23, నవంబర్ 2011, బుధవారం

రైలు, రాస్తారోకోలపై సుప్రీం కన్నెర్ర

 విశాలాంధ్ర దినపత్రిక : రైలు/రోడ్డు దిగ్బంధనాలపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసింది. రైలు, రోడ్డుపై రాకపోకలను అడ్డుకునేందుకు ప్రయత్నించే ఆందోళనకారులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. రైలు, రోడ్డు రాకపోకలను అడ్డుకోవటం ద్వారా సాధారణ పౌరుల కార్యకలాపాలను స్తంభింపజేస్తున్నారని, ఫలితంగా ప్రజలు చెప్పలేని ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్‌ జి.ఎస్‌. సంఘ్వీ, జస్టిస్‌ ఎస్‌.డి. ముఖోపా ధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం దీనిని ఎదుర్కొనేందుకు పటిష్ట వంతమైన సలహాలు యిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మూడు వారాల గడువు యిచ్చింది. ఈ విధంగా చేయటంలో విఫలమైతే ఆందోళన కారులను క్రిమినల్‌ నేరం క్రింద శిక్షించేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించిం ది. ''రైలు, రాస్తారోకో ఆందోళనకు పిలుపు యిచ్చే వారిని తప్పనిసరిగా శిక్షించవలసిందిగా మేయు ఆదేశాలు జారీ చేయాల్సి వుంటుంది. వారికి వ్యతిరేకంగా పెట్టే కేసులను మూడు మాసాలలో పరిష్కరించాలి. ఇందు కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయాలని మేము భావిస్తున్నాం'' అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి