదర్శించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణపై నిర్ణయం తీసుకోనప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయానికి రావడం.. అది కూడా వ్యతిరేక నిర్ణయానికి రావడం అసాధ్యమన్న కనీస విశ్లేషణను సైతం ఆ కథనం విస్మరించినట్లు కనిపిస్తున్నది.

గత సంవత్సర కాలంగా ‘ఆ నాలుగు పార్టీలు’ వైఖరి చెప్పాలంటూ ప్రతి నెలా చివరి రోజున ఆరున్నొక్కరాగంలో ఆలపిస్తున్న హోం మంత్రి చిదంబరం పాట కూడా ఆ పత్రికకు వినపడలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం వెల్లడిస్తే మిగిలిన మూడు పార్టీలు నిర్ణయానికి వస్తాయని, దాని తర్వాతే కేంద్రం నిర్ణయం తీసుకోగలుగుతుందని హోం మంత్రివర్యులు మొత్తుకుంటున్న విషయం సదరు పత్రిక చెవినపడలేదు. సంప్రతింపుల ప్రక్రియ సాగుతోదంటూ ఏడాదిగా సాగదీస్తున్న గులాంనబీ ఆజాద్ విన్యాసాలు దానికి కనపడలేదు. తెలంగాణపై ఒక నిర్ణయానికి రావడానికి రాష్ట్ర నేతలందరి అభివూపాయాలు సేకరిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం హడావుడి చేస్తుండగానే.. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయానికి వచ్చేసినట్లుగా రాయడం సత్య దూర మన్న విషయాన్ని తొక్కిపట్టింది. కాంగ్రెస్‌ను కాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన నివేదికలో తెలంగాణపై కేంద్ర నిర్ణయాన్ని ప్రకటించే సాహసం చేయలేదన్న వాస్తవాన్ని మరుగునపరిచింది. రానున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా తెలంగాణపై అందరు నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానన్న ఆజాద్ మాటలను ఆ కథనం అసలు పరిగణించలేదు.

ఆజాద్‌ను కాదని తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి వెల్లడించనంత వరకు కేంద్ర మంత్రి వర్గం ఏం చేయలేదని, కేంద్ర మంత్రి వర్గం అంటే అది కేవలం కేంద్ర హోం శాఖ ఒక్కటే కాదన్న రాజ్యంగ స్పూర్తిని పూర్తిగా విస్మరించి తెలంగాణ సమస్య పరిష్కారం అంతా హోం శాఖ చేతిలోనే ఉన్నట్లు కథనాన్ని ప్రచురించిందని ఉద్యమ శ్రేణులు ఆక్షేపణ తెలుపుతున్నాయి. కనీసం జరుగుతున్న పరిణామాలను పట్టించుకోకుండానే తెలంగాణపై అంతా నాకే తెలుసన్నట్లుగా భవిష్యవాణిని వినిపించిందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సినిమా గాసిప్స్‌ను అమోఘంగా వండి వార్చె సదరు పత్రిక ఇప్పుడు సంచలనాల కోసం తెలంగాణలాంటి సున్నిత అంశాలను కూడా గాసిప్స్ రొంపిలోకి దింపుతోందదని తెలంగణవాదులు విమర్శిస్తున్నారు. ఇక ఏ ఆధారం లేకుండా, స్థానిక అంశాలతో ఏ మాత్రం పరిచయం లేని మెయిల్ టుడే ప్రచురించిన కథనం అదేదో రాజపవూతమైనట్లు.. అన్నీ తెలిసిన సీమాంధ్ర మీడియా సంస్థలు ఇక అంతా అయిపోయిన ప్రచారం చేయడంపై తెలంగాణవాదులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

తెలంగాణ ప్రజల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మీడియా సంస్థలకు తెలంగాణపై విషం గక్కడం ఇదే మొదటి సారి కాదని గుర్తు చేస్తున్నారు. ఆజాద్ ఇరు ప్రాంత నేతలతో సంప్రతింపులు ముగించి అధినేత్రి సోనియాకు ఇచ్చిన నివేదికలో తెలంగాణ అవసరం లేదని ఆజాద్ పేర్కొన్నట్లుగా ప్రచారానికి దిగారని పేర్కొంటున్నారు. ఆ నివేదిక ఏదో తామే ఇచ్చినంతగా బిల్డప్ ఇచ్చాయని తెలంగాణవాదులు చెబుతున్నారు. నిజానికి ఆ సమయంలో అప్పటికి ఆజాద్ సంప్రతింపుల ప్రక్రియను ముంగించనూ లేదు.. తుది నివేదికను సమర్పించనూ లేదని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే 14ఎఫ్ తొలగింపు, ప్రాణహిత-చే ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయ మార్గాలంటూ గోల చేశాయని అంటున్నారు. వారి మదిలో దాగున్న కోర్కెను సందర్భానికనుగుణంగా ప్రజలపై రుద్ది, వికృతానందం పొందటం ఆ మీడియా సంస్థలకు అలవాటుగా మారిందని తెలంగాణవాదులు నిప్పులుగక్కుతున్నారు.


తమ ఆకాంక్షలను, అజెండాలను ఢిల్లీ పెద్దలకు ఆపాదించడం వారికి పరిపాటిగా మారిందని, ‘మనం మండించి వండిన వార్తలను ఖండించే వారు దండించే వారు లేరన్న ధీమా’తో సీమాంధ్ర మీడియా వికృత చేష్టలు రోజు రోజుకు మీతిమీరిపోతున్నాయని తెలంగాణవాదులు ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణ రాదని రోడ్డు మీద ఓ పిచ్చి కాగితం దొరికినా దాని ఆధారంగా ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఊదర కొట్టేదాకా ఈ పైత్యం వెళ్లిందని ఎద్దేవా చేస్తున్నారు. ఇందులో భాగంగానే మెయిల్ టుడే కథనానికి ఎక్కడలేని పవివూతతను ఆపాదించి, తెలంగాణ రాదని చెప్పడం ద్వారా తమ కుళ్లుబోతు తనాన్ని వెల్లబోసుకున్నారని మండిపడుతున్నారు. ఏదో లక్ష్యంతో, ఏవో ప్రయోజనాలాశించి మెయిల్ టుడే రాసుకున్న సింగల్ కాలమ్ ఐటమ్‌ని గంటల తరబడి మోతబెట్టిన సీమాంధ్ర మీడియాను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజానీకం లేదని ఉద్యమ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ తేల్చెయ్యాలన్న కృతనిశ్చయంతో మేడమ్ ఉన్నారన్న వార్తలు వెలువడగానే అర్థం పర్థం లేని కథనాలతో ప్రజలను గందరగోళ పరచాలనుకుంటే అది అయ్యే పని కాదని పలువురు కాంగ్రెస్ నేతలు సైతం చెబుతుండటం గమనార్హం.


సున్నితవాతావరణంపై దాడి!
ప్రస్తుతం తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తీవ్రత హెచ్చు స్థాయిలో ఉంది. దశాబ్దాల అణచివేతల నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమం కల్పించిన భావోద్వేగాలు తెలంగాణ గుండెల్లో నిండి ఉన్నాయి. ఇప్పటికే ఒకసారి నోటిదాకా వచ్చిన కూడును సీమాంధ్ర నేతలు కట్టగట్టుకుని, రాజీనామా డ్రామాలాడి నేలపాలు చేశారని తెలంగాణ ఉద్యమ శ్రేణులు విమర్శిస్తున్నాయి. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణకు ఏ కాస్త సానుకూల వాతావరణం కనిపిస్తున్నదని అనిపించినా సీమాంధ్ర నేతలు దానిని నాశనం చేయడానికి ప్రయత్నించారని, ఇప్పుడు కూడా అదే తీరులో వారి ప్రవర్తన ఉందని నేతలు అంటున్నారు.

అన్నింటికంటే మించి తెలంగాణ ఏర్పాటు చేయడమా? నిరాకరించడమా? అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా జరగాల్సిన నిర్ణయమని, అనేక రాజకీయ సమీకరణాలు ఈ నిర్ణయంతో ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా తెలంగాణ విషయంలో ఒక నిర్ణయం వెలువడుతుందని సంకేతాలు ఉన్నాయి. ఆ నిర్ణయం ఎలా ఉంటుందన్నది చెప్పలేకపోయినా.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తెలంగాణలో భావోద్వేగాల తీవ్రత నేపథ్యంలో సానుకూలంగానే నిర్ణయం ఉంటుందన్న ఆశాభావాల వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిస్థితుల నేపథ్యంలో అధిష్ఠానం అనివార్యతతో కూడిన సానుకూల నిర్ణయం ప్రకటిస్తుందన్న వాదన ఉంది. ఇదే విషయంలో తమకు సంకేతాలు ఉన్నాయని కొందరు రాజకీయ నేతలు చెప్పడం మినహా కాంగ్రెస్ అధిష్ఠానం మనసులో ఏమున్నదన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మొత్తంగా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. సానుకూల సంకేతాలు ఎలా ఉన్నా.. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు తెలంగాణ జేఏసీ సంసిద్ధమవుతున్నది.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 30 చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. రాగల నిర్ణయం ఏదైనాప్పటికీ ముందే ఊహాగానాలు చేసి, ప్రతికూల ఫీలర్లు వదలడం ప్రమాదకరమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే ఇటువంటి ప్రతికూల ప్రచారాలు దాదాపు 800 మంది తెలంగాణ బిడ్దలను బలిగొన్నాయి. కరడుగట్టిన సమైక్యవాదులైన లగడపాటి వంటి వారి అసత్య ప్రచారాలు, తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు చేసిన ప్రయత్నాలకు మనసు కకావికలమై, వీరంతా ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఇప్పుడు మళ్లీ తెలంగాణకు వ్యతిరేకంగా ఊహాగానాలతో కూడిన కథనాలు ప్రసారం చేయడం తెలంగాణ యువకులను రెచ్చగొట్టడమే అవుతుందన్న అభివూపాయాలను తలపండిన నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఒక రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఒక శాఖ స్వతంవూతించి నిర్ణయం తీసుకునే అవకాశాల్లేవని వారు స్పష్టం చేస్తున్నారు. అదే జరిగితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని వారు తేల్చి చెబుతున్నారు. 2009 డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటన కూడా కేంద్రం తరఫున చేసిందే తప్పించి, హోం శాఖ తనకు తానుగా చేసింది కాదని వారు గుర్తుచేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ప్రస్తుతం ఉన్న సున్నితవాతావరణాన్ని దెబ్బతీసేందుకు తప్ప మరొకందుకు కాదని వారు అంటున్నారు. ఈ సున్నిత వాతావరణం దెబ్బతిని, జరగరాని ఘటనలు ఏవైనా జరిగితే అందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

20, జులై 2012, శుక్రవారం

19, జులై 2012, గురువారం

భారతీయ జనతా పార్టీ కి…కొన్ని ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వారికి ,విశాలాంధ్ర మహాసభ తరపున సుంకర వెంకటేశ్వర రావు అను నేను కొన్ని ప్రశ్నలు అడగదల్చుకున్నాను....ఆ ప్రశ్నలకు వారి నుండి సూటి సమాధానాలు కావాలి, ఇవ్వగలరా...?
ఇప్పుడు మీ ముందు పెడుతున్న ఈ దిగువ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రజల కోసము మీరు చెప్పి తీరాలి.......

1 . మీరు 1997 లో మీ పార్టీ రాష్ట్ర శాఖ కాకినాడ లో చేసిన తీర్మాన ప్రతిని బహింగ పరచగాలరా...? ప్రజల కోసము బహిరంగ పరచి తీరాలి.

2 . ఆ తీర్మానములో "ఆంద్ర రాష్ట్ర" "తెలంగాణా రాష్ట్ర" ఏర్పాటు అని మీరు సవివరముగా పెర్కొన్నారా....? లేక.....పరిపాలనా సౌలభ్యము కొరకు రెండు చిన్న రాష్ట్రాలు అని పెర్కొన్నారా...?

3 . పరిపాలనా సౌలభ్యము కొరకు ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజించటం అంటే భౌగోళికముగా మీ పరిభాషలో మీ నిర్వచనము ఏమిటి...?

4 . ఉత్తరాంధ్ర....ఆంద్ర.....రాయలసీమ.....హైదరాబాదు...ఉత్తర తెలంగాణా....దక్షిణ తెలంగాణా అని ఇప్పుడున్న ప్రాంతాలను ఏ విధముగా విదగొడతారు,ఏ విధముగా కలుపుతారు..? కొద్దిగా వివరించండి....!

5 . మీరు చేసిన ఆ తీర్మానానికి మీ కేంద్ర పార్టీ ఆమోదము తెలిపినదా...? (ఒకవేళ ఆమోదము తెలిపి ఉంటె ఆ ప్రతిని కూడా ప్రజల కొరకు మీరు బహిరంగ పరచి తీరాలి) అప్పటి మీ కేంద్ర పార్టీ నాయకుడు,ఆంధ్రప్రదేశ్ కి ఇంచార్జ్ గా ఉన్న శ్రీ జానా కృష్ణమూర్తి గారు మీ తీర్మానము మీద ఏమని అన్నారు...చెప్పగలరా...?

6 . పరిపాలనా సౌలభ్యము కొరకు చిన్న రాష్ట్రాలు అని చిలుక పలుకులు పలుకుతున్న మీరు ఉత్తరప్రదేశ్ విషయములో మీ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోంది.....? మీరు నాగు పాము లాంటి రెండు నాలుకులు ఉన్నవారిగా , అవకాశ వాదులుగా మేము మిమ్మలిని అనుకోవాలా...?

7 . మీ పార్టీ అధినాయకుడు శ్రీ ఎల్ కే అద్వాని గారు 2002 లో కేంద్ర హోమ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు పార్లమెంటు సభ్యుడుగా ఉన్న శ్రీ ఆలె నరేంద్ర గారు పార్లమెంటు లో ది.26 - 02 -2002 న అడిగిన ప్రశ్నకు శ్రీ అద్వానీ గారు ది 01 -04 -2002 న ఇచ్చిన లిఖితపూర్వక సమాధానములో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు వీలు పడదు అని వివరముగా చెప్పారా లేదా.....?

8 . రాజధాని కలిగి ప్రాంతము వెనకబడిన ప్రాంతముగా పరిగణిస్తూ వేరే రాష్ట్రముగా విడిపోవటము అనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా...? ఉంటె ఆ చరిత్ర కొద్దిగా వివరించండి....

9 . రాష్ట్రములో వెనకబడిన ప్రాంతాలు ,దానికి సవివరమైన కారణాలు తో మీ పార్టీ ప్రజల కొరకు ఒక శ్వేత పత్రాన్ని విడుదల చెయ్యగలదా...?

10 . "తీవ్రవాద తెలంగాణా వేర్పాటువాదులు" ( జాక్,ప్రజాసంఘాలు,తెరాసా,తీవ్రవాద వామపక్ష సంఘాలు) భావదారిద్ర్యముతో తరచుగా, అదేపనిగా ఇతర ప్రాంతము(ఆంద్ర) వారిమీద విద్వేష భావముతో చేస్తున్న ఒక తీవ్ర ఆరోపణ "ఆంద్ర పెట్టుబడి దారులు,ఆంధ్రా దోపిడీదారులు,ఆంధ్రా వలసవాదులు,బ్రతకటానికి పొట్ట చేతబట్టుకు వచ్చినోల్లు,మా వనరులు అన్ని దోచుకుంటున్నారు, క్విట్ తెలంగాణా,తెలంగాణా నుండి తరిమికోదతాం,ఆంధ్రా వాళ్ళను బట్టలు ఊడదీసి తరిమి కొడతాం , రక్తపాతం సృష్టిస్తాం " అని ఇంకా అసభ్యముగా చేస్తున్న ప్రకటనలను ,భౌతిక దాడులను మీరు ఎందుకు ఇంతవరు ఖండించలేదు....? అంటే మీరు కూడా ఆకోవలోకే వస్తారని మేము అనుకోవాలా...? మీరు ఆ భాషని,దాడులని సమర్ధిస్తున్నారా...?

11 . "తీవ్రవాద తెలంగాణా వేర్పాటువాదులు" భావదారిద్ర్యముతో చేస్తున్న మరో ఆరోపణ "ఆంధ్రా వాళ్ళు మా వనరులు అన్ని దోచుకుంటున్నారు,మా సంస్కృతిని నాశనము చేస్తున్నారు ,మమ్మల్ని సాంస్కృతముగా అణచివేస్తున్నారు" అని చేస్తున్న ఆరోపణలను మీరు సమర్ధిస్తున్నారా...?

మీరు ఇతర బ్రతుకుదెరువు రాజకీయ సంఘాలు, రాజకీయ పార్టీలు,రాజకీయ నాయకులుగా కాకుండా "భారతజాతి ,భారతదేశ సఖ్యత, సమగ్రత కోసము పరితపించే ఒక జాతీయ పార్టీగా" ,పై ప్రశ్నలకు సమాధానాలు అవునో కాదో ప్రజలకు వివరించాల్సిన భాద్యత మీ మీద ఎంతో ఉంది ...సమాధానాలు ఆశిస్తూ....
మీ భవదీయుడు ,
వెంకటేశ్వర్
19 -7 -2012
http://pravasarajyam.com/1/nri/2012/07/19/quation-paper-to-bjp-from-sunakara/

17, జులై 2012, మంగళవారం

విశాలాంధ్ర మహాసభ తరపున నేను చేస్తున్న  సవాలు కి ఈ "తీవ్రవాద తెలంగాణా వేర్పాటువాదులు" సంస్కారముతో ,సహనముతో సమాధానము ఇవ్వాలి....ఇవ్వగలరా...? ఆ ఇవ్వగలిగే సత్తా మీకు ఉందా..?
మా పరకాల ప్రభాకర్ గారి గురించి మాటమాటకి ప్రతి ఒక్క బొడ్డు ఊడని ,తాడు బొంగరము లేని,సంస్కారము లేని,మేధస్సు అనేది అసలు ఏ కోశానా మచ్చుకు కూడా కనిపించని ప్రతి ఒక్క తెలంగాణా వేర్పాటువాది "నువ్వు బీజేపీ లో ఉన్నప్పుడు ఒక వోటు రెండు రాష్ట్రాలు అనే  కాకినాడ తీర్మానము లో నువ్వు కూడా పాల్గోన్నావు కదా....పీఆర్పీ లో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణా అని అన్నావుకదా....మీ భార్య ఇప్పుడు బీజేపీ లో అధికార ప్రతినిధి కదా  ఒక ప్రశ్న అడగటము పరిపాటి అయ్యిపోయింది.....ఇప్పుడు నేను మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతాను మీకు సత్తా,చేవ,దమ్ము,ఖలేజా,తెలివి ఉంటె ఈ దిగువ అడుగుతున్న కొన్ని  ప్రశ్నలకు మాత్రము సమాధానము ఇవ్వండి ప్లీజ్.
1 . ఇప్పుడు మీకు ,మీ ఉద్యమానికి నాయకత్వము వహిస్తున్న శ్రీ కే.చంద్రశేఖర్ రావు ఒకప్పుడు సమైఖ్య వాదా కాదా...? (రుజువులు ఉన్నాయి)(26 - 02 - 1997 )
2 . శ్రీ కే చంద్రశేఖర రావు అసెంబ్లీ లో జోనల్ వ్యవస్థ రద్దు చెయ్యమని అడిగాడా లేదా...?(రుజువులు ఉన్నాయి) ( 18 - 07 -1996 )
౩.  శ్రీ కొండ లక్ష్మణ్ గారు మంత్రి గా ఉన్నప్పుడు ,1969 ,1972 లో రాష్ట్రము సమైఖ్యముగా
ఉండాలని అన్నారా లేదా...?(రుజువులు ఉన్నాయి)
4 . మీ వేర్పాటువాద నాయకుల పిల్లలు ఇప్పుడు ఆంధ్రా రాయలసీమ వారితో వ్యాపార భాగస్వాములు కాదా...?(రుజువులు ఉన్నాయి)
5 .వేర్పాటు  వాద పార్టీ 2004 లో సమైఖ్య ప్రభుత్వములో మంత్రి పదవులు పొంది  అధికారము అనుభవించలేదా...?(రుజువులు ఉన్నాయి)
6 . శ్రీ నాగం జనార్ధనరెడ్డి నేను ఒకప్పుడు తెలంగాణా వాదిని , ఇప్పుడు సమైఖ్యవాదిని అని అసెంబ్లీ లో అనలేదా...?(రుజువులు ఉన్నాయి)(22 -08 -1988 )
 మమ్ములను చర్చలలో ఎదుర్కోలేక,మా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారంటే మీ వాదములో పసలేదు కాబట్టే....!
మీరు చేస్తున్న ఇప్పటి ఈ అప్రజాస్వామిక వేర్పాటువాద  ఉద్యమము మీలో చాలా మందికి  బ్రతుకుదెరువు ఉద్యమము ,ఉపాధి హామీ ఉద్యమము, స్వయం ఉపాధి ఉద్యమము లాంటిది  కాదా అని అడుగుతున్నా...!
మీకు ఈ అప్రజాస్వామిక  వేర్పాటువాద ఉద్యమము మీలో చాలా మందికి "బంగారు బాతు" లాగా అవ్వలేదా ...?
ఈ అప్రజాస్వామిక  వేర్పాటువాద ఉద్యమము ముసుగులో మీలో ఎంతమంది కోటీశ్వరులు అయ్యారో , కొండవీటి చేంతాడు లాంటి వారి వివరాలు , పేరులతో సహా ఎక్కడైనా రుజువులతో సహా   చెప్పటానికి మేము సిద్ధము.. ఈ దోచుకున్న డబ్బు ఆంధ్రా , తెలంగాణా రైతులది,వ్యాపారస్తులది,బడుగు జీవులది కూడా కాదా అని అడుగుతున్నా.....?
ఇట్లు ,
మీ భవదీయుడు
వెంకటేశ్వర్

విశాలాంధ్ర వాదన గొంతు వినిపించనీయని శ్రీ కొండా లక్ష్మణ్ రౌండ్ టేబుల్ సమావేశం!

పత్రికా ప్రకటన (16/7/2012) 

ఈ రోజు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ కి విశాలాంధ్ర మహాసభ హాజరయ్యింది. 

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మా వాదనను వినిపించే అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చిన మీదట మా సభ్యులం సమావేశానికి హాజరయ్యం. పిలవని పేరంటానికి మేము వెళ్ళలేదు.

ఇరవై నుంచి ముప్ఫై నిముషాలు అడ్డం పడకుండా అంతరాయం కలిగించకుండా మా మాట చెప్పే అవకాశం ఇస్తామని పదే పదే మాకు చెప్పి అనేక సార్లు మాకు ఫోన్లు చేసాక మేము అక్కడికి వెళ్ళాం. 

మా తరఫున డా పరకాల ప్రభాకర్ తన ఉపన్యాసం ప్రారంభించగానే అక్కడ ఉన్న వారు అడ్డుతగలడం మొదలుపెట్టారు. 

విభజనకు అనుకూలంగా వారు ఒక కారణం చెపితే మేము కలిసి ఉండడానికి వందకారణాలు చెపుతామని, వారు వంద చెపితే మేము వెయ్యి చెపుతామని, వారు వెయ్యి చెపితే మేము లక్ష చెపుతామని విశాలాంధ్ర మహా సభ ప్రధాన కార్యదర్శి డా పరకాల ప్రభాకర్ ఆ సమావేశం లో సవాలు చేసారు. 

తెలంగాణ ప్రాంతం లో రాష్ట్ర సమైక్యతను కోరుకునే వాళ్ళు లక్షలాదిగా ఉన్నారని, దానికి నిదర్శనం విశాలాంధ్ర మహాసభ లో ఉన్న శ్రీయుతులు నర్రా మాధవరావు (సాతంత్ర్య సమరయోధులు), కుమార్ చౌదరి యాదవ్, శ్రీనివాస రెడ్డి, నలమోతు చక్రవర్తి, శ్రీమతి సుగుణమ్మ(స్వాతంత్ర్య సమరయోధులు) లు ప్రముఖ నిదర్శనాలు. ఇందులో అనేక మంది ఇవాల్టి సభలో పాల్గొన్నారు. విశాలాంధ్ర కోరే ఈ తెలంగాణ ప్రముఖుల కన్నా విభజన కోరే వారికి తెలంగాణా పురోగతి పట్ల అధికంగా ఉన్న నిబద్ధత ఏమిటో వారు సమాధానం చెప్పాలి అని విశాలాంధ్ర మహాసభ ప్రశ్నించింది.

తెలంగాణ ప్రాంతం లో విశాలాంధ్ర వాదుల నోరునోక్కే ప్రయత్నం మానుకోవాలి.

పౌర హక్కులను కాపాడతామని చెప్పుకునే వారు, స్వాత్రంత్ర్య సమరయోధులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఉన్న సభలో మా వాదనను చెప్పడానికి అడ్డుపడడం చాల విచారకరం. వారెవరూ మా అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు మాకు ఉన్నదని మా వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడడానికి ముందుకు రాక పోవడం చాల గర్హనీయం.

వీరందరికీ విశాలాంధ్ర మహా సభ ఒక విజ్ఞప్తి చేస్తున్నది.

ఇప్పటికయినా ప్రజాస్వామ్య వాతావరణం లో ఒక చర్చ చేపట్టండి. విభజన వాదన వక్రీకరణల మీద, అభూత కల్పనల మీద, అసత్యాల మీద అర్ధ సత్యాల మీద ఆధార పడి సాగు తున్న ఆందోళన అని మేము నిరూపిస్తాం. రాష్ట్ర విభజన ఎందుకు జరగాలో వారు చెప్పవచ్చు.

మా నోరు నొక్కడంతో వారి వాదన లో బలం లేదు అని వారు చెప్పకనే చెప్పినట్టు అయింది.

విశాలాంధ్ర మహాసభ అటువంటి చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధం. 

రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ నిర్వాహకులు మాకు ఇచ్చిన మాట, హామీ నిలబెట్టుకోనందువల్ల, మూకుమ్మడిగా లేచి మాట్లాడుతూ మాకు అంతరాయం కలిగించడం వల్ల, విభజన కు అనుకూలంగా మాట్లాడ మని మమ్మల్ని ఒత్తిడి చేయడం వల్ల మేము సమావేశం నించి నిష్క్రమించాము. 

నలమోతు చక్రవర్తి 
అధ్యక్షులు, విశాలాంధ్ర మహాసభ

8, జులై 2012, ఆదివారం

విభజనకు ప్రాతిపదిక ఏమిటి?

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ (25/5/2010) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే డిమాండ్ 1969 నుంచి ఉన్నదే. ఈ అంశం సున్నితమైనదేకాని అత్యవసరమైనది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రగతి పథంలో అగ్రగామిగా ఉందనే విషయం నిర్వివాదం. 2003-09 సంవత్సరాల మధ్య జాతీయ జిడిపి వృద్ధిరేటు సగటున 8.5 శాతం ఉంటే రాష్ట్రంలో జిఎస్‌డిపి (స్థూల రాష్ట్ర ఉత్పత్తి) రేటు సగటున 9.17 శాతం ఉంది.

రాష్ట్రంలో ఉపాధి పొందుతున్నవారిలో 60శాతం మందికి వ్యవసాయ రంగమే అవకాశం కల్పిస్తోంది. వ్యవసాయరంగంలో వృద్ధిరేటు గత ఐదేళ్లలో జాతీయ స్థాయిలో సగటున 3 శాతం కాగా, రాష్ట్రంలో 6.74 శాతం ఉండడం విశేషం. గత 53 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సాధించిన అభివృద్ధిని నిష్పాక్షికంగా పరిశీలిస్తే దానిలో తెలంగాణదే అధిక భాగమనే విషయం స్పష్టమవుతుంది.

బి.పి. ఆర్.విఠల్ (రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి జరిగిన కృషిలో కీలక పాత్ర వహించిన మాజీ ఐఏఎస్ అధికారి) రాసిన విషయాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ సమయానికి రెండు ప్రాంతాల స్థితిగతులు ఎలా వుండేవో అర్థమవుతాయి. మద్రాసు,హైదరాబాద్ రాష్ట్రాల్లోని తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలతో మన రాష్ట్రం ఏర్పాటైంది. పూర్వ హైదరాబాద్ రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన తెలంగాణ ప్రాంతంలో ఆ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల కంటే అభివృద్ధి చాలా తక్కువ. అయితే కేరళ, కర్ణాటకలుభాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటైనప్పుడు వాటిలో కలిసిన ఆయా భాషలు మాట్లాడే ప్రాంతాలైన తిరువాన్కూర్-కొచ్చిన్, మైసూర్‌లు కొత్త రాష్ట్రాలలో ఎంతో అభివృద్ధి సాధించిన ప్రాంతాలుగా వచ్చి కలిశాయి.

navya.
ఆంధ్ర ప్రాంతంలోని ఏడు జిల్లాలు, తెలంగాణ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాలు బాగా వెనకబడడంతో , ఒక సమగ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించే సమయానికి తలసరి ఆదాయం, ఆర్థిక వృద్ధి, మానవాభివృద్ధి, తలసరి విద్యుత్ వినియోగం , వ్యవసాయక ఉత్పాదకత, అక్షరాస్యత, జనాభావృద్ధిరేటు, తలసరి మోటారు వాహనాలు, విద్యుదీకరించిన గ్రామాలు వంటి అన్ని ముఖ్య అంశాలలో రాష్ట్రం దేశ సగటు కంటే ఎంతో వెనుకబడి ఉంది.

జిల్లా స్థాయిలో ఉత్పత్తి వృద్ధిరేటు ఎంత ఉన్నదో 1994-95 నుంచి లెక్కలు వేయడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం 1994-95 నుంచి 2006-07 మధ్య రాష్ట్ర వృద్ది రేటు 6.68 శాతం ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే తెలంగాణలోని పది జిల్లాలలో నిజామాబాద్ 6.3 శాతం వార్షిక వృద్ధిరేటుతో చాలావెనుక బడి వుండగా , గణనీయంగా అభివృద్ధి చెందిన జిల్లాలనుకుంటున్న గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వృద్ధిరేటు వరుసగా 4.81; 5.09 శాతం మాత్రమే ఉంది.

దీనిని బట్టి తెలంగాణలో అతి తక్కువ వృద్ధి రేటు కలిగిన జిల్లా కంటే ఆంధ్రప్రాంతంలోని జిల్లాల వృద్ధి రేటు చాలా తక్కువగా ఉన్నదనే విషయం తెలుస్తోంది. అంతేగాక అనేక దశాబ్దాలుగా కొనసాగిన అసమానతలు కూడా పూర్తిగా తొలగిపోలేదని తెలుస్తోంది. కాని ఒకటి మాత్రం నిజం- తెలంగాణలోని పది జిల్లాలూ గణనీయంగా అభివృద్ధిని సాధించాయి. ఇక రాయలసీమ మొదటినుంచీ అనావృష్టి ప్రాంతమే. దేశంలోని అత్యల్ప వర్షప్రాంతం గల జిల్లాల్లో రాయలసీమలోని అనంతపురం జిల్లా రెండవది. ఒరిస్సా,ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా గత యాభై మూడేళ్ళుగా వెనుకబడిన ప్రాంతాలు గానే మిగిలిపోయాయి.

కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో విస్త­ృత ప్ర్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది అందరికీ ఆమోదయోగ్యమే అవుతుంది. అయితే ఆ నిర్ణయం మొదటి ఎస్సార్సీ నివేదిక ప్రకారం రాష్ట్రాలు ఏర్పాటు చేసినట్లుగా సమర్థనీయంగా ఉండాలి. రాజ్యాంగంలోని 3వ అధికరణంప్రకారం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి గల విశేషాధికారాలను ఎవరూ కాదనలేదు. అయితే కేంద్రం తీసుకునే నిర్ణయం పారదర్శకంగా, సహేతుకంగా ఉండాలి.

జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లు పెద్ద సంఖ్యలో ఉన్న గిరిజనుల అభిమతానికి అనుగుణంగా ఏర్పడ్డాయి. కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్ సాంస్క­ృతిక నేపథ్యం, సమస్యలు చాలా భిన్నమైనవి. అయితే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ వెనుక హేతుబద్ధమైన కారణాలేమైనా ఉన్నాయా? ఉంటే, అవేమిటి?

వెనుకబాటు గురించి కొందరు తెలంగాణ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత? అనే విషయాన్ని పాలనా నిపుణులతో పరిశీలింపచేయాలి. అదే నిజమైతే వెనుకబాటుకు కారణాలేమిటి? తెలంగాణ వెనుకబాటుతనం ఆంధ్రతో విలీనం వల్ల ఉత్పన్నమైనదా? 1956లో ఆంధ్రలో కలియడానికి ముందు తెలంగాణ ప్రాంతం సుసంపన్నంగా ఉన్నదా? ఉద్దేశపూర్వక విచక్షణ వల్ల ఆ వెనుకబాటు వచ్చిందా? లేక చారిత్రక కారణాలేమైనా ఉన్నాయా? రాష్ట్ర విభజనే ఆ వెనుకబాటుకు పరిష్కారమా?

ఆంధ్రలో కలవకపోతే తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్నదనే విషయాన్ని ఎవరైనా నిరూపించగలరా? రాయలసీమ లోని నాలుగు జిల్లాలు, ఉత్తర కోస్తాలోని మూడు జిల్లాలు కూడా చాలా వెనుకబడినవే. తెలంగాణ కంటే కూడా ఈ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని చెప్పవచ్చు.కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు వెనుకబాటును ప్రాతిపదికగా తీసుకొనేట్లయితే ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రాల ఏర్పాటుకు కూడా అంగీకరించగలరా?

నిజానికి వెనుకబడిన ప్రాంతాలు లేదా జిల్లాలు లేని రాష్ట్రాలు దేశంలో ఎక్కడా లేవు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులైన ఆంధ్ర నాయకులకు ప్రాంతీయతత్వం ఎప్పుడూ ఉండేది కాదు. మొత్తం రాష్ట్రానికి చెందిన భారీ పరిశ్రమలైనప్పటికీ, హైదరాబాద్ చుట్టుపక్కలగల రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనే వాటిని నెలకొల్పడానికి వారు చేయూత నివ్వడమే అందుకు నిదర్శనం. వాటిలో కొన్నిటిని నిజానికి రాయలసీమ, మధ్య కోస్తా జిల్లాల్లోను ఏర్పాటు చేయవచ్చు. హెచ్ ఎ ఎల్ యూనిట్లు ఉన్న ఒరిస్సాలో కోరాపుట్ ప్రాంతం, బిహెచ్ఇఎల్ యూనిట్లు ఉన్న హరిద్వార్ కంటేమన రాయలసీమ , మధ్య కోస్తా జిల్లాల్లో వ్యవస్థాపనా సౌకర్యాలు నిజానికి ఎక్కువే ఉన్నాయి.

కేంద్రప్రభుత్వరంగసంస్థలు రాష్ట్రంలో ఎక్కువే ఉన్నా అవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీ కృత మయ్యాయి. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఐఐటి, నేషనల్ స్కూల్ ఆఫ్ లా వంటివన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంవారు తెలంగాణ ప్రాంతానికి వచ్చి వారిని దోపిడీకి గురి చేశారనే తెలంగాణ నేతల వాదనలో ఎంత మాత్రం నిజం లేదు. లేకపోగా మొత్తం రాష్ట్రానికి చెందిన భారీ పరిశ్రమలు,భారీ పెట్టుబడులు తెలంగాణ ప్రాంతానికే లభించాయనే సత్యం ఇక్కడ మరువకూడదు.

పైపెచ్చు ఆంధ్ర ప్రాంతంవారే హైదరాబాద్ చుట్టు పక్కల అనేక భారీ పరిశ్రమలు స్థాపించారనే విషయం కూడా విస్మరించకూడదు. అనేక రంగాలలో, అనేక ప్రాంతాలలో ఆంధ్రప్రాంతం వారు పరిశ్రమలు నెలకొల్పి ఆ ప్రాంతాల అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయిందనీ, ఆంధ్రప్రాంతం వారు విశాలాంధ్ర కోసం చొరవ చూపారనే దుష్ప్రచారం కూడా ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. నిజానికి అది కూడా తెలంగాణ నేతలు చేస్తున్న పెద్ద తప్పుల్లో మరొకటి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో, ఆ ప్రాంతాల మనోవాంఛకు తగినట్లుగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది గాని ఏ ఒక్కరివల్లనో కాదు. ఇది చారిత్రక సత్యం.

దేశ సుదీర్ఘ చరిత్రలో 1947 కి ముందు 150 సంవత్సరాలు మినహా తెలుగువారంతా ఒక్కటిగానే ఉన్నారు. పరాయి పాలనలో ముక్కలుచెక్కలు అయిన తెలుగు ప్రాంతాలను ఏకం చేయడానికి, తెలుగువారందరినీ ఒక్కతాటిపైకి తేవడానికి 1900 ప్రాంతంలో హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర నిలయం ఏర్పాటైంది. కొమర్రాజు లక్ష్మణరావు వంటి మహనీయులు తెలుగు సంస్క­ృతి పునరుద్ధరణకు నడుం బిగించడంతో తర్వాత అది ఒక మహోద్యమంలా రూపుదిద్దుకుంది.

తెలంగాణకు చెందిన మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి, మందుముల నర్సింగరావు వంటి ఎందరో మహానుభావుల నాయకత్వంలో విశాలాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. తెలుగువారుకాకపోయినా తెలుగు ప్రాంతాలు సమైక్యం కావడానికి స్వామి రామానంద తీర్థ అందించిన తోడ్పాటును ఎలా విస్మరించగలం? విశాలాంధ్ర కోసం హైదరాబాద్ ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు బూర్గుల రామకృష్ణరావు.

తెలుగువారికి సమైక్య రాష్ట్రం కోసం ఇంతటి మహత్తరమైన కృషి తొలుత జరిగింది తెలంగాణలోనేనన్న చారిత్రక సత్యాన్ని ఎవరు తుడిచివేయగలరు? అంతే కాదు, హైదరాబాద్ శాసనసభలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఆమోదించిన తరువాతే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందనే సత్యాన్ని కాదనగలమా?ఆంధ్రప్రదేశ్‌నువిభజించడానికి తర్వాత కాలంలో కొందరు ప్రయత్నంచినప్పుడు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ అటువంటి వేర్పాటువాదం ఎంత మాత్రం మంచిది కాదంటూ హితవు పలికిన ఘటన మరువ గలమా? ఆంధ్రప్రదేశ్‌గా అవతరించిన తర్వాత రాష్ట్రం సర్వతో ముఖంగా అభివృద్ధి చెందింది.

పారిశ్రామికంగా, వ్యావసాయకంగా తెలంగాణ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా 974 కిలో మీటర్లు ఉన్న కోస్తా తీరం, ప్రపంచంలోనే అత్యధికంగా కోస్తాలో ఉన్న సహజవాయు నిక్షేపాలు రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు మరింతగా నడిపించాయి. ఒరిస్సా, బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలతో పోల్చితే తెలంగాణలో ఉన్నదంటున్న వెనుకబాటు అతి స్వల్పమే. తెలంగాణకు మంచి భవిష్యత్తు సమైక్య అంధ్ర ప్రదేశ్‌లోనే ఉంటుంది. ఏవైనా నిజమైన సమస్యలు ఉన్నట్లయితే వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవచ్చు.

- అడుసుమిల్లి జయప్రకాశ్
విజయావాడ మాజీ శాసనసభ్యులు.

3, జులై 2012, మంగళవారం

సమైక్యంలోనే సమృద్ధి

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ (16/12/2010): అన్నం ఉడికిందో లేదో తెలియడానికి అంతా పట్టుకోనక్కరలేదు. అదే విధంగా ఆంధ్ర- తెలంగాణలు ఏ విషయంలో వెనుకబడ్డాయో, ఏ అంశంలో ముందంజ వేస్తున్నాయో తెలుసుకొనేందుకు అన్ని రంగాలనూ పరిశీలించనవసరం లేదు. ఆ అన్నాన్నే పట్ట్టుకొని చూసినా తేలిగ్గా అర్థమైపోతుంది. అభివృద్ధి గణాంకాల ను పరిశీలిస్తే గత మూడు దశాబ్దాలలో వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ, బియ్యం మిల్లింగ్ వంటి అంశాలలో సీమాంధ్ర కంటే తెలంగాణలోనే ఎంతో మెరుగైన పరిస్థితులున్నాయని విశదమవుతుంది.

రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని 2010-11 సంవత్సరానికి గాను 210 లక్షల టన్నులుగా నిర్ణయించారు. దీనిలో వరి ఉత్పత్తి 148.85 లక్షల టన్నులు. తాజా అంచనా ప్రకారం వరి ఉత్పత్తి లక్ష్యం కంటే ఎక్కువ ఉండే సూచనలే కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉత్పత్తిలో 40 శాతం దాకా తెలంగాణ నుంచి లభించడమే. వరి ధాన్యం ఒక నిత్యావసర వస్తువు మాత్రమే కాదు; వరి అనాది నుంచి మన సంస్కృతిలో ఒక భాగం.

దక్షిణాది ధాన్యాగారంగా మన రాష్ట్రం ప్రసిద్ధి కెక్కింది. పంటలను మన రైతులు 'సస్యలక్ష్మి'గా ఒక ఆరాధాన భావంతో కొలుస్తుంటారు. బియ్యం (అక్షింతలు) లేకుండా ఏ శుభ కార్యమూ జరగదన్నది అందరికీ తెలిసిందే. అటువంటి బియ్యం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముందు ఆంధ్ర ప్రాంతంలో అధికంగా ఉన్నా, తర్వాత ఆ ఘనత ను తెలంగాణ ప్రాంతం దక్కించుకుంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అందుకు ప్రధాన కారణం-తెలంగాణ ప్రాంతంలో నీటి పారుదల అభివృద్ధికి, తద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వృద్ధికి ప్రభుత్వాలు నిర్విరామ కృషి చేయడమే.

ఆంధ్ర ప్రాంతం వలస పాలనలో ఉన్న సమయంలో గోదావరి డెల్టాలో డ్యామ్‌లు, రోడ్ల నిర్మాణం విరివిగా చేపట్టడంతో రవాణా, ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగానే పెరిగాయన్నది వాస్తవ మే. 1858లో ధవళేశ్వరం, 1908లో కృష్ణా బ్యారేజ్‌ల నిర్మాణాల వల్ల ఆంధ్ర ప్రాంతం సస్యశ్యామలమైంది. 1923లో నిర్మించి నిజాంసాగర్ డ్యామ్ మినహా తెలంగాణలో నాడు సరైన నీటిపారుదల సౌకర్యాలే లేవు.

హైదరాబాద్ రాష్ట్రంలో అప్పట్లో సాగునీటి పారుదల ప్రాంతం 5.1 శాతం మాత్రమే ఉండగా, ఆంధ్ర ప్రాంతం లో 30.3 శాతం ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం విద్యు త్ వినియోగంతో సమైక్య రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో మొత్తం వరి ఉత్పత్తిలో తెలంగాణ వాటా 18 శాతం మాత్రమే.

అంటే అప్ప ట్లో 5,46,317 టన్నుల వరి ధాన్యం మాత్రమే ఉత్పత్తి అయ్యేది. తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా ఈ ఉత్పత్తి 2008-09 నాటికి 53,60,547 టన్నులకు అంటే 881 శాతం పెరిగింది. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిం దో చెప్పడానికి నిజానికి ఈ ఉదాహరణ చాలు.

తెలంగాణలో కరీంనగర్, నల్లగొండ జిల్లాలు వరి ఉత్పత్తిలో ముందంజ వేస్తున్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల మధ్య ఉత్పత్తిలో అసమానతలకు కారణం నీటి పారుదల సౌకర్యంలో లోపమే. ఆంధ్ర ప్రాంతం వారు నదీ జలాలను తెలంగాణకు దక్కకుండా దోపిడీ చేస్తున్నారంటూ తెలంగాణవాదులు తరచుగా ఆరోపిస్తుంటారు. ఈ ఆరోపణలో ఎంత మాత్రం వాస్తవం లేదు. 2008-09లో కరీంనగర్ జిల్లాలో 11,75,996 టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా ఆదిలాబాద్ జిల్లాలో 1,98,382 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది.

గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆదిలాబాద్ ఎగువున ఉండగా కరీంనగర్ దిగువున ఉంది. ఎక్కడైనా సరే నది దిగువ ప్రాంతంలోని వారికే తగినంత ప్రయోజనం కలుగుతుంది. కరీంనగర్‌లో ఉత్పత్తి ఎక్కువగా ఉన్నంత మాత్రాన అక్కడివారు ఆదిలాబాద్ నీటిని దోపిడీ చేస్తున్నారని అనగలమా? అలా కానప్పు డు దిగువున ఉన్న ఆంధ్ర ప్రాంతం వారు మాత్రం నదీజలాలను దోపిడీ చేస్తున్నారని అనడంలో ఔచిత్యం ఏముంది?

1956 నుంచి వరి ఉత్పత్తి గణాంకాలను పరిశీలిస్తే వాస్తవ అభివృద్ధి ఎక్కడ జరిగిందో విశదమవుతుంది. 1955-56లో కోస్తాంధ్ర లో వరి ఉత్పత్తి 21,61,560 టన్నులు కాగా రాయలసీమలో 3,41,620 టన్నులుగా ఉంది. అదే సమయంలో తెలంగాణలో 5,46,317 టన్నులు వరి మాత్రమే ఉత్పత్తయింది. 2008-09 నాటి కి ఈ ఉత్పత్తి కోస్తాంధ్రలో 80,65,910 టన్నులకు పెరగగా, రాయలసీమలో 8,14, 676 టన్నులకు పెరిగింది.

