19, డిసెంబర్ 2011, సోమవారం

విశాలాంధ్రోద్యమాన్ని నేను హృదయపూర్వకంగా బలపరుస్తున్నాను: స్వామి రామానందతీర్థ (14 .2 .1950)

1950 ఫిబ్రవరి 13,14 వ తేదీలలో విశాలాంధ్రమహాసభ స్థాయిసంఘ సమావేశం వరంగల్ లో అయ్యదేవర కాళేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగింది. ఆ సమావేశాలకి మాడపాటి హనుమంతరావు, టంగుటూరి ప్రకాశం,స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు,కే.వీ.రంగారెడ్డి, బులుసు సాంబమూర్తి,అబ్దుల్ సలీం, కాళోజి మొదలైన ప్రముఖులు హాజరైయారు.  

ఆ సందర్భంగా ప్రసంగించిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానందతీర్థ, హైదరాబాద్ సంస్థాన విచ్ఛిత్తి భాషాప్రయుక్త రాష్ట్రాల నిర్మాణానికి ప్రస్తావన కావాలని, విశాలాంధ్రోద్యమం న్యాయమైనది, సహజమైనది అని , ఎనిమిది తెలంగాణా జిల్లాలు చేరనిదే ఆంధ్రరాష్ట్రం సమగ్రంకాదని అన్నారు.




ఆంధ్రప్రభ,ఫిబ్రవరి 15,1950





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి