23, జులై 2011, శనివారం

ఆర్టీసీకి కష్ట కాలం

అయ్యయ్యో ఆర్టీసీ: పగిలిన బస్సు అద్దాలలోంచి (ఆంధ్ర భూమి ఫోటో)

ఐక్య కార్యాచరణ సంఘాలు చీటికి మాటికి బందులను ప్రజలపై రుద్దుతుండగా ఆర్టీసీకి కష్ట కాలం దాపురించింది. బందు రోజులలో బస్సులను డిపోలకే పరిమితం చేసి ఆర్టీసీ ఇప్పటికే లక్షలాది రూపాయల నష్టాలను మూటగట్టుకొంది. ఉద్యమాల పుణ్యమానని వయసు ముదిరిపోయిన  విద్యార్ధి సంఘాల నాయకులవారు కూడా కార్లకు అధిపతులు అయినట్లు వినికిడి.అది ఎంత నిజమో నాకు తెలియదు. కాని సామాన్యుల జీవనోపాధికి, రవాణాకు ఆధారమైన బస్సులు మాత్రం ఐకాసాల నోటినుండి బంద్ అన్నమాట రాగానే రోడ్డు ఎక్కడంలేదు.ఈ విధంగా "రైట్ టు లైవ్లిహుడ్" అనే ప్రాథమిక హక్కును వేలాదిమందికి చెందకుండా కొంతమంది కాలరాస్తుండగా హక్కుల సంఘాలు, చీకటి సంధ్యలు, వక్రపాణీలు గుర్రుకొట్టి నిద్రపోతున్నారు లేక సాయంత్రం లైవ్ షో లకు ముస్తాబవుతున్నారు. ఇదేమి దౌర్భాగ్యంరా బాబు అని అనుకోవడం  తప్ప సామాన్యులు రోడ్లు లేక టీవీ స్టూడియోలు ఎక్కలేరు కదా?

 రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ధైర్యం చేసి జనులకు ఇబ్బంది కలగకూడదని బంద్ రోజున నిన్న హైదరాబాద్ నగరంలో బస్సులు నడపగా అల్లరిమూకలు 40 కి పైగా బస్సులపై దాడి చేసినట్టు సమాచారం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి