20, నవంబర్ 2011, ఆదివారం

సద్భావన యాత్రకి సంఘీభావం.విశాలాంధ్రవాదాన్ని కూడా వినిపించనివ్వండి : VMS PressMeet (19.11.2011)

ఆంధ్రజ్యోతి: రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఒకటిగా ఉంచాలా లేక విభజించాలా అనే అంశంపై స్వాతంత్య్ర సమరయోధుడు కొండాలక్ష్మణ్ బాపూజీ నిర్వహించ తలపెట్టిన సద్భావన యాత్రకు పరకాల సంఘీభావం ప్రకటించారు.

అయితే, సద్భావన వేదిక నుంచి తమ వాదాన్ని వినిపించడానికి అవకాశం కల్పించాలని కోరారు. " రెండు విభిన్న వాదాల మధ్య సద్భావన ఉండాలి. విభజన, సమైక్యతా సమస్యను మేము ప్రాంతాల మధ్య వివాదంగా చూడటం లేదు. భావజాలాల మధ్య సంఘర్షణగానే పరిగణిస్తున్నాం'' అని వివరించారు.

సమైక్యవాదాన్ని వినిపించేవారికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. దీనిపై పౌరహక్కుల ఉద్యమకారులు ఎందుకు స్పందించరంటూ నిలదీశారు. తాను బతికున్నంత వరకు రాష్ట్రాన్ని చీల్చలేరని స్వాతంత్య్రసమరయోధుల సంస్థ అధ్యక్షుడు నర్రామాధవరావు స్పష్టం చేశారు.

1969లోనూ, ఇప్పుడు విభజనవాదం ఓడిపోవడానికి స్వార్థ ప్రయోజనాలు, ఐక్యత లేకపోవడమే కారణమని పాత్రికేయుడు రామజోగయ్య అన్నారు. తెలంగాణవాదం అభూతకల్పనలతో, అసత్యాలతో ముడిపడి ఉందన్నారు. సమైక్యవాదం వినిపించడమే నేరంగా మారిందని మరో ప్రతినిధి కుమార్‌చౌదరి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విభజనపై మాట్లాడేముందు పాలమూరులో అమల్లో ఉన్న రెండుగ్లాసుల విధానంపై నోరువిప్పాలని న్యాయవాది రవితేజ నిలదీశారు.

ఈనాడు 20.11.2011

 సూర్య: విభజన వాదానికే కానీ విభజనవాదులకు తాము వ్యతిరేకం కాదని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్‌ స్పష్టం చేశారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ చేపడతానన్న సద్భావన యాత్ర కేవలం రెండు ప్రాంతాల మధ్యే కాకుండా రెండు విభిన్న వాదాల మధ్య కూడా ఉండాలని ఆయన సూచించారు. 1969లో తెలంగాణ ఉద్యమం, 1972లో ఆంధ్రా ఉద్య మం మాదిరిగానే ఈ సారికూడా విభజన కోరుకున్న చోటే సమైక్యానికి మద్దతు ఉందన్న విషయం నేతలు గమనించాలన్నారు. తనపై జరిగినదాడిపై పౌరహ క్కుల రక్షణ ప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

2 కామెంట్‌లు:

  1. PARAKALA PRABHAKAR GARU MEKU ANDHRA FEELING YEKKUVANDI MERU MATHO KALISUNDALANKUNTUNNARU GABATTI VISALANDHRA KADU VISALATELANGANA ANI SABHALU PETTANDI YEVARU ADDU CHEPPARU. MEERU MEE ATTITUTE CHANGE CHESUKUNI TITLE MARCHI PRAYATHNICHANDI " SHUBHAM BHUYATH"

    రిప్లయితొలగించండి
  2. Visalandhramahasabha,Andhra Mahasabhalaku charitrika pradhaanyata undi. Nizam raashtramlo teluguvaaru Andhra Mahasabha dwaaraa sanghatitham ayyaru. Meeru charitranu maarchagaligithe tappaka title maarchavacchu. Telangana, Andhra lanu samaanaartha padaalugaa vaadadaaniki maaku yemi abhyantaram ledu

    రిప్లయితొలగించండి