7, ఫిబ్రవరి 2012, మంగళవారం

విజయవాడ, తిరుపతిలలో 'విశాలాంధ్రమహాసభ' సమావేశాలు

ఢిల్లీ, హైదరాబాద్ లలో విజయవంతంగా తన వాదనను వినిపించిన 'విశాలాంధ్రమహాసభ' ఈ నెల విజయవాడ, తిరుపతిలలో ‘రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం’ అన్న అంశంపై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ నిర్వహించబోతుంది.

ఆంధ్రజ్యోతి: రాష్ట్ర సమైక్యతను పరిరక్షించేందుకు విశాలాంధ్ర మహసభ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పరకాల ప్రభాకర్ తెలిపారు.ఈనెల 11 న విజయవాడలో, 25న తిరుపతిలో సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తన వాదనను చెప్పుకునే స్వేచ్ఛ ఉందని, తెలంగాణను వ్యతిరేకించే వారిపై దాడులు, హెచ్చరికలు సరికాదని ప్రభాకర్ అన్నారు.

2 కామెంట్‌లు: