21, నవంబర్ 2011, సోమవారం

మానవహక్కుల సంఘాల నేతలకు ఒక ప్రవాసాంధ్రుని బహిరంగ లేఖ

An open letter to human right activists
by Ramana Vemsani 



నేను తెలంగాణా లోని ఒక కుగ్రామము లో జన్మించాను, విద్యార్ధి దశ నుండి మన మానవ హక్కుల వారు చెప్పే మాటలకు ప్రభావితమయ్యానని చెప్పుకోటానికి సంతోషిస్తాను వారి ఆదర్శాలు, చెప్పే మాటలు చూసి నా చుట్టూ వున్నా పరిసర ప్రాంతాలలో మానవ హక్కులకి విఘాతము కలగ కుండా చూసేవాడిని అని చెప్పుకోటానికి గర్వ పడతాను. మన తెలంగాణా లో కుల భావము ఎక్కువే అన్న సంగతి మన తెలంగాణా లోని సోదరులు అందరికి తెల్సు అనే అనుకుంటున్నాను. మా ఇంట్లో అప్పటి వరకు వున్నా రెండు గ్లాస్ ల సిద్దాంతాన్ని వ్యతిరేకించి మా అమ్మ ను నాన్న ను ఒప్పించి వాళ్ళలో మార్పును తీసుకు రాగలిగాను మా తాత గారు కట్టించిన గుడి లో కి అందరికి ప్రవేశము కల్పించగలిగాను అలాగే మా వూర్లో వెనక బడిన వర్గ సోదరులు కాని దళిత సోదరులు కాని రాజకీయాలలో ముందు ఉండేలాగా ప్రోత్స హించ గలిగాను గ్రామములో స్కూల్ రావటము కొరకు మా నాన్న గారి చేత ౩ ఎకరములు భూమి ఇప్పించగాలిగాను అంటే ఈ మానవ హక్కుల ప్రభావము నా మీద ఎంత పనిచేసిందో మీకు అర్ధమైంది అనుకుంటాను.

M A ఉస్మానియా లో చేస్తున్నప్పుడు నా సోదరి వివాహము కొరకు బందు మిత్రులని ఆహ్వానించటానికి గుంటూరు దగ్గిర లోని గ్రామము కు ఒక రాత్రి వెళ్తుండగా ఒక్క కుదుపున మా బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపి ప్రయాణికుల అందర్నీ నిద్ర లేపి అప్రమత్తము చెయ్యటము జరిగింది ఏమిటా అని బస్సు దిగితే మా ఎదురుగ ఒక బస్సు మంటల్లో కాలి పోవటము గమనించాను ఆ బస్సు లో ప్రయాణికులు అందరు ఆ జ్వాలల్లో కాలిపోతుంటే అది చూస్తున్న ప్రతి ఒక్క పౌరుడి దుఖాన్ని ఆపుకోలేక అలా తగులబెట్టిన వారిని కూడా మంటల్లో వేసి చంపాలని అంటున్న మాటలు విన్నాను. కాని మన మానవ హక్కుల సోదరులు ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుందని చెప్పిన వాదనని కూడా కాదనలేకపోయాను. ఆ తర్వాత మన తెలంగాణా లోని కాకతీయ దుర్ఘటన జరిగినప్పుడు కూడా మన మానవ హక్కుల సోదరులు ఏదో తెలియక చేసిన పొరపాటు గా చెప్తే కూడా అంగీకరించాను .

కాని లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో p hD చేసిన Dr పరకాల, ఈ సమాజము లో వేర్పాటు వాదము వద్దు అని, అంది వచ్చిన తన రాజకీయ బవిష్యత్తు కు విఘాతము కలగవచ్చేమో అన్న సందేహము కూడా లేకుండా మన ప్రజలకి తన వాదన లోని నిజాలు తెలియ చెయ్యటానికి ముందుకు వస్తే అతని మీద దాడి చెయ్యటము చూస్తే ఈ సమాజములో మానవ హక్కుల గురించి చర్చ జరగాల్సిన అవసరము ఎంత అయినా వున్నది అన్న విషయము మన మేధావులు అందరు గమనించాలని వేడుకుంటున్నాను. అతని విశాలాంధ్ర వాదన ను చూసి ఇంత మంది తెలంగాణా మేధావులు పారిపోవటము చూస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది. కొందరి ఆలోచనలు మనకు రుచించినా, రుచించక పోయినా అతనికి రక్షణ కల్పించ అవసరము కానీ, వాదనకు అవకాశము కానీ మనము దగ్గిర వుండి కల్పించాల్సిన ఆవశ్యకత మన మానవ హక్కుల సోదరులు అందరికీ ఉన్నదనే అనుకుంటున్నాను. మానవ హక్కుల కార్యకర్తలు ఎంత నిబద్దతతో పని చేస్తారో కూడా నిరూపించాల్సిన ఆవశ్యకత వచ్చింది, ఈ విషయము లో మన అమర్ చూపించిన మార్గము ఎంతైన అభినందనీయము మా సంధ్య అక్క కాని, మా విమల అక్క కాని, నా పాత P D S U మిత్రులు కాని, నా మిత్రుడు చక్రపాణి కాని ఈ విషయము లో స్పందిస్తే చూసి ఛాలా సంతోషిస్తాను అనటములో ఏ మాత్రమూ సందేహ పడను. ప్రతి ఒక్క పౌరుడు కు జీవించే హక్కు మరియు తమ అభిప్రాయాన్ని తెలియ చెప్పే హక్కు ఉంటుందని చెప్తూ వస్తున్న మన మానవ హక్కుల సోదరులు అవి ఒక్క బస్సు లలోని ప్రజలని, రైళ్లలోని ప్రజలని కాల్చి చంపే వారికి మాత్రమే అన్న విషయాన్ని అయినా స్పష్టము చేస్తే ఇంకా మరి సంతోషిస్తాను.

రమణ వేంసాని
ఖమ్మం జిల్లా (స్వస్థలం)
పోర్ట్స్మౌత్, ఒహిఒ అమెరికా నిస్తలం




2 కామెంట్‌లు:

  1. వారి గులాబీ కల్ల అద్దాలకు ఇవి కనిపించవు లెండి

    రిప్లయితొలగించండి
  2. ramana garu,

    Mee kavitalu ganuka verpaptu vadulu chusarante, Journalists may go to your place and threaten your parents, women and children. Please do not reveal your identity. You must have read in papers who T-alibans have gone to Mr Nalamotu Chakravarti's villege ??? JAI SAMAIKHYANDRA

    రిప్లయితొలగించండి