అదే సమయంలో తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి 53,60,547 టన్నులకు పెరిగిం ది. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే-వరి ఉత్పత్తి తెలంగాణలో 18 శాతం నుంచి 881 శాతానికి పెరిగిందని. ఈ పెరుగుదలకు వరి పండించే విస్తీర్ణం పెరగడం ప్రధాన కారణం. ఆ విస్తీర్ణం పెరగడానికి నీటి పారుదల సౌకర్యాలు విస్తరించడం అసలు కారణం.

అదే విధంగా వరి ధాన్యం సేకరణ కూడా తెలంగాణలో గణనీయంగా పెరిగింది. వివిధ ప్రభుత్వ సంస్థలు 2008-09లో తెలంగాణ ప్రాంతంలో చేసిన వరి సేకరణ 33,06,139 టన్నులుగా ఉంది. అంటే రాష్ట్రంలోని మొత్తం సేకరణ కంటే ఇది 40 శాతం ఎక్కువ. 2000-01లో కోస్తాంధ్రలో 53.7 శాతం వరి ధాన్య సేకరణ జరగగా, 2006-07 నాటికి అది 52.7 శాతానికి తగ్గింది. కాని అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో సేకరణ 44.9 శాతం నుంచి 46.5 శాతానికి పెరగడం గమనార్హం.

తెలంగాణలో వరి ఉత్పత్తే గాక మొత్తం ఆహార ధాన్యాల ఉత్ప త్తి కూడా గత మూడు దశాబ్దాలుగా గణనీయంగా పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే తమిళనాడులో ఆహార ధాన్యాల ఉత్పత్తి కం టే తెలంగాణలోనే ఎక్కువగా ఉంది. పొరుగున ఉన్న తమిళనాట జనాభా దాదాపు ఏడు కోట్లు కాగా తెలంగాణ జనాభా దానిలో సగం మాత్రమే. అయినా ఆహార ధాన్యాల ఉత్పత్తి తెలంగాణలోనే ఎక్కువ.

ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 42 శాతం, జనాభాలో 40 శాతం ఉన్న తెలంగాణలో 2008-09లో ఆహార ధాన్యాల దిగుబడి రాష్ట్ర ఉత్పత్తిలో 40.4 శాతం ఉంది. అంటే విస్తీర్ణం, జనాభా శాతాలకు దాదాపు సమానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా తెలంగాణ లో జరుగుతున్నదన్న మాట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ శాతం 1956లో 24.9 కాగా 2009 నాటికి 40.4కు పెరగడం. అంటే సమైక్యరాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కోస్తా, రాయ ల సీమల కంటే తెలంగాణలోనే ఆహారధాన్యాల ఉత్పత్తి, సాగునీటి విస్తీర్ణం బాగా పెరిగాయన్న మాట.

దేశంలో మొత్తం ఉత్పత్తయ్యే బియ్యంలో మన రాష్ట్రం వాటా 13 శాతం ఉంది. మొత్తం వరిసాగు చేసే విస్తీర్ణంలో 9 శాతమే మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఉత్పత్తి మాత్రం అంతకుమించి అధికం గా ఉంది. గత దశాబ్ద కాలంలో మన రాష్ట్రంలో వరి పండించే విస్తీ ర్ణం 21.61 లక్షల హెక్టార్లలో పెరగగా అందులో అధిక శాతం తెలంగాణ ప్రాంతానిదే కావడం గమనించవల్సిన విషయం.

1955-56లో మొత్తం సాగు నీటి ప్రాంతం సీమాంధ్రలో 33.3 శాతం కాగా తెలంగాణలో 17.9 శాతం మాత్రమే ఉండేది. కాని 2007-08 నాటికి ఈ విస్తీర్ణం సీమాంధ్రలో 42.7 శాతానికి, తెలంగాణలో 43.1 శాతానికి పెరిగింది. అంటే ఆ కాలానికి వృద్ధి శాతం సీమాంధ్రలో 40.8 శాతం కాగా తెలంగాణలో 140.8 శాతం ఉంది. వరి పంట విస్తీర్ణం కూడా 1955-56లో సీమాంధ్రలో 47.88 లక్షల ఎకరాలు కాగా తెలంగాణలో 19.39 లక్షల ఎకరాలు మాత్రమే ఉండేది.

అది 2005-06 నాటికి సీమాంధ్రలో 63.01 లక్షల ఎకరాలకు పెరగగా తెలంగాణలో 36.52 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే ఆ కాలానికి వరి పంట విస్తీర్ణంలో ఇలా రెట్టింపు పైగా వృద్ధి కనిపిస్తే వరి ఉత్పత్తిలో తెలంగాణ ప్రాంతంలో అనేక రెట్లు వృద్ధి కనిపిస్తోంది. అందుకే గత మూడు దశాబ్దాలలో సీమాంధ్ర కంటే తెలంగాణ నుంచే బియ్యం ఎగుమతులు కూడా అధికంగా జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత వివిధ ప్రభుత్వాలు తెలంగాణ లో నీటి పారుదలకు చేసిన వ్యయం 46 శాతం ఉండగా, ఆంధ్రలో 25 శాతం, రాయలసీమలో 25 శాతం వ్యయం జరిగింది. 'కాగ్' నివేదికల ప్రకారం చూస్తే 1956-2009 డిసెంబర్ మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టులపై మొత్తం 64, 861.72 కోట్ల వ్యయం చేయగా ఇందులో 29,701.03 కోట్లు తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు చేశారు. ముఖ్యంగా 2004-10 మధ్య నీటి పారుదల ప్రాజెక్టులకు మొత్తం 49,912.40 కోట్లు ఖర్చుకాగా దానిలో 23,221.75 కోట్లు అంటే తెలంగాణ ప్రాజెక్టులకు 48 శాతం ఖర్చు చేశారు.

ఏ విధంగా చూసినా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం ఎక్కువగా ప్రయోజనం పొందింది తెలంగాణ ప్రాంతమే. ముఖ్యంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో అప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ ఆదర్శవంతమైన బాటలో పయనిస్తోంది. ఇందుకు ప్రధాన కార ణం ఇప్పటి దాకా వచ్చిన అన్ని ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడమే.

-అడుసుమిల్లి జయప్రకాశ్
మాజీ శాసనసభ్యులు