6, డిసెంబర్ 2011, మంగళవారం

విశాలాంధ్ర ఏర్పడితే చాలా సంతోషిస్తాను : పండిట్ నెహ్రూ (11.12.1955)

1955 అక్టోబర్ మాసంలో ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు విశాలాంధ్ర ఏర్పాటు వెంటనే జరగాలని ఏకాభిప్రాయమునకు వచ్చారని చదివాము

భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు డిసెంబర్ 11 న గుంటూరు రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆంధ్ర రాజకీయ మహాసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ కార్యవర్గం విశాలాంధ్ర ఏర్పడాలని చెప్పిందని, దానిపై ఇరు ప్రాంతాల నాయకులు కలిసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. విశాలాంధ్ర ఏర్పడితే తాను మిక్కిలి సంతోషిస్తానని, త్వరలోనే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘ నివేదిక పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుందని, ఆ నిర్ణయాలు పార్లమెంట్ పరిశీలనకు వస్తాయని చెప్పారు.



ఆ తర్వాత పండిట్ నెహ్రూ నిజామాబాద్ నందు మార్చ్ 5,1956 తేదీన విశాలాంధ్ర ఏర్పాటును ప్రకటించిన విషయం తెలిసినదే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి