18, అక్టోబర్ 2011, మంగళవారం

రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం : విశాలాంధ్ర మహాసభ


మిత్రులారా,


‘విశాలాంధ్ర మహాసభ’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడడం కోసం కృషి చేస్తున్న సంస్థ. రాజకీయాలకు అతీతమైనది. ‘విశాలాంధ్ర మహాసభ’ తెలంగాణ, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలకు చెందిన మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు మరియు సమాజశ్రేయస్సు కోసం కృషి చేస్తున్న అనేకమంది వ్యక్తులు కలిసి స్థాపించిన సంస్థ.
మనరాష్ట్రంలో జరుగుతున్న వేర్పాటువాద ఆందోళన, హింస మరియు విధ్వంసక చర్యలను ప్రోత్సహిస్తూ, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురైయ్యారన్న అసత్య ఆరోపణల ఆధారంగా సాగుతున్నది. విభజనవాదులు అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.మా ఉద్దేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఆందోళన పూర్తిగా అసమంజసమైనది.
ఈ సందర్భంలో, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర సమైక్యతను కాపాడుదాంఅనే అంశం పై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ నిర్వహించతలపెట్టింది. మన రాష్ట్రానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక మరియు చారిత్రక నిజాలను మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ ద్వారా ప్రజల ముందుకు తేవడం యీ ప్రయత్నం యొక్క ముఖ్య ఉద్దేశం.
వేర్పాటువాద ఆందోళన ప్రచారం చేస్తున్న నిందలు,అవాస్తవాలు,వక్రీకరణలు, అసత్యాలను ఖండించి నిజానిజాలను తెలిసుకోవడంలో మా యీ ప్రయత్నం సహాయపడుతుందని ఆశిస్తున్నాము.
వర్క్ షాప్ 1:
అక్టోబర్ 22nd 11.00 AM – 1.00 PM
వర్క్ షాప్ 2:
అక్టోబర్ 23rd 2.00 PM – 4.00 PM
   ఎగ్జిబిషన్
   అక్టోబర్ 22nd 1.00 PM- 4.00 PM
   
అక్టోబర్ 23rd 11.00 AM - 4.00 PM

    
వేదిక: జూబిలీ హాల్, పబ్లిక్ గార్డెన్స్,
                
నాంపల్లి, హైదరాబాద్.



ఇట్లు ,
నలమోతు చక్రవర్తి

1 కామెంట్‌:

  1. మీ ప్రయత్నం దిగ్విజయంగా సాగి "రాష్ట్ర సమైక్యతకి" దోహదపడాలని మనస్పూర్తిగా అశిస్తున్నాం.ఇంతకి వక్తలెవరో,వర్కు్‌షాప్‌లో ఏమేమి చేస్తారో మరికొన్ని వివరాలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఇవ్వకపోయినా ఇబ్బంది ఏమిలేదు.
    మీ శ్రమకి,అలుపెరగని పోరాటానికి అభినందనలు !!!

    రిప్లయితొలగించండి